వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - శ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు[మార్చు]

పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
శకునశాస్త్రము/శిఖినరసింహ శతకము [1] నేదునూరి గంగాధరం శకున శాస్త్రం శకునాలు అంటే జరగబోయే భవిష్యత్తు ముందుగా అందించే సంజ్ఞ. కొందరు ఆధునికులు శకునాలు పట్టించుకోకున్నా శకునాలపై విస్తృతంగా నమ్మకాలు వ్యాపించివున్నాయి. ఈ నేపథ్యంలో శుభశకునాలు, దుశ్శకునాలు, శుభాశుభ సమయాలు, బల్లి, పక్షి, రంగుల శకునాలు మొదలైనవి ఎన్నింటినో ఇందులో విభాగించి వివరాలు అందించారు. ఆ శకునాలకు సంబంధించిన శాస్త్రగ్రంథమిది. 2020050016666 1938
శంకర విజయం [2] మాధవాచార్యులు జీవిత చరిత్ర సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యుడు (Adi Shankaracharya). ఆదిశంకరాచార్యులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడే ఈ ఆచార్యుడు హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథముడు. గొప్ప పండితుడు, గురువు, మహాకవి. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. శంకరుని జీవితానికి సంబంధించిన వివిధ గాథలు, నమ్మకాలు శంకర విజయం అన్న పేరుతో పిలువబడుతున్నాయి. ఇటువంటి "చరిత్ర"లలో కొన్ని - శంకరుని జీవిత గాధలో ఎన్నో అసాధారణమైన, అధిభౌతికమైన సంఘటనలు మనకు గోచరిస్తాయి. మాధవీయ శంకర విజయం - 14వ శతాబ్దికి చెందిన మాధవుని రచన. దీనిని శంకరాచార్యుని సమకాలీకుడు, శిష్యుడు ఐన మాధవాచార్యులు రాశారని సంప్రదాయ కథనం. 2030020025019 1928
శకుంతల బి.ఎ. [3] మూలం.ఎడ్‌గార్ లెస్, అనువాదం.జొన్నలగడ్డ వెంకట రాధాకృష్ణయ్య నవల, అనువాదం క్షణికోద్రేకంలోనో, స్వలాభంకోసం కుట్ర పన్నో వ్యక్తులు చేసే ఒక్కొక్క హత్య, ఒక్కొక్క నేరం ఎన్నెన్ని జీవితాలలో ఎంతెంత కల్లోలాన్ని చెలరేపుతుందో, నేరస్తులకు ఎన్ని తెలివితేటలున్నా నేరపరిశోధకులు, పోలీసుల కృషి ఫలితంగా న్యాయవ్యవస్థ ఎంత పటిష్ఠంగా శిక్షాస్మృతిని అమలుచేయగలదో తెలిపేవి అపరాధ పరిశోధక నవలలు. తెలుగులో ఒకనాడు వెల్లువలా వచ్చిన డిటెక్టివ్ నవలల్లో ఇదీ ఒకటి. ఎడ్‌గార్ లెస్ రాసిన సినిస్టర్ మాన్ నవల కథను స్వీకరించి ప్రాంతాలు, పేర్లు తెలుగునాటికి మార్చి దీనిని రాశారు. 2030020024617 1935
శకుంతల [4] మూలం.కాళిదాసు, అనువాదం.వేంకట పార్వతీశ కవులు నాటకం, అనువాదం అభిజ్ఞాన శాకుంతలము మహాకవి కాళిదాసు విరచిత సంస్కృత నాటకములన్నిటిలోనూ అత్యంత ప్రాచుర్యము నొందిన నాటకము. ఇందు ఏడు అంకములు గలవు. శాకుంతలము ఒక గొప్ప శృంగారభరిత నాటకము. ఈ నాటకాన్ని చదివి జర్మన్ మహాకవి గేథే ఆనందతాండవం చేశాడని ప్రతీతి. శాకుంతలానికి భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం ఉంది. ఫ్రెంచి సంగీతవేత్త ఎర్నెస్ట్ రేయర్ శాకొంతల పేరుతో బ్యాలే రచించగా ఇటాలియన్ ఫ్రాంకో ఆల్ఫనో "లా లెగ్గెండా డి శకుంతల"(శకుంతల చరిత్రము) అనే ఒపేరాను తయారుచేశారు. హంగేరియన్ కంపోజర్ కార్ల్ గోల్డ్‌మార్క్, నార్వేజియన్ సంగీతకారుడు అమెతిస్టియమ్ గీతాలు రచించారు. ఆ గ్రంథాన్ని ]]వేంకట పార్వతీశ్వర కవులు]] అనువదించారు. తన రచన చదివి ]]కాళిదాసు]] శాకుంతలం చదవాలని అభిలాష కలిగితే అది తమ రచన సార్థకం చేస్తుందని అనువాదకుల మాట. ర2030020024588 1943
శకుంతలా పరిణయము [5] కృష్ణ కవి ప్రబంధం, పద్యకావ్యం తెలుగు సాహిత్యంలో క్షీణ యుగముగా 1775 - 1875ను భావిస్తారు. ఈ దశ దక్షిణాంధ్ర నాయకుల మహోజ్వల యుగం ముగిసినాకా వచ్చింది. అటు ప్రబంధాల సరళి మాత్రమే స్వీకరించి పూర్వ ప్రబంధ కవులకున్న లోతులు అందుకోలేక ఇటు అనంతరకాలంలో ప్రారంభమైన విస్తృతమైన ప్రక్రియా రచనలు ప్రారంభం కాక మిగిలిపోయిన దశగా దాన్ని గుర్తిస్తారు. ఆ దశలో వచ్చిన రచన ఇది. దీనిలో ప్రసిద్ధమైన శకుంతల గాథ కథా వస్తువు. వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ ప్రచురించిన ప్రతి ఇది. 2030020025332 1927
శాకుంతలము యొక్క అభిజ్ఞానత [6] విశ్వనాథ సత్యనారాయణ సాహిత్య విమర్శ విశ్వనాథ సత్యనారాయణ (1895-1976) "కవి సమ్రాట్" బిరుదాంకితుడు. తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు - కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, పద్యకావ్యములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింపబడిన సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " . ఆయన వ్రాసిన రచనలన్నీ కలిపితే లక్ష పుటలు ఉండవచ్చు. కాళిదాసు సుప్రసిద్ధ నాటకమైన అభిజ్ఞాన శాకుంతలము గురించి విశ్వనాథ చేసిన సుదీర్ఘ ప్రసంగ పాఠమిది. ఇది చక్కని వ్యాఖ్యగా, సాహిత్యవిమర్శగా పేరొందింది. 2020010002004 1949
శతపత్ర సుందరి [7] బాలాంత్రపు రజనీకాంత రావు గేయ సంపుటి బాలాంత్రపు రజనీకాంత రావు బహుముఖ ప్రఙ్ఞాశాలి. గాయకుడు, వాగ్గేయకారుడు, రచయిత, స్వరకర్త. తొలితరం సంగీత దర్శకుల్లో ఒకడు. ఆయన రచించిన ఈ శతపత్ర సుందరి గీత సంపుటి. 200పైగా గీతాలున్నాయి. (దీనికి 1953లో తెలుగు భాషా సమితి పురస్కారం లభించింది) 2030020024895 1954
శబల [8] తుమ్మల సీతారామమూర్తి పద్యసంకలనం, ఖండకావ్యాలు తెలుగులెంకగా సుప్రసిధ్ధుడైన తుమ్మల సీతారామమూర్తి 1901 డిసెంబరు 25న గుంటూరు జిల్లా కావూరులో రైతు కుటుంబంలో జన్మించాడు. ఆధునిక పద్య కవుల్లో ముఖ్యుడు. తెనుగు లెంక, మహాత్ముని ఆస్థానకవి ఆయన బిరుదులు. తుమ్మల అచ్చమైన గాంధేయవాది. తెలుగుదనం మూర్తీభవించిన జాతీయోద్యమ కవి. ఆయన ఆత్మకథ,మహాత్మకథ వంటి ఆదర్శ ప్రౌఢకావ్యాలు, ఆత్మార్పణము, రాష్ట్రగానము, ఉదయగానము, పఱిగపంట, పైర పంట, శబల, సమదర్శి, నా కథలు వంటి రచనలు చేశారు. తన మేనల్లుడు నరసయ్య ఒక లేఖ రాసి "మావయ్యా నీ రచనలలో ఒక కృతిని చేపట్టు భాగ్యము నాకున్నదా?" అని జంకుతో అడగగా తాను ముద్రించని కొన్ని ఖండకావ్యాలను శబల పేరిట ప్రచురించారు. ఈ రచనకు విశ్వనాథ సత్యనారాయణ ముందుమాట రాసి వన్నె తెచ్చారు. 2030020025507 1955
శబ్దాల్ని ప్రేమిస్తూ [9] ఎ.పి.ఎస్.భగవాన్ వచన కవితలు, కవితా సంకలనం ఇది వచన కవితల సంకలనం. ఇందులో కవి రకరకాల వస్తువులను స్వీకరించి కవితలు రాశారు. సురభి కళాకారుల నుంచి పనిమనుషులు వరకూ వివిధ వస్తువులు తీసుకుని రచించారు. 2020120029691 1992
శబ్దమణి టిప్పణి [10][dead link] గదాధరభట్ట(?) వ్రాతప్రతి ఇది ఒక వ్రాత ప్రతి. 1990030081876
శమంతకోపాఖ్యానము [11] ఎఱ్ఱాప్రెగ్గడ హరివంశములోని ఉపాఖ్యానము, పద్యకావ్యం ఎఱ్ఱాప్రెగ్గడ ఆంధ్రీకరించిన హరివంశము చాలా వరకూ మూలభాగవతముననుసరించిఉన్నది. ఇందులోని శమంతకమణికి చెందిన కథాభాగము ఇవ్వబడడంతో పాటు శ్రీ కోదాడ రామకృష్ణయ్య మరియు ఆడిదం రామారావు గార్ల ముందుమాటతో అలరించుచున్న ముద్రణ. ముందుమాటలో నాచన సోముని హరివంశమునకు ఎఱ్ఱాప్రెగ్గడ హరివంశమునకు తులనాత్మక విశ్లేషణ మరియు ఎఱ్ఱన రచనావిశిష్టత గురించి విశదంగా ప్రస్తావించడం జరిగింది. 2020050018495 1920
శశిరేఖా పరిణయము [12], ఇదే పేరుతో ఉన్న మరిన్ని వ్యాసాలు చూడండి రత్నాకరం అప్పప్ప(అప్పప్ప కవి) ప్రబంధం, పద్యకావ్యం శశిరేఖా పరిణయం అనే ఈ ప్రబంధానికి శశిరేఖకీ అభిమన్యుడికీ వివాహం జరగడం. ఆ క్రమంలో ఏర్పడిన విఘాతాలు ఎలా అధిగమించారన్నదే ముఖ్య కథాంశం. 2030020025277 1928
శశికళ [13] పడకండ్ల గురురాజాచార్యుడు భక్తి పద్యావళి లోకసహజమైన గుణాలతోనే నిరంతరం మసలుతూ పరమపురుషుని చేరలేకపోతున్న ఒక భక్తుని ఆవేదన ఈ 22 పేజీల చిన్ని పొత్తములో కనపడుతుంది. అలనాడు యాదవగిరిగా పిలవబడిన ఆదవానిలో ప్రచురింపబడింది. 2020050018705 1922
శశాంక [14] వివరాలు లేవు నాటకం బృహస్పతి, తార, శశాంకుల మధ్య సాగిన ఇతివృత్తాన్ని తారాశశాంక నాటకంగా మలిస్తే తెలుగునాట బహుళ ప్రాచుర్యం పొందింది. దీనిని ఆధారం చేసుకుని సినిమాలు కూడా రూపొందాయి. రచయిత ఆ ప్రసిద్ధ పౌరాణిక ఇతివృత్తాన్ని శశాంక్, అనూరాధ అనే వ్యక్తుల మధ్య సాంఘిక ఇతివృత్తానికి ముడివేసి ఈ రచన చేశారు. 2030020024861 1950
శాకుంతల విమర్శనము [15] నండూరి బంగారయ్య సాహిత్య విమర్శ అభిజ్ఞాన శాకుంతలము మహాకవి కాళిదాసు విరచిత సంస్కృత నాటకములన్నిటిలోనూ అత్యంత ప్రాచుర్యము నొందిన నాటకము. ఇందు ఏడు అంకములు గలవు. శాకుంతలము ఒక గొప్ప శృంగారభరిత నాటకము. ఈ నాటకాన్ని చదివి జర్మన్ మహాకవి గేథే ఆనందతాండవం చేశాడని ప్రతీతి. శాకుంతలానికి భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం ఉంది. ఫ్రెంచి సంగీతవేత్త ఎర్నెస్ట్ రేయర్ శాకొంతల పేరుతో బ్యాలే రచించగా ఇటాలియన్ ఫ్రాంకో ఆల్ఫనో "లా లెగ్గెండా డి శకుంతల"(శకుంతల చరిత్రము) అనే ఒపేరాను తయారుచేశారు. హంగేరియన్ కంపోజర్ కార్ల్ గోల్డ్‌మార్క్, నార్వేజియన్ సంగీతకారుడు అమెతిస్టియమ్ గీతాలు రచించారు. అంత విఖ్యాత నాటకంలోని విశేషాలు తెలిసేలా గ్రంథకర్త ఈ విమర్శ గ్రంథం రాశారు. 2990100051775 1952
శాతవాహన సంచిక [16] సంపాదకుడు.మారేమండ రామారావు చరిత్ర ఆంధ్ర ఇతిహాస మండలి వారు తెలుగు వారి పూర్వ వైభవాన్ని పునరుజ్జీవింపజేసి, తెలుగు వారికి తమ పూర్వుల ఘనచరిత్ర తెలియజేయాలనే ఉద్దేశంతో కాకతీయులు, శ్రీకృష్ణదేవరాయలు వంటివారి పట్టాభిషేకోత్సవములు నిర్వహించారు. అదే సమయంలో వారిపై జరిగిన పరిశోధన కృషిని ప్రామాణికంగా కాకతీయ సంచిక, కృష్ణదేవరాయ సంచిక మొదలైన వాటి ముద్రణల ద్వారా ప్రకటించారు. ఈ క్రమంలోనే 1947లో శాతవాహన ఉత్సవాలు నిర్వహించి అనంతర కాలంలో శాతవాహనుల కాలం, పరిపాలన, రాజకీయ స్థితిగతులు వంటీవాటిపై ప్రామాణిక సంచికను వివిధ చరిత్రకారుల వ్యాసాలతో ప్రచురించారు. ఇప్పటివరకూ పరిశోధనల్లో ఈ సంచికలను చాలా విషయాలకు ప్రామాణికంగా భావించడమే తెలుగు సాహిత్యంలో వీటి విశిష్టతకు గీటురాయి. 2030020025630 1950
శాస్త్రజ్ఞుడివి అవుతావా? [17] మూలం.బెర్తా మోరిస్ పార్కర్, అనువాదం. మల్లాది నరసింహశాస్త్రి బాల సాహిత్యం, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం శాస్త్రవేత్త కావడానికి విషయ పరిజ్ఞానం ఎంత అవసరమో, ఊహలు అభివృద్ధి చేసుకోవడం అంతే అవసరం. గొప్ప విషయాలు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, చిన్న విషయాల పట్ల ఆసక్తి కలిగివుండడమూ అంతే ముఖ్యం. అందుకే ఒక శాస్త్రవేత్త వాస్తవాలు, ఊహలు, ప్రయోగాలు, పట్టుదల కలగలిపి ప్రపంచానికి కొత్త విషయమేదో ఆవిష్కరించి చూపుతాడు. బాలలను చిన్నతనం నుంచే జిజ్ఞాసపరులుగా తయారుచేసి భవిష్యత్ శాస్త్రవేత్తలుగా మలచడం చాలా ముఖ్యమైన విషయం. ఆ క్రమంలోనే బాలలకు తేలికగా అర్థమయ్యేలా కొందరు శాస్త్రవేత్తల ఆవిష్కరణ క్రమాన్ని కథలుగా తెలియజేసి, ఆ నమూనాల నుంచి బాలలు ఎలా ఆలోచించాలో, ఎలా తెలుసుకోవాలో వివరిస్తూ సాగిన గ్రంథమిది. అత్యంత ఉపయుక్తం, ఎంతో అపురూపమైన ఈ బాల సాహిత్యాన్ని బాలనంద ప్రచురణలు వారు ప్రచురించారు. 2020010001772 1959
శాస్త్రనిఘంటువు: చరిత్ర-రాజనీతిశాస్త్రము [18] వై.విఠల్ రావు నిఘంటువు తెలుగు అకాడెమీ వారు ప్రచురించిన శాస్త్ర నిఘంటువుల్లో ఇది ఒకటీ. ఇందులో చరిత్రకు సంబంధించిన పదాలను సవివరంగా రచించారు. విజ్ఞానసర్వస్వ నిర్మాణానికి అత్యంత ఉపయుక్తమైన ఈ ప్రామాణిక గ్రంథంలో అవసరమైన ప్రాథమిక సమాచారం ఉంది. 2020120000281 1983
శ్యామల (నవల) [19] వేంకట పార్వతీశ కవులు నవల, చారిత్రాత్మకం తిరుపతి వేంకట పార్వతీశకవులు ఇరవైయవ శతాబ్దిలో తెలుగు సాహిత్య రంగంలో పేరెన్నికగన్న తెలుగు జంటకవులు.బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం వేంకట పార్వతీశకవులుగా జంటకట్టి కవిత్వరచన చేశారు. వేంకట పార్వతీశ కవులు "కావ్య కుసుమావళి", "బృందావనం", "ఏకాంత సేవ" తదితర కావ్యాలు రచించారు. వీరి కావ్యాల్లో ప్రఖ్యాతమైన కావ్యం "ఏకాంత సేవ". వేంకట పార్వతీశ కవుల కవిత్వం ఇరవైయవ శతాబ్ది కవిత్వధోరణయిన భావ కవిత్వానికి ఆద్యులలో నిలుస్తారు. వారు రచించిన చారిత్రిక నవల ఇది. 2030020024791 1947
శాస్త్రవాచక పాఠములు (మూడవ ఫారము) [20] కె.వి.ఎల్.రావు వాచకము, పాఠ్యగ్రంథము 1921నాటి మూడవ ఫారము విజ్ఞాన శాస్త్ర పాఠ్యగ్రంథమిది. దీనిలో భౌతిక శాస్త్రం, జంతు శాస్త్రం, వృక్షశాస్త్రం వంటి విభాగాలు ఉన్నాయి. 2020120001398 1921
శారద (1925 మే సంచిక) [21] నడింపల్లి వెంకట లక్ష్మీనరసింహారావు మాసపత్రిక 2020050004523 1925
శారద (1925 జూన్ సంచిక) [22] నడింపల్లి వెంకట లక్ష్మీనరసింహారావు మాసపత్రిక శారద మాసపత్రిక తెలుగులో తొలినాళ్ళ పత్రికల్లో ఒకటి. నండిపల్లి వెంకట లక్ష్మీనరసింహారావు సంపాదకత్వం వహించిన ఈ పత్రిక 1925 జూన్ నెల సంచిక ఇది. 2020050004524 1925
శారద (1925 జులై సంచిక) [23] నడింపల్లి వెంకట లక్ష్మీనరసింహారావు మాసపత్రిక శారద మాసపత్రిక తెలుగులో తొలినాళ్ళ పత్రికల్లో ఒకటి. నండిపల్లి వెంకట లక్ష్మీనరసింహారావు సంపాదకత్వం వహించిన ఈ పత్రిక 1925 జూన్ నెల సంచిక ఇది. 2020050004525 1925
శారదా రామాయణము [24] బుచ్చి నరసరాజు గేయరామాయణము అంత్యప్రాసతో,శబ్దాలంకారంతో శోభిల్లుతూ గేయరూపంలో పాడుకోడానికి వీలుగా వ్రాసిన రామాయణము. శారదా అను మకుటము గలదు. సరళగ్రాంధిక లక్షణాలు గలిగిన గ్రామభాషలో వ్రాయబడిన సుమారు ఎనభై పేజీల పొత్తము. 2020050018844 1918
శ్రావణ మాస మహాత్మ్యము [25] ఆంధ్రీకరణ.చల్లా నృశింహశాస్త్రి ఆధ్యాత్మికత, హిందూ మతము శ్రావణ మాసంలో మంగళవారం, శుక్రవారం స్త్రీలు పలు వ్రతాలు చేస్తూంటారు. శ్రావణమాసాన్ని పవిత్రమైన నెలగా భావిస్తారు. పురాణాంతర్గతమైన శ్రావణ మాసాల మహాత్మ్యాన్ని ఈ గ్రంథంలో అనువదించి ప్రచురించారు. 2040100047251 1932
