సింహాచలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సింహాచలం విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం నగరంలో ఒక ప్రాంతం. ఇక్కడి వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ కొండలు తూర్పు కనుమలలో భాగంగా ఉన్నాయి.

పేరు వ్యుత్పత్తి[మార్చు]

సింహాచలం అనగా సింహం కలిగిన కొండ. ఈ పేరు సింహ + అచలం అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. అచలం అనగా చలనం లేనిది: కొండ లేదా పర్వతం.

ప్రాంతాలు[మార్చు]

శ్రీనివాసనగర్, ప్రహ్లాదపురం, సాయినగర్ కాలనీ, సింహపురి కాలనీ, సింహపురి లేఔట్ మొదలైనవి ముఖ్యమైన నివాసప్రాంతాలు.

రవాణా సౌకర్యాలు[మార్చు]

సింహాచలం రైల్వేస్టేషన్
  • సింహాచలం రైల్వే స్టేషను అనే పేరుతో గోపాలపట్నం ప్రాంతంలో ఉంది.

దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు[మార్చు]

  • శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న హిందూ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయం సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది. ఇది దక్షిణ భారతదేశం లోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం (52 కోట్ల రూపాయలు) కలిగిన దేవాలయం. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సింహాచలం&oldid=3891067" నుండి వెలికితీశారు