ఉయ్యూరు నగరపంచాయితీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉయ్యూరు నగర పంచాయతీ
ఉయ్యూరు
స్థాపన2011
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంనగర పంచాయతీ
జాలగూడుఅధికార వెబ్ సైట్

ఉయ్యూరు నగర పంచాయతీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లాకు చెందినది.ఈ నగర పంచాయతీ మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం లోని, ఉయ్యూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందింది.

చరిత్ర[మార్చు]

ఉయ్యూరు నగరపంచాయితీ, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లాకు చెందిన పట్టణ స్థానిక సంస్థలకు చెందిన ఒక నగర పంచాయితీ.ఇది నగర పంచాయితీగా 2011 లో ఏర్పడింది.ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 50 కి.మీ దూరంలోనూ, జిల్లా ప్రధాన కేంద్రం 40 కి.మీ. దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 46490, జనాభా ఉండగా అందులో పురుషులు 23312, మహిళలు 23,178 మంది ఉన్నారు.అక్షరాస్యత పురుష జనాభాలో 85.70%, ఉండగా స్త్రీ జనాభాలో 78.00% అక్షరాస్యులు ఉన్నారు.0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4332 ఉన్నారు.ఈ పురపాలక సంఘంలో మొత్తం 15,683 గృహాలు ఉన్నాయి.[1]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా జంపన్న పూర్ణచందర్రావు, [2] వైస్ చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస బాబు పనిచేస్తున్నారు.[2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ జగదాంబ సమేత సోమేశ్వరాలయం:-ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం, 2017, ఫిబ్రవరి-10వ తేదీ శుక్రవారం, మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా వైభవంగా నిర్వహించారు. రాత్రికి స్వామివారి రథోత్సవం కన్నులపండువగా సాగినది.
  2. శ్రీ విజయదుర్గాభవాని ఆలయం;- ఈ ఆలయం స్థానిక తోట్లవల్లూరు రహదారిపై ఉంది.
  3. శ్రీ లక్ష్మీనాంచారమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక తిరుణాళ్ళను, 2015, మార్చి-5వ తేదీ (ఫాల్గుణ పౌర్ణమి) గురు వారం నాడు ఘనంగా నిర్వహించారు. భక్తజనం ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చారు. వివిధ ప్రాంతాలనుండి వచ్చిన భక్తులు, మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం అమ్మవారి నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమల ఊరేగింపు సాగినది. రాత్రి అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు.
  4. శ్రీ సువర్చలా సమేత ఆంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి ఉత్సవాలు, ఐదురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు.
  5. శ్రీ అంకమ్మ తల్లి ఆలయం:- ఉయ్యూరులోని కాటూరు రహదారి సమీపంలో గల ఈ ఆలయంలో, జంపాన కుటుంబీకుల ఆధ్వర్యంలో అమ్మవారి జాతరను, ప్రతి సంవత్సరం, వైశాఖమాసంలో ఐదురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు.

ఇతర వివరాలు[మార్చు]

ఈ పురపాలక సంఘంలో 15 రెవెన్యూ వార్డులు, 20 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో 5 మురికివాడలు ఉండగా మురికివాడలో 13300 జనాభా ఉన్నారు. ఒక ప్రభుత్వ ఆసుపత్రి, 2 ఉన్నత పాఠశాలలు,12 ప్రాథమిక పాఠశాలలు,17 ప్రభుత్వ పాఠశాలలు,5 ఇ-సేవా కేంద్రాలు,2 కూరగాయల మార్కెట్లు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Vuyyuru Village Population - Vuyyuru - Krishna, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-08-11.
  2. 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు[మార్చు]