మీనాక్షీ బెనర్జీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మినాక్షీ బెనర్జీ
మినాక్షీ బెనర్జీ
జాతీయత భారతీయులు
ప్రసిద్ధిజీవ శాస్త్రవేత్త

మినాక్షీ బెనర్జీ Ph.D. (1988, బనారస్), భారత దేశానికి చెందిన మహిళా శాస్త్రవేత్త. ఆమె "అకాడామీ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ బయాలజీ", "ద నేషనల్ సైన్స్ అకాడమీ" లకు ఫెలోషిప్ పొందారు. ఆమె NASI కు జీవితకాల సభ్యులు. ఆమె ఆల్‌బెర్ట్ ష్వైట్జర్ అంతర్జాతీయ బంగారు పతకాన్ని సైన్స్ రంగంలో పొందడమే కాల అనేక అవార్డులు అందుకున్నారు. ఈమె యు.జి.సి అవార్డును కూడా పొందారు. ఆమె ప్రస్తుతం భోపాల్ లోని భర్కతుల్లా విశ్వవిద్యాలయంలో జీవశాస్త్రవిభాగానికి అధిపతిగా యున్నారు.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

ఆమె బాల్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం "అసాన్‌సోల్" లోని ఐరిష్ కాన్వెంట్, లోరెటోలో విద్యాభ్యాసం ప్రారంభించారు. బాల్యంలో విద్యలో చురుకుగా ఉండుటచేత అందరిచేత ప్రశంసలు పొందారు. ఆమె బాల్యంలో తన యింటి పరిసరాలలో గల పెద్ద పూల తోటలో గడిపేటపుడు కొన్ని కీటకాలు పూల చుట్టూ తిరిగుటను నిశితంగా గమనించేవారు. ఈ పరిశీలన ఆమెను విజ్ఞాన రంగంపై తపన, ఆసక్తిని రేకెత్తించింది. ఆ లేత ప్రాయంలోనే ఆమె లోతైన మనస్సులో శాస్త్రవేత్త లక్షణాలు ఆవిర్భవించాయి. ఆమె పాఠశాలలో చదువుకొనే కాలములో ఆమె చదువు, ఆటలు, సంగీతం, నాట్యము, వక్తృత్వం పట్ల ఆసక్తి కనబరచేవారు. ఆ రంగాల పట్ల అనేక బహుమతులు గెలుచుకున్నారు.కానీ ప్రకృతిని అధ్యయనం చేయాలనే ఉత్సుకత మిగిలిపోయింది. తర్వాత ఇంటర్మీడియట్ కోర్సులో సైన్స్ విభాగంలో రాంచీ విశ్వవిద్యాలయంలోని నిర్మల కాలేజీలో చేరారు. ఆ తర్వాత బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో బి.యస్సీని బోటనీ ప్రధానాంశంగా చేశారు.అచట బి.యస్సీ (ఆనర్స్) మొదటి శ్రేణిలో మొదటి స్థానాన్ని పొందారు. అదే విశ్వవిద్యాలయంలో C.A.S నుండి బోటనీలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.మాస్టర్స్ డిగ్రీలో కూడా మొదటి శ్రేణిలో మొదటి స్థానం సంపాదించి బంగారు పతకాన్ని పొందారు.పి.హెచ్.డి కొరకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చేరారు. ఆమె సైనోబాక్టీరియా పై రాసిన ప్రత్యేక రచన ఆమెను సైనోబాక్టీరియాలజిస్టుగా చేసింది. ఆమె ప్రకృతిలో సాధారణంగా గల 43 ఆకుపచ్చని అందమైన సూక్ష్మజీవులపై పరిశోధనను ప్రొఫెసర్ హె.డి.కుమార్ తో కలసి పనిచేసి పి.హెచ్.డి పూర్తిచేశారు. ఆ తర్వాత భోపాల్ విశ్వవిద్యాలయం (ప్రస్తుతం భర్కతుల్లా) లో లెక్చరర్ గా 1989 లో చేరారు.

ఉద్యోగాలు.గౌరవాలు, అవార్డులు[మార్చు]

1989 లో భర్కతుల్లా విశ్వవిద్యాలయంలో లెక్చరర్ గా ఉద్యోగ బాధ్యతలు మొదలు పెట్టారు. ఆమె 1997 లో రీడర్ గానూ,, 2005 లో ప్రొఫెసర్ గానూ పనిచేశారు. ప్రస్తుతం ఆమె జీవ శాస్త్ర విభాగంలో అధిపతిగా యున్నారు. ఆమె అనేక అవార్డులను స్వంతం చేసుకున్నారు.