శంకర గ్రంథ రత్నావళి [26] మూలం.శంకరాచార్యుడు, అనువాదం.నిర్వికల్పానంద స్వామి మతం, ఆధ్యాత్మికం సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యుడు. ఈ ఆచార్యుడు హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథముడు. గొప్ప పండితుడు, గురువు, మహాకవి. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. శంకరుడు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం ఉంది. బౌద్ధం వల్ల తరిగిపోయిన హిందూమత ప్రాబల్యాన్ని తిరిగి పాదుకొల్పేందుకు ఏ విధమైన బలప్రయోగం లేకుండా, తర్కం ద్వారా ఒప్పించి విజయం సాధించారు. శంకరాచార్యుడు వేదాన్ని నమ్ముతూనే పదుల సంఖ్యలో విభాజితమైపోయిన ఆధ్యాత్మిక విధానాలను, మతాలను ఏకీకృతం చేసి షణ్మత స్థాపకాచార్యునిగా నేటి హిందూమతానికి ఒకానొక రూపకర్తగా నిలిచారు. అఖండ భారతంలో ఎన్నో వేలమైళ్ల పాదయాత్రలు సాగించి వివిధమైన దేవాలయాల్లో మార్పులు చేసి, పూరి, బదరీనాథ్,ద్వారక, శృంగేరీ, కంచిల్లో పీఠాలు స్థాపించి నేటి శంకరాచార్య వ్యవస్థలకు ఆద్యునిగా నిలిచారు. ఇదే క్రమంలో ఆయన బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు, ఉపనిషత్తులకు, విష్ణుసహస్రనామాలకు భాష్యాలు రచించి, ఎన్నో వందల కొలదీ స్తోత్రాలు చేశారు. ఆయన సృష్టించిన ఆధ్యాత్మిక సాహిత్యాన్ని నిర్వికల్పానంద స్వామి తెనిగించి ఈ గ్రంథం ద్వారా ప్రచురించారు. అత్యంత ప్రభావశీలుడైన ఆధ్యాత్మిక శక్తి ఆదిశంకరుడు ఆయన అందించిన సాహిత్యానికి తెలుగు అనువాదం ఎందరో భక్తులకు ఉపకరిస్తుంది. 2020120029699 1954
శంకరాచార్య చరిత్రము [27] దుర్భా సుబ్రహ్మణ్యశర్మ చరిత్ర, ఆధ్యాత్మికం తాను జీవించిన అతితక్కువ కాలంలోనే భారతదేశమంతా పర్యటించి హిందూ మతాన్ని పునరుజ్జీవింపజేసిన మహాపురుషుడు శంకరాచార్యుడు. బౌద్ధం, జైనం ఒకపక్క హిందూమతాన్ని, వేదాధిక్యతను నిరసిస్తూండగా, హిందూమతంలోనే శాక్తేయులు, వైష్ణవులు, శైవులు, వామాచారులు మొదలైన విభాగాల వారు కలహిస్తూండగా అందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి దేశం నలుమూలలా పీఠాలను నెలకొల్పారు ఆయన. ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి పలు మతాలు, సిద్ధాంతాల పండితులతో వాదించి గెలిచారు. అటువంటి వ్యక్తి జీవితాన్ని ఈ గ్రంథంలో వివరించారు. 2030020029701 1937
శాసన పద్యమంజరి [28] సంపాదకుడు.జయంతి రామయ్య పంతులు చరిత్ర, పద్య సాహిత్యం పద్యాలను కేవలం కావ్య రచన కోసమే కాక పలు విధములైన ఇతర రచనల కోసం కూడా వినియోగించేవారు. కవిత్వం కాక శాస్త్ర సాంకేతిక గ్రంథాలు, గణిత గ్రంథాలు, ఇతర గ్రంథరచనల్లోనూ ఉపయోగపడ్డాయి పద్యాలు. అలానే పద్యాలను శాసనాల్లో కూడా వినియోగించారు పూర్వ ప్రభువులు. అటువంటి శాసన పద్యాలను సంకలించి ఈ గ్రంథంలో ప్రకటించారు జయంతి రామయ్య పంతులు. అటుగంజాం నుంచి ఇటు చెంగల్పట్టు వరకూ 25 ప్రాంతాల్లోని, 40 పద్యశాసనాలు ఈ గ్రంథంలో ప్రచురించారు. 2030020025347 1937
శిబిక [29] నీలా జంగయ్య వ్యాస సంపుటి 2020120001029 1989
శివయోగ సారము-ద్వితీయ సంపుటం [30] కొలని యాది గణపతిదేవుడు యోగశాస్త్రం, పద్యరచన శైవులకు, శివభక్తులకు ఉపకరించేలా ఈ శివయోగసారాన్ని పూర్వకవియైన కొలనియాది గణపతిదేవుడు రచించారు. దీనికి తాత్పర్యాన్ని ముదిగొండ వీరేశలింగశాస్త్రి రచించగా కొడిమేల రాజలింగారాధ్యులు సంపాదకత్వం వహించి ప్రచురించారు. 2030020025504 1927
శివతత్త్వ ప్రభాంధ్రీకరణము [31] నిర్మల శంకరశాస్త్రి ఆధ్యాత్మికం 2020120007760 1996
శివతత్త్వ సారము [32] మల్లికార్జున పండితారాధ్యుడు ఆధ్యాత్మికత, హిందూమతం అద్వైతాన్ని ఖండించి శైవమత సూత్రాలను ప్రకటించే పద్యరచన ఇది. నన్నయకు అనంతరం ఓ వంద సంవత్సరాలకు దీని రచన జరిగిందని పరిష్కర్త, ప్రచురణకర్త కొమర్రాజు వెంకట లక్ష్మణరావు భావిస్తున్నారు. ఒకే ఒక్క ప్రతి లభ్యం ఐతే దానిని పరిష్కరించి ప్రచురించారు. 2030020025441 1922
శివ భారతము [33] గడియారం వేంకట శేషశాస్త్రి ప్రబంధం, పద్యకావ్యం, చరిత్రాత్మకం శివ భారతము గడియారం వేంకట శేషశాస్త్రి 1943లో రచించిన వీరరస ప్రధానమైన పద్య కావ్యము. భారతావనిలో సనాతనధర్మ పునరుద్ధరణమునకై కంకణము కట్టుకొని హైందవ ధర్మ పతాకమును ప్రతిష్ఠించిన వీరుడైన శివాజీ చరిత్రమే ఈ శివ భారతము. ఇది 2,500 పద్యములు, 8 ఆశ్వాసములు గల బృహత్కావ్యము. శివాజీ కథ వివిధ ధార్మిక, తాత్త్విక, రాజకీయ ఉపదేశములతో వివిధ పాత్రల, విభిన్న మానసిక ప్రవృత్తుల సంఘర్షణలతో కూడుకొనియుండును. 2030020025333 1943
శివ శీలము [34] మాచిరాజు దుర్గాశంకరామాత్యుడు(అస్పష్టమైన వివరాలు) నాటకం, అనువాదం(?) చఁతపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1630 ఫిబ్రవరి 19 - 1680 మార్చి 4) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు. సుదీర్ఘ యుద్ద కాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్రస్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేనివారికి, స్త్రీలకు, పసివారికి సహాయం చేసాడు. ఒకసారి శివాజీ సైనికాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి అందమయిన కోడలును తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు. శివాజీ ఆమెతో "నా తల్లి కూడా మీ అంత అందమయినది అయిఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని" అంటూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు. ఆయన ఈ పవిత్రశీలమే ఈ నాటకానికి ప్రధాన ఇతివృత్తం. 2030020024816 1950
శిలాదిత్య నాటకము [35] కోలాచలం శ్రీనివాసరావు నాటకం, చారిత్రిక నాటకం కోలాచలం శ్రీనివాసరావు (1854 - 1919) బళ్ళారికి చెందిన సుప్రసిద్ధ నాటక రచయిత మరియు న్యాయవాది. రామరాజు చరిత్రము ఆయన ప్రముఖ రచన. ఇది ఆయన రాసిన చారిత్రిక నాటకం. ఈ ప్రతి ఆయన మరణానంతరం ముద్రితమైంది. 2030020024779 1924
శివరహస్య ఖండము-ద్వితీయ సంపుటం [36] కోడూరి వేంకటాచల కవి పద్యకావ్యం స్కాంద పురాణం వ్యాసుడు రచించిన ఆష్టాదశ పురాణలలో ఒకటి. ఇందులో 81,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణం 7 ఖండాలుగా విభజించబడింది. దానిలోని శివ సంబంధమైన ఈ ఖండాన్ని కవి పద్యకావ్యంగా మలిచారు. 2030020025147 1931
శివాజీ [37]- ఇదే పేరుతో కల మరొక శివాజీ వ్యాసం మూలం.సేతుమాధవరావు ఎస్.పగిడి, అనువాదం.కొత్తపల్లి కేశవరావు జీవిత చరిత్ర, చరిత్ర మొఘల్ సామ్రాజ్య పతనంలో అనంతర భారతదేశ చరిత్రలో మరాఠా సామ్రాజ్యానిది కీలకమైన పాత్ర. ఆ హైందవ సామ్రాజ్యాన్ని నిర్మించిన శివాజీ రావు భోంస్లే లేదా శివాజీ మహారాజు భారతీయ రాజుల్లో గొప్పవాడిగా, వీరుడిగా, మంచి పరిపాలకుడిగా పేరొందారు. ఆయన ప్రారంభించిన మరాఠా సామ్రాజ్యము ఆయన జీవితకాలంలోనే ఒక గొప్ప శక్తిగా మారింది. ఆపైన తర్వాతి కాలంలో అటు సింధు నది నుంచి ఇటు కావేరీ వరకూ వ్యాపించింది. శివాజీ జీవితం స్ఫూర్తిదాయకమైనదే కాక చరిత్రకు ఎంతో ముఖ్యమైనది. సేతుమాధవరావు పగిడి రాసిన శివాజీ అనే ఈ గ్రంథం ఆ మహారాజు ప్రామాణిక జీవితచరిత్రల్లో ముఖ్యమైనది. పోటీపరీక్షలకే కాక చరిత్ర పరిశోధకులకు కూడా కీలకమైన గ్రంథం కావడం విశేషం. ఈ పుస్తకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు జాతీయ జీవిత చరిత్ర గ్రంథమాలలో భాగంగా ప్రచురించారు. 99999990128948 2000
శివలీలా విలాసము [38] కూచిమంచి తిమ్మకవి పద్యకావ్యం కూచిమంచి తిమ్మకవి 18వ శతాబ్దపు తెలుగు కవి. తిమ్మకవి పదిహేడవ శతాబ్దపు నాలుగవ భాగంలో జన్మించి, పద్దెనిమిదవ శతాబ్దపు రెండవభాగం వరకు జీవించి ఉండేవాడని విమర్శకులు, చారిత్రకులు చెప్తున్నారు. ఇతడు ఆరువేల నియోగి. ఇతని ముత్తాత బయ్యనామాత్యుడు. తామ తిమ్మయార్యుడు. తండ్రి గంగనామాత్యుడు, తల్లి లచ్చమాంబ. సింగన్న, జగ్గన్న, సూరన్న ఇతనికి తమ్ములు. గొట్తిముక్కుల రామయమంత్రిగారి కుమార్తె బుచ్చమ్మ ఇతని భార్య. తిమ్మకవి పిఠాపురం సంస్థానంలోని కందరాడ గ్రామానికి కరణమట. పిఠాపురాన్ని ఆ రోజుల్లో శ్రీ రావు మాధవ రాయుడు పరిపాలించేవాడు. అతనే తిమ్మకవికి "కవి సార్వభౌమ" అనే బిరుదాన్నిచ్చాడు. అయినా తిమ్మకవి తన గ్రంథాలను పిఠాపురపు కుక్కుటేశ్వర స్వామికి అంకితం చేశాడు. ఆయన రాసిన కావ్యమిది. 2030020025316 1921
శివరాత్రి మహాత్మ్యం [39] శ్రీనాథుడు పద్యకావ్యం చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటినాఁడు రచియించితి మరుత్తరాట్చరిత్ర - బాల్యములోనే బృహత్కావ్యాన్ని రచించిన ప్రౌఢ కవి శ్రీనాథుడు. వీరి రచనలలో వీరి వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. పాండిత్య గరిమతో అచంచల ఆత్మవిశ్వాసం మూర్తిభవించిన నిండైన విగ్రహం వారి రచనలు చదువుతూ ఉంటే గోచరిస్తుంది. ఆయన రచించిన ఈ శివరాత్రి మహాత్య్మం బహుళ ప్రాచుర్యం పొందినది. 2030020025454 1930
శివానందలహరి [40] ఆదిశంకరులు స్తోత్రము, హిందూమతం హిందూమతాన్ని పునరుజ్జీవింపజేసిన ఆధ్యాత్మిక నాయకుడు, గురువు, యోగి ఆది శంకరాచార్య భగవంతునిపై, తాత్త్వికతపై, జీవితాన్ని ముక్తిమార్గంలోకి మళ్ళించుకోవడం గురించీ ఎన్నో అపురూపమైన కవితలు రచించారు. వ్యక్తుల ప్రవర్తన దిద్దుకునేలా భజగోవిందం, దారిద్ర్యాన్ని పోగొట్టుకునేందుకు కనకథారాస్తవం మొదలైనవాటితో శివానందలహరి కూడా ఆయన రచించిన సుప్రసిద్ధ స్తవం. శ్రీశైలంలో విడిసి స్వామివారిని, అమ్మవారిని సేవించే కాలంలో ఆయన ఈ స్తోత్రాన్ని చేశారని ఐతిహ్యం. ఈ స్తవాన్ని వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ ప్రచురించిన ప్రతి ఇది. 2030020024971 1937
శివానందలహరి (అనువాదం) [41] మూలం.ఆది శంకరాచార్యుడు అనువాదం.సోమంచి వాసుదేవరావు ఆధ్యాత్మికం, భక్తి హిందూమతాన్ని పునరుజ్జీవింపజేసిన ఆధ్యాత్మిక నాయకుడు, గురువు, యోగి ఆది శంకరాచార్య భగవంతునిపై, తాత్త్వికతపై, జీవితాన్ని ముక్తిమార్గంలోకి మళ్ళించుకోవడం గురించీ ఎన్నో అపురూపమైన కవితలు రచించారు. వ్యక్తుల ప్రవర్తన దిద్దుకునేలా భజగోవిందం, దారిద్ర్యాన్ని పోగొట్టుకునేందుకు కనకథారాస్తవం మొదలైనవాటితో శివానందలహరి కూడా ఆయన రచించిన సుప్రసిద్ధ స్తవం. శ్రీశైలంలో విడిసి స్వామివారిని, అమ్మవారిని సేవించే కాలంలో ఆయన ఈ స్తోత్రాన్ని చేశారని ఐతిహ్యం. ఆయన రచించిన శివానంద లహరిని పద్యరూపంలో సోమంచి వాసుదేవరావు తెనిగించారు. 2020050016669 1937
శ్రీకృష్ణావతారతత్త్వము-మొదటి భాగము [42] జనమంచి శేషాద్రిశర్మ సాహిత్యం 2020120007632 1926
శ్రీకృష్ణావతారతత్త్వము-మూడవ భాగము [43] జనమంచి శేషాద్రిశర్మ సాహిత్యం 2020120021073 1926
శ్రీకృష్ణావతారతత్త్వము-నాల్గవ భాగము [44] జనమంచి శేషాద్రిశర్మ సాహిత్యం 2040100047147 1926
శ్రీకృష్ణావతారతత్త్వము-ఆరవ భాగము [45] జనమంచి శేషాద్రిశర్మ సాహిత్యం 2020120021164 1927
శ్రీకృష్ణావతారతత్త్వము-ఏడవ భాగము [46] జనమంచి శేషాద్రిశర్మ సాహిత్యం 2020120021076 1928
శ్రీకృష్ణావతారతత్త్వము-ఎనిమిదవ భాగము [47] జనమంచి శేషాద్రిశర్మ సాహిత్యం 2020120021070 1928
శ్రీకృష్ణావతారతత్త్వము-తొమ్మిదవ భాగము [48] జనమంచి శేషాద్రిశర్మ సాహిత్యం 2020120021077 1930
శ్రీ కృష్ణలీలలు-చిరుతల భజన [49] ఆమిదాల రామస్వామి జానపద కళారూపాలు 2020010004732 1958
శ్రీ కాళికా సహస్రనామావళి [50] సంస్కృత మూలం: ఆది శంకరాచార్య, వ్యాఖ్యానం:ముక్తినూతులపాటి వెంకట సుబ్బారావు ఆధ్యాత్మిక సాహిత్యం 2040100028373 2001
శ్రీ అధ్యాత్మ రామాయణ కీర్తనలు[51] సుబ్రహ్మణ్యకవి పౌరాణికం, సంకీర్తనలు వేదవ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో 61 అధ్యాయం నుంచి రామకథను పార్వతీ, పరమేశ్వరుల సంవాదంగా రచించాడు. ఇదే ఆధ్యాత్మ రామాయణంగా ఖ్యాతి చెందింది. వాల్మీకీయములో కథ, కథనాలు ప్రధానం కాగా, ఆధ్యాత్మ రామయణంలో తత్వ వివేచన ప్రధానము. ఆ అధ్యాత్మ రామాయణాన్ని సుబ్రహ్మణ్య కవి అనే వాగ్గేయకారుడు సంకీర్తనల రూపంలో రచించారు. తెలుగు సంకీర్తన వాౙ్మయంలో ఇది చాలా ప్రధాన్యత కలిగిన పుస్తకం. 2020050019082 1920
శ్రీ అరవింద జీవితము [52] రచయిత పేరు పుస్తకంలో లేదు జీవిత చరిత్ర, చరిత్ర అరవింద ఘోష్ అనే పూర్వనామం కలిగిన అరవిందయోగి భారత జాతీయోద్యమ కారుడు, తత్త్వవేత్త, యోగి, గురువు, కవి. ఇండియన్ సివిల్ సర్వీసెస్ పూర్తిచేసి బరోడా సంస్థానంలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఉన్నతోద్యోగాన్ని లెక్కచేయక జాతీయోద్యమానికి అనుకూలంగా రచనలు చేశారు. ఆ క్రమంలోనే బ్రిటీష్ వారు రాజద్రోహ నేరం మోపి ఆయనను ఖైదుచేశారు. ఆపైన అభియోగాలు నిరూపితం కాకపోవడంతో వదిలివేశారు. ఆయనకు జైలులో ఆధ్యాత్మిక అనుభూతులు కలగడంతో రాజకీయ జీవితం నుంచి ఆధ్యాత్మికత వైపు మరలి అరవింద యోగిగా మారారు. పాండిచ్చేరిలో అరవిందాశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని నిరాడంబర జీవితం, మహోన్నతమైన ఆలోచన, ఆచరణలతో ఎందరికో మార్గదర్శిగా, గురువుగా నిలిచారు. అరవింద యోగి రచించిన సావిత్రి గ్రంథం యోగపరమైన లోతైన అర్థాలతో అపురూపమైన గ్రంథంగా నిలిచింది. అటువంటి వ్యక్తి జీవిత చరిత్ర ఆయన జీవిత క్రమాన్ని, తద్వారా ఆయన బోధలను వెల్లడించగలదు. 5010010031961 1948
శ్రీ వివేకానంద లేఖావళి-మొదటి భాగం [53] మూలం.వివేకానందుడు, అనువాదం.చిరంతనానంద స్వామి లేఖా సాహిత్యం స్వామీ వివేకానంద (1863 జనవరి 12 - 1902 జూలై 4), (బెంగాలీలో 'షామీ బిబేకానందో') ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. ఆయన జీవితం యువతకు స్ఫూర్తిగా భావించి ఆయన జన్మదినాన్ని భారత ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. ఈ గ్రంథంలో వివేకానందుని లేఖలు ఉన్నాయి. 2030020024507 1951
