మర్రిపెడ పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మర్రిపెడ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ, మరిపెడ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మహబూబాబాద్ (ఎస్.టి.) లోక్‌సభ నియోజకవర్గం లోని డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[1]

చరిత్ర[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న మరిపెడ, 2013, మార్చి 22న పురపాలక సంఘంగా ఏర్పడింది. మరికొన్ని గ్రామ పంచాయతీలను కలిపి మరిపెడ పురపాలకసంఘంగా ఏర్పాటుచేశారు.

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 15 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[2] వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు[మార్చు]

  1. జి. సింధుర కుమారి
  2. బానోత్ శ్రీనివాస్
  3. రేఖ లలిత
  4. మాచర్ల స్రవంతి
  5. పానుగోత్ సుజాత
  6. బోడ పద్మ
  7. వారుకొండ శ్రీనివాస్
  8. బానోత్ కిషన్
  9. విశారపు ప్రగతి
  10. బదావత్ హతిరామ్
  11. ఎడెల్లి పరుశరాములు
  12. బయ్యా భిక్షం
  13. ముదిరెడ్డి బుచ్చిరెడ్డి
  14. గంధసిరి ఉపేంద్ర
  15. జాతోత్ కౌసల్య

మూలాలు[మార్చు]

  1. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 31 March 2021.
  2. admin (2020-05-16). "Maripeda municipality Councillors list 2020". Telangana data. Retrieved 2021-05-22.

వెలుపలి లంకెలు[మార్చు]