అమరావతి (గ్రామం): కూర్పుల మధ్య తేడాలు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 115: | పంక్తి 115: | ||
==అమరారామం== |
==అమరారామం== |
||
అమరలింగేశ్వర స్వామి ([[శివుడు]]) పుణ్య క్షేత్రం ఈ పట్టణములో కృష్ణానదీ తీరాన యున్నది. ఆంధ్ర ప్రదేశ్ లోని [[పంచారామాలు|పంచారామాలలో]] ఇది ఒకటి. వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది రాజులు తరతరాలుగా ఈ స్వామివారిని దర్శించుకుని తరించారనడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. కన్నడాంధ్ర ప్రభువైన [[శ్రీకృష్ణదేవరాయలు]] అమరావతిని సందర్శించి ఇక్కడి అమరేశ్వరునికి నైవేద్య మహాపూజలు నిర్వహించినట్టు, పెద[[మద్దూరు]] గ్రామ పంటభూముల్ని ఆలయానికి దానమిచ్చినట్టుగా ఇక్కడ ఉన్న రాజశాసనం తేటతెల్లం చేస్తోంది. |
అమరలింగేశ్వర స్వామి ([[శివుడు]]) పుణ్య క్షేత్రం ఈ పట్టణములో కృష్ణానదీ తీరాన యున్నది. ఆంధ్ర ప్రదేశ్ లోని [[పంచారామాలు|పంచారామాలలో]] ఇది ఒకటి. వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది రాజులు తరతరాలుగా ఈ స్వామివారిని దర్శించుకుని తరించారనడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. కన్నడాంధ్ర ప్రభువైన [[శ్రీకృష్ణదేవరాయలు]] అమరావతిని సందర్శించి ఇక్కడి అమరేశ్వరునికి నైవేద్య మహాపూజలు నిర్వహించినట్టు, పెద[[మద్దూరు]] గ్రామ పంటభూముల్ని ఆలయానికి దానమిచ్చినట్టుగా ఇక్కడ ఉన్న రాజశాసనం తేటతెల్లం చేస్తోంది. ఒరిస్సా గజపతులపై విజయానంతరం 1517లో చారిత్రక ప్రాంతం కృష్ణాతీరమైన అమరావతిని దర్శించిన కృష్ణదేవరాయలు ఇక్కడ తులాభారం తూగాడు. తన బరువుతో సరిసమానమైన బంగారాన్ని పేదలకు పంచిపెట్టినట్టుగా [[శాసనం]]<nowiki/>లో ఉంది. అందుకు గుర్తుగా రాయలు నిర్మించిన తులాభార మండపం, దానిముందు వేయించిన శాసనం నేటికీ ఇక్కడ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆలయంలోని దక్షిణ రెండో ప్రాకారంలో ఈ మండపం ఉంది. నేడు అమరావతి అమరేశ్వరునిగా కొలువందుకుంటున్న స్వామి నాడు [[ధరణికోట]] అమరేశ్వరస్వామిగా వెలుగొందు తున్నాడని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. రాయలు తన భార్య చిన్నాదేవి చేత కృష్ణవేణీ తీరాన రత్నధేను మహాదానం, తిరుమల దేవి చేత సప్తసాగర మహాదానం చేయించినట్టుగా ఇందులో రాసి ఉంది. |
||
=== స్థలపురాణం === |
=== స్థలపురాణం === |
17:25, 15 ఫిబ్రవరి 2018 నాటి కూర్పు
అమరావతి | |
— రెవిన్యూ గ్రామం — | |
అమరావతి పట్టణ దృశ్యమాల (ఎడమ నుండి కుడికి) 1. అమరేశ్వర స్వామి వారి ఆలయ గోపురం. 2. ధ్యాన బుద్ధ విగ్రహం. 3. కృష్ణా నది. 4. అమరావతి బౌద్ధ మహా స్తూపం | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | గుంటూరు జిల్లా |
మండలం | అమరావతి |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి గుడిసె నిర్మలాదేవి, |
జనాభా (2001) | |
- మొత్తం | 13,400 |
- పురుషుల సంఖ్య | 5,830 |
- స్త్రీల సంఖ్య | 5,548 |
- గృహాల సంఖ్య | 2,629 |
పిన్ కోడ్: | |
Area code(s) | 522020 |
ఎస్.టి.డి కోడ్ |
బౌద్ధ |
పర్యాటక ప్రాంతాలు |
---|
ప్రముఖ బౌద్ధ స్థలాలు |
లలితగిరి
|
అమరావతి |
|
— మండలం — | |
