వికీపీడియా:మీకు తెలుసా? భండారము
స్వరూపం
|
1 • 2 • 3 • 4 • 5 • 6 • 7 • 8 • 9 • 10 • 11 • 12 • 13 • 14 • 15 • 16 • 17 • 18 |
ఈ జాబితా, మొదటి పేజీ లోని "మీకు తెలుసా?" విభాగంలో ఇప్పటిదాకా ప్రదర్శించిన వాక్యాల భాండాగారం.
- ఏదైనా వికిపీడియా వ్యాసం చదువుతున్నపుడు మీకు ఆహా! అనిపించే విషయం ఏదైనా కనిపిస్తే ఇక్కడ దానిని చేర్చండి. బహుశా మీలాగే చాలా మందికి ఆ విషయము తెలిసి ఉండకపోవచ్చు.
- ఈ భాండాగారం నుండి ఒక సమయములో కేవలం మూడూ లేదా నాలుగింటిని మాత్రమే ఈ మూసలో చేర్చండి.
- వికీపీడియాలో వ్యాసాలు పూర్తవటం అనేది ఉండదు. ఎప్పుడూ ఎవరో ఒకరు వ్యాసాన్ని మెరుగుపరుస్తూనే ఉంటారు. అందుకని మీరు కొత్తగా తెలుసుకున్న విషయాలను ఎప్పటికప్పుడు ఇక్కడ చేర్చేయండి. అలాగే ఇక్కడ చేర్చిన విషయాలను దాయనవసరం లేదు.
మీకు తెలుసా?
|
|
2026 సంవత్సరంలోని వాక్యాలు
01 వ వారం
- ... విజిత మల్లికా సింహళ చిత్ర పరిశ్రమలో పేరొందిన తొలితరం నటీమణుల్లో ఒకరనీ!
- ... తెలుగు దినపత్రికల్లో దేశాభిమాని తర్వాత రెండో పత్రిక శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి ఆధ్వర్యంలో వెలువడిన గౌతమి అనీ!
- ... ఇస్రో నిర్మించతలపెట్టిన భారతీయ అంతరిక్ష స్థావరం లో వ్యోమగాములు 3 నుంచి 6 నెలలపాటు ఉండగలరనీ!
- ... 2001లో ప్రపంచంలో మొదటిసారిగా స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన దేశం నెదర్లాండ్స్ అనీ!
- ... మోక్షగుండం విశ్వేశ్వరయ్య మొదటిసారిగా వేదావతి హగరి నదిపై ఆనకట్ట నిర్మించాడనీ!
02 వ వారం
- ... వృద్ధాప్య సమస్యలపై పరిశోధన చేసి పీహెచ్డి సాధించిన మొదటి తెలుగు మహిళ గురజాడ శోభా పేరిందేవి అనీ!
- ... జి.వి. జగ్గారావు వేధశాల విశాఖపట్నంలో జమీందారు గోడే వెంకట జగ్గారావు ప్రారంభించిన వేధశాల అనీ!
- ... జన్శక్తి జనతా దళ్ లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఏర్పాటు చేసిన స్వంత పార్టీ అనీ!
- ... ముంబై మెట్రో భారతదేశంలో మూడవ అత్యంత పొడవైన మెట్రో నెట్వర్క్ అనీ!
- ... క్రైస్ట్ ది రిడీమర్ బ్రెజిల్ లో ఉన్న ఎత్తైన ఏసుక్రీస్తు విగ్రహమనీ!
03 వ వారం
- ... భాస్కరరాయలు భారతదేశంలో శాక్తేయ సాంప్రదాయ అభివృద్ధికి కృషిచేసిన వారిలో ప్రముఖుడనీ!
- ... పంజాబ్ విశ్వవిద్యాలయం అనుబంధంగా 2 వందలకు పైగా కళాశాలలు ఉన్నాయనీ!
- ... బట్రేపల్లి జలపాతం కదిరి-పులివెందుల దారిలో కేవలం వర్షాకాలంలో మాత్రమే కనువిందుచేసే జలపాతమనీ!
- ... భారతదేశంలోని రాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థలలో, నిర్మాణం మొదలైన తర్వాత అత్యంత వేగంగా ట్రయల్ రన్ నిర్వహించిన సంస్థగా జైపూర్ మెట్రో రికార్డు సృష్టించిందనీ!
- ... సరోజ్ ఖాపర్డే రాజ్యసభకు ఎక్కువకాలం పనిచేసిన రెండవ సభ్యురాలు అనీ!
04 వ వారం
- ... హైదరాబాదు రాజ్యంలో పత్రికలపై ఆంక్షలు విధించేందుకు ఎకరార్ నామా అనే నిబంధన ప్రవేశపెట్టారనీ!
- ... సంగీత దర్శకుడు రాహుల్ రాజ్ ప్రతిష్టాత్మక బర్కిలీ సంగీతకళాశాల పూర్వ విద్యార్థి అనీ!
- ... పిల్లలకోసం ప్రత్యేకంగా వెలువడిన తొలిపత్రిక బాలమిత్ర అనీ!
- ... బుచ్చిబాబు సానా రూపొందించిన మొదటి చిత్రం ఉప్పెన, జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకుందనీ!
- ... కొండవీటి వాగు కొండవీటి కొండల్లో ఉద్భవించి కృష్ణానదిలో కలుస్తుందనీ!
05 వ వారం
- ... 1948 లో పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురంలో స్థాపించిన శ్రీ వై ఎన్ కళాశాలలో అనేక మంది ప్రముఖులు విద్యనభ్యసించారనీ!
- ... 2025లో ప్రపంచకప్ గెలుచుకున్న భారత మహిళా క్రికెట్ జట్టుకు అమోల్ ముజుందార్ ప్రధాన శిక్షకుడనీ!
- ... సముద్రమట్టానికి కొంత ఎత్తున ఉండి ఇంచుమించు సమతలంగా ఉన్న ప్రాంతాన్ని పీఠభూమి అంటారనీ!
