హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం
నల్గొండ జిల్లా లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం తిరిగి ఏర్పడింది. నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి.[1][2]
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]
- హుజూర్నగర్
- నేరేడుచర్ల
- గరిడేపల్లి
- మట్టంపల్లి
- మేళ్లచెరువు
- పాలకవీడు
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2019 ఉప ఎన్నిక హుజూర్నగర్ జనరల్ శానంపూడి సైది రెడ్డి పు తెరాస 1,13,095 నలమాద పద్మావతిరెడ్డి మహిళా కాంగ్రెస్ పార్టీ 69,737 2018 89 హుజూర్నగర్ జనరల్ నలమడ ఉత్తమకుమార్ రెడ్డి పు కాంగ్రెస్ 92996 శానంపూడి సైది రెడ్డి పు తెరాస 85530 2014 89 హుజూర్నగర్ జనరల్ నలమడ ఉత్తమకుమార్ రెడ్డి మగ కాంగ్రెస్ 69879 కాసోజు శంకరమ్మ ఆడా తెరాస 45955 2009 89 హుజూర్నగర్ జనరల్ నలమడ ఉత్తమకుమార్ రెడ్డి మగ కాంగ్రెస్ 80835 గుంటకండ్ల జగదీష్రెడ్డి మగ తెరాస 51641 1972 278 హుజూర్నగర్ జనరల్ కీసర జితేందర్రెడ్డి [3] మగ స్వతంత్ర అభ్యర్థి 41007 అక్కిరాజు వాసుదేవరావు మగ కాంగ్రెస్ 26699 1967 278 హుజూర్నగర్ జనరల్ అక్కిరాజు వాసుదేవరావు మగ కాంగ్రెస్ 26618 దొడ్డా నర్సయ్య మగ CPM 23730 1962 297 హుజూర్నగర్ జనరల్ అక్కిరాజు వాసుదేవరావు మగ కాంగ్రెస్ 25394 దొడ్డా నర్సయ్య మగ CPI 22537 1957 83 హుజూర్నగర్ జనరల్ దొడ్డా నర్సయ్య మగ PDF 21521 వి.బాస్కర్ రావు మగ కాంగ్రెస్ 15634
2009 ఎన్నికలు[మార్చు]
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన గుంటకండ్ల జగదీష్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరఫున నలమడ ఉత్తమకుమార్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి, ప్రజారాజ్యం పార్టీ నుండి ఎం.శ్రీనివాస్, లోక్సత్తా పార్టీ తరఫున కె.శ్రీనివాస్ రెడ్డి పోటీచేశారు.[4]
ఫలితాలిలా ఉన్నాయి.[1]
క్ర.సం. | అభ్యర్థి | పార్టీ | వోట్లు |
---|---|---|---|
1 | నలమడ ఉత్తమకుమార్ రెడ్డి | కాంగ్రెస్ | 80835 |
2 | గుంటకండ్ల జగదీష్రెడ్డి | తె.రా.స. | 51641 |
3 | మేకల శ్రీనివాసరావు | ప్రజారాజ్యం పార్టీ | 22612 |
4 | చెరువుపల్లి సైదయ్య | భా.జ.పా. | 3267 |
5 | కడియం శ్రీనివాసరెడ్డి | లోక్ సత్తా పార్టీ | 1992 |
6 | ఎరుకు పిచ్చయ్య | స్వతంత్ర | 1632 |
7 | కె.వి. శ్రీనివాసాచార్యులు | స్వతంత్ర | 1434 |
8 | మామిడి సుదర్శన్ | బహుజన సమాజ పార్టీ | 1216 |
9 | కలకండ తిరుపతయ్య | స్వతంత్ర | 835 |
10 | వట్టికూటి రామారావు | స్వతంత్ర | 581 |
11 | బొల్లం మల్లయ్య యాదవ్ | స్వతంత్ర | 523 |
12 | కొసనం కొండలు | స్వతంత్ర | 447 |
13 | గాదె ప్రభాకరరరెడ్డి | స్వతంత్ర | 425 |
2018 ఎన్నికల్లో[మార్చు]
2018లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా హుజూర్నగర్ నుంచి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి గెలిచారు. ఆ ఎన్నికలో మొత్తం 1,94,493 ఓట్లు పోలవగా అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి 92,996 ఓట్లు సాధించారు. శానంపూడి సైదిరెడ్డి 85,530 ఓట్లు పొందారు. దీంతో సుమారు 7 వేల ఓట్ల ఆధిక్యంతో ఉత్తమ్ గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్లు కూటమిగా ఏర్పడడంతో అక్కడ టీడీపీ నుంచి అభ్యర్థిని నిలపలేదు.ఈసారి కాంగ్రెస్, టీడీపీలు వేర్వేరుగా పోటీ చేశాయి. టీడీపీ నుంచి చావా కిరణ్మయి తొలిసారి ఎన్నికల బరిలో దిగారు.కోదాడలో ఓటమి.. హుజూర్నగర్లో పోటీ ప్రస్తుతం హుజూర్నగర్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీపడిన పద్మావతి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ఆమె టీఆరెస్ అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2014లో కోదాడ నుంచి పద్మావతి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో ఓటమి తరువాత ఇప్పుడు తన భర్త ప్రాతినిధ్యం వహించిన హుజూర్నగర్ ఖాళీ కావడంతో అక్కడ అభ్యర్థిగా బరిలో దిగారు.
2019 ఉప ఎన్నిక[మార్చు]
అనంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన నల్గొండ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవడంతో హుజూర్నగర్ అసెంబ్లీ సీటు ఖాళీ అయింది. దాంతో, ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. 21వ తేదీన జరిగిన ఈ ఉపఎన్నికల్లో 84.75 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ 2014 సార్వత్రిక ఎన్నికలలో 81.18 శాతం, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 86. 38 శాతం పోలింగ్ నమోదైంది. అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన సైదిరెడ్డికి 113094 ఓట్లు (56.34 శాతం) పోలవ్వగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి రెడ్డికి 69736 ఓట్లు (34.74 శాతం)లభించాయి.శానంపూడి సైదిరెడ్డి 43359 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. స్వతంత్ర అభ్యర్థి సపవత్ సుమన్కు 2697 ఓట్లు (1.34 శాతం), బీజేపీ అభ్యర్థి డాక్టర్ కోట రామారావుకు 2638 ఓట్లు (1.31 శాతం), నోటాకు 506 ఓట్లు (0.25 శాతం) లభించాయి.
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ Andrabhoomi (13 November 2018). "మంత్రుల నగరి.. హుజూర్నగర్". www.andhrabhoomi.net. Archived from the original on 12 జూలై 2021. Retrieved 12 July 2021.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Mana Telangana (28 September 2019). "ఉమ్మడి నల్లగొండ ఎన్నికల తీరు". Archived from the original on 12 జూలై 2021. Retrieved 12 July 2021.
- ↑ Sakshi (28 August 2013). "తెలంగాణ కేసరి: కీసర జితేందర్రెడ్డి". Sakshi. Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021.
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009