శ్రీ వివేకానంద లేఖావళి-రెండవ భాగం [54] మూలం.వివేకానందుడు, అనువాదం.చిరంతనానంద స్వామి లేఖా సాహిత్యం స్వామీ వివేకానంద (1863 జనవరి 12 - 1902 జూలై 4), (బెంగాలీలో 'షామీ బిబేకానందో') ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. ఆయన జీవితం యువతకు స్ఫూర్తిగా భావించి ఆయన జన్మదినాన్ని భారత ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. ఈ గ్రంథంలో వివేకానందుని లేఖలు ఉన్నాయి. 2030020024541 1951
శ్రీ సీతారామము [55] మూలం.బంకించంద్ర ఛటర్జీ, అనువాదం.తల్లాప్రగడ సూర్యనారాయణరావు కావ్యం బంకించంద్ర చటోపాధ్యాయ్ బెంగాలీ కవి, వ్యాసరచయిత మరియు సంపాదకుడు. ఇతని రచన వందేమాతరం ఇతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇతను వ్రాసిన ఆనంద్ మఠ్ అనే నవలనుండి ఈ గీతాన్ని సంగ్రహించారు. ఈ గీతం భారత స్వతంత్ర సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసింది. ఆయన రచించిన నవలకు అనువాదమిది. 2030020024858 1912
శ్రీ ప్రబోధిని (జనవరి 1915) [56] వివరాలు లేవు మాసపత్రిక 2020050002845 1915
శ్రీ ప్రబోధిని (ఫిబ్రవరి, మార్చి 1915) [57] వివరాలు లేవు మాసపత్రిక 2020050002846 1915
శ్రీ ప్రబోధిని (ఏప్రిల్ 1915) [58] వివరాలు లేవు మాసపత్రిక 2020050002847 1915
శ్రీ ప్రబోధిని (మే 1915) [59] వివరాలు లేవు మాసపత్రిక 2020050002848 1915
శ్రీ ప్రబోధిని (జూన్ 1915) [60] వివరాలు లేవు మాసపత్రిక 2020050002849 1915
శ్రీ ప్రబోధిని (జులై 1915) [61] వివరాలు లేవు ఆధ్యాత్మిక సాహిత్యం 2020050002850 1915
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు-మొదటి సంపుటం [62] శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథా సాహిత్యం 20 వ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. భాషలో, భావంలో, తెలుగు నుడికారం ప్రయోగించటంలో ఈయన పేరెన్నిక గన్నవాడు. ఆయన జీవితం ఒక సంధి యుగంలో గడిచింది. ఒక పక్క పాత సంప్రదాయాలు వెనక్కి లాగుతూ ఉండగా, పాశ్చాత్య నాగరికత మరొక పక్క ఆకర్షిస్తూ ఉండగా ఆ పాత కొత్తల కలయికని తన రచనలలో ప్రతిభావంతంగా చిత్రించేడీయన. ఆయన రచించిన కథల సంపుటమిది. 2990100071385 1999
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు-రెండో సంపుటం [63] శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథా సాహిత్యం 20 వ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. భాషలో, భావంలో, తెలుగు నుడికారం ప్రయోగించటంలో ఈయన పేరెన్నిక గన్నవాడు. ఆయన జీవితం ఒక సంధి యుగంలో గడిచింది. ఒక పక్క పాత సంప్రదాయాలు వెనక్కి లాగుతూ ఉండగా, పాశ్చాత్య నాగరికత మరొక పక్క ఆకర్షిస్తూ ఉండగా ఆ పాత కొత్తల కలయికని తన రచనలలో ప్రతిభావంతంగా చిత్రించేడీయన. ఆయన రచించిన కథల సంపుటమిది. 2030020024695 1939
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు-మూడవ సంపుటి [64] శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథా సాహిత్యం 20 వ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. భాషలో, భావంలో, తెలుగు నుడికారం ప్రయోగించటంలో ఈయన పేరెన్నిక గన్నవాడు. ఆయన జీవితం ఒక సంధి యుగంలో గడిచింది. ఒక పక్క పాత సంప్రదాయాలు వెనక్కి లాగుతూ ఉండగా, పాశ్చాత్య నాగరికత మరొక పక్క ఆకర్షిస్తూ ఉండగా ఆ పాత కొత్తల కలయికని తన రచనలలో ప్రతిభావంతంగా చిత్రించేడీయన. ఆయన రచించిన కథల సంపుటమిది. 2030020024690 1940
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు-ఐదో సంపుటం [65] శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథా సాహిత్యం 20 వ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. భాషలో, భావంలో, తెలుగు నుడికారం ప్రయోగించటంలో ఈయన పేరెన్నిక గన్నవాడు. ఆయన జీవితం ఒక సంధి యుగంలో గడిచింది. ఒక పక్క పాత సంప్రదాయాలు వెనక్కి లాగుతూ ఉండగా, పాశ్చాత్య నాగరికత మరొక పక్క ఆకర్షిస్తూ ఉండగా ఆ పాత కొత్తల కలయికని తన రచనలలో ప్రతిభావంతంగా చిత్రించేడీయన. ఆయన రచించిన కథల సంపుటమిది. 2030020024684 1942
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు-ఆరో సంపుటి [66] శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథా సాహిత్యం 20 వ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. భాషలో, భావంలో, తెలుగు నుడికారం ప్రయోగించటంలో ఈయన పేరెన్నిక గన్నవాడు. ఆయన జీవితం ఒక సంధి యుగంలో గడిచింది. ఒక పక్క పాత సంప్రదాయాలు వెనక్కి లాగుతూ ఉండగా, పాశ్చాత్య నాగరికత మరొక పక్క ఆకర్షిస్తూ ఉండగా ఆ పాత కొత్తల కలయికని తన రచనలలో ప్రతిభావంతంగా చిత్రించేడీయన. ఆయన రచించిన కథల సంపుటమిది. 2030020024661 1948
శ్రీమద్రామాయణము(అయోధ్యకాండ) వచనము(రెండవ భాగము) [67] దేవరాజ సుధీ ఆధ్యాత్మికం, పురాణం రామాయణం భారతీయ సంప్రదాయంలో అత్యంత ప్రముఖమైన గ్రంథం. తెలుగు సాహిత్యంలో కవిత్రయం భారతం, పోతన భాగవతం అత్యంత ప్రామాణికం, ఏకైక సుప్రఖ్యాతంగా నిలబడ్డాయి. ఐతే రామాయణం విషయంలో ఏ ఒక్క తెలుగు రామాయణానికో ఆ ఖ్యాతి దక్కలేదు. వేటికవే సాటిగా రంగనాథ రామాయణం, రామాయణ కల్పవృక్షం, మొల్ల రామాయణం పేరు తెచ్చుకున్నా ఆ వాల్మీకాన్ని హిందీ తులసీ రామాయణం మరపించినట్టుగా చేయలేదు. అందుకే ఎన్నెన్నో రామాయణాలు ఏర్పడ్డాయి. అసంఖ్యాకమైన రామాయణాలు రావడంతో విశ్వనాథ వారు మరలనిదేల రామాయణంబని ప్రశ్న తనకుతానే వేసుకుని సమాధానం చెప్పుకుని మరీ కల్పవృక్షాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రచించిన తెలుగు రామాయణాల్లో ఇది ఒకటి. 9000000004343 1944
శ్రీరామ పట్టాభిషేకం (నాటకం) [68] పాతాళభేది సుబ్రహ్మణ్యకవి నాటకం శ్రీరామచంద్రుడి పట్టాభిషేక ఉత్సవాన్ని గురించి వాల్మీకి రామాయణంలో వర్ణితమైన విశేషాలే కాక జానపదుల పాటల్లో కూడా ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆ మహోత్సవాన్ని గురించి శక్తి ఉన్న మేరకు ప్రతి రామాయణ కర్తా ఊహించుకున్నాడు. అటువంటి పట్టాభిషేక ఉత్సవాన్ని పతాకంగా చేసుకుని ఈ నాటకం నిర్మితమైంది. 2030020025265 1929
శ్రీరామకర్ణామృతం [69] చేకూరి సిద్ధ కవి పద్యకావ్యం, అనువాదం సంస్కృత భాషలో విరచితమై, రామభక్తులకు పఠనయోగ్యంగా ప్రసిద్ధంగా ఉన్న శ్రీరామకర్ణామృతానికి ఇది ఆంధ్రీకరణ. సంస్కృత శ్లోకాన్ని ఇచ్చి, వెన్వెంటనే దాని తెలుగు అనువాదమైన పద్యాన్నీ, ఆపైన తాత్పర్యాన్ని ప్రచురించారు ఇందులో. 2030020025061 1929
శ్రీ రామాయణం (కట్టా వరదరాజు)-అరణ్య, కిష్కింధ కాండలు [70] కట్టా వరదరాజు ఇతిహాసం, పద్యకావ్యం తెలుగు సాహిత్యానికి తంజావూరు సరస్వతీ గ్రంథాలయం ఓ అపూర్వమైన నిధి. అందులో ఎన్నో మరుగుపడ్డ రచనలు, కొన్ని రచనల్లో దొరకని భాగాలు వ్రాతప్రతులుగా దొరికాయి. వాటిలో ఒకటే ఈ గ్రంథం. 2030020024799 1952
శ్రీ రామాయణం (కట్టా వరదరాజు)-సుందర కాండము [71] కట్టా వరదరాజు ఇతిహాసం, పద్యకావ్యం తెలుగు సాహిత్యానికి తంజావూరు సరస్వతీ గ్రంథాలయం ఓ అపూర్వమైన నిధి. అందులో ఎన్నో మరుగుపడ్డ రచనలు, కొన్ని రచనల్లో దొరకని భాగాలు వ్రాతప్రతులుగా దొరికాయి. వాటిలో ఒకటే ఈ గ్రంథం. 2030020024835 1952
శ్రీ రామాయణం (కట్టా వరదరాజు)-యుద్ధ కాండము [72] కట్టా వరదరాజు ఇతిహాసం, పద్యకావ్యం తెలుగు సాహిత్యానికి తంజావూరు సరస్వతీ గ్రంథాలయం ఓ అపూర్వమైన నిధి. అందులో ఎన్నో మరుగుపడ్డ రచనలు, కొన్ని రచనల్లో దొరకని భాగాలు వ్రాతప్రతులుగా దొరికాయి. వాటిలో ఒకటే ఈ గ్రంథం. 2030020024696 1952
శ్రీరామ విజయము-కళ్యాణ కాండము [73] కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి ఇతిహాసం, పద్యకావ్యం రామాయణం భారతీయ సంప్రదాయంలో అత్యంత ప్రముఖమైన గ్రంథం. తెలుగు సాహిత్యంలో కవిత్రయం భారతం, పోతన భాగవతం అత్యంత ప్రామాణికం, ఏకైక సుప్రఖ్యాతంగా నిలబడ్డాయి. ఐతే రామాయణం విషయంలో ఏ ఒక్క తెలుగు రామాయణానికో ఆ ఖ్యాతి దక్కలేదు. వేటికవే సాటిగా రంగనాథ రామాయణం, రామాయణ కల్పవృక్షం, మొల్ల రామాయణం పేరు తెచ్చుకున్నా ఆ వాల్మీకాన్ని హిందీ తులసీ రామాయణం మరపించినట్టుగా చేయలేదు. అందుకే ఎన్నెన్నో రామాయణాలు ఏర్పడ్డాయి. అసంఖ్యాకమైన రామాయణాలు రావడంతో విశ్వనాథ వారు మరలనిదేల రామాయణంబని ప్రశ్న తనకుతానే వేసుకుని సమాధానం చెప్పుకుని మరీ కల్పవృక్షాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రచించిన తెలుగు రామాయణాల్లో ఇది ఒకటి. ఐతే రామాయణంలో బాల కాండమని ఉన్న పేరును కళ్యాణ కాండమని(సీతారామ కళ్యాణరీత్యా), అయోధ్య కాండమని ఉన్న పేరు రాజ్యకాండమనీ(రాజ్యసింహాసన విషయంపై జరిగిన మలుపులు దృష్టిలో ఉంచుకుని) పేర్లు మార్చారు. అలాగే ఇంకొన్ని సముచితమని తోచిన మార్పులు చేసారు. 2030020025078 1930
శ్రీమదాంధ్ర మహాభారతం-యుద్ధ పంచకం [74] కర్తలు.కవిత్రయం ఇతిహాసం మహాభారతం పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. ఈ మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడు. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. సంస్కృతములో ఉన్న ఈ మహా కావ్యాన్ని, కవిత్రయముగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ)లు తెలుగు లోకి అనువదించారు. వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలని తెలుగులో సామెత. "యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్" - "ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు" అని ప్రశస్తి పొందింది. హిందువులకు ఎంతో పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రము కూడా మహాభారతంలోని భాగాలే. దీనిని బట్టి ఈ కావ్య విశిష్టతను అంచనా వేయవచ్చును. 2030020024921 1950
శ్రీమదాంధ్ర మహాభారతం-శాంతి సప్తకము [75] కర్తలు.కవిత్రయం ఇతిహాసం మహాభారతం పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. ఈ మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడు. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. సంస్కృతములో ఉన్న ఈ మహా కావ్యాన్ని, కవిత్రయముగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ)లు తెలుగు లోకి అనువదించారు. వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలని తెలుగులో సామెత. "యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్" - "ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు" అని ప్రశస్తి పొందింది. హిందువులకు ఎంతో పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రము కూడా మహాభారతంలోని భాగాలే. దీనిని బట్టి ఈ కావ్య విశిష్టతను అంచనా వేయవచ్చును. 2030020024877 1929
శ్రీమదాంధ్ర భాగవతం [76] పోతనామాత్యుడు, పరిష్కర్త.తంజనగరం తేవప్పెరుమాళ్ళయ్య, పరిశోధన.బుక్కపట్టణం రామానుజయ్య పద్యకావ్యం తెలుగు సాహిత్యంలోని అత్యంత ప్రాముఖ్యత, ప్రాచుర్యం కలిగిన గ్రంథాల్లో ఆంధ్ర భాగవతం ముందువరుసలో ఉంటుంది. మూలమైన వ్యాస భాగవతాన్ని కూడా పోతన భాగవతం మరపించేలా చేసిందంటే ప్రాధాన్యత అర్థంచేసుకోవచ్చు. తెలుగు నాట వందల ఏళ్ళుగా ఇంటింటికీ ప్రచారమైనదీ కావ్యం. గజేంద్రమోక్షం, రుక్మిణీ కళ్యాణం, ప్రహ్లాద చరిత్రము, కుచేలోపాఖ్యానము వంటీవి విడివిడిగా చదువుకునేవారు. వ్రాత ప్రతుల కాలంలో ఈ ఘట్టాల వ్రాతప్రతులు తెలుగునాట ఎన్నో గ్రంథాలకన్నా ఎక్కువగా ఉండడంతో వీటి ప్రాచుర్యం తెలుస్తుంది. ఈ వ్రాత ప్రతులను పరిష్కరించే పద్ధతిలో కూడా వివిధ భేదాలున్నాయి. పరిష్కర్తగా వ్యవహరించిన పెరుమాళ్ళయ్య లభించిన వ్రాత ప్రతులలో పాఠభేదములు, తప్పులుగా తోచినవి సరిజేయడమే గాక దానిని ఎందుకు, ఎలా సరిజేయవచ్చు అన్న విషయాన్ని కూడా తన అభిప్రాయాలతో రాశారు. ఆనాటి పండితులు కొందరిలో పాఠ్యపరిష్కరణపై అభిప్రాయాలు నేటి పరిశోధకులు తెలుసుకునేందుకు ఈ గ్రంథం పనికివస్తుంది. 2030020025497 1928
శ్రీరంగ మహత్వం [77] భైరవ కవి పద్యకావ్యం గారుడ పురాణాంతర్గతమైన శ్రీరంగ క్షేత్ర మహత్యాన్ని తెలుగులోకి పద్యగద్యాత్మకమైన కావ్య రూపంగా ఈ గ్రంథంలో అనువదించారు కవి. ప్రముఖ క్షేత్రమైన శ్రీరంగం మహత్వాన్ని ఈ గ్రంథం వివరిస్తోంది. 2030020025490 1927
శ్రీమదాంధ్ర భాగవతం-పంచమ, షష్ట, సప్తమ, అష్టమ, నవమ స్కంధములు [78] పోతనామాత్యుడు, పరిష్కర్త.తంజనగరం తేవప్పెరుమాళ్ళయ్య, పరిశోధన.బుక్కపట్టణం రామానుజయ్య పద్యకావ్యం తెలుగు సాహిత్యంలోని అత్యంత ప్రాముఖ్యత, ప్రాచుర్యం కలిగిన గ్రంథాల్లో ఆంధ్ర భాగవతం ముందువరుసలో ఉంటుంది. మూలమైన వ్యాస భాగవతాన్ని కూడా పోతన భాగవతం మరపించేలా చేసిందంటే ప్రాధాన్యత అర్థంచేసుకోవచ్చు. తెలుగు నాట వందల ఏళ్ళుగా ఇంటింటికీ ప్రచారమైనదీ కావ్యం. గజేంద్రమోక్షం, రుక్మిణీ కళ్యాణం, ప్రహ్లాద చరిత్రము, కుచేలోపాఖ్యానము వంటీవి విడివిడిగా చదువుకునేవారు. వ్రాత ప్రతుల కాలంలో ఈ ఘట్టాల వ్రాతప్రతులు తెలుగునాట ఎన్నో గ్రంథాలకన్నా ఎక్కువగా ఉండడంతో వీటి ప్రాచుర్యం తెలుస్తుంది. ఈ వ్రాత ప్రతులను పరిష్కరించే పద్ధతిలో కూడా వివిధ భేదాలున్నాయి. పరిష్కర్తగా వ్యవహరించిన పెరుమాళ్ళయ్య లభించిన వ్రాత ప్రతులలో పాఠభేదములు, తప్పులుగా తోచినవి సరిజేయడమే గాక దానిని ఎందుకు, ఎలా సరిజేయవచ్చు అన్న విషయాన్ని కూడా తన అభిప్రాయాలతో రాశారు. ఆనాటి పండితులు కొందరిలో పాఠ్యపరిష్కరణపై అభిప్రాయాలు నేటి పరిశోధకులు తెలుసుకునేందుకు ఈ గ్రంథం పనికివస్తుంది. 2030020024825 1925
శ్రీమళయాళ సద్గురు గ్రంధావళి-ఏడవ సంపుటి [79] వివరాలు లేవు ఆధ్యాత్మిక సాహిత్యం 2990100061820 2001
శ్రీమళయాళ సద్గురు గ్రంధావళి-తొమ్మిదవ సంపుటి [80] వివరాలు లేవు ఆధ్యాత్మిక సాహిత్యం 2990100061821 2001