- ... స్వాతంత్ర్యోద్యమ కాలంలో నెల్లూరులో ప్రారంభమైన నెల్లూరు గోడపత్రిక సుమారు 60 సంవత్సరాల పాటు కొనసాగిందనీ!
- ... తమిళనాడులోని మహాబలిపురంలో కృష్ణ మండపం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటనీ!
06 వ వారం
- ... స్త్రీ శక్తి పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 లో మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించిందనీ!
- ... అమెరికాకు అతి చిన్న వయసులో అధ్యక్షుడైనవాడు థియోడర్ రూజ్వెల్ట్ అనీ!
- ... జగదీష్ అండ్ కమలా మిట్టల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ ఆర్ట్ లో ప్రాచీన కాలానికి చెందిన అనేక కళాకృతులు ఉన్నాయనీ!
- ... కళాదర్శకుడు తోట తరణికి ఫ్రాన్స్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారం చెవాలియర్ ప్రధానం చేశారనీ!
- ... 2015 నాటికి దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి ప్రపంచ జనాభాలో 12 శాతం మందిని ప్రభావితం చేసిందనీ!
07 వ వారం
- ... హైదరాబదులోని రవీంద్ర భారతి, గాంధీ భవన్, సాలార్ జంగ్ మ్యూజియం వంటి ఎన్నో కట్టడాలకు వాస్తుశిల్పి మహ్మద్ ఫయాజుద్దీన్ అనీ!
- ... కాంచీపురం లోని కైలాసనాథ దేవాలయం అక్కడి అత్యంత ప్రాచీన ఆలయాల్లో ఒకటనీ!
- ... దివి మురళీకృష్ణ ప్రసాద్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిలో అత్యంత ధనవంతులైన వ్యక్తుల్లో ఒకరనీ!
- ... భారతీయ శాస్త్రవేత్త అనిల్ కుమార్ నోబెల్ గ్రహీత రిచర్డ్ ఎర్నెస్ట్ తో కలిసి పరిశోధనలు చేశాడనీ!
- ... 1993లో ఇన్ఫోసిస్ ఐపివోకి రావడానికి ఎన్.ఆర్. నారాయణమూర్తికి వల్లభ్ భన్సాలీ సహాయం చేశాడనీ!
08 వ వారం
- ... ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ప్రజల్లో గుండె జబ్బుల గురించి అవగాహన కల్గించడానికి కృషి చేస్తుందనీ!
- ... స్పానిష్ భాష మాట్లాడే ప్రజలు ఎక్కువగా మెక్సికో దేశంలో ఉన్నారనీ!
- ... దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన మొదటి సినిమాటోగ్రాఫర్ వి. కె. మూర్తి అనీ!
- ... ఛత్తీస్గఢ్ లోని మహామాయ ఆలయం భారతదేశంలోని 52 శక్తిపీఠాల్లో ఒకటనీ!
- ... తెలుగు సంగీత పరిశ్రమలో ఆదిత్య మ్యూజిక్ ఒక ప్రముఖమైన సంస్థ అనీ!
09 వ వారం
- ... మండవ జానకిరామయ్య విజయ డైరీ మాజీ ఛైర్మన్ గా పాల పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశాడనీ!
- ... కర్ణాటకలోని ఏడు పవిత్రమైన ముక్తి క్షేత్రాల్లో మహాబలేశ్వర్ ఆలయం, గోకర్ణ ఒకటనీ!
- ... భారత జాతీయ అంధుల క్రికెట్ జట్టు రెండు సార్లు టీట్వంటీ ప్రపంచ కప్, రెండు సార్లు వన్డే ప్రపంచకప్ గెలుచుకుందనీ!
- ... రోజుకు రెండుసార్లు సముద్రంలో కనుమరుగైపోయే శివాలయం గుజరాత్ రాష్ట్రం భరూచ్ జిల్లాలో ఉందనీ!
- ... గుంటూరులోని కుగ్లర్ ఆసుపత్రి 1897లో మహిళల కోసం ప్రారంభించబడిన ఆసుపత్రి అనీ!
10 వ వారం
- ... కాశ్మీర్ కు చెందిన భజన్ సోపోరి ప్రాచీన భారత వాయిద్యమైన సంతూర్ వాద్య నిపుణుడనీ!
- ... బెంగాల్ లోని ప్రసిద్ధ ఆలయం రాధే శ్యాం మందిరం టెర్రాకోటతో నిర్మించబడిందనీ!
- ... నీలా నది కేరళలో ప్రవహించే రెండవ పొడవైన నది అనీ!
- ... ఆంధ్రప్రదేశ్ కు చెందిన దేశీ ఒంగోలు పశువులు ప్రపంచవ్యాప్తంగా బలానికీ, దూకుడు స్వభావానికి పేరొందినవనీ!
- ... భారతదేశంలోని ఉన్నత శిఖరాల యుద్ధశిక్షణ స్కూల్ మంచులో యుద్ధశిక్షణా నైపుణ్యాలు పెంపొందిస్తుందనీ!
11 వ వారం
- ... ఘనకాంత బోరా అస్సాం శాస్త్రీయ నృత్యమైన సత్త్రియ నృత్యంలో నిష్ణాతుడనీ!
- ... మరియమ్మన్ ఆలయం, సమయపురం తమిళనాడులో రెండవ అత్యంత సంపన్నమైన ఆలయమనీ!
- ... 1937లో జమీందార్లకు వ్యతిరేకంగా ఇచ్ఛాపురం నుండి మద్రాసు వరకు ఆంధ్ర రైతు రక్షణ యాత్ర జరిగిందనీ!
- ... హల్వారా వైమానిక దళ స్థావరం 1965, 1971లలో భారత పాకిస్థాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిందనీ!
- ... 1964లో వచ్చిన బాలీవుడ్ చిత్రం దోస్తీ, ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిందనీ!
12 వ వారం
- ... భారత ప్రభుత్వం తిరుమలాచారి రామస్వామిని వరసగా ఐదుసార్లు శాస్త్ర సాంకేతిక కార్యదర్శిగా నియమించిందనీ!
- ... కెన్యా దేశంలోని ఉమోజా గ్రామంలో కేవలం మహిళలే ఉంటారనీ!