గుంటూరు పటంలో అమరావతి మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో అమరావతి స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండల కేంద్రం | అమరావతి |
గ్రామాలు | 16 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 64,220 |
- పురుషులు | 32,580 |
- స్త్రీలు | 31,630 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 60.59% |
- పురుషులు | 70.43% |
- స్త్రీలు | 50.50% |
పిన్కోడ్ | 522020 |
అమరావతి గుంటూరు జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన గుంటూరు నుండి 32 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3316 ఇళ్లతో, 13400 జనాభాతో 1170 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6432, ఆడవారి సంఖ్య 6968. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2405 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 605. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589946[1].పిన్ కోడ్: 522020
అమరావతి ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లాలో కృష్ణా నదీతీరానికి కుడి వైపున ఉన్న ఒక పుణ్యక్షేత్రము. ఈ పట్టణము వేల సంవత్సరాల ప్రాచీనమైన చరిత్ర కలిగి ఉంది. ప్రాచీన శాసనాల ప్రకారము ఈ పట్టణానికి ధాన్యకటకము అనే పేరు ఉన్నట్లు తెలుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లోని పంచారామాలలో ఒకటైన అమరేశ్వరాలయము పేరు మీదుగా అమరావతి పేరు వచ్చింది.[2] ఈ పట్టణము జైన, బౌద్ధ మతాలకు కూడా ప్రసిద్ధమైనది. శాతవాహనులలో ప్రసిద్ధుడైన గౌతమీపుత్ర శాతకర్ణి మూలముగా క్రీ.శ. ఒకటవ శతాబ్దములో ధాన్యకటకము ప్రసిద్ధిచెందినది. చైనా యాత్రికుడు హ్యూయాన్త్సాంగ్ ఈ పట్టణములో నివసించి అచటి వైభవము గురించి ప్రశంసించాడు.
చరిత్ర
అమరావతీ నగరాన బౌద్ధులు విశ్వవిద్యాలయము స్థాపించారని రాయప్రోలు సుబ్బారావు అన్నారు.అమరావతిలో కల అమరేశ్వర ఆలయం కారణంగా ఈ ప్రదేశం ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. అంతేకాక, ఇక్కడ నిర్మించబడిన అతి పెద్ద బౌద్ధారామాల కారణంగా కూడా ప్రసిద్ధి కెక్కింది. ఈ బౌద్ధ స్థూపాలను మౌర్య సామ్రాజ్య స్థాపనకు ముందే నిర్మించారని విశ్వసిస్తారు. దీనిని అప్పట్లో ధాన్య కటకం లేదా ధరణికోట అని పిలిచేవారు. ఆంధ్ర పాలకులలో మొదటి వారైన శాతవాహనులకు సుమారు సామాన్యశక పూర్వం 3 వ శతాబ్దం నుండి సామాన్యశక పూర్వం 2 వ శతాబ్దం వరకు వారి సామ్రాజ్యానికి రాజధానిగా వుండేది. గౌతమ బుద్ధుడు తన కాలచక్ర ప్రక్రియను అమరావతి లోనే బోధించాడు. అందువలన అమరావతి బుద్ధునికంటే ముందు నుండే ఉన్నదని నిర్ధారణ ఔతున్నది. దీనికి చారిత్రక ఆధారాలు వజ్రయాన గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి. నేడు ఈ పట్టణం, అమరావతి స్థూపం, పురావస్తు మ్యూజియం వంటి ఆకర్షణల కారణంగా ఒక చక్కని పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధికెక్కింది.
సీ ఆర్ డీ ఏ
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[3]
గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు
తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్డీఏ పరిధిలోకి వస్తుంది.
