Coordinates: 17°13′27″N 78°35′20″E / 17.2243003°N 78.5887951°E / 17.2243003; 78.5887951

ఆదిబట్ల పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆదిబట్ల పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
ఆదిబట్ల పురపాలకసంఘం is located in తెలంగాణ
ఆదిబట్ల పురపాలకసంఘం
ఆదిబట్ల పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 17°13′27″N 78°35′20″E / 17.2243003°N 78.5887951°E / 17.2243003; 78.5887951
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండలం ఇబ్రహీంపట్నం
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 34.079 km² (13.2 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 15,453
 - పురుషుల సంఖ్య 8,076
 - స్త్రీల సంఖ్య 7,377
 - గృహాల సంఖ్య 4,139
పిన్ కోడ్ - 501510
ఎస్.టి.డి కోడ్ - 08414
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

ఆదిబట్ల పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] ఆదిబట్ల పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం లోని ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న ఆదిబట్ల, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3] ఇబ్రహీంపట్నం మండలం లోని బొంగ్లూర్, ఆదిబట్ల (ఆదిత్యా నగర్), కొంగరకలాన్, మంగల్‌పల్లి, పటేల్ గూడ, రాందాస్‌పల్లి మొదలైన పంచాయతీలు కలిసి పురపాలక సంఘంగా ఏర్పాటుచేశారు.

భౌగోళికం[మార్చు]

ఆదిబట్ల 34.079 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°13′55″N 78°32′35″E / 17.232°N 78.543°E / 17.232; 78.543 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 20.5 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 15453 మంది కాగా, అందులో 8076 మంది పురుషులు, 7377 మంది మహిళలు ఉన్నారు. 4139 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 11 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు. వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[5]

వార్డు కౌన్సిలర్లు[మార్చు]

  1. నల్లవోలు లావణ్య
  2. కుంట్ల మౌనిక
  3. కంతి సంధ్య
  4. కొప్పు కృష్ణంరాజు
  5. వనమల శ్రీనివాస్
  6. కోల నగేష్
  7. నీళ్ళ హరిదాసు గౌడ్
  8. గోపగళ్ళ మహేందర్
  9. మర్రి నిరంజన్ రెడ్డి
  10. కోరే కళమ్మ
  11. మర్రి అర్చన
  12. నారని మౌనిక
  13. పొట్టి రాములు
  14. కొత్త ఆర్తిక
  15. కమాండ్ల యాదగిరి

మూలాలు[మార్చు]

  1. "Adibatla Municipality". adibatlamunicipality.telangana.gov.in. Archived from the original on 14 ఆగస్టు 2020. Retrieved 24 March 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 24 March 2021.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 24 March 2021.
  4. "Basic Information of Municipality, Adibatla Municipality". adibatlamunicipality.telangana.gov.in. Retrieved 24 March 2021.[permanent dead link]
  5. skannegari. "Elections to Adibatla Municipality into 15 wards - Telangana NavaNirmana Sena". tgnns.com. Archived from the original on 11 ఏప్రిల్ 2021. Retrieved 11 April 2021.

వెలుపలి లంకెలు[మార్చు]