నారాయణవనం
నారాయణవనం | |
|---|---|
| Coordinates: 13°25′N 79°35′E / 13.42°N 79.58°E | |
| దేశం | |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | తిరుపతి |
| మండలం | నారాయణవనం |
| Area | |
• Total | 1.68 కి.మీ2 (0.65 చ. మై) |
| Elevation | 120 మీ (390 అ.) |
| Population (2011) | |
• Total | 11,253 |
| • Density | 6,700/కి.మీ2 (17,000/చ. మై.) |
| భాష | |
| • అధికారక | తెలుగు |
| Time zone | UTC+5:30 (IST) |
| పిన్ | 517581 |
| ప్రాంతీయ ఫోన్కోడ్ | +91–8577 |
| Vehicle registration | AP |
నారాయణవనం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా, నారాయణవనం మండలం లోని జనగణన పట్టణం. [2]ఇది పుత్తూరుకి 5 కి.మీ. తిరుపతికి 40 కి.మీ. దూరంలో ఉంది.కోన జలపాతాలు, సినిగిరి పెరుమాళ్ కోన, అధలన కోన నారాయణవనానికి అతి దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ జలపాతాలు సంవత్సరంలో 365 రోజులు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ పట్టణం సముద్ర మట్టానికి 122 మీటర్ల ఎత్తులో, 13.42° రేఖాంశం 79.58° అక్షాంశం మీద ఉంది.
ఇక్కడ అతిప్రాచీనమైన శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామికి పద్మావతికి ఇక్కడే వివాహం జరిగిందని అంటుంటారు. దానికి ఋజువుగా ఇక్కడ అమ్మవారి నలుగు పిండికి అవసరమైన తిరగలి కనిపిస్తోంది. ఈ దేవాలయం నిర్వహణా బాధ్యతలు 1967 నుండి తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆద్వర్యంలో జరుగుతున్నాయి. ప్రతిఏడూ అమ్మవారికి 18 రోజులపాటు జాతర జరుగుతుంది. అది ఆగస్టు 22 - 26 తేదీల మద్యలో ప్రారంబమై సెప్టెంబరు 11 -12 తేదీలలో ముగుస్తుంది. ఈ అమ్మవారికి పూజలు చేస్తే పెళ్ళికానివారికి పెళ్ళి అవుతుందని, పిల్లలు కలగని వారికి పిల్లలు కలుగుతారని భక్తుల నమ్మిక.
జనాభా గణాంకాలు
[మార్చు]నారాయణవనం చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలో ఉన్న ఒక జనాభా లెక్కల పట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం, నారాయణవనం పట్టణంలో మొత్తం 2,802 కుటుంబాలు నివసిస్తున్నాయి. నారాయణవనం మొత్తం జనాభా 11,253 అందులో 5,661 మంది పురుషులు, 5,592 మంది స్త్రీలు ఉన్నారు.[3]
దర్శించతగిన ప్రదేశాలు
[మార్చు]- కల్యాణ వెంకటేశ్వర దేవాలయం (నారాయణవనం) ఆకాశరాజు కూతురైన పద్మావతికి శ్రీ వేంకటేశ్వరస్వామికి వివాహం ఇక్కడే జరిగిందని ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇక్కడ ప్రధాన ఆలయంలో ఉన్న దేవుడు శ్రీకళ్యాణ వేంకటేశ్వరుడు. ప్రధాన దేవాలాయానికి అనుబంధంగా చిన్న దేవాలయాలు ఉన్నాయి.అవి:
- శ్రీ పద్మావతి అమ్మవారు గుడి
- శ్రీ ఆండాళ్ అమ్మవారి గుడి
- శ్రీ సీత లక్ష్మణ సమేత రాములవారి గుడి
- శ్రీ రంగనాయకులవారి గుడి
- శ్రీ పరాశర స్వామివారి గుడి
- శ్రీ వీరభద్ర స్వామి వారి గుడి
- శ్రీ శక్తివినాయక గుడి
- శ్రీ అగస్త్యేశ్వరస్వామి గుడి
- శ్రీ అవనాక్షమ్మ గుడి
సమీప అలయాలు
[మార్చు]శ్రీ కైలాసనాధస్వామి ఆలయం, నారాయణవనం సమీపంలోని శ్రీ కామాక్షీ సమేత కైలాసనాధస్వామి ప్రకృతిలో ఒక ఆకృతిగా తరాలు మారినా చెక్కుచెదరని రమ్య మోహనాకృతిగా కొలువుదీరి ఉన్నాడు. శేషాచల కనుమలలో "కాకముఖ" పర్వత శ్రేణిపై ఈ కైలాసకోన ఆవరించి ఉంది. ప్రాకృతికశోభకు అచ్చమైన నెలవుగా, ప్రకృతి పులకింతకు నిక్కమైన కొలువుగా, కైలాసకోన ఆకట్టుకుంటుంది. శివుడే తన ఆత్మలింగాన్ని స్వయంగా ఇక్కడ కొండగుహలలో ప్రతిష్ఠించాడని పురాణకథనం.
జరిగే ఉత్సవాలు
[మార్చు]శ్రీ పరాశర స్వామి చంపకవల్లి అమ్మవారి ఉత్సవ విగ్రాహాలకి, శ్రీ అగస్త్యేశ్వరస్వామి, శ్రీ మరకతవల్లి అమ్మవారి ఉత్సవ విగ్రాహాలకి సంక్రాంతి తరువాత గిరి ప్రదిక్షణ అనే కొండ చుట్టు తిరునాళ్ళు జరుగుతాయి.
- ఆండ్డాళ్ నీరోత్సవం
- ఫంగుణి ఉత్తరోత్సవం
- తెప్పోత్సవం
- ఆణీవారి ఆస్థానం
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Census Handbook - Chittoor" (PDF). Census of India. pp. 19–21, 58. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 November 2015.
- ↑ "Villages and Towns in Narayanavanam Mandal of Chittoor, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. the original నుండి 2022-10-11 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-10-11.
- ↑ "Narayanavanam Population, Caste Data Chittoor Andhra Pradesh - Census India". www.censusindia.co.in. the original నుండి 2022-10-11 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-10-11.