శ్రీమళయాళ సద్గురు గ్రంధావళి-పదవ సంపుటి [81] వివరాలు లేవు ఆధ్యాత్మిక సాహిత్యం 2990100061813 2001
శ్రీమళయాళ సద్గురు గ్రంధావళి-పదకొండవ సంపుటి [82] వివరాలు లేవు ఆధ్యాత్మిక సాహిత్యం 2990100061814 2001
శ్రీమళయాళ సద్గురు గ్రంధావళి-పదమూడవ సంపుటి [83] వివరాలు లేవు ఆధ్యాత్మిక సాహిత్యం 2990100061815 2001
శ్రీమళయాళ సద్గురు గ్రంధావళి-పదిహేడవ సంపుటి [84] వివరాలు లేవు ఆధ్యాత్మిక సాహిత్యం 2990100061817 2001
శ్రీమళయాళ సద్గురు గ్రంధావళి-పంత్తొమ్మిదవ సంపుటి [85] వివరాలు లేవు ఆధ్యాత్మిక సాహిత్యం 2990100061818 2001
శ్రీమళయాళ సద్గురు గ్రంధావళి-ఇరవైయవ సంపుటి [86] వివరాలు లేవు ఆధ్యాత్మిక సాహిత్యం 2990100061819 2001
శ్రీ శంకర విజయము [87] వెంపరాల సూర్యనారాయణశాస్త్రి పద్యకావ్యం సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యుడు (Adi Shankaracharya). ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడే ఈ ఆచార్యుడు హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథముడు. గొప్ప పండితుడు, గురువు, మహాకవి. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. శంకరుని జీవితానికి సంబంధించిన వివిధ గాథలు, నమ్మకాలు శంకర విజయం అన్న పేరుతో పిలువబడుతున్నాయి. దానినే ఈ కవి తెనిగించారు. 2030020024509 1952
శ్రీమద్భాగవతం-ఆంధ్రవచనం, మూడవభాగం [88] కేతవరపు వెంకటశాస్త్రి పురాణం, హిందూమతం భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం (Bhagavata Purana or Bhāgavatam) హిందూ మత సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణము. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భగవదవతారాలు గురించి ఈ గ్రంధంలో చెప్పబడ్డాయి. దీనిని తెలుగులో సరళ గ్రాంథిక వచనంలో రచించారు. 2030020024578 1925
శ్రీమద్భాగవతం-ఆంధ్రవచనం, అయిదవ భాగం [89] కేతవరపు వెంకటశాస్త్రి పురాణం, హిందూమతం భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం (Bhagavata Purana or Bhāgavatam) హిందూ మత సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణము. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భగవదవతారాలు గురించి ఈ గ్రంధంలో చెప్పబడ్డాయి. దీనిని తెలుగులో సరళ గ్రాంథిక వచనంలో రచించారు. 2030020024557 1914
శ్రీమద్భాగవతం-ఏకాదశ, ద్వాదశ స్కంధములు-ఆంధ్రవచనం [90] దేవరాజసుధీమణి పురాణం, హిందూమతం భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం (Bhagavata Purana or Bhāgavatam) హిందూ మత సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణము. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భగవదవతారాలు గురించి ఈ గ్రంధంలో చెప్పబడ్డాయి. దీనిని తెలుగులో సరళ గ్రాంథిక వచనంలో రచించారు. 2030020024527 1924
శ్రీరామచంద్రమూర్తి (వచన కావ్యం) [91] జనమంచి సీతారామస్వామి వచన కావ్యం రామచంద్రుని చరిత్రములో అత్యంత కరుణ రస ప్రధానమైన గాథ ఉత్తర రామచరిత్రము. ఓ సామాన్యుడు మోపిన నింద సామ్రాట్టు పదవికీ, సూర్యవంశ ప్రతిష్ఠకూ కళంకం కారాదని సీతాదేవిని అడవుల్లో వదలివేయమని స్వయంగా ఆనతీ ఇచ్చాకా శ్రీరామచంద్రుడు అనుభవించిన బహుదుఃఖగాథ అది. దానిని గతంలో భవభూతి అపురూపమైన నాటకం-ఉత్తర రామచరిత్రగా మలచగా, అది చదివే సమయంలో కలిగిన ఆలోచనతో దీనిని వచన కావ్యంగా మలిచానని కవి వెల్లడించారు. 2030020024621 1924
శ్రీమదంధ్ర మహాభారతము-శాంతి పర్వము [92] పరిష్కర్త: చివుకుల సుబ్బరామశాస్త్రి ఆధ్యాత్మిక సాహిత్యం 2020010001941 1928
శ్రీమదాంధ్ర భోజచరిత్రము [93] ఆంధ్రీకరణ.చిలకపాటి వెంకట రామానుజశర్మ నాటకం, అనువాదం భోజరాజు మహాకవి కాళిదాసు పోషకునిగా, నవరత్నాలనే కవిపండితులకు ఆశ్రయమిచ్చినవానిగా సంస్కృత సాహిత్య రంగంలో సుప్రసిద్ధుడు. ఆయన జీవితాన్ని గురించి సంస్కృతంలో ప్రఖ్యాతిపొందిన నాటకాలకు ఇది అనువాదం. 2030020024765 1911
శ్రీమాధవాచార్య విద్యారణ్యస్వామి [94] మూలం.నరసింహ చింతామణి కేళ్కర్, అనువాదం.మాచిరాజు దుర్గాశంకరామాత్యుడు నాటకం, అనువాద నాటకం విద్యారణ్యుడు లేదా మాధవాచార్యుడు శృంగేరి శారదా మఠానికి 12వ పీఠాధిపతి. శంకరాచార్యుల తరువాత ఐదు శతాబ్ధాలకు (1380-1386) శారదా పీఠాన్ని అధిరోహించాడు. విజయనగర సామ్రాజ్య స్థాపనకు మూల ప్రేరకునిగా ప్రసిద్ధి చెందాడు. ప్రజలలో అధ్యాత్మిక భావాలు పెంపొందించడానికి అవతరించిన మూర్తిగా విద్యారణ్యుడిని భావిస్తారు. ఆయనను ప్రధాన పాత్రగా ఈ నాటకం కేళ్కర్ మరాఠీలో రాస్తే దాన్ని మాచిరాజు దుర్గాశంకరామాత్యుడు తెలుగులోకి అనువదించారు. 2030020024619 1927
శ్రీమదాంధ్ర కిరాతార్జునీయం [95] మూలం.భారవి, అనువాదం.భువనగిరి విజయ రామయ్య పద్యకావ్యం, అనువాదం కిరాతార్జునీయం 6 వ శతాబ్దంలో మహాకవి భారవి చే రచింపబడిన సంస్కృత పద్య కావ్యం. ఈ కావ్యం అర్జునుడు మరియు మారు వేషంలో ఉన్న శివుని మధ్య జరిగిన యుద్ధాన్ని తెలుపుతూ రాయబడింది. సంస్కృతం లోని ఆరు మహా కావ్యాలలో ఒకటిగా కిరాతార్జునీయం కొనియాడబడింది. ఈ కావ్య రచనా శైలి . పద ఎన్నిక మరియు అద్భుత వర్ణన, సంస్కృత పండితుల ప్రశంసలు పొందింది. ఈ కావ్యంలో ఎక్కువగా వీర రసం బాగా వర్ణించబడింది. ఇందులో కవి మహాభారతంలో వనపర్వంలోని ఒక చిన్న భాగాన్ని తీసుకుని వర్ణించాడు. ఇది ఆ కావ్యానికి ఆంధ్రానువాదం. 2030020025024 1934
శ్రీకృష్ణకవి చరిత్రము [96] అనంతపంతుల రామలింగస్వామి జీవిత చరిత్ర ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, బహుగ్రంథకర్త, గ్రాంథికవాది శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి జీవిత చరిత్రమిది. కృష్ణమూర్తిశాస్త్రి తన జీవితంలోని వివిధ సంఘటనలను చెప్పగా విని ఆకళించుకుని ప్రభుత్వోన్నతోద్యోగి, సాహిత్యాభిలాషి రామలింగస్వామి ఈ గ్రంథాన్ని రచించారు. 5010010033172 1933
శ్రీకృష్ణదేవరాయ విజయ నాటకము [97] వేదము వేంకటరాయ శాస్త్రి నాటకం భారతదేశ చరిత్రలో ముఖ్యుడైన చక్రవర్తులలో శ్రీకృష్ణదేవరాయలు ఒకరు. ఆయన జీవితాన్ని గురించి తెలుగులో ఎన్నెన్నో చాటువులు, చారిత్రిక కల్పనలు ఉన్నాయి. అటువంటి వాటిలో పారిజాతాపహరణం (ప్రబంధం) ఆయన చరిత్రమేనన్నది ఒకటి. దీనిని సుప్రసిద్ధ పండితులు, కవి మరియు విమర్శకులు వేదము వేంకటరాయశాస్త్రి ఇతివృత్తంగా తీసుకుని ఈ నాటకం రచించారు. 2030020025146 1950
శ్రీ లలితోపాఖ్యానము [98] వ్యాసుడు హిందూమతం బ్రహ్మాండ పురాణంలోని ఈ కథ లలితాదేవి ఆవిర్భావం, ఆమె గుణగణాలు, ఆమె కథ వంటివి తెలియజేస్తుంది. లలితాదేవి ప్రాధాన్యత శక్తి ఉపాసనలో అసామాన్యం. ఆమెను గూర్చి రచించిన లలితా సహస్రనామాన్ని వశిన్యాది వాగ్దేవతలు (వశిని, కామేశ్వరి, అరుణ, విమల, జయిని, మేధిని, సర్వేశ్వరి, కౌలిని అనే ఎనిమిది మంది దేవతలు) దేవి ఆజ్ఞానుసారం దేవిస్తుతికోసం పఠించారని చెప్పబడింది. స్తోత్రంలో దేవి కేశాది పాదవర్ణన ఉంది. ఇందులో అనేక మంత్రాలు, సిద్ధి సాధనాలు, యోగ రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయని, విశ్వసిస్తారు. లలిత (క్రీడించునది)ను స్తుతించే ఈ స్తోత్రాన్ని దేవి ఇతర రూపాలైన దుర్గ, కాళి, మహాలక్ష్మి, సరస్వతి, భగవతి వంటి దేవతలను అర్చించడానికి కూడా పఠిస్తారు. పారాయణం, అర్చన, హోమం వంటి అనేక పూజావిధానాలలో ఈ సహస్రనామస్తోత్రం పఠించడం జరుగుతుంది. అంతటి దైవీరూపమైన లలితాదేవి గాథ ఇది. 2030020025029 1950
శ్రీ సూర్యనారాయణ శతకం [99] చింతపెంట సుబ్రహ్మణ్యకవి శతకం శతకము అనగా వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. శతకములు పురాణముల వలె కథా ప్రధాన మైనవి కావు. ప్రబంధముల వలే వర్ణనా ప్రాధాన్యములు గావు, గేయ కృతులవలె సంగీత ప్రాధాన్యములు గావు, కాని తెలుగు నాట పండిత పామరులనే తారతమ్యము లేక, పిల్లలు- పెద్దలు అనే తేడాలేక, చదువురాని వారితో సహా అందరి లోనూ బహుళ ప్రచారము నొందినది శతక సాహిత్యము. ఇంతటి బహుళ ప్రాచుర్యమును పొందిన తెలుగు సాహిత్య ప్రక్రియ మరొకటి లేదు అనడంలో సందేహం లేదు. ఇంతవరకు ఉపలబ్ధమైన పాత తెలుగు గ్రంథాలలో సంఖ్యా పరంగా చూస్తే శతకాలదే ప్రథమ స్థానమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ క్రమంలో సూర్యనారాయణా మకుటంతో రచించిన శతకమిది. 2020050016521 1924
శ్రీలలితా స్తోత్రమంజరి [100] సంపాదకుడు.పురాణపండ రాధాకృష్ణమూర్తి హిందూమతం, స్తోత్రాలు లలితాదేవి హిందూమతంలో సృష్టి, స్థితి, లయ కారకులైన త్రిమూర్తులనే సృష్టించి ఆయా పనులకు నియోగించిన మూలపుటమ్మగా ప్రసిద్ధి పొందిన దైవీరూపం. ఆమెను గురించి ఉన్న అనేకమైన ప్రసిద్ధ, ప్రాధాన్యత కల స్తోత్రాలను ఏర్చికూర్చి ఈ గ్రంథరూపంలో ప్రచురించారు. పురాణపండ రాధాకృష్ణమూర్తి ఈ సంకలనానికి సంపాదకత్వం వహించి తన అన్నగారు, ప్రసిద్ధ పౌరాణికులు ఉషశ్రీకి అంకితమిచ్చారు. 02990100071613 1990
శ్రీగర్గ భాగవతము [101] చివుకుల అప్పయ్యశాస్త్రి పద్యకావ్యం చివుకుల అప్పయ్యశాస్త్రి సంస్కృతాంధ్ర పండితులు మరియు పత్రికా సంపాదకులు. వీరు సనాతన హిందూ ధర్మాన్ని పునరుద్ధరణ కోసం పరితపించారు. వీరు "దివ్యవాణి" అనే ఆధ్యాత్మిక వారపత్రికను నడిపారు. శ్రాద్ధ ప్రక్రియ అర్ధవంతమని వీరు సప్రమాణంగా నిరూపించారు. దీనిపట్ల ప్రజలకు ప్రత్యయాన్ని కలిగించుటకై తీవ్రంగా కృషిచేశారు. వీరు "వేంకటేశ విన్నపాలు" అను శతకమును రచించారు. సంస్కృతం నుండి గర్గ భాగవతాన్ని ఉదాత్తమైన రసవంతమైన శైలిలో తెలుగులోకి అనువదించారు. ఆ భాగవత అనువాద ప్రతి ఇది. 2030020024870 1926
శ్రీకాళహస్తి మహాత్మ్యము [102] ధూర్జటి స్థలపురాణం వ్రాతప్రతిగా ఉన్న కాళహస్తి మహాత్మ్యాన్ని ప్రచురణలోకి తెచ్చే సంకల్పంతో కృషిచేసిన వారు కొత్తపల్లి వెంకట పద్మనాభశాస్త్రి ఆయన ఎంతో కృషిచేసి తయారుచేసిన ప్రతి దోషభూయిష్టముగా ఉండడంతో మరలా రెండవ ముద్రణను సరిగా వేయించే ప్రయత్నంలో కృషిచేస్తుండగా మృతిచెందారు. ఆ మిగిలిన పనిని పద్మనాభ శాస్త్రి భార్య అన్నపూర్ణమ్మ కోరిక మేరకు వావిలికొలను సుబ్బారావు చేయగా ఈ ప్రతి వెలుగుచూసింది. దీనిలో గ్రంథకర్త వివరాలే కాక ముద్రణ ప్రతి వివరాలు కూడా కొంతమేరకు ఉండడంతో ఇది నేటి పరిశోధకులకు ఉపకరిస్తుంది. 2030020025370 1914
శ్రీభాగవత మహాత్మ్యము [103] కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులు పద్యకావ్యం పద్మపురాణంలోని గోకర్ణోపాఖ్యానాన్ని స్వీకరించి ఈ గ్రంథం సంతరించారు కవి. ఈ గ్రంథం శ్రీమహాభాగవతం మహత్యాన్ని వివరించే ఇతివృత్తం కలిగివుంది. 2030020025027 1939
శ్రీమదాంధ్ర భాగవతం - సప్తమ స్కంధము [104] పోతనామాత్యుడు పద్యకావ్యం తెలుగు సాహిత్యంలోని అత్యంత ప్రాముఖ్యత, ప్రాచుర్యం కలిగిన గ్రంథాల్లో ఆంధ్ర భాగవతం ముందువరుసలో ఉంటుంది. మూలమైన వ్యాస భాగవతాన్ని కూడా పోతన భాగవతం మరపించేలా చేసిందంటే ప్రాధాన్యత అర్థంచేసుకోవచ్చు. తెలుగు నాట వందల ఏళ్ళుగా ఇంటింటికీ ప్రచారమైనదీ కావ్యం. గజేంద్రమోక్షం, రుక్మిణీ కళ్యాణం, ప్రహ్లాద చరిత్రము, కుచేలోపాఖ్యానము వంటీవి విడివిడిగా చదువుకునేవారు. వ్రాత ప్రతుల కాలంలో ఈ ఘట్టాల వ్రాతప్రతులు తెలుగునాట ఎన్నో గ్రంథాలకన్నా ఎక్కువగా ఉండడంతో వీటి ప్రాచుర్యం తెలుస్తుంది. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ "పోతన్న తెలుగుల పుణ్యపేటి" అంటూ, కరుణశ్రీ "సుకవీ! సుకుమార కళాకళానిధీ!!" అంటూ ప్రస్తావించగా ఎందరో తెలుగు పాఠకులు ఈ పద్యాలను ఆప్యాయంగా చదివి పరవశించారు. 2030020025021 1921
శ్రీకృష్ణావతార తత్త్వము-పదకొండవ ప్రకరణం [105] జనమంచి శేషాద్రి శర్మ పౌరాణికం జనమంచి శేషాద్రి శర్మ (Janamanchi Seshadri Sarma) (1882-1950) సుప్రసిద్ధ తెలుగు కవి, పండితుడు. వీరి పదిహేనవ ఏటనే కవిత్వాన్ని ప్రేమించి అవధానాలు చేయడం ప్రారంభించారు. శతావధానాలు కూడా చేశారు. కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వ్యక్తుల ఉపదేశాల వలన కావ్య రచనా కార్యక్రమానికి దీక్ష వహించి జీవితాంతం విద్యార్థిగా కృషిచేశారు. ఆయన కృష్ణావతారంలోని లోతుపాతులు వివరిస్తూ ప్రతి ఘట్టాన్నీ వర్ణించి రాసిన గ్రంథమిది. 2030020024942 1930
శ్రీ గీతా భాష్యత్రయ సారము [106] పరవస్తు శ్రీనివాసజగన్నాధస్వామి ఆధ్యాత్మికం, తత్త్వశాస్త్రం భగవద్గీత హిందువులకు పవిత్ర గ్రంథం, భారతీయ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన గ్రంథం. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మ స్వరూపము ఇందులో ముఖ్యాంశములు. దీనిని త్రిమతాచార్యులైన శంకర మధ్వాదులు తమతమ మతాలను సమర్థించుకునేలా భాష్యాలు రచించారు. ఆ భాష్యాల సారాన్ని ఈ గ్రంథంలో రచయిత అందించారు. 2020050019199 1889
శ్రీ చదల జానకి రామారావు జీవనయాన సప్తతి చరిత్ర [107] అడ్సుమిల్లి పూర్ణచంద్రరావు జీవితచరిత్ర ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన నాయకునిగా ప్రసిద్ధి చెందిన చదల జానకి రామారావు జీవిత చరిత్ర గ్రంథం ఇది. ఆదివాసీల హక్కుల పోరాట యోధునిగానే కాక కళాకారునిగా, సామాజికవేత్తగా కూడా పేరొందారు. ఆయన సప్తతి(70వ జన్మదినోత్సవం) సందర్భంగా దీనిని ప్రచురించారు. 2990120001647
శ్రీజీవ యాత్ర [108] కాంచనపల్లి కనకమ్మ ప్రబంధం, పద్యకావ్యం కాంచనపల్లి కనకమ్మ సంస్కృతాంధ్ర రచయిత్రి. వీరు కొంతకాలం నెల్లూరు, చెన్నైలలో లేడీ వెల్లింగ్టన్ ఉన్నత పాఠశాలలోను, క్వీన్ మేరీస్ కళాశాల లోను ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. మాక్విలన్ కంపెనీ వంటి విద్యాసంస్థల కోసం తెలుగు పుస్తకాలు రచించారు. ఆనాటి అన్ని స్త్రీల పత్రికలలోను వీరి రచనలు ప్రచురించబడ్డాయి. పద్యం, కథ, నవల, నాటకం, జీవితచరిత్ర, యాత్రాచరిత్ర వంటి ప్రక్రియలన్నిటిలోను రచనలు చేసారు. వీరి కృషికి గుర్తింపుగా "కవితా విశారద", "కవితిలక" అనే బిరుదులు మరియు కేసరి గృహలక్ష్మి స్వర్ణకంకణం అందుకున్నారు. ఆమె రచించిన తత్త్వ ప్రతిపాదక ప్రబంధమిది. 2030020024960 1925
