గూడూరు నగరపంచాయితీ (కర్నూలు జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గూడూరు పురపాలక సంఘం
గూడూరు
స్థాపన2011
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
గూడూరు
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

గూడూరు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,కర్నూలు జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంలోని, కోడుమూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర[మార్చు]

గూడూరు పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 340 కి.మీ దూరంలో ఉంది.2011 సంవత్సరంలో మున్సిపాలిటీగా స్థాపించబడింది.ఈ మునిసిపాలిటీలో 20 ఎన్నికల వార్డులు ఉన్నాయి.

జనాభా గణాంకాలు[మార్చు]

2001 జనాభా లెక్కల ప్రకారం 19805 గా ఉన్న పట్టణ జనాభా 2011 లో 22288 కు పెరిగింది. గత దశాబ్దంలో 11.70% పెరిగింది.2011 భారత జనాభా లెక్కల ప్రకారం 22288 జనాభా ఉండగా అందులో పురుషులు 11338,మహిళలు 10932 మంది ఉన్నారు.అక్షరాస్యత 53.88% ఉండగా అందులో పురుష జనాభాలో 63.15%,స్త్రీ జనాభాలో 44.34% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2853 ఉన్నారు.ఈ పురపాలక సంఘంలో మొత్తం 4662 గృహాలు ఉన్నాయి.[1]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా బి. ఇందిరా సుభాషిని,[2] వైస్ చైర్మన్‌గా రామాంజనేయులు పనిచేస్తున్నారు.[2]

మూలాలు[మార్చు]

  1. "Gudur Village Population - Gudur - Kurnool, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-03.
  2. 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు[మార్చు]