తిరుకడల్మలై దేవాలయం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరుకడల్మలై దేవాలయం | |
---|---|
![]() | |
Location in తమిళనాడు | |
భౌగోళికాంశాలు : | 12°37′0″N 80°11′55″E / 12.61667°N 80.19861°ECoordinates: 12°37′0″N 80°11′55″E / 12.61667°N 80.19861°E |
పేరు | |
ఇతర పేర్లు: | స్థలశయన పెరుమాళ్ కోవిల్ |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తమిళనాడు |
జిల్లా: | మహాబలిపురం |
ప్రదేశం: | మహాబలిపురం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | స్థల శయన పెరుమాల్ |
ప్రధాన దేవత: | నిలమంగై తాయార్ |
దిశ, స్థానం: | తూర్పుముఖం |
పుష్కరిణి: | పుండరిక పుష్కరిణి |
విమానం: | గగనాకార విమానం |
ప్రత్యక్షం: | పుండరీక మహర్షి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ద్రవిడ శిల్పకల |
తిరుకడల్మలై. (ఆంగ్లం: Tirukadalmalai) ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది మహాబలిపురంలో ఉంది,108 వైష్ణవ దివ్యదేశాలులో తిరుకడల్మలై దేవాలయం ఒకటి.
వివరాలు[మార్చు]
స్థలశయనర్ -జిలమంగై నాచ్చియార్ - తార్ష్య నది - తూర్పుముఖం - భుజంగశయనం - గగనాకార విమానం - పుండరీకునకు ప్రత్యక్షం - పూడత్తాళ్వార్, తిరుమంగై ఆళ్వార్లు కీర్తించింది.
విశేషాలు[మార్చు]
ఇది పూడత్తాళ్వార్ జన్మించిన స్థలం. ఆళ్వార్లు మంగళాశాసనం చేసిన సన్నిధి శిథిలమై సముద్రతీరాన ఉంది. ఇది శిథిలం అయినందున కొంత దూరములో మరియొక సన్నిధిని నిర్మించారు. స్వామి స్థలశయనముగా సేవ సాయించు క్షేత్రం ఇదియొక్కటియే. పుండరీకమహర్షి తామర పుష్పములతో స్వామిని అర్చించాలని వెళ్ళిన సమయంలో స్వామి ఒక వృద్ద బ్రాహ్మణుని రూపముతో వచ్చి ఆకలిగానుంది, ఆహారం కావాలని అడిగాడు. అంతట పుండరీకుడు ఆహారమును తీసికొని వచ్చుటకు వెళ్ళాగా, ఇంతలో స్వామి ఆ తామరపుష్పాలను అలంకరించుకొని పుండరీకమహర్షి తలచిన రూపముతో శయనించాడు. మహర్షి తిరిగివచ్చి స్వామిని సేవించి ఆశ్చర్యపడి వారిని స్థలశయనర్ అని పిలిచినట్లు కథనం.
ఆ విధముగా స్వామికి స్థలశయనర్ అనే పేరు వచ్చింది. ఈక్షేత్రానగల జ్ఞానపిరాన్ (వరాహస్వామి) సన్నిధి ఉంది. ఇచ్చట స్వామి శరీరంలో తాయార్లు కుడివైపున ఉండుటచే ఈసన్నిధికి వలనెంజై (కుడి హృదయం) అనిపేరు.ఇది అతిమనోహరమైన శిల్పసంపదతో అలరారుతున్న క్షేత్రం. తిరుమంగై ఆళ్వారు ఈక్షేత్రస్వామిని కీర్తించుచుండ తిన్ఱనూర్ భక్తవత్సలస్వామి ప్రత్యక్షం అయినందున భక్తవత్సలస్వామి ఇక్కడి నుండి మంగళాశాసనము చేసారని కథనాలు వివరిస్తున్నాయి.
సాహిత్యంలో[మార్చు]
శ్లో. శ్రీ మత్తార్ష్య తరజ్గిణీ తటగతే దేశేకడల్ మల్ల ఇ
త్యాఖ్యే శ్రీ నిలమంగ నామయుతయాదేవ్యా భుజజ్గేశయ:
భాతి శ్రీ స్థలశాయి నామకవిభు శ్శ్రీ పుండరీకేక్షిత:
ప్రాగాస్యస్తు ఘనాకృతా కలిరిపు శ్రీ భూతచక్రస్తుత:||
ఆలయ వివరాలు[మార్చు]
ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వారా దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
స్థలశయనర్ | నిలమంగై నాచ్చియ్యర్ | తార్ష్య నది | తూర్పు ముఖం | భుజంగశయనం | పూదత్తాళ్వార్-తిరుమంగై ఆళ్వార్ | గగనాకార విమానం | పుండరీకునకు |