శ్రీ తుకారామస్వామిచరిత్రము [109] వావిళ్ల రామస్వామి సన్స్ ప్రచురణ(రచయిత/అనువాదకుని వివరాలు లేవు) ఆధ్యాత్మికం, జీవిత చరిత్ర తుకారాం మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన విష్ణుభక్తుడు. భక్తి ఉద్యమానికి చెందిన వాగ్గేయకారుడు. విష్ణుమూర్తి రూపమైన విఠోబా/విట్ఠల స్వామి భక్తునిగా ఆయన ప్రఖ్యాతుడు. 16వ శతాబ్దికి చెందిన భక్త తుకారాం జీవితాన్ని గురించి పలు అద్భుతగాథలు ప్రచారంలో ఉన్నాయి. అటువంటి కథలను సంకలనం చేసి మరాఠీలో రాసిన జీవిత చరిత్రను వావిళ్ల వారు తెనిగించారు. ఈ పుస్తకం ద్వారా తుకారాం జీవితాన్ని గురించి తెలుసుకోవచ్చు. 2030020024439 1931
శ్రీదేవీ భాగవతము (1-2-3 స్కందములు) [110] నోరి నరసింహశాస్త్రి ఆధ్యాత్మికం శ్రీదేవీ భాగవత పురాణము, ఒక శాక్తేయ పురాణము. ఇదీ, మరియు మార్కండేయ పురాణములోని దేవీ మహాత్మ్యము శక్తి ఆరాధనా సంప్రదాయంలో విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇది ఒక ఉప పురాణము అని కొందరు అన్నప్పటికీ, గ్రంధంలో మాత్రం ఇది మహా పురాణము అని ఉంది. ఈ గ్రంధాలలో పరాశక్తియైన శ్రీమాతయే సకల సృష్టిస్థితిలయకారిణియైన పరబ్రహ్మస్వరూపిణి అని చెప్పబడింది. 7వ స్కంధంలో 33వ అధ్యాయంలో దేవి విరాట్ స్వరూప వర్ణన ఉంది. 35వ, 39వ అధ్యాయాలలో శ్రీమాతను ధ్యానించే, ఆరాధించే విధములు తెలుపబడినాయి. ఇంకా అనేక పురాణ గాథలు, ఆధ్యాత్మిక తత్వాలు, భగవన్మహిమలు ఇందులో నిక్షిప్తం చేయబడినాయి. ఇది త్రిమూర్తులు చేసిన శ్రీదేవీ స్తోత్రాలతో ప్రారంభమౌతుంది. దీని మూలం వ్యాసుడు రచించిన దేవీ భాగవతము. ఇందులో పద్దెనిమిది వేల శ్లోకాలు, పన్నెండు స్కంధాలు, మూడు వందల పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి. సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము అనే అయిదు లక్షణాలు గల మహా పురాణము. దానిని ప్రముఖ నవలా రచయిత, సాహిత్యవేత్త నోరి నరసింహశాస్త్రి సరళీకరించి తెనిగించారు. 2030020025528 1950
శ్రీనాథ వైభవం [111] మున్నంగి లక్ష్మీనరసింహశర్మ చరిత్ర, సాహిత్యం, జీవిత చరిత్ర శ్రీనాథుడు తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధుడు. మరుత్తరాట్చరిత్ర, శాలివాహన సప్తశతి, భీమఖండము, కాశీఖండము, శృంగార నైషధము మొదలైన ఎన్నెన్నో కావ్యాలను రచించి తెలుగు సాహిత్యంలో తనకంటూ ప్రత్యేకంగా శ్రీనాథ యుగాన్ని నిలుపుకున్న కవి. వేర్వేరు కారణాలతో తెలుగు దేశమంతా పర్యటించి పలు ప్రదేశాల్లోని సంప్రదాయాలు, ఆహార విహారాలు, కట్టు బొట్టు తీరు, స్త్రీల పద్ధతులు వంటివి పద్యరూపంగా నిక్షిప్తం చేశారు. ఆ కాలం నాటి సంస్కృతిని మొత్తాన్నీ శ్రీనాథుడు క్రానికల్ చేశాడు. అటువంటి కవి జీవితాన్ని ఆయన సాహిత్యంలోంచి ఎక్కువగా, కొంతవరకూ శాసనాధారాల నుంచి స్వీకరించి రాశారు ఈ గ్రంథంలో. చాటువులు, కావ్యాలు విస్తృతంగా తన పర్యటనలు, పరిస్థితులు, జీవితంలో వివిధ సంఘటనలు రికార్డు చేసివుండడంతో శ్రీనాథుని జీవితం రచించేందుకు వీలు దొరికి, గ్రంథం చాలావరకూ సమగ్రత పొందింది. 2030020024437 1929
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు (రెండో సంపుటం) [112] శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి సాహిత్యం తెలుగు కథల శిల్పాన్ని కొత్త ఒరవడిలో పెట్టిన గొప్ప రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. పూర్తి సంభాషణాత్మకంగా ఆయన కథలను నడిపే తీరు చాలా ప్రసిద్ధమయింది. ఆనాటి గోదావరి జిల్లాలు, అందులో మరీ ముఖ్యంగా అక్కడి వైదిక బ్రాహ్మణుల సాంఘిక జీవన దర్పణం లాంటి కథలను ఎన్నిటినో రాశారాయన. పూర్తిగా జీవద్భాషలో రాయడమే కాక తెలుగులో వచన రచనను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఉద్యమస్థాయిలో పనిచేశారు. 2020050016554 1940
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు (మూడో సంపుటం) [113] శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి సాహిత్యం తెలుగు కథల శిల్పాన్ని కొత్త ఒరవడిలో పెట్టిన గొప్ప రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. పూర్తి సంభాషణాత్మకంగా ఆయన కథలను నడిపే తీరు చాలా ప్రసిద్ధమయింది. ఆనాటి గోదావరి జిల్లాలు, అందులో మరీ ముఖ్యంగా అక్కడి వైదిక బ్రాహ్మణుల సాంఘిక జీవన దర్పణం లాంటి కథలను ఎన్నిటినో రాశారాయన. పూర్తిగా జీవధ్బాషలో రాయడమే కాక తెలుగులో వచన రచనను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఉద్యమస్థాయిలో పనిచేశారు. 2020050016553 1940
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు (నాలుగో సంపుటం) [114] శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి సాహిత్యం తెలుగు కథల శిల్పాన్ని కొత్త ఒరవడిలో పెట్టిన గొప్ప రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. పూర్తి సంభాషణాత్మకంగా ఆయన కథలను నడిపే తీరు చాలా ప్రసిద్ధమయింది. ఆనాటి గోదావరి జిల్లాలు, అందులో మరీ ముఖ్యంగా అక్కడి వైదిక బ్రాహ్మణుల సాంఘిక జీవన దర్పణం లాంటి కథలను ఎన్నిటినో రాశారాయన. పూర్తిగా జీవధ్బాషలో రాయడమే కాక తెలుగులో వచన రచనను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఉద్యమస్థాయిలో పనిచేశారు. 2020050016552 1940
శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు [115] పలువురు కవులు, సంకలనం.వేటూరి ప్రభాకరశాస్త్రి కీర్తనలు, శతకాలు, కృతులు వేంకటేశ్వర స్వామిపైన కృతులు తాళ్ళపాక వారే కాక మరెందరో ఇతర కవులు, వాగ్గేయకారులు కూడా చేశారు. ఈ గ్రంథంలో తితిదే వారి ప్రచురణలో సంకలించిన కృతులు అటువంటీవే. దాదాపు 17 వేర్వేరు శతకాలు, స్తుతులు, దండకాలు కలిపి ఈ గ్రంథంగా రూపొందించారు. 2030020025033 1948
శ్రీ బ్రహ్మానంద తీర్థ విజయము [116] పి.ఆదినారాయణ చరిత్ర శంకరాచార్యులు హిందూమతాన్ని పునర్వైభవం కలిగించేందుకు స్థాపించిన పీఠాల్లో శృంగేరీ దక్షిణామ్నాయ పీఠం ఒకటి. శృంగేరీ పీఠాధిపతులు దేశంలో పరంపరాగతంగా హిందూ ధర్మాన్ని, అద్వైత తత్త్వాన్ని సుస్థాపితం చేస్తూ, 14శతాబ్దిలో ముస్లిం దండయాత్రలు, దురాక్రమణలు అడ్డుకునేందుకు తమ శిష్యులు హరిహరరాయ, బుక్కరాయలతో విజయనగర సామ్రాజ్యం స్థాపించారు. అటువంటి పీఠానికి అధిపతిగా వ్యవహరించిన బ్రహ్మానంద తీర్థ స్వామి జీవితం, ప్రభావం గురించి ఈ గ్రంథం రచించారు పి.ఆదినారాయణ. 2030020025054 1937
శ్రీ భద్రాచల రామదాస చరిత్రము [117] పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి ఆధ్యాత్మికత, చరిత్ర రామదాసుగా సుప్రఖ్యాతుడైన కంచర్ల గోపన్న ప్రసిద్ధిచెందిన భద్రాచల కోదండ రామాలయం కట్టించారు. వాగ్గేయకారునిగా, కవిగా శ్రీరామునిపై కీర్తనలు, దాశరథీ శతకం వంటివి రచించారు. తహశిల్దారుగా తానాషా వద్ద పనిచేసిన గోపన్న రామాలయాన్ని ప్రజల వద్ద వసూలు చేసిన పన్ను డబ్బుతో నిర్మించిన కారణంగా జైలులో పెట్టారు. ఆపైన తానాషాకు రామ లక్ష్మణులు కనిపించి డబ్బు ఇచ్చి చెల్లుచీటీ తీసుకుని మరీ రామదాసుని విడిపించారని చెప్తారు. ఈ గాథనంతటినీ పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి ఈ గ్రంథంలో రచించారు. 2020050005773 1925
శ్రీభగవద్గీతావచనము [118] ప్రచురణ.మంగు వెంకట రంగనాథరావు ఆధ్యాత్మికం భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. ఆధ్యాత్మికంగానే కాక జీవన విధానాన్ని రూపుదిద్దేందుకు ఉపకరిస్తుంది. భగవద్గీత మహాభారతంలో కృష్ణుడు అర్జునునికి చెప్పడంతో సుప్రసిద్ధ గ్రంథమైన భగవద్గీత ప్రారంభం కాగా, మానవుల కర్మలను తొలగించి ముక్తిని ప్రసాదించే మార్గమేది అని పార్వతీదేవి ప్రశ్నించడంతో పరమేశ్వరుడు భగవద్గీతను వినిపించడంతో శ్రీభగవద్గీతావచనము ప్రారంభమౌతుంది. 2020050019128 1909
శ్రీభద్రాచల క్షేత్ర చరిత్రము [119] కొండపల్లి రామచంద్రరావు చరిత్ర నేటి తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో నెలవై ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం తెలుగువారికి అత్యంత పుణ్యప్రథమైన ఆలయాల్లో ఒకటి. భద్రాచలం ఆలయ చరిత్ర భక్త రామదాసుగా ప్రఖ్యాతుడైన కంచర్ల గోపన్న జీవితంతో, తానాషా అని పిలిచే గోల్కొండ నవాబుతో ముడిపడివుంది. ఆ చరిత్రను సప్రమాణికంగా ఈ గ్రంథంలో రచించారు. 2990100071603 1961
శ్రీమదాంధ్ర బ్రహ్మవైవర్త పురాణము (ఉత్తర ఖండము) [120] మూలం.వేద వ్యాసుడు, అనువాదం.మట్టుపల్లి శివసుబ్బరామయ్య గుప్త పురాణం బ్రహ్మవైవర్త పురాణములో 18 వేల శ్లోకాలు ఉన్నాయి అని మత్స్య పురాణములోను, నారద పురాణము లోను చెప్పబడింది. కాని ఇప్పుడు 12 వేల పై చిలుకు శ్లోకాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇది ముఖ్యముగా పరబ్రహ్మ వ్యాప్తము గురించి చెప్పుచున్నది గనుక దీనిని బ్రహ్మవైవర్త పురాణము అన్నారు. ఈ పురాణము నాలుగు భాగాలుగా విభజింపబడింది. బ్రహ్మ ఖండము - బ్రహ్మాండోత్పత్తి, సృష్టి గురించి, ప్రకృతి ఖండము - ఆదిశక్తి గురించి, ఆమె అంశన ప్రభవించిన దేవతల గురించి, గణేశ ఖండము - గణపతి జననవృత్తాంతము, జమదగ్ని పరశురాముల వృత్తాంతము, శ్రీకృష్ణ ఖండము - పరబ్రహ్మమే కృష్ణునిగా అవతరించి చేసిన చర్యలు వివరించారు. ఈ పురాణములో శ్రీకృష్ణుడే పరాత్పరుడుగా వ్యాసమహర్షి వర్ణించాడు. ఈ గ్రంథాన్ని తెలుగులోకి మట్టుపల్లి శివసుబ్బరామయ్య గుప్త అనువదించగా తితిదే వారు ప్రచురించారు. (మూల గ్రంథం అనాదిగా వస్తున్నది) 2020120007573 1995
శ్రీ మద్భాగవత మహిమ [121] మిన్నికంటి గురునాథశర్మ ఆధ్యాత్మిక సాహిత్యం 2020050005932 1954
శ్రీమద్భాగవతాద్య స్కంధాద్య పద్య వ్యాఖ్యానం [122] బండ్లమూడి గురుమూర్తి శాస్త్రి వ్యాఖ్యానం భాగవతం గ్రంథం ప్రారంభంలోని తొలి స్కంధం ఆదిలోని పద్య వ్యాఖ్యానం ఈ గ్రంథం. గురునాథ పండితుడు ఈ వ్యాఖ్య చేశారు. 2020050019108 1910
శ్రీ మహర్షి జీవిత చరిత్రామృతం-మొదటి భాగం [123] బులుసు వెంకటేశ్వరులు జీవిత చరిత్ర, పురాణాలు భారతీయ సంస్కృతిలోని సకలమైన ఊహలకు, ఆశలకు, ఆశయాలకు, తత్త్వాలకు మూలమైన మహాపురుషులు మహర్షులు. తపన జెందుతూ, ప్రకృతి నడకలోని సూత్రాలను అర్థం చేసుకుంటూ, భగవంతుని అపురూపమైన స్పర్శను అందుకుని దానిని మొత్తం మానవాళికి అందించిన మహానుభావులను మహర్షులని మన సంస్కృతి సంభావించింది. బట్ట కట్టుకోవడం, తిండి తినడం మొదలుకొని ఎలా జీవించాలి, ఎవరితో ఏం సంభాషించాలి మొదలైన ఎన్నెన్నో విషయాలను సాహిత్యం, సంప్రదాయం, విలువల ద్వారా అందజేసిన ఆ మహానుభావుల జీవితాలు తెలుసుకోవడం మనల్ని మనం పునరవలోకించుకోవడమే అవుతుంది ఈ గ్రంథం అలాంటి మహాపురుషుల జీవితాలను అందిస్తోంది. 2030020024410 1953
శ్రీ మహర్షి జీవిత చరిత్రామృతం-మూడవ భాగం [124] బులుసు వెంకటేశ్వరులు జీవిత చరిత్ర, పురాణాలు భారతీయ సంస్కృతిలోని సకలమైన ఊహలకు, ఆశలకు, ఆశయాలకు, తత్త్వాలకు మూలమైన మహాపురుషులు మహర్షులు. తపన జెందుతూ, ప్రకృతి నడకలోని సూత్రాలను అర్థం చేసుకుంటూ, భగవంతుని అపురూపమైన స్పర్శను అందుకుని దానిని మొత్తం మానవాళికి అందించిన మహానుభావులను మహర్షులని మన సంస్కృతి సంభావించింది. బట్ట కట్టుకోవడం, తిండి తినడం మొదలుకొని ఎలా జీవించాలి, ఎవరితో ఏం సంభాషించాలి మొదలైన ఎన్నెన్నో విషయాలను సాహిత్యం, సంప్రదాయం, విలువల ద్వారా అందజేసిన ఆ మహానుభావుల జీవితాలు తెలుసుకోవడం మనల్ని మనం పునరవలోకించుకోవడమే అవుతుంది ఈ గ్రంథం అలాంటి మహాపురుషుల జీవితాలను అందిస్తోంది. 2030020026748 1953
శ్రీ రాజగోపాలాచారి గారి జీవితచరిత్ర [125] ఆర్.నారాయణమూర్తి చరిత్ర, జీవితచరిత్ర రాజాజీగా ప్రఖ్యాతులైన చక్రవర్తుల రాజగోపాలాచారి స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్ర్యానంతరం కొద్ది దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించిన రాజనీతివేత్త. ప్రాథమికంగా కాంగ్రెసువాది అయినా పరిస్థితుల ప్రాభల్యం వల్ల కొన్ని పార్టీలు మారి, స్వాతంత్ర్యానంతరం నెహ్రూ సోషలిస్టు విధానల పట్ల వ్యతిరేకతతో స్వంతంగా పార్టీ కూడా నెలకొల్పారు. మద్రాసుకు ముఖ్యమంత్రిగా వ్యవహరించడమే కాక, దేశానికి ఆఖరి గవర్నర్ జనరల్‌గా చరిత్రకెక్కారు. ఆయన జీవిత చరిత్ర వల్ల ఆయా పరిణామాలపై మంచి అవగాహన కలిగే అవకాశముంది. అయితే ఈ పుస్తకం 1944లో రాయగా ఆపైన దాదాపుగా రెండు దశాబ్దాల వరకూ దేశ చరిత్రలో చురుకుగా వ్యవహరించారు. ఈ పుస్తకం వాటిని ప్రతిబింబించే అవకాశం లేదు. 5010010033177 1944
శ్రీరామానుజ కీర్తి కౌముది-మొదటి భాగము [126] సంపాదకుడు: ధనకుధరం వరదాచార్యులు ఆధాత్మిక సాహిత్యం 2040100073440 1972
శ్రీరామానుజ కీర్తి కౌముది-మూడవ భాగము [127] సంపాదకుడు: ధనకుధరం వరదాచార్యులు ఆధాత్మిక సాహిత్యం 2040100047300 1982
శ్రీరామానుజ కీర్తి కౌముది-నాల్గవ భాగము [128] సంపాదకుడు: ధనకుధరం వరదాచార్యులు ఆధాత్మిక సాహిత్యం 2040100047292 1983
శ్రీరామానుజ కీర్తి కౌముది-ఐదవ భాగము [129] సంపాదకుడు: ధనకుధరం వరదాచార్యులు ఆధాత్మిక సాహిత్యం 2040100047301 1984
శ్రీరామానుజ కీర్తి కౌముది-ఆరవ భాగము [130] సంపాదకుడు: ధనకుధరం వరదాచార్యులు ఆధాత్మిక సాహిత్యం 2040100047296 1985
శ్రీరామానుజ కీర్తి కౌముది-ఏడవ భాగము [131] సంపాదకుడు: ధనకుధరం వరదాచార్యులు ఆధాత్మిక సాహిత్యం 2040100047297 1986
