తిరుక్కడల్మలై
ThiruKadalMallai | |
---|---|
![]() | |
Location in తమిళనాడు | |
భౌగోళికాంశాలు : | 12°37′0″N 80°11′55″E / 12.61667°N 80.19861°ECoordinates: 12°37′0″N 80°11′55″E / 12.61667°N 80.19861°E |
పేరు | |
ఇతర పేర్లు: | Sthalasayana Perumal Kovil |
ప్రదేశం | |
దేశం: | India |
రాష్ట్రం: | తమిళనాడు |
జిల్లా: | మహాబలిపురం |
ప్రదేశం: | మహాబలిపురం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | స్థల శయన పెరుమాల్ |
ప్రధాన దేవత: | నిలమంగై తాయార్ |
దిశ, స్థానం: | తూర్పుముఖము |
పుష్కరిణి: | పుండరిక పుష్కరిణి |
విమానం: | గగనాకార విమానము |
ప్రత్యక్షం: | పుండరీక మహర్షి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ద్రవిడ శిల్పకల |
తిరుక్కడల్మలై (ఆంగ్లం: Tirukadalmalai) ఒక పవిత్రమైన క్షేత్రము. ఇది మహాబలిపురంలో నున్నది;, 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి.
వివరాలు[మార్చు]
స్థలశయనర్ -జిలమంగై నాచ్చియార్ - తార్ష్య నది - తూర్పుముఖము - భుజంగశయనము - గగనాకార విమానము - పుండరీకునకు ప్రత్యక్షము - పూడత్తాళ్వార్, తిరుమంగై ఆళ్వార్లు కీర్తించింది.
విశేషాలు[మార్చు]
ఇది పూడత్తాళ్వార్ అవతరించిన స్థలము. ఆళ్వార్లు మంగళాశాసనం చేసిన సన్నిధి శిథిలమై సముద్రతీరమున ఉంది. ఇది శిథిలము కాగా కొంత దూరములో మరొక సన్నిధిని నిర్మించారు. స్వామి స్థలశయనముగా సేవసాయించు క్షేత్రము ఇదియొక్కటియే.
పుండరీక మహర్షి తామర పుష్పములతో స్వామిని అర్చింపబోయెనట. ఆ సమయమున స్వామి ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపములో వచ్చి ఆకలిగానున్నది ఆహారమునీయమని అడిగెను. అంతట పుండరీకుడు ఆహారమును తీచుకొని వచ్చుటకు వెడలెను. ఇంతలో స్వామి ఆ తామర పుష్పములను అలంకరించుకొని పుండరీక మహర్షి తలచిన రూపములో శయనించెను. మహర్షి తిరిగివచ్చి స్వామిని సేవించి ఆశ్చర్యపడి వారిని స్థలశయనర్ అని సంబోధించిరి.
ఈ క్షేత్రమున గల జ్ఞానప్పిరాన్ సన్నిధి తప్పక సేవింపవలెను. ఇచ్చట స్వామి తిరుమేనిలో తాయార్లు కుడివైపున వుండుటచే ఈ సన్నిధిని వలనెన్ద్రై అని పేరు.