- ... నాచ్నా దేవాలయాలు భారతదేశంలో ఇప్పటికీ నిలిచిఉన్న తొలి రాతి దేవాలయాలనీ!
- ... 2024 నాటికి ట్వంటీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ పోటీల్లో భారత్ అత్యధికంగా 160 విజయాలు సాధించిందనీ!
- ... కర్ణాటకలోని యానా ప్రపంచంలోని అత్యధిక వర్షపాతం నమోదయ్యే గ్రామాలలో ఒకటనీ!
13 వ వారం
- ... తెలుగు సినీ దర్శకుడు పోలవరపు శరత్ 15 ఏళ్ళలో 35 సినిమాలకు దర్శకత్వం వహించాడనీ!
- ... కర్ణాటకలోని దొడ్డ బసవప్ప దేవాలయం 24 మూలల వినూత్నమైన నక్షత్రాకారంలో నిర్మించబడిందనీ!
- ... బ్రాహ్మణపురుగు పాము భారతదేశంలో అన్నింటికన్నా చిన్నపాము అనీ!
- ... శ్రీసూక్తం సర్వ సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని స్తుతించే ప్రాచీన సంస్కృత శ్లోకమనీ!
- ... ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ భారతదేశానికి స్వాతంత్ర్యానికి వచ్చిన తొలినాళ్ళలో జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థగా గుర్తింపు పొందిందనీ!
14 వ వారం
- ... రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ గా పనిచేసిన విజయపత్ సింఘానియా విమాన చోదకుడు కూడా అనీ!
- ... ఒడిషాలోని భువనేశ్వర్ లో ఉన్న లింగరాజ ఆలయం అత్యంత ప్రాచీన ఆలయాల్లో ఒకటనీ!
- ... సిక్కిం సార్వభౌమత్వం గురించి 1971లో సత్యజిత్ రాయ్ తీసిన డాక్యుమెంటరీ సిక్కిం భారత ప్రభుత్వం చేతిలో నిషేధానికి గురైందనీ!
- ... కేవలం ఊహాత్మక భావనలతో కాకుండా ప్రయోగాలు, పరిశీలిన ద్వారా ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే ప్రయోగాత్మక భౌతిక శాస్త్రం విజ్ఞాన విప్లవ కాలంలో ఐరోపాలో ప్రత్యేక విభాగంగా ఏర్పడిందనీ!
- ... జలవాణిజ్య మార్గంలో ప్రధాన పాత్ర పోషించే కొల్లాం కాలువ జాతీయ జలమార్గం - 3 లో ఒక భాగమనీ!
15 వ వారం
- ... మధు అంబట్ మూడు సార్లు జాతీయ ఉత్తమ సినిమాటోగ్రాఫర్ పురస్కారాన్ని గెలుచుకున్నాడనీ!
- ... శృంగార వల్లభ స్వామి దేవాలయం తొలి తిరుపతి అని వ్యవహరించబడుతుందనీ!
- ... తమిళనాడులోని రాజపాలయం మామిడి పండ్లకీ, జాతి కుక్కలకూ పేరు గాంచిందనీ!
- ... చారిత్రక ప్రాశస్త్యం కలిగిన పునర్జని గుహ లో పాకుతూ వెళ్ళడం వల్ల పాపనాశనం అవుతుందని విశ్వసిస్తారనీ!
- .... బారాబతి కోట ముస్లింలు, మరాఠాల పరిపాలనా కాలంలో ఒడిషా రాజధానిగా ఉందనీ!
16 వ వారం
- ... అక్కల మంగయ్య కుటుంబం తరతరాలుగా లోహశిల్పకళలో పేరు గాంచిందనీ!
- ... కర్ణాటక రాజధాని బెంగళూరులోని జ్ఞానాక్షి రాజరాజేశ్వరి ఆలయం ఉన్న ప్రాంతం రాజరాజేశ్వరి నగర్ గా ప్రసిద్ధి చెందినదనీ!
- ... కేరళలో 1749లో జరిగిన చంగనాస్సేరి యుద్ధం ట్రావెన్కూర్ సామ్రాజ్య విస్తరణకు దారి తీసిందనీ!
- ... మృత్తికా శాస్త్రం అనేది నేలను ఒక సహజ వనరుగా భావించి అధ్యయనం చేసే విజ్ఞానశాస్త్ర భాగమనీ!
- ... మహా బోధి సొసైటీ భారతదేశంలో బౌద్ధమత పునరుద్ధరణకు కృషి చేస్తుందనీ!
17 వ వారం
- ... ట్వంటీ ట్వంటీ ఫార్మాట్ లో మొట్టమొదటి హ్యాట్రిక్ సాధించిన బౌలర్ బ్రెట్ లీ అనీ!
- ... గుజరాత్ లోని సియోట్ గుహలు సా.శ ఒకటవ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారనీ!
- ... కొచ్చిన్ యుద్ధంలో భాగంగా స్థానిక రాజుతో పొత్తు పెట్టుకున్న కొద్దిపాటి పోర్చుగీసు సైన్యం, తమకన్నా ఎంతో పెద్దదైన జామోరిన్ సైన్యాన్ని ఓడించిందనీ!
- ... భూమి మీద కొన్ని లక్షల ఏళ్ళుగా ఉన్న వాతావరణాన్ని గురించి అధ్యయనం చేసేది శీతోష్ణస్థితుల శాస్త్రం అనీ!
- ... ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం ముంబైలో యుద్ధంలో అమరుల కోసం నిర్మించిన కట్టడాల విషయంలో జరిగిన అవినీతి ఆరోపణ అనీ!
18 వ వారం
- ... షాహిద్ అఫ్రిది వన్డేలలో నెలకొల్పిన అత్యంత వేగవంతమైన శతకం 17 ఏళ్ళపాటు అలాగే ఉండిందనీ!
- ... ప్రాచీన ఆధ్యాత్మిక గ్రంథమైన తేవారం నేటికీ తమిళనాడులోని అనేక శివాలయాలలో భక్తి పరాయణంగా ఆలపించబడుతున్నాయనీ!