శ్రీరామానుజ కీర్తి కౌముది-ఎనిమిదవ భాగము [132] సంపాదకుడు: ధనకుధరం వరదాచార్యులు ఆధాత్మిక సాహిత్యం 2040100047302 1987
శ్రీరామానుజ కీర్తి కౌముది-తొమ్మిదవ భాగము [133] సంపాదకుడు: ధనకుధరం వరదాచార్యులు ఆధాత్మిక సాహిత్యం 2040100047298 1988
శ్రీరామానుజ కీర్తి కౌముది-పదకొండవ భాగము [134] సంపాదకుడు: ధనకుధరం వరదాచార్యులు ఆధాత్మిక సాహిత్యం 2040100047291 1991
శ్రీరామానుజ కీర్తి కౌముది-పన్నెండవ భాగము [135] సంపాదకుడు: ధనకుధరం వరదాచార్యులు ఆధాత్మిక సాహిత్యం 2040100047303 1992
శ్రీరామానుజ కీర్తి కౌముది-పదమూడవ భాగము [136] సంపాదకుడు: ధనకుధరం వరదాచార్యులు ఆధాత్మిక సాహిత్యం 2040100047295 1993
శ్రీరామానుజ కీర్తి కౌముది-పద్నాల్గవ భాగము [137] సంపాదకుడు: ధనకుధరం వరదాచార్యులు ఆధాత్మిక సాహిత్యం 2040100047304 1994
శ్రీరామానుజ కీర్తి కౌముది-పదిహేనవ భాగము [138] సంపాదకుడు: ధనకుధరం వరదాచార్యులు ఆధాత్మిక సాహిత్యం 2040100047293 1995
శ్రీరామానుజ కీర్తి కౌముది-పదహారవ భాగము [139] సంపాదకుడు: ధనకుధరం వరదాచార్యులు ఆధాత్మిక సాహిత్యం 2040100073446 1996
శ్రీరామావతారతత్త్వము-నాల్గవ భాగము [140] జనమంచి శేషాద్రిశర్మ ఆధాత్మిక సాహిత్యం 2020120021110 1933
శ్రీరామావతారతత్త్వము-ఆరవ భాగము [141] జనమంచి శేషాద్రిశర్మ ఆధాత్మిక సాహిత్యం 2020120001819 1934
శ్రీరామావతారతత్త్వము-ఏడవ భాగము [142] జనమంచి శేషాద్రిశర్మ ఆధాత్మిక సాహిత్యం 2020120001818 1934
శ్రీరామావతారతత్త్వము-ఎనిమిదవ భాగము [143] జనమంచి శేషాద్రిశర్మ ఆధాత్మిక సాహిత్యం 2020120021111 1935
శ్రీరామావతారతత్త్వము-పదవ భాగము [144] జనమంచి శేషాద్రిశర్మ ఆధాత్మిక సాహిత్యం 2020120032898 1938
శ్రీలలితా సహస్రనామ వివరణ-మొదటి భాగము [145] జి.ఎల్.ఎన్.శాస్త్రి ఆధాత్మిక సాహిత్యం 2020120001720 1997
శ్రీలలితా సహస్రనామ వివరణ-రెండవ భాగము [146] జి.ఎల్.ఎన్.శాస్త్రి ఆధాత్మిక సాహిత్యం 2020120021166 1997
శ్రీలలితా సహస్రనామ వివరణ-మూడవ భాగము [147] జి.ఎల్.ఎన్.శాస్త్రి ఆధాత్మిక సాహిత్యం 2020120001723 1997
శ్రీలలితా సహస్రనామ వివరణ-నాల్గవ భాగము [148] జి.ఎల్.ఎన్.శాస్త్రి ఆధాత్మిక సాహిత్యం 2020120021080 1997
శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర[149] దుర్భాక రాజశేఖర శతావధాని చరిత్ర రాణా ప్రతాప్ రాజ్‌పుత్ వర్గానికి చెందిన హిందూ పరిపాలకుడు. ఆయన ప్రస్తుత రాజస్థాన్‌లోని మేవార్ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆయన భారతీయ సంస్కృతిలో ధైర్యం, సాహసం వంటి లక్షణాలకు ప్రతీకగా నిలిచారు. ప్రత్యేకంగా మొఘల్ పాలకుడు, నాటి రాజకీయాల్లో మహా శక్తివంతుడైన అక్బర్‌ను ఎదిరించి వీరమరణం పొందిన కారణంగా అతని సాహసం కీర్తింపబడుతోంది. ఈ నేపథ్యంలోనే దుర్భాక రాజశేఖర శతావధాని రాణా ప్రతప్ వీరగాథను ఇతివృత్తంగా స్వీకరించి ఈ పద్యకావ్యాన్ని రచించారు. ఈ పద్యకావ్యం చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి, కట్టమంచి రామలింగారెడ్డి వంటివారి మన్ననలు పొందింది. 2040100047280 1958
శ్రీ మదాంధ్ర తులసీ రామాయణము[150] స్వామీ అవ్యాయానంద పౌరాణికం రామాయాణాన్ని చాలామంది రచయితలు పలు భాషలలోకి అనువదించారు. అనువదించడమే కాక అనుసృజన కూడా చేశారు. హిందీలో తులసీదాసు రాసిన రామచరిత మానస్ ఇటువంటి రచనల్లో మకుటాయమానంగా చెబుతారు. తెలుగులో మొల్ల రామాయణం, విశ్వనాధ సత్యనారాయణ రాసిన రామాయణ కల్పవృక్షం వంటివి చాలా ప్రసిద్ధమైనవి అయినా తెలుగులోకి అనువదింపబడిన తులసీదాసు రామాయణం కూడా తెలుగునాట చాలా ప్రసిద్ధికెక్కింది. 6020010002124 1965
శ్రీరామకథా సుథాలహరి యుద్ధకాండము(మొదటి భాగము) [151] దుర్గా ప్రసాద్ ఆధ్యాత్మికం, పురాణం 2020120002400 2000
శ్రీరామకృష్ణ ప్రభ (1951 జనవరి) [152] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049579 1951
శ్రీరామకృష్ణ ప్రభ (1951 ఫిబ్రవరి) [153] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049615 1951
శ్రీరామకృష్ణ ప్రభ (1951 మార్చి) [154] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049598 1951
శ్రీరామకృష్ణ ప్రభ (1951 ఏప్రిల్) [155] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049574 1951
శ్రీరామకృష్ణ ప్రభ (1951 మే) [156] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049604 1951
శ్రీరామకృష్ణ ప్రభ (1951 జూన్) [157] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049592 1951
శ్రీరామకృష్ణ ప్రభ (1951 జులై) [158] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049585 1951
శ్రీరామకృష్ణ ప్రభ (1951 ఆగస్టు) [159] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049554 1951
శ్రీరామకృష్ణ ప్రభ (1951 సెప్టెంబరు) [160] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049621 1951
శ్రీరామకృష్ణ ప్రభ (1951 అక్టోబరు) [161] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049562 1951
శ్రీరామకృష్ణ ప్రభ (1951 నవంబరు) [162] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049610 1951
శ్రీరామకృష్ణ ప్రభ (1951 డిసెంబరు) [163] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049569 1951
శ్రీరామకృష్ణ ప్రభ (1962 జనవరి) [164] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049580 1962
శ్రీరామకృష్ణ ప్రభ (1962 ఫిబ్రవరి) [165] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049616 1962
శ్రీరామకృష్ణ ప్రభ (1962 మార్చి) [166] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049599 1962
శ్రీరామకృష్ణ ప్రభ (1962 ఏప్రిల్) [167] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049575 1962
శ్రీరామకృష్ణ ప్రభ (1962 మే) [168] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049605 1962
శ్రీరామకృష్ణ ప్రభ (1962 జులై) [169] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049586 1962
శ్రీరామకృష్ణ ప్రభ (1962 సెప్టెంబరు) [170] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049622 1962
శ్రీరామకృష్ణ ప్రభ (1962 అక్టోబరు) [171] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049563 1962
శ్రీరామకృష్ణ ప్రభ (1962 నవంబరు) [172] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049611 1962
శ్రీరామకృష్ణ ప్రభ (1962 డిసెంబరు) [173] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049570 1962
శ్రీరామకృష్ణ ప్రభ (1970 ఏప్రిల్) [174] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100068722 1970
శ్రీరామకృష్ణ ప్రభ (1971 జనవరి) [175] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049581 1971
శ్రీరామకృష్ణ ప్రభ (1971 ఫిబ్రవరి) [176] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049617 1971
శ్రీరామకృష్ణ ప్రభ (1971 మార్చి) [177] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049600 1971
శ్రీరామకృష్ణ ప్రభ (1971 ఏప్రిల్) [178] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049576 1971
శ్రీరామకృష్ణ ప్రభ (1971 మే) [179] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049606 1971
శ్రీరామకృష్ణ ప్రభ (1971 జూన్) [180] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049593 1971
శ్రీరామకృష్ణ ప్రభ (1971 జులై) [181] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049587 1971
శ్రీరామకృష్ణ ప్రభ (1971 ఆగస్టు) [182] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049556 1971
శ్రీరామకృష్ణ ప్రభ (1971 సెప్టెంబరు) [183] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049623 1971
శ్రీరామకృష్ణ ప్రభ (1971 అక్టోబరు) [184] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049561 1971
శ్రీరామకృష్ణ ప్రభ (1971 నవంబరు) [185] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049612 1971
శ్రీరామకృష్ణ ప్రభ (1971 డిసెంబరు) [186] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049568 1971
శ్రీరామకృష్ణ ప్రభ (1973 ఆగస్టు) [187] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049557 1973
శ్రీరామకృష్ణ ప్రభ (1973 జూన్) [188] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049594 1973
శ్రీరామకృష్ణ ప్రభ (1973 జులై) [189] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049588 1973
శ్రీరామకృష్ణ ప్రభ (1973 అక్టోబరు) [190] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049564 1973
శ్రీరామకృష్ణ ప్రభ (1973 సెప్టెంబరు) [191] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049624 1973
శ్రీరామకృష్ణ ప్రభ (1973 డిసెంబరు) [192] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049571 1973
శ్రీరామకృష్ణ ప్రభ (1975 జనవరి) [193] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049582 1975
శ్రీరామకృష్ణ ప్రభ (1975 ఫిబ్రవరి) [194] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049618 1975
శ్రీరామకృష్ణ ప్రభ (1975 మార్చి) [195] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049601 1975
శ్రీరామకృష్ణ ప్రభ (1975 ఏప్రిల్) [196] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049577 1975
శ్రీరామకృష్ణ ప్రభ (1975 మే) [197] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049607 1975
శ్రీరామకృష్ణ ప్రభ (1975 జూన్) [198] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049595 1975
శ్రీరామకృష్ణ ప్రభ (1975 జులై) [199] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049589 1975
శ్రీరామకృష్ణ ప్రభ (1975 ఆగస్టు) [200] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049558 1975
శ్రీరామకృష్ణ ప్రభ (1975 సెప్టెంబరు) [201] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049625 1975
శ్రీరామకృష్ణ ప్రభ (1975 అక్టోబరు) [202] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049565 1975
శ్రీరామకృష్ణ ప్రభ (1975 నవంబరు) [203] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049613 1975
శ్రీరామకృష్ణ ప్రభ (1975 డిసెంబరు) [204] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049572 1975
శ్రీరామకృష్ణ ప్రభ (1977 జనవరి) [205] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049583 1977
శ్రీరామకృష్ణ ప్రభ (1977 ఫిబ్రవరి) [206] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049619 1977
శ్రీరామకృష్ణ ప్రభ (1977 మార్చి) [207] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049602 1977
శ్రీరామకృష్ణ ప్రభ (1977 మే) [208] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049608 1977
శ్రీరామకృష్ణ ప్రభ (1977 జూన్) [209] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049596 1977
శ్రీరామకృష్ణ ప్రభ (1977 జులై) [210] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049590 1977
శ్రీరామకృష్ణ ప్రభ (1977 ఆగస్టు) [211] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049559 1977
శ్రీరామకృష్ణ ప్రభ (1977 సెప్టెంబరు) [212] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049626 1977
శ్రీరామకృష్ణ ప్రభ (1977 అక్టోబరు) [213] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049566 1977
శ్రీరామకృష్ణ ప్రభ (1977 నవంబరు) [214] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049614 1977
శ్రీరామకృష్ణ ప్రభ (1977 డిసెంబరు) [215] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049573 1977
శ్రీరామకృష్ణ ప్రభ (1978 జనవరి) [216] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049552 1978
శ్రీరామకృష్ణ ప్రభ (1979 మార్చి) [217] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049553 1979
శ్రీరామకృష్ణ ప్రభ (1982 జనవరి) [218] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049584 1982
శ్రీరామకృష్ణ ప్రభ (1982 ఫిబ్రవరి) [219] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100066594 1982
శ్రీరామకృష్ణ ప్రభ (1982 మార్చి) [220] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049603 1982
శ్రీరామకృష్ణ ప్రభ (1982 ఏప్రిల్) [221] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049578 1982
శ్రీరామకృష్ణ ప్రభ (1982 మే) [222] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049609 1982
శ్రీరామకృష్ణ ప్రభ (1982 జూన్) [223] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049597 1982
శ్రీరామకృష్ణ ప్రభ (1982 జులై) [224] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049591 1982
శ్రీరామకృష్ణ ప్రభ (1982 ఆగస్టు) [225] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049560 1982
శ్రీరామకృష్ణ ప్రభ (1982 సెప్టెంబరు) [226] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049627 1982
శ్రీరామకృష్ణ ప్రభ (1982 అక్టోబరు) [227] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2990100049567 1982