అమరేశ్వరాలయం
గర్భాలయంలో 15 అడుగుల ఎత్తులో పొడవుగా ఊన్న మహా శివలింగం దంతం రంగులో ఉంటుంది. ఈ శివలింగం అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో తలపై మేకు కొట్టినట్టు చెబుతారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లు కూడా కనిపిస్తూ వుండటం విశేషం. ప్రతి యేటా విజయదశమి రోజున, మహా శివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ స్వామివారికి అమ్మవారికి అంగరంగ వైభవంగా కల్యాణోత్సవం జరిపించబడుతూ ఉంటుంది. చాముండికా సమేతుడైన అమరేశ్వరుడు ఇక్కడ విశేష పూజలను అందుకుంటూ ఉంటాడు. ఇక్కడి స్వామివారు త్రిగుణాలకు అతీతుడు అనే భావాన్ని ఆవిష్కరించేలా మూడు ప్రాకారాలతో ఆలయం కనువిందు చేస్తుంటుంది. మొదటి ప్రాకారంలో ప్రణవేశ్వరుడు, జ్వాలాముఖీ దేవి కనిపిస్తారు. మధ్య ప్రాకారంలో వినాయకుడు, కాలభైరవుడు, కుమార స్వామి, ఆంజనేయ స్వామి ఉంటారు. ధ్వజ స్తంభం దగ్గరగా సూర్య భగవానుడు ప్రతిష్ఠితమై ఉన్నాడు.
అమరారామం
అమరలింగేశ్వర స్వామి (శివుడు) పుణ్య క్షేత్రం ఈ పట్టణములో కృష్ణానదీ తీరాన యున్నది. ఆంధ్ర ప్రదేశ్ లోని పంచారామాలలో ఇది ఒకటి. వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది రాజులు తరతరాలుగా ఈ స్వామివారిని దర్శించుకుని తరించారనడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. కన్నడాంధ్ర ప్రభువైన శ్రీకృష్ణదేవరాయలు అమరావతిని సందర్శించి ఇక్కడి అమరేశ్వరునికి నైవేద్య మహాపూజలు నిర్వహించినట్టు, పెదమద్దూరు గ్రామ పంటభూముల్ని ఆలయానికి దానమిచ్చినట్టుగా ఇక్కడ ఉన్న రాజశాసనం తేటతెల్లం చేస్తోంది. ఒరిస్సా గజపతులపై విజయానంతరం 1517లో చారిత్రక ప్రాంతం కృష్ణాతీరమైన అమరావతిని దర్శించిన కృష్ణదేవరాయలు ఇక్కడ తులాభారం తూగాడు. తన బరువుతో సరిసమానమైన బంగారాన్ని పేదలకు పంచిపెట్టినట్టుగా శాసనంలో ఉంది. అందుకు గుర్తుగా రాయలు నిర్మించిన తులాభార మండపం, దానిముందు వేయించిన శాసనం నేటికీ ఇక్కడ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆలయంలోని దక్షిణ రెండో ప్రాకారంలో ఈ మండపం ఉంది. నేడు అమరావతి అమరేశ్వరునిగా కొలువందుకుంటున్న స్వామి నాడు ధరణికోట అమరేశ్వరస్వామిగా వెలుగొందు తున్నాడని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. రాయలు తన భార్య చిన్నాదేవి చేత కృష్ణవేణీ తీరాన రత్నధేను మహాదానం, తిరుమల దేవి చేత సప్తసాగర మహాదానం చేయించినట్టుగా ఇందులో రాసి ఉంది.
స్థలపురాణం
త్రిపురాసుర సంహారసమయంలో కుమారస్వామిచేత విరుగకొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి ఇక్కడ పడిందని పురాణాలు వివరిస్తున్నాయి. పంచారామాలలో ఒకటైన అమరారామం (అమరావతి) కృతయుగంలోనే ఆవిర్భవించిన విశిష్టమైన పుణ్యక్షేత్రం. పురాణాల్లో క్రౌంచతీర్థంగా పేర్కొనబడింది. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించి. అమరేశ్వరుడనే నామకరణం చేసి పూజించినట్టు స్థలపురాణం తెలియజేస్తుంది. దేవతల గురువు బృహస్పతి ఆదేశం మేరకు అప్పట్లో ఈ శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్ఠించడని. అమరుల నివాస ప్రాంతంగా మారిన కారణంగా ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి.
