కుప్పం పురపాలక సంఘం

వికీపీడియా నుండి
(కుప్పం పురపాలకసంఘం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కుప్పం పురపాలక సంఘం
కుప్పం
స్థాపన2020
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
కుప్పం
కార్యస్థానం
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం

కుప్పం పురపాలకసంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాకు చెందిన పురపాలక సంఘం.ఈ పురపాలక సంఘం చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలోని, కుప్పం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర[మార్చు]

ఈ పురపాలక సంఘం 2020వ సంవత్సరంలో మూడవ గ్రేడు పురపాలక సంఘంగా ఏర్పాటు చేశారు.[1]

భౌగోళిక స్వరూపం[మార్చు]

కుప్పం పురపాలక సంఘం 12′ 45″ ఉత్తరం, 78′ 20″ తూర్పు అక్షాంశరేఖాంశాలవద్ద ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

ఈ పురపాలక సంఘంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 21,963 మంది జనాభా ఉన్నరు. ఉండగా అందులో పురుషులు 11,091, మహిళలు 10,872 మంది ఉన్నారు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2,551 ఉన్నారు. అక్షరాస్యత సగటు అక్షరాస్యత రేటు 83.62% ఉంది, ఇది రాష్ట్ర సగటు 67.41% కంటే గణనీయంగా ఎక్కువ.లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 980 మంది మహిళలు ఉన్నారు.[2]

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 25 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.[3] ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు.

మూలాలు[మార్చు]

  1. "ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు". apdpms.ap.gov.in. Archived from the original on 2019-08-03. Retrieved 2021-04-02.
  2. "Literacy of AP (Census 2011)" (PDF). Official Portal of Andhra Pradesh Government. p. 43. Archived from the original (PDF) on 14 జూలై 2014. Retrieved 5 సెప్టెంబరు 2014.
  3. "కుప్పం పురపాలక సంఘం 25 వార్డులుగా విభజన". www.andhrajyothy.com. Retrieved 2021-04-02.

వెలుపలి లంకెలు[మార్చు]