- ... హిల్ ప్యాలెస్ మ్యూజియం కేరళ రాష్ట్రంలోనే అతిపెద్ద పురావస్తు ప్రదర్శనశాల అనీ!
- ... డయ్యూ యుద్ధం లో పోర్చుగీసు వారు గుజరాత్ సుల్తాన్ ముస్లిం కూటమిని ఓడించారనీ!
- ... లోహియా మెషినరీ లిమిటెడ్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూరులో ఉన్న మోటారు సైకిల్ తయారీ సంస్థ అనీ!
19 వ వారం

- ... సుశీల్ దోషి మొదటి హిందీ క్రికెట్ వ్యాఖ్యాతగా పేరుగాంచాడనీ!
- ... శ్రీకాకుళంలోని ఆంధ్ర విష్ణు ఆలయం శాతవాహనుల కాలంనాటిదనీ!
- ... కేరళలోని కొట్టాయం జిల్లాలో ఉన్న ముట్టుచిర లో భారతదేశంలోనే పురాతన చర్చిలు ఉన్నాయనీ!
- ... మరాఠా నావికాదళం 17 వ శతాబ్దంలో శివాజీ ఆధ్వర్యంలో తీరం వెంబడి వచ్చే శత్రుసైన్యాలను ఎదుర్కోవడానికి ఏర్పడ్డ సైన్యమనీ!
- ... గుజరాత్ కి చెందిన కర్సన్ భాయ్ పటేల్ స్థాపించిన నిర్మా తన కూతురు పేరు మీదుగా స్థాపించాడనీ!
20 వ వారం
- ... కేరళకు చెందిన జి. విజయరాఘవన్ భారతదేశంలో మొట్టమొదటి టు-డైమెన్షనల్ (2D) ఎకోకార్డియోగ్రఫీ ప్రయోగశాలను స్థాపించారనీ!
- ... ఉత్పల వంశం మధ్యయుగంలో కాశ్మీర దేశానికి చెందిన రాజవంశమనీ!
- ... కర్ణాటకలోని బీజాపూర్ కోట, దాని చుట్టూ ఉన్న పరిసరాలను దక్షిణ భారతదేశపు ఆగ్రా అని వ్యవహరిస్తారనీ!
- ...కేరళలోని ఆదానీ పోర్ట్స్ విజింజం లో అంతర్జాతీయ స్థాయి నౌకాశ్రయాన్ని ఏర్పాటు చేసిందనీ!
- ... సక్కర్బాగ్ జూలాజికల్ గార్డెన్ ఆసియా సింహాలను, అంతర్జాతీయ అంతరించిపోతున్న జాతులకు బ్రీడింగ్ ప్రోగ్రామ్ను అందిస్తుందనీ!
21 వ వారం
- ... విశ్వావిర్భావానికి సంబంధించిన కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్ గ్రౌండ్ ని కనుగొన్నందుకు రాబర్ట్ వుడ్రో విల్సన్ నోబెల్ బహుమతి పొందాడనీ!
- ...కాశ్మీర శైవంగా పిలిచే ఆధ్యాత్మిక రహస్యవాద సాంప్రదాయానికి శివసూత్రాలు పునాది అనీ!
- ... ఓడనాడు అనేది మధ్యయుగ కేరళ చివరి నాటి భూస్వామ్య రాజ్యమనీ!
- ... ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్ 1882 లోనే విద్యుదీకరణ జరిగిన మొదటి భవనమనీ!
- ... ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యు అనేది లియో టాల్స్టాయ్ రచించిన క్రైస్తవ అరాచకవాద తాత్విక గ్రంథమనీ!
22 వ వారం
- ... రోటరీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి ఆసియా సంతతి వ్యక్తి నితీష్ చంద్ర లహరి అనీ!
- ... గుజరాత్ లోని రుక్మిణి దేవి ఆలయం నీటిని సమర్పించే జల్ దాన్ ఆచారానికి ప్రసిద్ధి గాంచిందనీ!
- ... ఎజిమల లోని ఇండియన్ నేవల్ అకాడమీ ఆసియాలోనే అతిపెద్దదనీ!
- ... జ్యోతిర్మీమాంస నీలకంఠ సోమయాజి రచించిన ఖగోళ అధ్యయన పద్ధతుల గ్రంథమనీ!
- ... కర్ణాటక ఒప్పందం లో భాగంగా ఆర్కాట్ నవాబు తమిళనాడుపై ఈస్టిండియా కంపెనీకి అధికారం అప్పగించాడనీ!
23 వ వారం
- ... వి.గణపతి స్థపతి సాంప్రదాయ వాస్తుశైలిలో నిర్మించిన అనేక నిర్మాణాలకు రూపకల్పన చేశాడనీ!
- ... మధురై అంతర్జాతీయ విమానాశ్రయము రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వైమానిక దళ క్షేత్రంగా ప్రారంభమైందనీ!
- ... ఆధునిక కన్నడ భాష కదంబుల రాజవంశంలో ప్రారంభమైన హళెగన్నడ నుంచి రూపాంతరం చెందిందనీ!
- ... భారతదేశంలోనూ, విదేశాలలోనూ లలిత కళలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం లలిత కళా అకాడమీ నిర్వహిస్తుందనీ!
- ... కాపాలిక సాంప్రదాయం సా.శ 4-5 శతాబ్దాల మధ్యలో పుట్టిన తాంత్రిక, పౌరాణికేతర శైవ సాంప్రదాయమనీ!
24 వ వారం
- ... సుందరర్ తమిళ శైవభక్తులు నాయనార్లలో ఒకడనీ!
- ... దిమాసా రాజ్యం మధ్యయుగపు చివరి రోజుల్లో ఈశాన్య భారతదేశంలో ప్రాచుర్యం పొందిన రాజ్యమనీ!
- ... విలువైన ముత్యాల చేపల పెంపకంపై నియంత్రణ సాధించడం కోసం పోర్చుగీసు వారిపై విజయనగర సామ్రాజ్యం మత్స్య తీరంపై విఠల దండయాత్ర చేసిందనీ!