పునరుద్ధరణ
1980లో జరిగిన పుష్కరాల సమయంలో అమరావతిలో పెద్ద ఎత్తున పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ప్రస్తుతం మనం చూస్తున్న విశాలమైన ఆలయద్వారం ఎత్తైన గాలిగోపురం గతంలో చిన్నద్వారం చిన్న గాలిగోపురంగా ఉండేవి. మొత్తం విచ్ఛిన్నం చేసి కొత్త నిర్మాణం కొరకు లోతుగా పునాదులు తీయబడ్డాయి. ఈ తవ్వకాలలో భౌద్ధ సంస్కృతికి చెందిన పాలరాతి శిల్పాలు అనేకం లభించాయి. ప్రస్తుతం మ్యూజియంలో కనిపిస్తున్న నంది ఈ తవ్వకాలలో లభించిందే. అలాగే మరికొన్ని చిన్న శిల్పాలు ఈ తవ్వకాలలో లభించాయి.
బౌద్ధ సంస్కృతి
అమరావతికి సమీపంలో ఉత్తరాన ఉన్న ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధానియైన ధాన్యకటకం. శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం పరిఢవిల్లింది. బౌద్ధమత చరిత్రలో ధాన్యకటకానిది ప్రముఖ స్థానం. ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ట స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం. క్రీ.పూ. 4వ శతాబ్దిలో గ్రీకు రాయబారి మెగస్తనీసు పేర్కొన్న 30 ఆంధ్ర దుర్గాలలో ఈ నగరమొకటి. సుమారు 16 కి.మీ చుట్టుకొలత కలిగిన మహానగరం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. మౌర్యులకు పూర్వము క్రీ. పూ. 4-3 శతాబ్దాలలో ఈ ప్రాంతం గణతంత్ర రాజ్యం (జనపదం)గా ఉన్న ఆధారాలున్నాయి. బుద్ధుని జీవితకాలము నుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది. మరుగునపడిన చైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. దీపాలదిన్నెగా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797 లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ.[4] అప్పటికే మహాచైత్యం అంతా కూలిపోయి 90 అడుగుల చుట్టుకొలత, 20 అడుగుల ఎత్తుగల ఒక దిబ్బలాగా మిగిలింది. అనేక విడతలుగా జరిగిన తవ్వకాలలో ఎన్నో విలువైన విగ్రహాలు, పరికరాలు మరియు ఇతర వస్తువులు దొరికాయి. ఈ త్రవ్వకాలను సర్ వాల్టర్ స్మిత్ 1845 లో, రాబర్ట్ సీవెల్ 1877 లో, జేమ్స్ బర్గెస్ 1881 లో మరియు అలక్జాండర్ రియ 1888-89 మధ్యలో చేపట్టారు. ఆఖరున జరిగిన తవ్వకాలలో ఈ చైత్య నిర్మాణానికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం నివసించిన మెగాలిథ్స్ కి సంబంధించిన అవశేషాలు కూడా దొరికాయి. ఇక్కడ దొరికిన శిల్పాలలో ఎక్కువ మద్రాస్ గవర్నమెంట్ మ్యూజియం, చెన్నై మరియు బ్రిటిష్ మ్యూజియం, లండన్ లలో భద్రపరిచారు. ధాన్యకటకంలో 1962-65 మధ్యలో యమ్. వెంకటరామయ్య మరియు కె.రాఘవాచారి ల అధ్వర్యంలో త్రవ్వకాలు జరిగాయి. తావ్వకాల తరువాత పాలరాతి మీద చెక్కబడిన ప్రధాన్యత లేని కొన్ని శిల్పాలు నిర్లక్ష్యంగా వదిలి వేయబడ్డాయి. ప్రజలు ఈ పాలరాతి ముక్కలను తమ ఇండ్లకు తీసుకువెళ్ళి మెత్తని పొడిచేసి రంగోలీలో వాడుకున్నారు. తరువాత ఒక పలుచని కంచెతో సురక్షితం చేసినా ప్రజలు సులువుగా లోపల ప్రవేశించి స్థాపం సమీపంలో సంచరించారు. ఇందులో ఐదు పీరియడ్స్ కి సంబంధించిన నివాసుల ఆధారాలు దొరికాయి. కార్బన్ డేటింగ్ ద్వారా ఈ పట్టణం క్రీ.పూ.5వ శతాబ్దికి చెందిందని తెలిసింది. అద్భుతమైన శిల్పకళతో అలరారే స్థూపంపై బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, బౌద్ధచిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. స్థూపంపై బ్రాహ్మీ లిపిలో శాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఈ స్థూపం గురించి అప్పటి బ్రిటిషు పురాతత్వ పరిశోధకుడు ఫెర్గుసన్ ఇలా అన్నాడు: "కళావైదుష్యానికి సంబంధించి ఇది భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన కట్టడము". దీన్ని చెన్నై లోని ప్రభుత్వ ప్రదర్శనశాలలో భద్రపరచారు.
