త్రిలింగ

వికీపీడియా నుండి
(త్రిలిజ్గ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
త్రిలింగ పత్రిక ముఖచిత్రం.

త్రిలింగ లేదా త్రిలిజ్గ ఒక తెలుగు సారస్వత పత్రిక. దీనిని వావిళ్ల సంస్థ వారు 1914 సంవత్సరంలో ప్రారంభించారు. దీనికు అక్కిరాజు ఉమాకాంతం వారు ప్రారంభ సంపాదకులుగా పనిచేశారు. సుమారు 50 సంవత్సరాలకు పైగా ఈ పత్రిక దేదీప్యమానంగా వెలిగింది.

వ్యావహారిక భాషోద్యమాన్ని గురించి త్రిలింగ పత్రిక కార్టూన్లు ప్రచురించేది. తెలుగు పత్రికలలో ఈ వ్యాజ చిత్రాలు ప్రారంభించింది త్రిలింగ పత్రికే.

పున:ప్రారంభం[మార్చు]

ఈ పత్రిక 2010 సంవత్సరంలో వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ నంస్ వారిద్వారానే తిరిగి హైదరాబాదులో ప్రారంభించబడినది. దీని పేరును మార్చలేదు. గానీ త్రిలింగ : సాహిత్య, సాంస్కృతిక త్రైమాసిన పత్రిక గా ఉంచారు.

"https://te.wikipedia.org/w/index.php?title=త్రిలింగ&oldid=2953500" నుండి వెలికితీశారు