- ... భారతీయ బౌద్ధ మహాసభ భారతదేశంలో బౌద్ధమత పునరుద్ధరణ కోసం బి. ఆర్. అంబేద్కర్ స్థాపించిన సంస్థ అనీ!
- ... 2024లో పశ్చిమ బెంగాల్ వరదలు కారణంగా సుమారు 2.5 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారనీ!
25 వ వారం
- ... ప్రముఖ వ్యాపారస్థుల కుటుంబంలో పుట్టిన పిరోజ్ షా గోద్రెజ్ రియల్ ఎస్టేట్ రంగంలో తమ వ్యాపారాన్ని విస్తరించాడనీ!
- ... ఒడిశా లోని రత్నగిరి ఒక కాలంలో ప్రధాన బౌద్ధ విహారమనీ!
- ... బ్రిటిష్ కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీలోని దక్షిణ కెనరా జిల్లా, అత్యంత భిన్నమైన జనాభా కలిగిన ప్రాంతమనీ!
- ... సారనాథ్ మ్యూజియం లో అత్యంత ప్రాచీనమైన ప్రదేశాలకు సంబంధించిన వస్తువులు భద్రపరచబడ్డాయనీ!
- ... తమిళనాడులోని మనమదురై భారతీయ పురాతన వాయిద్యమైన ఘటం తయారీకి పేరు గాంచిందనీ!
26 వ వారం
- ... జార్జ్ జోసెఫ్ భారత అంతరిక్ష రంగంలో కృషి చేసినందుకుగాను 1999 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడనీ!
- ... తిరుక్కోవిలూరు 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో మొదటిదనీ!
- ... అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) అమెరికాలోని లాస్ ఏంజిలెస్ లో 1977 నుంచి భగవద్గీత మ్యూజియం నిర్వహిస్తోందనీ!
- ... శత్రు దుర్బేధ్యమైన గ్వాలియర్ కోట ను జిబ్రాల్టర్ ఆఫ్ ఇండియా అని ముద్దుగా పిలుస్తారనీ!
- ... క్రికెట్ మహిళల ఆసియా కప్ లో భారతదేశం అత్యధికంగా ఏడు సార్లు విజేతగా నిలిచిందనీ!
27 వ వారం
- ... రేడియో భానుమతిగా పేరు గాంచిన పసుమర్తి భానుమతి ఆకాశవాణి తొలి మహిళా అనౌన్సరుగా పేరు గాంచారనీ!
- ... తమిళనాడు, కృష్ణగిరి జిల్లా, హోసూరులోని కెనిల్వర్త్ కోట ఇంగ్లండు లోని కెనిల్వర్త్ క్యాజిల్ ని పోలిన నిర్మాణమనీ!
- ... గర్హా రాజ్యం మధ్య భారతదేశంలో గోండు ప్రజలు స్థాపించిన రాజ్యమనీ!
- ... శ్రీవైష్ణవ సాంప్రదాయంలో 108 దివ్య దేశాలలాగా అభిమాన్య క్షేత్రాలు కూడా పవిత్ర పుణ్యక్షేత్రాలనీ!
- ... ఆంగ్లేయులకు ఎదురొడ్డి పోరాడిన వీరనారి రాణి కిత్తూర్ చెన్నమ్మ సమాధి బైల్హోంగల్ లో ఉందనీ!
28 వ వారం
- ... రాధికా హెర్జ్బెర్గర్ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి మదనపల్లెలో స్థాపించిన రిషీ వ్యాలీ సంస్థకు డైరెక్టరుగా పనిచేస్తుందనీ!
- ... దిండిగల్ కోటను మధురై నాయకర్ రాజవంశీయులు 16వ శతాబ్దంలో నిర్మించారనీ!
- ... బెంగాల్ వాలంటీర్స్ అనేది బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా ఏర్పడ్డ రహస్య విప్లవాత్మక సంస్థ అనీ!
- ... డేవిడ్ హ్యూమ్ ప్రతిపాదించిన బండిల్ సిద్ధాంతం వస్తువులకు సంబంధించిన అస్తిత్వ మీమాంస సిద్ధాంతమనీ!
- ... స్కాంద పురాణం ప్రకారం పరశురాముడు తన గొడ్డలి సముద్రంలోకి విసిరి వెనక్కి తగ్గించిన ప్రాంతం కొంకణ్ తీరప్రాంతంగా ఏర్పడిందనీ!
29 వ వారం
- ... క్యాన్సర్ వైద్య నిపుణుడు లూయిస్ జోస్ డి సౌజా వైద్యరంగంలో సేవలు చేసినందుకు 1992 లో పద్మశ్రీ పురస్కారం పొందాడనీ!
- ... కొప్పం యుద్ధం దక్షిణ భారతదేశంలో ప్రముఖ రాజవంశాలైన చోళులకు, చాళుక్యులకు మధ్య జరిగిన యుద్ధమనీ!
- ... ది డిస్కవరీ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ బ్రిటిష్ అధికారులు జైలులో నిర్బంధించినపుడు రాసిన పుస్తకమనీ!
- ... ప్రస్తుతం పలు బ్యాంకుల విలీనం తర్వాత ఏర్పడ్డ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఒక భాగమనీ!
- ... మనుషులు కాకుండా ఇతర జంతువులు ఎలా ప్రవర్తిస్తాయో తెలిపేది ఇథాలజీ అనీ!
30 వ వారం
- ... దామర్ల చెన్నప నాయక గౌరవార్థం ఆయన వారసుడు చెన్నపట్టణాన్ని స్థాపించాడనీ!
- ... వైష్ణో దేవిని మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి త్రిమూర్తి దేవతల ఉమ్మడి అవతారంగా పూజిస్తారనీ!
- ... కత్యూరి రాజవంశం భారతదేశంలో ఉత్తరాఖండ్, నేపాల్ ప్రాంతాలను పరిపాలించిన మధ్యయుగపు రాజవంశమనీ!
- ... సెయింట్ థామస్ కేథడ్రల్ ముంబైలో అతి పురాతన చర్చి అనీ!
- ... మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్థాపించిన బెంగళూరు ప్రెస్ భారతదేశపు అత్యంత పురాతన సంస్థలలో ఒకటనీ!
31 వ వారం
- ... ఫణిశ్వర్ నాథ్ రేణు ఆధునిక హిందీ సాహిత్యంలో అత్యంత విజయవంతమైన, ప్రభావవంతమైన రచయితలలో ఒకరనీ!
- ... తమిళనాడు పోలీస్ మ్యూజియం, చెన్నైలో రాష్ట్ర న్యాయ అమలు సంస్థ బ్రిటిష్ రాజ్ నుండి ఆధునిక కాలానికి మారడాన్ని సూచించే ప్రదర్శనల భాండాగారం ఉందనీ!
- ... అంబేద్కర్ తన అనుచరణగణంతో సామూహికంగా బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన స్థలం దీక్షాభూమి అనీ!
- ... టిబెటన్ సంచార జాతి అయిన గురుంగ్ ప్రజలు హిమాలయా ప్రాంతంలో గొర్రెలు, జడల బర్రెలు మేపుకుని జీవనం సాగిస్తారనీ!
- ... కర్ణాటకలోని, కొల్లూరు మూకాంబిక దేవిని ఉదయం సరస్వతిగా, మధ్యాహ్నం లక్ష్మిగా, సాయంత్రం పార్వతిగా ఆరాధిస్తారనీ!
32 వ వారం
- ... రచయిత, సామాజిక కార్యకర్త తుషార్ గాంధీ మహాత్మా గాంధీ మునిమనవడనీ!
- ... బెంగాల్ నవాబులు ఢిల్లీలోని మొఘల్ సామ్రాజ్య ఖజానాకు భారీగా నిధులు సమకూర్చేవారనీ!
- ... ప్రాచీన దక్షిణ భారతదేశ నిర్మాణాలను చోళుల కళ, వాస్తుశిల్పం అత్యధికంగా ప్రభావితం చేశాయనీ!
- ... ట్రూత్ సోషల్ అనేది సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విటర్) కి పోటీగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్ధతుతో ఏర్పాటైన సంస్థ అనీ!
- ... బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ భారతీయ కళా ప్రపంచంలో గణనీయమైన వారసత్వాన్ని సృష్టించిందనీ!
33 వ వారం
- ... చిలకూరు బాలాజీ దేవాలయానికి గుర్తింపు తీసుకువచ్చిన ఎం.వి.సౌందరరాజన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగానూ, రిజిస్ట్రార్ గానూ పని చేశాడనీ!
- ... ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ లో విలీనమైన కార్పొరేషన్ బ్యాంక్ 1906 లో కర్ణాటకలోని ఉడిపిలో ప్రారంభమైందనీ!
- ... సుప్రసిద్ధ ఎల్లోరా గుహలు మహారాష్ట్రలో జైనమతం ప్రాభవానికి నిదర్శనాలనీ!
- ... కొలతలకు సంబంధించిన శాస్త్రీయ అధ్యయనం మెట్రాలజీ ఫ్రెంచ్ విప్లవ సమయంలో వేళ్ళూనుకున్నదనీ!
- ... ప్రముఖ భారతీయ గాయని ఆశా భోస్లే ఆశాస్ అనే పేరుతో ప్రపంచ స్థాయి రెస్టారెంట్ చెయిన్ స్థాపించిందని!
34 వ వారం
- ... కె. జి. బాలకృష్ణన్ కేరళ నుంచి వచ్చిన మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనీ!
- ... కర్ణాటకలోని సంకిఘట్ట జైనమతంలో ఒక చారిత్రక ప్రదేశమనీ!
- ... రాజస్థాన్ లోని చిత్తూరు కోట భారతదేశంలో అతిపెద్ద కోటలలో ఒకటనీ!
- ... తాజ్ హోటల్స్ ప్రపంచ ప్రముఖ హోటల్స్ జాబితా అయిన గోల్డ్ స్టాండర్డ్ హోటల్స్ లో ఉన్నాయనీ!
- ... జామియా మిలియా ఇస్లామియా జాకీర్ హుస్సేన్, మహాత్మా గాంధీ లాంటి వారు కలిసి స్థాపించిన పరిశోధన విశ్వవిద్యాలయమనీ!
35 వ వారం
- ... బి.ఎన్. కృష్ణమూర్తి శర్మ మధ్వాచార్యుల ద్వైత వేదాంతాన్ని పరిశోధించిన వారిలో అగ్రగణ్యుడనీ!
- ... 1996లో ప్రపంచపు గంధపు నూనెల ఉత్పత్తిలో మైసూరు గంధపు నూనె వాటా సుమారు 70 శాతానికిపైగా ఉండేదనీ!
- ... శ్రీలంక తమిళులు, ప్రవాసులు కలిసి ఏర్పాటు చేయదలుచుకున్న స్వతంత్ర దేశాన్ని తమిళ ఈలం అని వ్యవహరిస్తున్నారనీ!
- ... న్యూరల్ నెట్వర్క్ అనేది మానవ మెదడులోని నాడీ వ్యవస్థను అనుకరిస్తూ ప్రతిపాదించబడిన కంప్యూటర్ వ్యవస్థ అనీ!
- ... వైశాఖ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష ప్రతిపద తిథి నాడు నారద జయంతి ని జరుపుకుంటారనీ!
36 వ వారం

- ...19 సంవత్సరాల వయస్సులో యోగేంద్ర సింగ్ యాదవ్ పరమవీరచక్ర పురస్కారాన్ని పొందాడానీ!
- ... ప్రసిద్ధ చిత్రకారుడు రాజా రవివర్మ సోదరి మంగళ బాయి కూడా చిత్రకారిణిగా పేరు గాంచిందనీ!
- ... కర్ణాటకలోని గలగనాథలో 11 వ శతాబ్దం నాటి ప్రసిద్ధ చాళుక్య దేవాలయం ఉందనీ!
- ... కోల్కతలోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ భారతదేశపు పురాతన ఆర్ట్ కళాశాలల్లో ఒకటనీ!