అమరావతి 16 డిగ్రీల 58' ఉత్తర అక్షాంశం, 80 డిగ్రీల 35' తూర్పు రేఖాంశంపై ఉంది. అమరావతికి అతి దగ్గర రైల్వే స్టేషను గుంటూరు. అక్కడ నుండి అమరావతికి బస్సు సౌకర్యం ఉంది. విజయవాడ నుండి లాంచిల ద్వారా కృష్ణానదిపై ప్రయాణించి అమరావతి చేరవచ్చు. స్థూపం ఉండిన ప్రదేశం, భారతీయ పురాతత్వ సర్వేక్షణ వారి సంగ్రహాలయము మరియు అమరేశ్వర మందిరం ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. సత్యం శంకరమంచి వ్రాసిన అమరావతి కథలు ఈ గ్రామ/పట్టణ సంస్కృతికి అద్దంపట్టాయి.
వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు
వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు అమరావతి సంస్థాన పాలకుడు. 1761 ఏప్రిల్ 20న జగ్గన్న, అచ్చమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన పాలనా కాలంలో చెంచులు గ్రామాలపైబడి దోచుకుంటూ ఉండేవారు. ఈ దోపిడీలను అరికట్టడానికి ఆయన 150 మంది చెంచు నాయకులను ఆహ్వానించి, వారిని మట్టుపెట్టించాడు. ఈ సంఘటనను "అటునుంచి కొట్టుకురండి" అన్న కథలో (అమరావతి కథలు) చక్కగా వివరించబడింది. ఈ సంఘటన జరిగిన గ్రామం పేరు నరుకుళ్ళపాడుగా మారింది. దానితో ప్రజలకు దోపిడీల బెడద తగ్గినా, ఆయన అశాంతికిలోనయ్యాడు. పాప పరిహారార్ధం దేవాలయాల నిర్మాణం చెయ్యమన్న కొందరు పెద్దల సూచన మేరకు అనేక దేవాలయాలను కట్టించాడు. అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి గుడిని పునరుద్ధరించాడు. 1807-09లో మంగళగిరి నరసింహస్వామి దేవాలయానికి 11 అంతస్తుల గాలి గోపురాన్ని నిర్మింపజేసాడు. ఆయన తండ్రి జగ్గన్న పేరు మీదనే బేతవోలు అనే గ్రామం పేరును జగ్గయ్యపేటగా మార్చాడు. వేంకటాద్రి నాయుడు 1817, ఆగష్టు 17న మరణించాడు.
