ఎమ్మిగనూరు పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎమ్మిగనూరు పురపాలక సంఘం
ఎమ్మిగనూరు
స్థాపన1965
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

ఎమ్మిగనూరు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంలోని, ఎమ్మిగనూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర[మార్చు]

ఎమ్మిగనూరు పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 400 కి.మీ దూరంలో ఉంది.1965 లో ఈ మునిసిపాలిటీగా స్థాపించబడింది.ఈ మునిసిపాలిటీలో 33 ఎన్నికల వార్డులు ఉన్నాయి.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 95,149 జనాభా ఉండగా అందులో పురుషులు 47,456, మహిళలు 47,693 మంది ఉన్నారు.అక్షరాస్యత పురుష జనాభాలో 73.05%, ఉండగా స్త్రీ జనాభాలో 53.06% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 8224 ఉన్నారు.ఈ పురపాలక సంఘంలో మొత్తం 19619 గృహాలు ఉన్నాయి.[1]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా యస్. సరస్వతి, [2] వైస్ చైర్మన్‌గా వై.పి.యం.కె చౌదరి పనిచేస్తున్నారు.[2]

పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  • నీలకంఠేశ్వర స్వామి దేవాలయం
  • షిర్డీ సాయి దేవాలయం
  • మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఎమ్మిగనూరుకు 22 కి.మీ.దూరంలో ఉంది.

ఇతర వివరాలు[మార్చు]

ఈ పురపాలక సంఘం 14.50 చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.18 రెవెన్యూ వార్డులు,33 ఎన్నికల వార్డులు ఉన్నాయి. ఈ పురపాలక సంఘంలో 45 మురికివాడలు ఉన్నాయి.1 ప్రభుత్వ ఆసుపత్రి,1 కూరగాయల మార్కెట్ ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Yemmiganur Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-03.
  2. 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు[మార్చు]