- ... కరేబియన్ సముద్రం భూమిపై ఉన్న అతిపెద్ద సముద్రాలలో ఒకటనీ!
37 వ వారం
- ... లక్ష్మణ్ మహాదేవ్ చితాలే రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ లో తొలి భారతీయ సభ్యులలో ఒకరనీ!
- ... బెంగళూరులోని కే.ఆర్. మార్కెట్ ఆసియాలో అతిపెద్ద పూల మార్కెట్లలో ఒకటనీ!
- ... సోహ్రాయ్ చిత్రకళ అనేది జార్ఘండ్ కి చెందిన జానపద చిత్రకళ అనీ!
- ... ప్రాచీన నలంద విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యుడి పేరు మీదుగా అమెరికాలోని కొలరాడో లో నరోపా విశ్వవిద్యాలయం స్థాపించారనీ!
- ... భారతీయ సాహిత్యంలో ప్రాచుర్యం పొందిన రామచరిత మానస్, హనుమాన్ చాలీసా వంటివి అవధి భాషలో రాయబడినవనీ!
38 వ వారం
- ... వజ్రాల వ్యాపారి మాథుర్ సవానీ గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతంలో నీటి సౌకర్యాల కోసం చేసిన కృషికి గాను 2014లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడనీ!
- ... మంగుళూరులోని కుద్రోలి భగవతి ఆలయం 14 మంది దేవతలను మూడు వేర్వేరు పేర్లతో పూజించే ఏకైక ఆలయమనీ!
- ... గూగుల్ ఆర్ట్స్ & కల్చర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వామ్య సాంస్కృతిక సంస్థల నుండి సేకరించిన కళాఖండాలతో కూడిన ఆన్లైన్ వేదిక అనీ!
- ... తొంభై శాతానికిపైగా చర్మ క్యాన్సర్లు సూర్యుని అతినీలలోహిత కిరణాలకు గురికావడం వల్ల సంభవిస్తాయనీ!
- ... శ్రీలంకకు చెందిన ప్రాచీన నగరం పొలొన్నరువ ఆ దేశంలో అత్యంత శాస్త్రీయ ప్రణాళికతో నిర్మించబడిన నగరమనీ!
39 వ వారం
- ... గణితశాస్త్రంలో ఇన్ఫోసిస్ బహుమతిని మొదటిసారిగా అందుకున్నది మణీంద్ర అగ్రవాల్ అనీ!
- ... హిందూమతంలో ప్రముఖ తెగ లింగాయతులకు కూడలసంగమం ముఖ్యమైన తీర్థయాత్రా స్థలమనీ!
- ... గోండ్ చిత్రకళ సుమారు 1400 ఏళ్ళ చరిత్ర కలిగిన చిత్రకళ అనీ!
- ... సకశేరుక జీవుల్లో పక్కటెముకలు శరీరంలో ముఖ్య అవయవాలైన గుండె, ఊపిరితిత్తులు మొదలైనవాటికి రక్షణగా ఉంటాయనీ!
- ... తోడర్ మల్ అక్బర్ ఆస్థానంలో నవరత్నాల్లో ఒకడిగా పేరు గాంచాడనీ!
40 వ వారం
- ... కౌండిన్యుడు గౌతమబుద్ధుని ఐదుగురు ప్రారంభ సన్యాసులైన పంచవగ్గీయులలో ఒకడనీ!
- ... క్రౌంచ గిరిని శివపార్వతుల తనయుడైన కుమారస్వామి మొదటి నివాసంగా విశ్వసిస్తారనీ!
- ... స్ట్రేంజర్ థింగ్స్ అనేది నెట్ఫ్లిక్స్ లో ప్రసారమైన విజయవంతమైన వైజ్ఞానిక కల్పనతో కూడిన టివీ సిరీస్ అనీ!
- ... లీలావతి అనేది భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు భాస్కరాచార్యుడు గణితశాస్త్రంపై వ్రాసిన గ్రంథమనీ!
- ... లారీ ఎల్లిసన్ ప్రముఖ బహుళజాతి సాఫ్ట్వేర్ సంస్థ ఒరాకిల్ సహవ్యవస్థాపకుడనీ!
41 వ వారం
- ... భారతీయ చిత్రకారుడు లక్ష్మణ్ పాయ్ ప్రపంచ వ్యాప్తంగా 110కి పైగా వ్యక్తిగత ప్రదర్శనలు ఇచ్చాడనీ!
- ... సంగీత విద్వాంసుడు త్యాగరాజు కోవూరు సుందరేశ్వర ఆలయం సందర్శించి కోవూరు పంచరత్నం అనే ఐదు కీర్తనలను ఆలపించాడనీ!
- ... జుహు, ముంబై మహానగర ప్రాంతంలోని అత్యంత ఖరీదైన, సంపన్న ప్రాంతాలలో ఒకటనీ!
- ... ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయాలలో ఒకటిగా భావించబడుతోందనీ!
- ... దక్షిణాసియా క్రీడలు మొదటిసారిగా 1984 లో నేపాల్ రాజధాని ఖాట్మండులో నిర్వహించారనీ!
42 వ వారం
- ... పోటీపరీక్షలు రాసే విద్యార్థులు ప్రముఖ భౌతికశాస్త్ర ఆచార్యుడు హెచ్. సి. వర్మ రాసిన పుస్తకాలు ఎక్కువగా ఉపయోగిస్తారనీ!
- ... సా.శ 8 నుండి 12 వ శతాబ్దాల మధ్యలో భారతదేశాన్ని పరిపాలించిన పాల రాజవంశం కాలంలో పాల చిత్రకళ అభివృద్ధి చెందిందనీ!
- ... ప్రపంచ సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందిన టు బి ఆర్ నాట్ టు బి అనే వాక్యం షేక్స్పియర్ రాసిన హ్యామ్లెట్ అనే నాటకం లోనిదనీ!
- ... కేరళ కి చెందిన సినిమా దర్శకుడు జె. శశికుమార్ ఒక సంవత్సరంలోనే 15 సినిమాలకు దర్శకుడుగా పని చేశాడనీ!