అవార్డులు[మార్చు]

  • 1990 లో ఎం.పి. యంగ్ సైంటిస్ట్ అవార్డు
  • 1995 లో జర్మనీలో గౌరవ డాడ్ ఫెలోషిప్ పొందారు.
  • 1995 లో శైవలం ఫిజియాలజీ, సైనోబాక్టీరియా యొక్క ఆవరణశాస్త్రం, బయోకెమిస్ట్రీ లలో చేసిన పరిశోధనలకు గానూ జె.ఎ.బి.యంగ్ సైంటిస్ట్ అవార్డును స్వంతం చేసుకున్నారు.
  • 1998 లో యు.కెలో గౌరవనీయమైన స్టాఫ్ అకాడమిక్ కామన్వెల్త్ ఫెలోషిప్ ను బయోటెక్నాలజీలో పొంది, దుర్హాం విశ్వవిద్యాలయంలో గౌరవ విజిటింగ్ ఫెలోగా గౌరవం పొందారు. అచట ఆమె జీవ శాస్త్రంలో క్రొత్త శాఖ అయిన ఆస్ట్రోబయాలజీ (బాహ్య అంతరిక్షంలో గల జీవుల పై అధ్యయనం, అంటార్కిటిక్ లో సారూప్యత) పై అధ్యయనం కొనసాగించారు.
  • 2002 లో ఆమె శాస్త్రవేత్తలకు ఇచ్చిన ప్రముఖ UGC కెరీర్ అవార్డు అందుకుంది. ఈ అవార్డును సంబంధిత రంగంలో గణనీయమైన చెప్పుకోదగిన కృషికి యిస్తారు. * * మార్చి 2003 లో డాక్టర్ బెనర్జీ నేషనల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అకాడమీ న్యూఢిల్లీ వారి యొక్క అంతర్జాతీయ బోర్డు ద్వారా సైనో బాక్టీరియాలజీ రంగంలో చేసిన అత్యున్నత కృషికి గానూ గౌరవనీయ సైంటిస్ట్ అవార్డ్ ను పొందింది.
  • 2004 లో బెనర్జీ జె.కె.పౌండేషన్, భారతదేశం ద్వారా పర్యావరణ బయోటెక్నాలజీ ప్రతిభకు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ నేషనల్ అవార్డు గుర్తింపును UNESCO ద్వారా సత్కరించబడ్డారు. దీని ఫలితంగా నేషనల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అకాడమీలో ఫెలోషిప్ ను పొందారు.
  • ఆ, ఎ 2005 లో పర్యావరణ బయాలజీ అకాడమీ ఆఫ్ ఫెల్లోషిప్ అవార్డు కూడా పొందారు, అంతర్జాతీయ అవార్డుల బోర్డు NESA 2005 నుండి "సైంటిస్ట్ ఆఫ్ ద యియర్" అవార్డును స్వంతం చేసుకున్నారు.
  • 2006 లో ఆమె యు.కె. లోని ఆల్బర్ట్ ష్వైట్జర్ ఇంటర్నేషనల్ పౌండేషన్ నుండి గౌరవ ఆల్బర్ట్ ష్వైట్జర్ సైన్స్ మెడల్ ను అందుకున్నారు. డాక్టర్ బెనర్జీ జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని అనేక శాస్త్రీయ బాడీస్ లో ఫెలో, జీవిత సభ్యులుగా ఉన్నారు.

ఉద్యోగాలు, పరిశోధనలు[మార్చు]

డాక్టర్ బెనర్జీ అనేక దేశాలకు వివిధ చర్చలు, సమావేశాల కోసం సందర్శించారు. డాక్టర్ బెనర్జీ చురుకుగా శైవలం బయోటెక్నాలజీ, సైనోబాక్టీరియల్ రీసెర్చ్, వాటి అనువర్తనాల యొక్క వివిధ కోణాలు నిమగ్నమై ఉన్నారు. ఈమె బర్కతుల్లా విశ్వవిద్యాలయంలో అనేక విభాగాలకు అతిథి ఫాకల్టీగా యున్నారు, మధ్య ప్రదేశ ప్రభుత్వం లోని ఉన్నత విద్యా శాఖలోని సెకండరీ స్కూల్ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆమె 10 పి.హెచ్.డిలు, 24 ఎం.ఫిల్ విద్యార్థులకు మార్గదర్శకత్వం చేశారు. ఆమె అంతర్జాతీయ, జాతీయ పత్రికలలో 55 ప్రచురణలకు సమీక్షలు చేశారు. ఆమె 65 కంటే ఎక్కువ జాతీయ, అంతర్జాతీయ సమావేశాలలో పాల్గొన్నారు. ఆమె విజయవంతంగా నేషనల్ నిధులు ఏజన్సీల 4 పరిశోధన ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఆమె ప్రస్తుతం వివిధ రకాల ఆల్గే బయో ఫెర్టిలైజర్స్ ఔషధ మొక్కల పై విస్తృత పరిశోధనల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు, చల్లని, వేడి సహా విభిన్న ప్రాంతాలలో సహజంగా ఏకైక సైనోబ్యాక్టీరియా పై అధ్యయనాలు చేస్తూ యున్నారు.

మూలాలు[మార్చు]

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.నా జీవితంలో పూర్తి విశ్వాసం]
  • బయోడేటా