సంగారెడ్డి పురపాలకసంఘం

వికీపీడియా నుండి
(సంగారెడ్డి పురపాలక సంఘం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

సంగారెడ్డి పురపాలక సంఘం, సంగారెడ్డి జిల్లాకు చెందిన పురపాలక సంఘాలలో ఒకటి. 1954లో ఏర్పడిన ఈ పురపాలక సంఘం ప్రస్తుతం మొదటిశ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతోంది. 2011 గణన ప్రకారం పురపాలక సంఘం పరిధిలోని జనాభా 71426 కాగా, 2014 మార్చి నాటికి 52556 ఓటర్లున్నారు. ప్రస్తుతం ఇందులో 31 వార్డులు ఉన్నాయి.

ఆదాయ-వ్యయములు[మార్చు]

2010-11 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ పురపాలక సంఘం ఆదాయం రూ. 976.45 కోట్లు కాగా వ్యయము రూ. 806.14 కోట్లు.[1]

ఎన్నికలు[మార్చు]

1954 నుంచి 2005 వరకు జరిగిన 9 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 5, భారతీయ జనతాపార్టి 3, తెరాస ఒక్కసారి చైర్మెన్ పదవులను పొందాయి. ఈ పురపాలక సంఘం చైర్మెన్‌గా పనిచేసిన లక్ష్మన్‌జీ తదుపరి కాలంలో ఆందోల్ శాసన సభ్యులు కూడా ఎన్నికయ్యారు.

2014 ఎన్నికలు[మార్చు]

2014 మార్చి 30న 10వ సారి ఎన్నికలు జరిగాయి.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-09. Retrieved 2014-04-04.

వెలుపలి లంకెలు[మార్చు]