సింగరాయకొండ (ఆర్ఎస్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సింగరాయకొండ (ఆర్ఎస్) ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం లోని జనగణన పట్టణం.[1]దీనిని పాత సింగరాయకొండ అని కూడ అంటారు.

గ్రామ చరిత్ర

[మార్చు]

పాతసింగరాయకొండ గ్రామ సమీపాన, మన్నేరు ఒడ్డున జాతీయ రహదారి ప్రక్కన కొత్తవంతెన నిర్మించగా, పాతవంతెన క్రింద మట్టి త్రవ్వుచుండగా, 2017, మార్చి-27న, మూడు అడుగుల ఎత్తు ఉన్న, ఒక పురాతన రాతి శివలింగం బయల్పడింది.

సాగునీటి సౌకర్యం

[మార్చు]
  • భవనాశి చెరువు.
  • మేలం చెరువు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శి వి, బ్రహ్మానందరెడ్డి, రాష్ట్రంలో ఉత్తమ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఎంపికైనారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడ్కలలో భాగంగా, 2017, ఏప్రిల్-24న విజయవాడలో నిర్వహించు ఒక కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి నారా లోకేష్ చేతులమీదుగా వీరికి ఈ పురస్కారం అందజేసెదరు.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, సింగరాయకొండ (RS) పట్టణంలో మొత్తం 4,894 కుటుంబాలు నివసిస్తున్నాయి. మొత్తం జనాభా 19,400 అందులో 9,245 మంది పురుషులు కాగా, 10,155 మంది స్త్రీలు ఉన్నారు. సగటు లింగ నిష్పత్తి 1,098. పట్టణంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1971, ఇది మొత్తం జనాభాలో 10%. 0-6 సంవత్సరాల మధ్య 1018 మంది మగ పిల్లలు, 953 మంది ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 936, ఇది సగటు లింగ నిష్పత్తి (1,098) కంటే తక్కువ. అక్షరాస్యత రేటు 75.7%. ఇది అవిభాజ్య ప్రకాశం జిల్లా 63.1% అక్షరాస్యతతో పోలిస్తే సింగరాయకొండ (RS) అధిక అక్షరాస్యతను కలిగి ఉంది. పురుషుల అక్షరాస్యత రేటు 82.38% స్త్రీల అక్షరాస్యత రేటు 69.8%.[2]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ పట్టాభిసీతారామాలయం - పునర్నిర్మాణం చేసిన ఈ ఆలయంలో 2014, జూన్-2, సోమవారం నాడు, సీతా, లక్ష్మణ, ఆంజనేయస్వాముల సమేత శ్రీ కోదండరామస్వామివారి నూతన శిలా విగ్రహ ప్రతిష్ఠ, కలశ స్థాపన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వేదపండితులు, ఉదయం విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, యంత్రస్థాపన, అనంతరం ఉదయం 7-45 గంటలకు శిఖర, కలశ స్థాపన నిర్వహించారు. అనంతరం సరిగా ఉదయం 8 గంటలకు శిలావిగ్రహాలు ప్రతిష్ఠించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వందలాది మంది భక్తులు స్వామివారి పీఠంలో వెండి, బంగారం వేసి తమ భక్తి చాటుకున్నారు. స్వామివారి శాంతి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు.

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం - దక్షిణ సింహాచలంగా పేరుపొందిన ఈ ఆలయంలో, స్వామివారి బ్రహ్మోత్సవాలు, 2014, జూన్-9, సోమవారం నాడు ప్రారంభమైనవి. ఆరోజున తొలుత, గరుడ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ రోజు రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. రాత్రికి హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం నాడు ప్రత్యేకపూజల అనంతరం, స్వామివారు చొప్పరంపై ఊరేగినారు. సాయంత్రం శేషవాహనంపై అభయమిచ్చారు. ఈ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి నుండి స్వామివారిని గరుడవాహనంపై పాతసింగరాయకొండ, సోమరాజుపల్లె గ్రామాలలో ఊరేగించారు. శనివారం స్వామివారు చొప్పరంపై దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారికి వసంతోత్సవం నిర్వహించారు. శనివారం రాత్రికి గజోత్సవం సాగినది. ఆదివారం ఉదయం, స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు. ఆదివారం తెల్లవారుఝామున స్వామివారు గజవాహనంపై దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాలు, 18వ తేదీ, బుధవారం నిర్వహించిన పుష్పయాగంతో ముగిసినవి.

మూలాలు

[మార్చు]
  1. "Villages and Towns in Singarayakonda Mandal of Prakasam, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-11-09. Retrieved 2022-11-09.
  2. "Singarayakonda (RS) Population, Caste Data Prakasam Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-11-09. Retrieved 2022-11-09.

వెలుపలి లింకులు

[మార్చు]