చేరుకునే మార్గం
కృష్ణా నది తీరం ఒక విహార ప్రదేశంగా వేలాది పర్యాటకులని ఆకర్షించే ఈ పట్టణానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ నుండి చేరుకోవడానికి నేరుగా బస్సులున్నాయి. 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ పర్యాటకశాఖ విజయవాడ నుండి అమరావతికి మోటర్ పడవ సౌకర్యం కల్పించింది. అయినప్పటికీ ఇప్పుడే జలమార్గంలో బోటు సేవలు లభ్యం కావడం లేదు. అందుకు కారణం ఈ ప్రయాణానికి నాలుగు గంటల సమయం పట్టడం. వర్షాకాలంలో మాత్రమే బోట్లు నడపగలిగిన జలమార్గంలో మిగిలిన సమయంలో ఇసుకదిబ్బలు. రాళ్ళు అడ్డుగా ఉండడమే ఇదుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. దీనికి సమీప విమానాశ్రయం విజయవాడ. ఈ ప్రదేశం సంవత్సరం పొడవునా ఉష్ణమండల వాతావరణం కలిగి, వేసవులు అధిక వేడి, పొడి గాని, చలి కాలాలు చలి గాను వుంటాయి. ఎన్నో ఆకర్షణలు కల ఈ ప్రదేశం, చారిత్రకులనే గాక పర్యాటకులని కూడా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం అమరావతిలో దలైలామా అమరావతి వచ్చిన సమయంలో ఆరంభించిన బౌద్ధనిర్మాణం పని జరుగుతూ ఉంది.
గ్రామంలోని ఇతర దేవాలయలు
శ్రీ బాలత్రిపురసుందరీ అమ్మవారి ఆలయం:- అమరావతి గ్రామంలోని క్రోసూరు రహదారి చెంత ఈ నూతన ఆలయ ప్రతిష్ఠోత్సవ వేడుకలు 2014,జూన్-8, ఆదివారం నాడు కన్నులపండువగా కొనసాగినవి. ఈ సందర్భంగా మండప దేవతాపూజలు, ప్రాతరౌపాసన, గర్తన్యాసం, రత్నన్యాసం, జీవన్యాసం, ధాతున్యాసాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 7-43 గంటల దివ్యముహూర్తంలో యంత్రస్థాపన, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠోత్సవాలను నిర్వహించారు. అదే సమయంలో, సింహవాహనం, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి, శిఖర, కలశ ప్రతిష్ఠా మహోత్సవాలను సైతం, నిర్వహించారు. 9 గంటలకు కళాన్యాసం, ప్రాణప్రతిష్ఠ, దిష్టికుంభం, పూర్ణాహుతి నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు. [4]
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు నాలుగు ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉంది. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.
సమీప ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాల ధరణికోటలోను, ఇంజనీరింగ్ కళాశాల గుంటూరులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ గుంటూరులో ఉన్నాయి.
సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులో ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
అమరావతిలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో నలుగురు డాక్టర్లు , 9 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.ఒకపశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో 13 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ముగ్గురు, ఐదుగురు డిగ్రీ లేని డాక్టర్లు, ఐదుగురు నాటు వైద్యులు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
పారిశుధ్యం
గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారాకూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్లోకి పంపిస్తున్నారు.గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది.సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు.ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ ఉందిసామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
అమరావతిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైన సౌకర్యాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది.అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 9 గంటల పాటు వ్యవసాయానికి, 22 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
అమరావతిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 270 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 80 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 14 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 3 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 4 హెక్టార్లు
- బంజరు భూమి: 4 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 791 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 785 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూమి: 15 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
అమరావతిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది
- కాలువలు: 3 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 12 హెక్టార్లు
గ్రామ ప్రముఖులు
గ్రామ పంచాయతీ
2013 లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి గుడిసె నిర్మలాదేవి, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
గ్రామ గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 11378.[5] ఇందులో పురుషుల సంఖ్య, 5830, స్త్రీల సంఖ్య 5548, గ్రామంలో నివాసగృహాలు 2629 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1170 హెక్టారులు
మండల గణాంకాలు
- జనాభా (2001) - మొత్తం 64,220 - పురుషుల సంఖ్య 32,580 - స్త్రీల సంఖ్య 31,630
- అక్షరాస్యత (2001) - మొత్తం 60.59% - పురుషుల సంఖ్య 70.43% - స్త్రీల సంఖ్య 50.50%
సమీప గ్రామాలు
వైకుంటపురం 9 కి.మీ,వడ్డమాను 5 కి.మీ,ధరణికోట 1. 5 కి.మీ,ఎండ్రాయి 6 కి.మీ,హరిచంద్రాపురం 12 కి.మీ.
