Jump to content

శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషను

Coordinates: 18°24′31″N 83°54′12″E / 18.4085°N 83.9034°E / 18.4085; 83.9034
వికీపీడియా నుండి
శ్రీకాకుళం రోడ్
श्रिकाकुलम् रोड्
Srikakulam Road
శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషను
General information
Locationఆముదాలవలస, ఆంధ్ర ప్రదేశ్
India
Coordinates18°24′31″N 83°54′12″E / 18.4085°N 83.9034°E / 18.4085; 83.9034
Elevation34m
Systemభారతీయ రైల్వేలుస్టేషను
Owned byభారతీయ రైల్వేలు
Operated byఈస్ట్ కోస్ట్ రైల్వే
Linesహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము
ఖుర్దా రోడ్-విశాఖపట్నం రైలు మార్గము
Platforms4
Construction
Structure typeనేలపై ప్రామాణికం
Parkingఉంది
Bicycle facilitiesలేదు
Other information
Statusపనిచేస్తున్నది
Station codeCHE
డివిజన్లు విశాఖపట్నం (వాల్తేరు)
History
Opened1893-1896
Electrified1998-2000
Location
పటం

శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషను, భారత దేశము నందు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో, శ్రీకాకుళం, పరిసర ప్రాంతాలలో పనిచేస్తుంది. శ్రీకాకుళం రోడ్ స్టేషను శ్రీకాకుళం పట్టణం నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. తరచుగా బస్సులు పట్టణం లోపలకు అందుబాటులో ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

విజయవాడ జంక్షన్ నుండి కటక్ వరకు ఉన్న 1,287 కిమీ (800 మైళ్ళు) మొత్తం తీరం వెంబడి సాగిన రైలు మార్గములు (రైల్వే ట్రాక్ల) ను 1893 సం. - 1896 సం. మధ్య కాలం సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించింది, ట్రాఫిక్‌కు కూడా తెరిచింది.[1][2]

విద్యుధ్ధీకరణ

[మార్చు]

పలాస-తిలరు, శ్రీకాకుళం రోడ్-చీపురుపల్లి, చీపురుపల్లి -అలమంద రైలు మార్గములను 1998-99 సం.లో వీటిని విద్యుధ్ధీకరణ చేశారు. శ్రీకాకుళం రోడ్-తిలరు విభాగం 1999-2000 సం.లో దీని విద్యుధ్ధీకరణ జరిగింది..[3]

సదుపాయాలు

[మార్చు]

శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషను నాలుగు పడకల వసతి గృహాల సముదాయం ఉంది.[4] రైల్వే స్టేషను వద్ద ఇతర సదుపాయాలు అయిన వేచి ఉండే గది, శాకాహారం ఉపాహారంగా గదులు, కంప్యూటరీకరణ రిజర్వేషన్లు కార్యాలయాలు, పుస్తకం దుకాణములు ఉన్నాయి.[5]

రైల్వే పునర్వ్యవస్థీకరణ

[మార్చు]

బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే 1944 సం.లో జాతీయకరణ చేశారు.[6] తూర్పు రైల్వే, బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే విభాగం, ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ యొక్క తూర్పు మొఘల్ సరాయ్ లతో కలిపి 1952 ఏప్రిల్ 14 సం.న ఏర్పడింది.[7] 1955 సం.లో, తూర్పు రైల్వే నుండి దక్షిణ తూర్పు రైల్వేను ఏర్పరచారు. దీనిలోని మార్గములు ఎక్కువగా ముందున్న బిఎన్‌ఆర్ రైల్వే ద్వారా నిర్వహించబడుతూ ఉండేవి.[7][8] కొత్తగా మండలాలు ఏర్పాటులో భాగంగా, ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే లను 2003 ఏప్రిల్ సం.లో ప్రారంభించారు.ఈ రెండు రైల్వే మండలాలు సౌత్ ఈస్టర్న్ రైల్వే నుండి ఏర్పాటు చేశారు.[7]

మూలాలు

[మార్చు]
  1. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 1 ఏప్రిల్ 2013. Retrieved 13 July 2013.
  2. "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 11 అక్టోబరు 2012. Retrieved 13 July 2013.
  3. "History of Electrification". IRFCA. Retrieved 13 July 2013.
  4. "East Coast Railway Amenities at Stations (as in 2008)". Archived from the original on 6 జనవరి 2014. Retrieved 13 July 2013.
  5. "Srikakulam Road (CHE)". Make my trip. Archived from the original on 30 అక్టోబరు 2013. Retrieved 13 July 2013.
  6. "IR History: Part - III (1900 - 1947)". IRFCA. Retrieved 2012-11-21.
  7. 7.0 7.1 7.2 "Geography – Railway Zones". IRFCA. Retrieved 2012-11-21.
  8. "IR History: Part - IV (1947 - 1970)". IRFCA. Retrieved 2012-11-21.

బయటి లింకులు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
ఈస్ట్ కోస్ట్ రైల్వే జోను
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని ఖుర్దా రోడ్-విశాఖపట్నం రైలు మార్గము