శ్రీరామ కాలనిర్ణయ బోధిని [228] కందాడై వేంకట సుందరాచార్యులు పౌరాణికం, చరిత్ర పురాణాలు భారత ప్రాచీన చరిత్రకు ఆధారాలని కొందరు భారతీయ చారిత్రికుల అభిప్రాయం. దీని ప్రకారం పలువురు చారిత్రిక పురుషులైన బుద్ధుడు, శంకరుడు మొదలైనవారికి పురాణేతిహాసలను ఆధారం చేసుకుని కాలనిర్ణయాలు చేయడమే కాక పురాణ పురుషులేగాని చరిత్రలో ఎన్నడూ జీవించినవారు కాదని పాశ్చాత్య చరిత్రకారులు, వారిని అనుసరించే ఇతరులూ భావించే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మొదలైనవారికి కూడా కాలాన్ని నిర్ధారించారు. అటువంటి గ్రంథాల్లో ఇది ఒకటి. 2030020024995 1913
శ్రీరామతీర్థస్వామి జీవితము [229] బులుసు వెంకటేశ్వర్లు జీవిత చరిత్ర 9000000005150 1950
శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జీవితచరిత్ర [230] పిడపర్తి ఎజ్రాకవి జీవితచరిత్ర లాల్ బహాదుర్ శాస్త్రి (హిందీ लालबहादुर शास्त्री) (1904 అక్టోబరు 2 - 1966 జనవరి 11) భారత దేశ రెండవ ప్రధానమంత్రి మరియు దేశ స్వాతంత్ర్యోద్యమములో ప్రముఖ పాత్రధారి. స్వాతంత్ర్యానంతరం భారతదేశానికి ప్రధానులుగా పనిచేసిన నేతల్లోకెల్లా దేశానికి అత్యంత గొప్ప విజయాలను అందించిన వ్యక్తిగా నిలిచారు. తాను ప్రధాని పదవిలో పనిచేసిన 18 నెలల్లోనే పాకిస్థానుపై యుద్ధాన్ని గెలిచి, దేశం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆహారసమస్యను పరిష్కరించేందుకు ‘హరిత విప్లవం’, ‘శ్వేత విప్లవాల’కు పునాదులు వేశారు. ఆయనకు మరణానంతరం 1996లో భారతరత్న పురస్కారం ప్రకటించారు. ఆయన వ్యక్తి జీవితచరిత్ర ఇది. 2020120001724 1979
శ్రీవాణి మాసపత్రిక (1985 ఫిబ్రవరి) [231] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049661 1985
శ్రీవాణి మాసపత్రిక (1985 ఏప్రిల్) [232] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049662 1985
శ్రీవాణి మాసపత్రిక (1985 మే) [233] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049663 1985
శ్రీవాణి మాసపత్రిక (1985 జులై) [234] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049664 1985
శ్రీవాణి మాసపత్రిక (1985 ఆగస్టు) [235] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049665 1985
శ్రీవాణి మాసపత్రిక (1985 సెప్టెంబరు) [236] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049666 1985
శ్రీవాణి మాసపత్రిక (1985 అక్టోబరు) [237] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049659 1985
శ్రీవాణి మాసపత్రిక (1985 డిసెంబరు) [238] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049660 1985
శ్రీవాణి మాసపత్రిక (1986 జనవరి) [239] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049670 1986
శ్రీవాణి మాసపత్రిక (1986 ఫిబ్రవరి) [240] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049671 1986
శ్రీవాణి మాసపత్రిక (1986 మార్చి) [241] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049672 1986
శ్రీవాణి మాసపత్రిక (1986 మే) [242] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049673 1986
శ్రీవాణి మాసపత్రిక (1986 జూన్) [243] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049674 1986
శ్రీవాణి మాసపత్రిక (1986 జులై) [244] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049675 1986
శ్రీవాణి మాసపత్రిక (1986 ఆగస్టు) [245] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049676 1986
శ్రీవాణి మాసపత్రిక (1986 సెప్టెంబరు) [246] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049677 1986
శ్రీవాణి మాసపత్రిక (1986 అక్టోబరు) [247] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049667 1986
శ్రీవాణి మాసపత్రిక (1986 నవంబరు) [248] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049668 1986
శ్రీవాణి మాసపత్రిక (1986 డిసెంబరు) [249] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049669 1986
శ్రీవాణి మాసపత్రిక (1987 జనవరి) [250] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068788 1987
శ్రీవాణి మాసపత్రిక (1987 ఫిబ్రవరి) [251] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068792 1987
శ్రీవాణి మాసపత్రిక (1987 మార్చి) [252] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068790 1987
శ్రీవాణి మాసపత్రిక (1987 ఏప్రిల్) [253] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068787 1987
శ్రీవాణి మాసపత్రిక (1987 మే) [254] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068791 1987
శ్రీవాణి మాసపత్రిక (1987 జులై) [255] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068789 1987
శ్రీవాణి మాసపత్రిక (1987 ఆగస్టు) [256] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068785 1987
శ్రీవాణి మాసపత్రిక (1987 అక్టోబరు) [257] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068786 1987
శ్రీవాణి మాసపత్రిక (1987 డిసెంబరు) [258] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068773 1987
శ్రీవాణి మాసపత్రిక (1990 జనవరి) [259] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100066617 1990
శ్రీవాణి మాసపత్రిక (1990 ఫిబ్రవరి) [260] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100066620 1990
శ్రీవాణి మాసపత్రిక (1990 మార్చి) [261] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049678 1990
శ్రీవాణి మాసపత్రిక (1990 ఏప్రిల్) [262] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049679 1990
శ్రీవాణి మాసపత్రిక (1990 మే) [263] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100066618 1990
శ్రీవాణి మాసపత్రిక (1990 ఆగస్టు) [264] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100066614 1990
శ్రీవాణి మాసపత్రిక (1990 అక్టోబరు) [265] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100066615 1990
శ్రీవాణి మాసపత్రిక (1990 నవంబరు) [266] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100066619 1990
శ్రీవాణి మాసపత్రిక (1990 డిసెంబరు) [267] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100066616 1990
శ్రీవాణి మాసపత్రిక (1993 జనవరి) [268] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049686 1993
శ్రీవాణి మాసపత్రిక (1993 ఫిబ్రవరి) [269] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100066661 1993
శ్రీవాణి మాసపత్రిక (1993 మార్చి) [270] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100066654 1993
శ్రీవాణి మాసపత్రిక (1993 ఏప్రిల్) [271] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049688 1993
శ్రీవాణి మాసపత్రిక (1993 మే) [272] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100066655 1993
శ్రీవాణి మాసపత్రిక (1993 జూన్) [273] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100066656 1993
శ్రీవాణి మాసపత్రిక (1993 జులై) [274] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049689 1993
శ్రీవాణి మాసపత్రిక (1993 ఆగస్టు) [275] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049690 1993
శ్రీవాణి మాసపత్రిక (1993 సెప్టెంబరు) [276] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049691 1993
శ్రీవాణి మాసపత్రిక (1993 అక్టోబరు) [277] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100066657 1993
శ్రీవాణి మాసపత్రిక (1993 నవంబరు) [278] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100066658 1993
శ్రీవాణి మాసపత్రిక (1993 డిసెంబరు) [279] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100066659 1993
శ్రీవాణి మాసపత్రిక (1995 జనవరి) [280] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049650 1995
శ్రీవాణి మాసపత్రిక (1995 ఫిబ్రవరి) [281] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049651 1995
శ్రీవాణి మాసపత్రిక (1995 మార్చి) [282] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049652 1995
శ్రీవాణి మాసపత్రిక (1995 ఏప్రిల్) [283] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049653 1995
శ్రీవాణి మాసపత్రిక (1995 మే) [284] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049654 1995
శ్రీవాణి మాసపత్రిక (1995 జూన్) [285] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049655 1995
శ్రీవాణి మాసపత్రిక (1995 జులై) [286] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049656 1995
శ్రీవాణి మాసపత్రిక (1995 ఆగస్టు) [287] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049657 1995
శ్రీవాణి మాసపత్రిక (1995 సెప్టెంబరు) [288] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049658 1995
శ్రీవాణి మాసపత్రిక (1995 అక్టోబరు) [289] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049647 1995
శ్రీవాణి మాసపత్రిక (1995 నవంబరు) [290] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049648 1995
శ్రీవాణి మాసపత్రిక (1995 డిసెంబరు) [291] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100049649 1995
శ్రీవాణి మాసపత్రిక (1998 జనవరి) [292] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068728 1998
శ్రీవాణి మాసపత్రిక (1998 ఫిబ్రవరి) [293] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068729 1998
శ్రీవాణి మాసపత్రిక (1998 మార్చి) [294] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068730 1998
శ్రీవాణి మాసపత్రిక (1998 ఏప్రిల్) [295] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068731 1998
శ్రీవాణి మాసపత్రిక (1998 మే) [296] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068732 1998
శ్రీవాణి మాసపత్రిక (1998 జూన్) [297] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068733 1998
శ్రీవాణి మాసపత్రిక (1998 జులై) [298] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068734 1998
శ్రీవాణి మాసపత్రిక (1998 ఆగస్టు) [299] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068735 1998
శ్రీవాణి మాసపత్రిక (1998 సెప్టెంబరు) [300] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068736 1998
శ్రీవాణి మాసపత్రిక (1998 అక్టోబరు) [301] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068725 1998
శ్రీవాణి మాసపత్రిక (1998 నవంబరు) [302] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068726 1998
శ్రీవాణి మాసపత్రిక (1998 డిసెంబరు) [303] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068727 1998
శ్రీవాణి మాసపత్రిక (2000 జనవరి) [304] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068777 2000
శ్రీవాణి మాసపత్రిక (2000 మార్చి) [305] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068778 2000
శ్రీవాణి మాసపత్రిక (2000 మే) [306] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068780 2000
శ్రీవాణి మాసపత్రిక (2000 జూన్) [307] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068781 2000
శ్రీవాణి మాసపత్రిక (2000 జులై) [308] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068782 2000
శ్రీవాణి మాసపత్రిక (2000 ఆగస్టు) [309] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068783 2000
శ్రీవాణి మాసపత్రిక (2000 సెప్టెంబరు) [310] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068784 2000
శ్రీవాణి మాసపత్రిక (2000 అక్టోబరు) [311] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068774 2000
శ్రీవాణి మాసపత్రిక (2000 నవంబరు) [312] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068775 2000
శ్రీవాణి మాసపత్రిక (2000 డిసెంబరు) [313] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు మాసపత్రిక 2990100068776 2000
శ్రీ విశ్వేశ్వర శతకము [314] వేమూరి వెంకటరామయ్య శర్మ శతకం ఆనాటి ప్రముఖ భాగవతుడు, ఉపన్యాసకుడు ములుకుట్ల లక్ష్మీనారాయణశాస్త్రి సనాతన భాగవత భక్తి సమాజ స్థాపకునిగా గణుతికెక్కారు. ఆ సమాజం ద్వారా పలనాడు ప్రాంతంలో ఓ గొప్ప శివాలయాన్ని నిర్మించే ప్రయత్నంలో కృతకృత్యులు అవుతున్న తరుణంలో ఆయన శిష్యుడు వెంకటరామయ్యశర్మ ఈ శతకరచన చేసి సమర్పించారు. 2020050016520 1941
శ్రీనివాస విలాస సేవధి [315] శ్రేష్ఠలూరి వేంకటార్యుడు ద్విపద కావ్యం తిరుమలపై కొలువైవున్న వేంకటేశ్వరుడు రెండు వేలయేళ్ళుగా దైవతంగా ఉన్నాడని సాహిత్యాధారాలు చెప్తున్నాయి. 12వందల యేళ్ళ నుంచి ఆయనకు పలువురు భక్తులు సేవలు చేస్తున్నట్టుగా శాసనాధారాలు దొరుకుతున్నాయి. ఇక వేయేళ్ళుగా ఐతే ఆయన ప్రాచుర్యం విస్తరిస్తూనే ఉంది. ఆ క్రమంలో కృష్ణరాయల కాలం శ్రీనివాసుని ప్రాముఖ్యతకు ఓ శిఖరాయమానమైన కాలంగా చెప్పవచ్చు. ఆ కాలానికే చెందిన శ్రేష్ఠలూరి వేంకటార్యుడూ వేంకటేశ్వరుని గురించీ రకరకాల పురాణాలు, స్థల మహాత్మ్యాల్లో ఉన్న కథలను ఒక క్రమం చేసి రచించిన గ్రంథమిది. ఇది ద్విపదలో రచించారు. తనకు స్వప్న దర్శనమిచ్చి ఈ కావ్యం వ్రాయమని పురిగొల్పాడని కవి స్వయంగా చెప్పుకున్నారు. 2030020024818 1954