- ... ప్రాసియోడిమియం అనేది భూమిపైన దొరికే అరుదైన లోహాల్లో ఒకటనీ!
43 వ వారం
- ... శ్రీకాకుళం జిల్లాలోని షేర్ మహమ్మద్ పురం గ్రామం 16వ శతాబ్దిలో గోల్కొండ నవాబు ప్రతినిధికి కేంద్రంగా ఓ వెలుగు వెలిగిందనీ, ఊరిలో ఆనాటి కోటతో సహా అనేక చారిత్రక కట్టడాలు ఉంటాయనీ!
- ... రాజేంద్ర కె. పచౌరి పర్యావరణ, విధానపరమైన సమస్యలపై అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వ్యక్తి అనీ!
- ... తరంగ్ సినీ అవార్డ్స్ అనేవి ఒడియా భాష చిత్రపరిశ్రమలో పనిచేసే వారికి ఇచ్చే పురస్కారాలనీ!
- ... గర్ల్ విత్ ఎ పెర్ల్ ఇయర్రింగ్ అనేది జోహన్నెస్ వెర్మీర్ గీసిన ప్రపంచ ప్రఖ్యాత చిత్రం అనీ!
- ... ది డైలీ టెలిగ్రాఫ్ బ్రిటన్ లో అత్యధికంగా చదివే నాణ్యమైన ఆంగ్ల దినపత్రికల్లో ఒకటనీ!
44 వ వారం
- ... వైష్ణవాచార్యుడు శ్రీపాదరాజ ను హరిదాసు ఉద్యమ స్థాపకుడిగా పరిగణిస్తారనీ!
- ... సావో టోమ్ ఆఫ్రికాలోని అత్యంత పురాతన వలస పాలనా నగరాలలో ఒకటిగా పరిగణించబడుతుందనీ!
- ... తమిళ తీరప్రాంత పట్టణమైన వేలాంకన్ని ప్రపంచ ప్రసిద్ధ క్రైస్తవ క్షేత్రాల్లో ఒకటనీ!
- ... ప్యాలెస్ ఆన్ వీల్స్ రాజస్థాన్ పర్యాటక సంస్థ, భారతీయ రైల్వేతో కలిసి నిర్వహిస్తున్న విలాసవంతమైన రైలు అనీ!
- ... మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురైన తర్వాత 1991లో జరిగిన అమేథి లోక్సభ ఉపఎన్నికలలో విజయం సాధించింది తెలంగాణ ప్రాంతానికి చెందిన సతీష్ శర్మ అనీ!
45 వ వారం
- ... ఎన్ఐఐటీ సహ వ్యవస్థాపకుడైన రాజేంద్ర సింగ్ పవార్ 1998 లో ఐటీ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గా గుర్తింపు పొందాడనీ!
- ... ఉచితంగా ప్రవేశం లభించే సైన్స్ మ్యూజియం, లండన్ నగరంలో ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటనీ!
- ... తెలుగు చిహ్నం సిద్ధం పలు ప్రాచీన భారతీయ శాసనాల్లో కనిపించే ప్రముఖమైన చిహ్నం అనీ!
- ... దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, దిగ్గజ ఫీల్డర్ జాంటీ రోడ్స్ భారతదేశం పట్ల ఉన్న అభిమానంతో ఆయన నలుగురు సంతానంలో ఒకరికి ఇండియా అని నామకరణం చేసాడనీ!
46 వ వారం
- ... నలంద మహావిహారంలో పండితుడైన శాంతిదేవుడు ఆచార్య నాగార్జునుడికి శిష్యుడనీ!
- ... క్యూబా విప్లవం దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ అనేక పరిణామాలకు దారితీసిందనీ!
- ... కర్ణాటకలోని బీజాపూర్ లో ఉన్న గోల్ గుంబజ్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా గుర్తించబడిందనీ!
47 వ వారం
- ... కేరళ రాజకుటుంబానికి చెందిన రవివర్మ మార్తాండ వర్మ నిమ్హాన్స్ ఆసుపత్రి వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకడనీ!
- ... హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రా కోట హిమాలయా ప్రాంతాల్లో ఉన్న ప్రాచీన కోటల్లో ఒకటనీ!
48 వ వారం
- ... ఒకప్పటి కూర్గ్ పరిపాలకుడైన దొడ్డ వీర రాజేంద్ర నిర్మించిన నగరాన్ని ప్రస్తుతం విరాజ్ పేటగా పిలుస్తున్నారనీ!
- ... జాతీయ రక్షణ అకాడమీ భారత త్రివిధ దళాలకు కేంద్రీకృత శిక్షణా సంస్థగా పనిచేసే ప్రతిష్టాత్మక విద్యాలయమనీ!
- ... చైనా కు చెందిన రాణి షి లింగ్ షి ను పట్టును కనిపెట్టినందుకుగాను ప్రపంచవ్యాప్తంగా పట్టు దేవత అని పిలుస్తారని!
49 వ వారం
- ... బాలీవుడ్ సంగీత దర్శకులు జతిన్-లలిత్ 1990 వ దశకంలో మధుర గీతాలకు ప్రసిద్ధి గాంచారనీ!
50 వ వారం
- ... లయ ప్రధాన సంగీతానికి పేరు గాంచిన భారతీయ సంగీత దర్శకుడు ఓ. పి. నయ్యర్ సంగీతంలో ప్రత్యేకంగా శిక్షణ ఏమీ తీసుకోలేదనీ!
51 వ వారం
- ... దివాన్ బహదూర్ అనే బిరుదు పొందిన ఎస్. కృష్ణస్వామి అయ్యంగార్ భారతీయ చరిత్రకారుడిగా విశేష సేవలందించాడనీ!
- ... విజయనగర సంస్థానాన సర్వసైన్యాధ్యక్షుడు గురప్ప రెండవ భార్య మహాలక్ష్మి ప్రాంతాన్ని రక్షించడానికి ప్రాణత్యాగం చేస్తే శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని కమ్మసిగడాం గ్రామదేవతగా ప్రతిష్టించి పూజిస్తున్నారని!