సమీప మండలాలు
తూర్పున తుళ్ళూరు మండలం, ఉత్తరాన కంచికచెర్ల మండలం, తూర్పున ఇబ్రహీంపట్నం (కృష్ణా) మండలం, పశ్చిమాన పెదకూరపాడు మండలం ఉన్నాయి.
అమరావతి చిత్రాలు
-
అమరేశ్వరాలయ శిఖరం
-
అమరేశ్వరాలయ స్నానఘట్టము
-
అమరేశ్వరస్వామివారి స్నానఘట్టము.నావలరేవు
-
కృష్ణా నది
-
మ్యూజియంలో స్తూపం నమూనా, శకలాలు
-
బుద్ధుని పై మరుని దాడి - విగ్రహ రూపము, క్రీ.శ.2వ శతాబ్దం
-
అమరావతిలో పురాతత్వశాఖ ఫలకము
-
గ్రీకు శాసనముతో భారతీయ యక్షుడు, అమరావతి, క్రీ.శ.3వ శతాబ్దం
-
అమరేశ్వరస్వామివారి ప్రధాన దేవాలయం.
-
అమారావతి మ్యూజియంలో ఒక చక్రవర్తి శిల్పం 1వ శతాబ్దం
-
అమరావతి ధ్యానకేంద్రము
-
ధ్యానములో ఉన్న బుద్ధుని విగ్రహం
మండలంలోని గ్రామాలు
- అమరావతి,
- అత్తలూరు,
- ధరణికోట,
- దిడుగు,
- ఎండ్రాయి,
- జూపూడి (అమరావతి మండలం),
- కర్లపూడి (అమరావతి మండలం),
- లింగాపురం (అమరావతి మండలం),
- మల్లాది, మునుగోడు,
- నరుకుళ్ళపాడు,
- నెమలికల్లు,
- పెద్ద మద్దూరు,
- పొందుగల,
- పుట్టిపాడు (నిర్జన గ్రామము),
- ఉంగుటూరు (అమరావతి),
- వైకుంఠపురం,
- ముత్తయిపాలెం
- మండేపూడి
- లేమల్లె
- ఎనికేపాడు
ఇవి కూడా చూడండి
- వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు
- అమరావతీ సంస్థానం
- ధరణికోట
- అమరావతి కథలు
- అమరావతి స్తూపం
- ద్రాక్షారామం
- క్షీరారామము
- భీమారామము
- కుమరారామము
బయటి లింకులు
మూలాలు
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ సమగ్ర ఆంధ్ర విజ్ఞానకోశము, మొదటి సంపుటి, 1958 ప్రచురణ, పేజీ సంఖ్య 261
- ↑ http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
- ↑ ఆంధ్రుల చరిత్రము - ప్రథమ_భాగము, చిలుకూరి వీరభద్రరావు
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2013,ఆగష్టు-19; 11వపేజీ. [4] ఈనాడు గుంటూరు రూరల్; 2014.జూన్-9; 14వ పేజీ.
- Pages with malformed coordinate tags
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- Pages using div col with unknown parameters
- అమరావతి మండలంలోని గ్రామాలు
- క్లుప్త వివరణ ఉన్న articles
- గుంటూరు జిల్లా మండలాలు
- ఆంధ్ర ప్రదేశ్ చారిత్రక స్థలాలు
- ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధ చారిత్రక స్థలాలు
- ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాలు
- ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు
- గుంటూరు జిల్లా పర్యాటక ప్రదేశాలు
- గుంటూరు జిల్లా పుణ్యక్షేత్రాలు
- ఆంధ్ర ప్రదేశ్ సీఆర్డీఏ గ్రామాలు
- ప్రసిద్ధ శైవక్షేత్రాలు
- ఆంధ్ర ప్రదేశ్ హిందూ దేవాలయాలు