శ్రీవేంకట రామకృష్ణ గ్రంథమాల-ద్వితీయ గుచ్ఛకము [316] వేంకట రామకృష్ణ కవులు కవిత్వం, సాహిత్య విమర్శ 20వ శతాబ్ది తొలి అర్థభాగంలో తెలుగు సాహిత్యంలో అవధానాలతో పాటుగా తెరపైకి వచ్చి సామాన్యపాఠకులకు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచిపెట్టినవి సాహిత్య కలహాలు. అటు తిరుపతి వేంకట కవులు, ఇటు వారితో పోటీగా కొప్పరపు సోదర కవులు, వేంకట రామకృష్ణ కవులు పోటాపోటీగా అష్టావధానాలు, శతావధానాలు చేసి రేపిన కలహంలోకి దాదాపుగా ఆనాటి తెలుగు కవిపండితులందరూ వచ్చిచేరారు. తిరుపతి వేంకటేశ్వరులతో పోటీగా అవధానాలే కాక కవిత్వ ఖండన మండనాలు చేసినవారు వేంకట రామకృష్ణ కవులు. వీరు పిఠాపురం సంస్థాన ఆస్థాన కవులు. తిరుపతి వేంకట కవులు రాసిన గ్రంథాల్లోని ఔచిత్య, వ్యాకరణ, చందో దోషాలు ఎత్తి చూపడం, తిరుపతివేంకటేశ్వరులు దానికి సమాధానం ఇవ్వడం మొదలుగా సాగిన ఎన్నెన్నో సాహిత్య విమర్శా వివాదాలు తుదకు సాహిత్యానికి, తెలుగు పాఠకుల పాండిత్యానికి మేలే చేశాయి. కథానిక రచనలో సాలప్రాంశువైన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మాటల్లో చెప్పాల్సివస్తే సంవత్సరాల కఠోరశ్రమపై, గురుశుశ్రూషపై నేర్చుకోవాల్సిన ఎన్నో భాషా, సాహిత్యపరమైన విషయాలు ఈ వివాదాల వల్ల కొద్ది రోజుల్లో తెలిసిపోయేవి . అటువంటి వివాద సాహిత్య సంచయంలో ఈ గ్రంథం కూడా చేరుతుంది. కోకిల కాకము, కవితా విమర్శఖండనము, ముండన మండనము, శతప్రాసము, శతఘ్ని, శృంగభంగము, సత్యసందేశము మొదలైన శీర్షికలతో ఉన్న ఈ విమర్శా విభాగాల పేర్లే వాటిలోని వివాదసూచనలను చేస్తాయి. ఐతే ఈ సాహిత్యమంతా గొప్ప ఆలంకారిక, ఛందో, వ్యాకరణ రహస్యాలతో నిండివుందనేది నిజం. 2020050005752 1912
శ్రీ వివేకానందస్వాములవారి మహోపన్యాసములు[317] వివేకానంద స్వామి(మూల రచయిత), నండూరి మూర్తిరాజు (అనువాదకులు) ఆధ్యాత్మికం, సాంఘికం, మతం రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు, ప్రపంచ మతాల సమ్మేళనంలో హిందూమతానికి ప్రాతినిధ్యం వహించిన వివేకానందుడు చేసిన పలు ఉపన్యాసాల అనువాదం ఇది. దేశాభ్యుదయం, మతసంస్కరణలు, ధర్మాచరణం మొదలైన వివిధ అంశాల గురించి వివేకానందుడు చేసిన ప్రసంగాల సమాహారమిది. వ్యక్తిత్వ వికాస పాఠాలుగా వివేకానంద బోధనలు ఉపకరిస్తున్న నేపథ్యంలో ఈ గ్రంథం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 2020050019132 1914
శ్రీ శంకర శతకము [318] స్వేచ్ఛానంద యోగి ఆధ్యాత్మికం, శతకం తెలుగు సాహిత్యంలో శతకాలు విస్తృతంగా, వైవిధ్యభరితంగా విస్తరించాయి. భక్తి, శృంగార, నీతి, జనజీవనం మొదలైన విషయాలలో శతకాలను ఎందరో కవులు రచించారు. యోగులు ఆధ్యాత్మికతను, భక్తిపరులు భక్తినీ, లౌక్యులు లోకరీతినీ, నీతినీ శతకాల్లో వివరించారు. ఈ క్రమంలో యోగియైన స్వేచ్ఛానందులు శంకరా అన్న మకుటంతో ఈ జ్ఞాన వైరాగ్య బోధ చేసే శతకాన్ని రచించారు. 2020050016523 1926
శ్రీ శివపురాణము [319] ముదిగొండ నాగవీరేశ్వరకవి పురాణాలు అష్టాదశ పురాణాలలో శివ పురాణం ఒకటి. వాయవీయ సంహితలో చెప్పిన ప్రకారం ఇందులో 12 సంహితలు, లక్ష శ్లోకాలు ఉండేవట. కాని వేదవ్యాసుడు పురాణాలను పునర్విభజన చేసిన తరువాత ఇందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి. వ్యాసుడు దీనిని తన శిష్యుడు రోమహర్షణునికి ఉపదేశించాడు. మత్స్య పురాణంలో తప్ప అన్ని ఇతర పురాణాలలోనూ శివమహాపురాణం ప్రస్తావన ఉంది. దీనిని ముదిగొండ నాగవీరేశ్వరకవి అనువదించారు. 2030020025477 1947
శ్రీశివ శక్త్యైక్య దర్శనము [320] వివరణ.మంధా లక్ష్మీనరసింహం, పరిశోధన.పేరి సుబ్రహ్మణ్యశాస్త్రి ఆధ్యాత్మికం సగుణోపాసన, నిర్గుణోపాసన మొదలైన పద్ధతులను ఆచరించే విధానాలు తెలిపే గ్రంథాల సారంగా ఈ పుస్తకాన్ని రచించారు. బృహదారణకము, భగవద్గీత, వాశిష్ఠము మొదలైన వేదాంత గ్రంథాలను మూలంగా స్వీకరించి గహనమైన వేదాంత విషయాలను రచించారు. 2020050019111 1920
శ్రీ శివాజీ జీవితము [321] కొమర్రాజు వెంకట లక్ష్మణరావు జీవిత చరిత్ర, చరిత్ర భారతదేశ చరిత్రలో మొఘలుల పరిపాలన తర్వాత దేశం బ్రిటీష్ పాలనలోకి వెళ్లకముందు 100 ఏళ్ళ పాటు విస్తారమైన ప్రాంతాన్ని పరిపాలించిన వారు మరాఠా రాజులు. హిందూ పదపాదుషాహీ అన్న లక్ష్యంతో దక్కన్ పీఠభూముల్లో ప్రారంభించిన వారి దిగ్విజయం కొన్ని దశాబ్దాల్లోనే పశ్చిమాన అటక్ వరకూ చేరుకుంది. అటువంటి రాజ్యానికి స్థాపకుడు, మొఘలుల పీడనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, చక్కని పరిపాలకుడు శివాజీ భోంస్లే. శివాజీ మహరాజ్‌గా ప్రసిద్ధి చెందిన ఆయన ఔరంగజేబు పాలనలో ఆనాటి పరిపాలకుల పీడనకు వ్యతిరేకంగా పోరాడారు. ఏ విధంగా చూసినా భారత చరిత్ర విభాగంలో శివాజీ జీవిత చరిత్ర ప్రాధాన్యత సంతరించుకున్నదే. తొలి తెలుగు విజ్ఞాన సర్వస్వ నిర్మాత, విజ్ఞాన చంద్రికా గ్రంథమాల వ్యవస్థాపకుడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు రచించిన గ్రంథమిది. 2030020024483 1947
శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారయణరామానుజ జియర్ స్వామివారి పవిత్ర జీవితచరిత్ర [322] శిరిశనగళ్ కృష్ణమాచార్యులు జీవిత చరిత్ర హిందూత్వంలో భాగమైన వైష్ణవ మతంలో జీయర్ సంప్రదాయం ఒకటి. ఈ సంప్రదాయంలో భాగంగా జీయర్ మఠాధిపతులైన జీయర్లు తమ శిష్యులకు ఆధ్యాత్మిక, ధార్మిక అంశాలలో మార్గదర్శనం చేస్తూంటారు. జీయర్లలో ఇటీవల వారు సుప్రసిద్ధుడు ఐన చిన జీయర్ స్వామికి గురువైన పెద జీయర్ జీవితాన్ని గురించి వ్రాసిన గ్రంథమిది. 1990020047892 1982
శ్రీ శంకరీయం [323] పంతుల విశారదుడు క్రీడలు ఆటలలోని నియమాలను ఆటల చట్టాలు పేరిట ఈ గ్రంథంలో వివరించారు. నెట్బాలు, త్రోబాలు, రింగ్ టెన్నిస్, బాల్ బాడ్మింటన్, కోకో, కబడ్డీ, వాలీబాల్, చేతి సాకరాట, కేరమ్స్, కుందాట, రెఫరీయింగ్ అనే విభాగాల కింద ఆయా ఆటల నియమాలు, పద్ధతులు వివరించారు. చివరిగా ఈ ఆటల నియమాలను పద్యరూపంలో మలచి రచించారు. పిల్లలు ఆ పద్యాలను కంఠస్థం చేయడం ద్వారా మరింత తేలికగా, కచ్చితంగా ఆటల నియమాలు గుర్తుంచుకుని వివాదాలకు దూరంగా ఆరోగ్యకరమైన పోటీతో ఆటలాడుతారనే ఉద్దేశంతో పద్యాలు రూపొందించారు. 2020050005942 1942
శ్రీ రామరసాయన [324] వివరాలు లేవు ఆధ్యాత్మికం రామరసాయనమనే సంస్కృత భక్తి గ్రంథమిది. ఇందులో రామచంద్రుని గుణగణాలు వర్ణిస్తూ భక్తిని పెంచే విధంగా ఉంటుంది. 2020050019190 1894
శుక సప్తతి-ప్రథమ భాగము [325] పాలవేకరి కదిరీపతి నాయకుడు కథా సాహిత్యం శుక సప్తతి శృంగారభరితమూ, నీతి ప్రబోధకరమూ ఐన కథల మాలిక. ఇందులో పతి దేశాంతరం పోగా విరహంతో జీవిస్తున్న ఓ సతి, ఆమెను దారి తప్పకుండా రోజుకో కథ చెప్పి మళ్లించే ఓ మాట్లాడే చిలుక కనిపిస్తాయి. వారిద్దరి మధ్య సంభాషణగా ప్రారంభమై రోజుకో కథ చొప్పున సాగుతూ పోతుంది. ఇవన్నీ శృంగారభరిత కథలు కాగా చివరిలో ఓ నీతితో ముగుస్తూంటాయి. 2030020025429 1935
శుద్ధాంధ్ర హరిశ్చంద్ర చరిత్రము [326] రాయవరపు గవర్రాజు పద్యకావ్యం హరిశ్చంద్రుడు హిందూ రాజులలో బహుళ ప్రసిద్ధి చెందినవాడు. ఇతడు సత్యమునే పలుకవలెనని అబద్దము చెప్పరాదనే నియమము కలిగినవాడు. ఆయనకూ విశ్వామిత్రునికీ నడుమ జరిగిన కథ చాలా ప్రసిద్ధం, సత్యమహత్వ ప్రబోధితం. ఈ కథను అనుసరించే పద్యకావ్యాన్ని రచించారు. 2030020025493 1920
శుభయోగము-రెండవ భాగం [327] మూలం.సురేంద్ర మోహన భట్టాచార్య, అనువాదం.వోలేటి పార్వతీశ కవి నవల, అనువాదం వేంకట పార్వతీశకవులు ఇరవైయవ శతాబ్దిలో తెలుగు సాహిత్య రంగంలో పేరెన్నికగన్న తెలుగు జంటకవులు. బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం వేంకట పార్వతీశకవులుగా జంటకట్టి కవిత్వరచన చేశారు. వారిలోని వాడైన ఓలేటి పార్వతీశ కవి ఈ నవలను బెంగాలీ నుంచి తెనిగించారు. 2030020024998 1949
శుక, రంభ [328] పూర్వకవులు తత్త్వం శుకమహర్షికీ, రంభకూ జరిగిన సంవాదంగా ఈ రచన వెలువడ్డది. శుకుడు రంభతో చేసే సంవాదంలో గాఢమైన వైరాగ్యాన్ని ప్రబోధించారు. ఐతే ఇది పూర్వులైన కవులు ఓ తాటాకు గ్రంథంపై రచించగా తాము పరిష్కరించామని ప్రచురణకర్తలు పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ కర్తృత్వం ఎవరిదో ప్రచురించలేదు. 2030020024429 1940
శూర సంసోను [329] అడ్డాడ వీరభద్రాచారి క్రైస్తవ మతము, నాటకం క్రైస్తవ జనులు ప్రదర్శించుకునేందుకు తగిన నాటకం ఒకటైనా ఏర్పడాలనే ఆలోచనతో పత్తా అబ్రహాం ఈ నాటకాన్ని అడ్డాడ వీరభద్రాచారిని ఉత్సాహపరిచి రచింపజేశారు. బైబిల్ లోని సంసోను కథను ఆయనకు విశదీకరించి రాయమని కోరగా రాశారు. ఆపైన అబ్రహాం పలుతావుల దీనిని ప్రదర్శించారు. 2030020025043 1946
శృంగార మల్హణ చరిత్ర [330] ఎడపాటి ఎర్రన ప్రబంధం శివభక్తి ప్రతిపాదకమైన ఈ ప్రబంధానికి ఇతివృత్తం పాల్కురికి సోమన రచించిన పండితారాధ్య చరిత్రంలోనిది. పండితారాధ్య చరిత్రలోని శివభక్తుడు, గొప్ప కవి యైన మల్హణుని గాథను ఆధారం చేసుకుని ఈ ప్రబంధం రచించారు కవి. ఎడపాటి ఎర్రన కృష్ణదేవరాయల కాలానికి చెందినవాడు. శివభక్తుడు. 2030020025434 1927
శృంగార సంకీర్తనలు [331] ఆవటపల్లి రామకృష్ణయ్య సంకీర్తన సంస్కృతంలో జయదేవుని అష్టపది అనంతర కాలంలో తెలుగులో అన్నమాచార్యులు వేంకటేశ్వరునిపై, క్షేత్రయ్య మొవ్వ గోపాలునిపై రచన చేసిన శృంగార సంకీర్తనలు దేవాలయంలోని ప్రదర్శనల్లోనూ, వివిధ ఆలయ సంప్రదాయాలకు పాదులుపెట్టాయి. దేవదాసిల నృత్యాలకు కూడా ఆధారభూతమై నిలిచాయి. అదే క్రమంలో తెలుగులోని పలు దేవాలయాల మూర్తులపై శృంగార సంకీర్తనలు బయలుదేరాయి. అలా ఎనమదల వేణుగోపాలస్వామిపై ఆవటపల్లి రామకృష్ణయ్య రచించిన శృంగార సంకీర్తనలు ఇవి. 2020050019112 1913
శృంగార భల్లాణ చరిత్రము [332] చితారు గంగాధరకవి ద్విపద కావ్యం శివభక్తుల కథామాలికయైన, తెలుగులో ప్రముఖ రచనయైన పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రములోనిదే ఈ గ్రంథ ఇతివృత్తమున్నూ. శివభక్తి పరాయణుడైన భల్లాణరాజును శివుడు ఎంతగా పరీక్షించాడో ఇందులో వర్ణితమైంది. ఇది ద్విపద ఛందంలో రచించబడ్డ కృతి. 2030020025667 1928
శృంగార కాళిదాసు [333] సంకలనం.కె.కృష్ణస్వామి శర్మ కథలు కాళిదాసు ఒక గొప్ప సంస్కృత కవి మరియు నాటక కర్త. "కవికుల గురువు" అన్న బిరుదు ఇతని యొక్క ప్రతిభాపాటవాలకు నిలువెత్తు సాక్ష్యం. గొప్ప శివ భక్తునిగా భావింపబడే కాళిదాసు, తన యొక్క కావ్యములు మరియు నాటకములు చాలావరకు హిందూ పురాణ మరియు తత్త్వ సంబంధముగా రచించాడు. కాళిదాసు అను పేరుకు అర్థం కాళి యొక్క దాసుడు. ఆయన మొదట మూఢుడనీ అనుకోకుండా అమ్మవారి వరాన మహా కవి అయ్యాడనీ, భోజరాజు ఆయన సల్లాపాలాడారని ఎన్నో రకాల కథలు ఉన్నాయి. వేర్వేరు కాలాలకు చెందిన భవభూతి మున్నగు కవులతో కాళిదాస సంభాషణలు కూడా చాటువులుగా ప్రసిద్ధం. ఆ చమత్కార భరితమైన కథలన్నీ ఈ రూపంలో గ్రంథస్థం చేశారు. 2030020024672 1928
శృంగార కాదంబరి [334] మూలం.బాణభట్టుడు, అనువాదం. చింతపల్లి నరసింహశాస్త్రి అనువాదం బాణోచ్ఛిష్టం జగత్‌సర్వం-బాణుని ఎంగిలే ఈ జగత్తంతా అన్న లోకోక్తికి బాణుడు వర్ణించనిది లోకంలో లేదని అర్థం. అంతటి సుప్రసిద్ధి పొందిన బాణభట్టుడు సంస్కృతంలో కాదంబరి అనే వచన కావ్యం, హర్ష చరిత్రమనే కావ్యం రచించారు. ఆ కాదంబరిని శృంగార కాదంబరిగా మలిచారు అనువాదకుడు. 2030020024872 1926
శేషభూషణ శతకం [335] కట్రోజు శేష బ్రహ్మయ్య శతకం శతకము అనగా వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. శతకములు పురాణముల వలె కథా ప్రధాన మైనవి కావు. ప్రబంధముల వలే వర్ణనా ప్రాధాన్యములు గావు, గేయ కృతులవలె సంగీత ప్రాధాన్యములు గావు, కాని తెలుగు నాట పండిత పామరులనే తారతమ్యము లేక, పిల్లలు- పెద్దలు అనే తేడాలేక, చదువురాని వారితో సహా.... అందరి లోనూ బహుళ ప్రచారము నొందినది శతక సాహిత్యము. ఇంతటి బహుళ ప్రాచుర్యమును పొందిన తెలుగు సాహిత్య ప్రక్రియ మరొకటి లేదు అనడంలో సందేహం లేదు. ఇంతవరకు ఉపలబ్ధమైన పాత తెలుగు గ్రంథాలలో సంఖ్యా పరంగా చూస్తే శతకాలదే ప్రథమ స్థానమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. శేషభూషణా అనే మకుటంతో కవి ఈ శతకాన్ని రచించారు. 2020050014267 1941
శైవాచార సంగ్రహము [336] తిరుమలనాథ కవి పద్యకావ్యం, హిందూమతం శైవులు ఆచరించాల్సిన విధి విధానాలు శైవ పురాణాలు, శృతి, స్మృతి మొదలైన వాటి నుంచి నిర్ధారించి రాసిన గ్రంథమిది. శివభక్తి ప్రతిపాదించుకు కథలు, ఇతర మతాల ఖండనలు వంటి వాటిని కలిపి నిత్యపూజా విధానాలు, విశేష దినాల్లో ఆచరించాల్సిన పద్ధతులు కలిపి ఈ గ్రంథాన్ని రచించారు.వేరే బార్ కోడ్ 2030020025112? 2030020025442 1951
శంతను రాజ చరిత్రము [337] అన్నంరాజు రమణయ్య ప్రబంధం, పద్యకావ్యం శంతనుడు మహాభారతంలో హస్తినాపురాన్ని పరిపాలించిన సూర్యవంశానికి చెందిన రాజు. భరతుడి వంశక్రమానికి చెందినవాడు. పాండవులకు మరియు కౌరవులకు పూర్వీకుడు. హస్తినాపురానికి రాజైన ప్రతీపునికి వృద్ధాప్యంలో జన్మించిన కనిష్ఠ పుత్రుడు. ఆయన గంగాదేవితో భీష్ముడికి జన్మనివ్వడం, ఆపైన సత్యవతిని మోహించి ఆమెను చేపట్టాలంటే ఆమె కుమారులే వారసులు కావాలని ఆమె తండ్రి పెట్టిన షరతుకు భీష్ముడు బ్రహ్మచర్యం వహించడం మహాభారత గాథను మలుపుతిప్పిన విషయాలు. ఇది ఆయన ఇతివృత్తం ఆధారం చేసుకుని రాసిన ప్రబంధం. 2030020024891 1916

మూలాలు[మార్చు]

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా[dead link]