Jump to content

సోంపేట రైల్వే స్టేషను

Coordinates: 18°58′52″N 84°34′59″E / 18.981°N 84.58294°E / 18.981; 84.58294
వికీపీడియా నుండి
సోంపేట
सोम्पेट
Sompeta
సోంపేట రైల్వే స్టేషను
General information
Locationమెయిన్ రోడ్, కంచిలి, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
Coordinates18°58′52″N 84°34′59″E / 18.981°N 84.58294°E / 18.981; 84.58294
Elevation48 m (157 ft)
Systemభారతీయ రైల్వేలు స్టేషను
Linesహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము
ఖుర్దా రోడ్-విశాఖపట్నం రైలు మార్గము
Platforms4
Tracksబ్రాడ్‌గేజ్ 1676 mm (5 ft 6 in)
Construction
Structure type(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
Parkingఉంది
Other information
Station codeSPT
జోన్లు తూర్పు తీర రైల్వే
డివిజన్లు ఖుర్దా రోడ్ డివిజను
History
Opened1893–96
Electrified1998–99
Location
పటం

సోంపేట రైల్వే స్టేషను, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది శ్రీకాకుళం జిల్లా పరిసరాల్లో ఉన్న సోంపేట-కంచిలి, కవిటి ప్రాంతాల ప్రజల అవసరాల కొరకు పనిచేస్తుంది. ఇది సోంపేట, కంచిలి చుట్టుపక్కల ప్రాంతాలలో ఒక ప్రధాన కేంద్రంగా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక గ్రామం ఒక మండలం అయిన కంచిలిలో ఉంది. ఈ స్టేషనులో 14 సూపర్ ఫాస్ట్ రైళ్లు, 18 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 6 ప్యాసింజర్ రైళ్లు రెండు దిశలలో ఈ స్టేషనులో ఆగుతాయి.

చరిత్ర

[మార్చు]

ఈ స్టేషను, కటక్ నుండి విజయవాడ తీరప్రాంతంలో ఉన్న 1,287 కి.మీ. (800 మైళ్ళు) రైలు మార్గాలను కలుపుతున్న మార్గాన్ని 1893-1896 సమయం కాలంలో నిర్మించారు. ఇది నిర్మించి, ట్రాఫిక్ తెరదించారు. ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే. తర్వాత 1900 సం.లో దీనిని బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే (బిఎన్‌ఆర్) కు అందజేశారు. భారతదేశం స్వాతంత్ర్యం లభించడంతో, స్టేషన్ దక్షిణ తూర్పు రైల్వే యొక్క అధికార పరిధిలోకి వచ్చింది. 2003 సం. తర్వాత, భారతీయ రైల్వేలు కొత్తగా మండలాలు నిరోధించుట ప్రకారం, ఈ స్టేషను ఈస్ట్ కోస్ట్ రైల్వే యొక్క అధికార పరిధిలోకి వచ్చింది.

రైల్వే పునర్వ్యవస్థీకరణ

[మార్చు]

బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే 1944 సం.లో జాతీయీకరణ చేశారు.[1] ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ యొక్క మొఘల్సరాయ్ తూర్పు భాగం, బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే లతో కలిసి, తూర్పు రైల్వే 1952 ఏప్రిల్ 14 న ఏర్పడింది.[2] 1955 సం.లో, దక్షిణ తూర్పు రైల్వేను ఈస్టర్న్ రైల్వే నుండి ఏర్పరచారు.ఇందులో ఎక్కువగా అంతకు ముందు బెంగాల్ నాగ్‌పూర్ రైల్వేచే నిర్వహించబడుతున్న రైలు మార్గాలున్నాయి.[2][3]

కొత్తగా రైల్వే మండలాలు 2003 ఏప్రిల్ సం.లో ప్రారంభించారు, వాటిలో ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోనులను నార్త్ ఈస్టర్న్ రైల్వే నుండి మలిచారు.[2]

సదుపాయాలు

[మార్చు]

ఈ స్టేషనులో ఫస్ట్ క్లాస్ (వెయిటింగ్ హాల్) వేచి ఉండు గది, కంప్యూటరీకరణ రిజర్వేషన్లు కార్యాలయాలు, II తరగతి వేచి ఉండు గది, ఫుట్ బ్రిడ్జి (సన్నవారధి), ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంది. ఒక కంప్యూటరీకరణ రిజర్వేషన్లు కౌంటర్ 08.00 గంటల నుండి 20.00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ స్టేషనుకు 4 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి.

పరిపాలన

[మార్చు]

ఈ స్టేషనులో ఒక స్టేషన్ (సూపరింటెండెంట్) పర్యవేక్షకుడు, ముగ్గురు స్టేషన్ మాస్టర్లు 10 ట్రాఫిక్ పాయింట్స్ మెన్స్, ముగ్గురు బుకింగ్ క్లర్కులు నియమించ బడ్డారు. స్టేషన్ పర్యవేక్షకుడు స్టేషను యొక్క మొత్తం బాధ్యతలు, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పరిపాలన, వాణిజ్య గణాంకాలు అన్ని అంశాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

స్టేషనులో రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ కార్యాలయం కలిగి ఉంది. ఇక్కడి పర్మనెంట్ వే (పివే) శాఖ విభాగం రైలు మార్గాలు, రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్ల నిర్వహణ పనులు చూస్తుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "IR History: Part - III (1900 - 1947)". IRFCA. Retrieved 2012-11-21.
  2. 2.0 2.1 2.2 "Geography – Railway Zones". IRFCA. Retrieved 2012-11-21.
  3. "IR History: Part - IV (1947 - 1970)". IRFCA. Retrieved 2012-11-21.

వెలుపలి లంకెలు

[మార్చు]