శ్రీనివాస మంగాపురం: కూర్పుల మధ్య తేడాలు
K.Venkataramana (చర్చ | రచనలు) శ్రీనివాస మంగాపురం వ్యాసాన్ని విలీనం చేసితిని. |
చి వర్గం:రాయలసీమ లోని పుణ్యక్షేత్రాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 19: | పంక్తి 19: | ||
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు]] |
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు]] |
||
[[వర్గం:తిరుమల]] |
[[వర్గం:తిరుమల]] |
||
[[వర్గం:రాయలసీమ లోని పుణ్యక్షేత్రాలు]] |
10:48, 11 డిసెంబరు 2013 నాటి కూర్పు
శ్రీనివాస మంగాపురం తిరుపతి కి 12 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వేంచేసి ఉన్నారు. ఇతిహాసాల, పురాణాల ప్రకారం స్వామి నారాయణవనం లో కళ్యాణం చేసుకొని, తిరుమల కొండ మీద వెలసే ముందు పద్మావతి అమ్మవారితో ఇక్కడ కాలం గడిపారు.
శ్రీని వాస మంగా పురం తిరుపతి,మదనపల్లి రోడ్డులో తిరుపతి కి దగ్గరలో వున్నది. గతంలో ఈ ఆలయం పురావస్తు శాఖ వారి ఆదీనంలో వుండి నిత్య పూజా కార్యక్రమాలకు దూరంగా వుండేది. ఆ తర్వాత సకల పూజా కార్య క్రమాలు జరుగు తున్నవి. ఇక్కడి శ్రీ వేంకటేస్వరుని ఆలయం చాల పెద్దది. విశాల మైనది. ఇక్కడి శ్రీ వారి ప్రధాన మూర్తి తిరుమల లొ వున్న దాని కంటే పెద్దది. గతంలో మంగాపురం లో రైల్వే స్టేషన్ కూడ వుండేది. భక్తులు ఇక్కడ దిగి ముందు స్వామివారిని దర్శించుకొని తిరుమలకు వెళ్లేవారు. శ్రీ వారి మెట్టు ఇక్కడికి దగ్గరే. అక్కడి నుండే తిరుమల కొండ పైకి మెట్లదారి వున్నది. ఇది చాల దగ్గిర దారి. తిరుపతి అలిపిరి నుండే వుండే మెట్ల దారి కంటే ఇది చాల దగ్గర. సుమారు ఒక గంట లోపలే తిరుమల కొండ పైకి చేరవచ్చు. చాల మంది ఇక్కడి నుండి తిరుమల కొండపైకి ఎక్కి స్వామి వారిని దర్శించుకొని ఆతర్వాత తిరుపతి వైపు మెట్ల దారి గుండ కిందికి దిగేవారు. కాని అలిపిరి వద్ద నున్న మెట్లదారి గుండా పైకి ఎక్కి నూరు మెట్ల దారి గుండా దిగే వారు ఎవరు ఉండరు. తిరుపతి చూడ నవసరం లేదనుకొనే వారు మాత్రం గతంలో ఈ దారినే ఎక్కువగా వాడే వారు. అప్పట్లో శ్రీనివాస మంగాపురం శ్రీనివాసుని దర్శించుకునే భక్తులు చాల తక్కువ. ఇక్కడ భక్తుల రద్దీ తిరుమలతో పోలిస్తే చాల తక్కువ గాన తనివి తీర శ్రీనివాసుని దర్శించు కోవచ్చు. ప్రస్తుతం ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య బాగ పెరిగింది.
చిత్రమాలిక
-
కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, పురావస్తు శాఖ ఫలకం
-
కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం
-
శ్రీనివాస మంగాపురం గుడిలోని సేవలు
-
కళ్యాణ వేంకటేశ్వరస్వామి యొక్క ధ్వజ స్థంభం