గోల్కొండ ఎక్స్ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు
K.Venkataramana (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
పంక్తి 243: | పంక్తి 243: | ||
{{దక్షిణ భారతదేశం రైలు మార్గములు}} |
{{దక్షిణ భారతదేశం రైలు మార్గములు}} |
||
{{దక్షిణ మధ్య రైల్వే}} |
{{దక్షిణ మధ్య రైల్వే}} |
||
{{inuse}} |
|||
[[వర్గం:భారతీయ రైల్వేలు ఎక్స్ప్రెస్ రైళ్ళు]] |
[[వర్గం:భారతీయ రైల్వేలు ఎక్స్ప్రెస్ రైళ్ళు]] |
10:31, 27 మే 2016 నాటి కూర్పు
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | ఎక్స్ప్రెస్ | ||||
స్థానికత | తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ | ||||
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ మధ్య రైల్వే | ||||
మార్గం | |||||
మొదలు | గుంటూరు | ||||
గమ్యం | సికింద్రాబాద్ జంక్షన్ | ||||
ప్రయాణ దూరం | 385 km (239 mi) | ||||
సగటు ప్రయాణ సమయం | 8 గం. 15 ని. ఎగువ మరియు దిగువ ప్రయాణము కొరకు | ||||
రైలు నడిచే విధం | ప్రతిరోజు | ||||
రైలు సంఖ్య(లు) | 17201 / 17202 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | ఎసి చైర్ కార్, రెండవ సిట్టింగ్, నిబంధనలు లేనివి | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది | ||||
పడుకునేందుకు సదుపాయాలు | లేదు | ||||
సాంకేతికత | |||||
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||||
వేగం | 46.91 km/h (29.15 mph) హాల్టులతో సరాసరి | ||||
|
గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైలు తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు మధ్య నడిచే ఇంటర్ లింక్ ఎక్స్ ప్రెస్. 17201/17202 నెంబర్లతో నడిచే ఈ రైలు భారతీయ రైల్వేలకు చెందిన దక్షిణ మధ్య రైల్వే డివిజన్ కు చెందినది. మొత్తం 383 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించేందుకు సుమారు 8 గంటల సమయం తీసుకుంటూ నెమ్మదిగా ప్రయాణించే రైలుగా గుర్తింపు పొందింది. సికింద్రాబాద్, గుంటూరు మధ్య ఉన్న మొత్తం 24(గుంటూరు, సికింద్రాబాద్ సహా) స్టేషన్లలోనూ ఈరైలు ఆగుతుంది.
పేరు
హైదరాబాద్ నగరంలోని చారిత్రక గోల్కొండ కోట పేరును ఈ రైలుకు పెట్టారు. గోల్కొండ కోట హైదరాబాద్ లోని ముఖ్యమైన చారిత్రక ప్రదేశాల్లో ఒకటి. హైదరాబాద్ ను పరిపాలించి కుతుబ్ షాహీల పాలన లో గోల్కొండ కోటను నిర్మించారు.
రికార్డులు
1973లో ప్రారంభించిన ఈ రైలు అప్పట్లో భారత దేశంలోనే అతి వేగంగా ఆవిరితో నడిచే ప్యాసింజర్ రైలుగా రికార్డుల్లోకి ఎక్కింది.[1]
సమయ పట్టిక
గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైలు గుంటూరు- సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య ఈ క్రింది సమయ పట్టికను అనుసరించి నడుస్తుంది
సంఖ్య | స్టేషన్
పేరు(కోడ్) |
రాక | బయలుదేరుట | ఆగు
సమయం |
ప్రయాణ దూరం |
---|---|---|---|---|---|
1 | గుంటూరు జంక్షన్ (GNT) | ఆరంభం | 05:45 | 0 | 0 కి.మీ. |
2 | గోగాముక్ (PDKN) | 05:52 | 05:53 | 1 ని. | 6 కి.మీ. |
3 | నంబూరు (NBR) | 05:59 | 06:00 | 1 ని. | 9 కి.మీ. |
4 | మంగళగిరి (MAG) | 06:10 | 06:11 | 1 ని. | 20 కి.మీ. |
5 | విజయవాడ జంక్షన్ (BZA) | 06:45 | 07:00 | 15 ని. | 32 కి.మీ. |
6 | రాయనపాడ్ (RYP) | 07:13 | 07:14 | 1 ని. | 44 కి.మీ. |
7 | కొండపల్లి (KI) | 07:28 | 07:29 | 1 ని. | 50 కి.మీ. |
8 | ఎర్రుపాలెం (YP) | 07:46 | 07:47 | 1 ని. | 74 కి.మీ. |
9 | మధిర (MDR) | 07:59 | 08:00 | 1 ని. | 89 కి.మీ. |
10 | బోనకలు (BKL) | 08:13 | 08:14 | 1 ని. | 105 కి.మీ. |
11 | ఖమ్మం (KMT) | 08:35 | 08:36 | 1 ని. | 134 కి.మీ. |
12 | డోర్నకల్ జంక్షన్ (DKJ) | 08:54 | 08:55 | 1 ని. | 156 కి.మీ. |
13 | గార్ల (GLA) | 09:00 | 09:01 | 1 ని. | 161 కి.మీ. |
14 | మహబూబాబాద్ (MABD) | 09:15 | 09:16 | 1 ని. | 180 కి.మీ. |
15 | కే సముద్రం (KDM) | 09:27 | 09:28 | 1 ని. | 196 కి.మీ. |
16 | నెక్కొండ (NKD) | 09:40 | 09:41 | 1 ని. | 211 కి.మీ. |
17 | వరంగల్ (WL) | 10:13 | 10:15 | 2 ని. | 241 కి.మీ. |
18 | కాజీపేట్ జంక్షన్ (KZJ) | 10:33 | 10:35 | 2 ని. | 251 కి.మీ. |
19 | ఘన్ పూర్ (GNP) | 10:56 | 10:57 | 1 ని. | 271 కి.మీ. |
20 | జనగాం (ZN) | 11:14 | 11:15 | 1 ని. | 299 కి.మీ. |
21 | ఆలేర్ (ALER) | 11:29 | 11:30 | 1 ని. | 313 కి.మీ. |
22 | భువనగిరి (BG) | 11:59 | 12:00 | 1 ని. | 336 కి.మీ. |
23 | మౌలాలీ (MLY) | 12:38 | 12:40 | 2 ని. | 377 కి.మీ. |
24 | సికింద్రాబాద్ జంక్షన్ (SC) | 13:45 | ముగింపు | 0 | 383 కి.మీ. |
విజయవాడ రైల్వే స్టేషన్ లో ఈ రైలు 15 నిమిషాల పాటు ఆగుతుంది. ఇక మిగతా అన్ని స్టేషన్లలో కేవలం 1 నిమిషం నుంచి 2 నిమిషాల సేపు మాత్రమే ఆగుతుంది.
మార్గం
గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైలు గుంటూరు లో ఉదయం 5:45 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్ కు మధ్యాహ్నం 13:45గంటలకు చేరుతుంది[2]. తిరుగు ప్రయాణంలో రెండవ రేక్ రైలు సికింద్రాబాద్ లో మధ్నాహ్నం 13:05 గంటలకు బయలు దేరి గుంటూరు స్టేషన్ కు రాత్రి 21:20 గంటలకు చేరుతుంది. నల్గొండ జిల్లాలోని ఆలేర్ రైల్వే స్టేషన్ , విజయవాడ, వరంగల్ మరియు కాజీపేట స్టేషన్ల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది.
రైలు ప్రమాదాలు
జులై 2, 2003 ఉదయం వరంగల్ సమీపంలో గొల్గొండ ఎక్స్ ప్రెస్ రైలు వంతెన పైనుంచి కింద పడిపోయింది. ఈ ఘోర రైలు ప్రమాదంలో కనీసం 21 మంది ప్రయాణికులు చనిపోయారు.[3][4] 1999లోనూ అప్పటి ఆంధ్రప్రదేశ్(ప్రస్తుతం తెలంగాణ) రాష్ట్రంలోని వరంగల్ జిల్లా ఘన్ పూర్(స్టేషన్) సమీపంలో ఈ రైలు పట్టాలు తప్పింది.
సికింద్రాబాద్ జంక్షన్ నుండి బయలుదేరు రైళ్ళు
సికింద్రాబాద్ జంక్షన్ నుండి బయలుదేరు ఇతర రైళ్ళు జాబితా ఈ క్రింద విధంగా ఉన్నాయి. మూస:సికింద్రాబాద్ జంక్షన్ నుండి బయలుదేరు రైళ్ళు
మూలాలు
- ↑ Bryan Morgan (1985), The Great Trains, Rh Value Publishing, p. 206
- ↑ "Golconda Express timetable". cleartrip.com. Retrieved 2015-07-21.
- ↑ "Golconda Express toll rises to 21". Rediff. July 3, 2003. Retrieved 2015-07-21.
- ↑ V Subrahmanyam and D Krishna Reddy (July 2, 2003). "Golconda Express derails, 18 dead". Retrieved 2015-07-21.