కొత్తగూడెం (భద్రాద్రి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి జిల్లాకు చెందిన మండలాలు మూస చేర్చాను |
చి Sri Harsha Bhogi, పేజీ కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము) ను కొత్తగూడెం (భద్రాద్రి జిల్లా) కు తరలించారు: కొత్తగూడెం ఇప్పుడు ఖమ్మం జిల్లాలో లేదు |
(తేడా లేదు)
|
07:27, 17 మే 2018 నాటి కూర్పు
?కొత్తగూడెం తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 16.10 కి.మీ² (6 చ.మై)[1] |
జిల్లా (లు) | ఖమ్మం జిల్లా |
జనాభా • జనసాంద్రత |
79,819[2] (2011 నాటికి) • 4,958/కి.మీ² (12,841/చ.మై) |
అధికార భాష | తెలుగు |
పురపాలక సంఘం | కొత్తగూడెం పురపాలక సంఘము |
కొత్తగూడెం, తెలంగాణ రాష్ట్రములోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఒక పట్టణం మరియు భద్రాద్రి జిల్లా పరిపాలన కేంద్రం, అదే పేరుతోనున్న మండలం.[3].పిన్ కోడ్: 507101.
భద్రాద్రి జిల్లా పరిపాలన కేంద్రం.
లోగడ కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో రెవిన్యూ డివిజనుగా ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తగా భద్రాద్రి పేరుతో నూతన జిల్లాను, కొత్తగూడెం జిల్లా పరిపాలన కేంద్రంగా ఉండేలాగున, అలాగే మండల కేంద్రంగా రామవరం గ్రామంతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4].
ఇక్కడ సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రధాన కార్యాలయము ఉండుటవల్ల దీనిని దక్షిణ భారతదేశపు బొగ్గు పట్టణముగా పిలుస్తారు. కొత్తగూడెం మరియు పాల్వంచలు జంట పట్టణాలు. కొత్తగూడెం చుట్టుపక్కల అడవులు, పరిశ్రమలు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి.
ప్రభుత్వం మరియు రాజకీయాలు
పౌర పరిపాలన
జమ్మికుంట పురపాలక సంఘము 1971 లో స్థాపించిబడింది. ఇది 33 వార్డులు కలిగి ఉన్న ఒక మొదటి గ్రేడ్ పురపాలక సంఘము. ఈ పట్టణ అధికార పరిధి 16.10 km2 (6.22 sq mi).[1]
రవాణా సదుపాయాలు
కొత్తగూడెం రైల్వేస్టేషన్ ను "భద్రాచలం రోడ్డు " అనే పేరుతో పిలుస్తారు. భద్రాచలం చేరుకోవడానికి ఇక్కడనుండే వెళ్ళవలెను. భద్రాచలం ఇక్కడి నుండి గంట ప్రయాణము. పాల్వంచ పట్టణము మీదుగా వెళ్ళవలసి వుంటుంది. కొత్తగూడెంకు హైదరాబాదు నుండి బస్సు ద్వారాగానీ, రైలు ద్వారాగానీ వెళ్ళవచ్చు. దీనిని చేరుకోవడానికి హైదరాబాదు నుండి అయితే ఐదు గంటలు, బెజవాడ నుండి అయితే నాలుగు గంటలూ పడుతుంది. కొత్తగూడెం నాలుగు దిక్కులా పచ్చని అడవులను చూడవచ్చు. పట్టణములో చెప్పోదగ్గ ముఖ్య అంశము సింగరేణి సంస్థ గురించి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ సంస్థ ఉండటం వలన కొత్తగూడెంకి బ్లాక్ గోల్డ్ నగరము అని పేరు. కొత్తగూడెం ధర్మల్ విద్యుత్ కేంద్రం రాష్ట్రానికి అధికశాతం విద్యుత్ ని అందిస్తుంది. ఇది పాల్వంచ పట్టణములో ఉంది. అక్కడే నవ భారత్ ఇనుము సంస్థ కూడా ఉంది.
భౌద్ధం ఆనవాళ్ళు
కొత్తగూడెం మండలం హేమచంద్రాపురంగ్రామంలోని కారుకొండగుట్ట లకు ఘనమైన చరిత్ర ఉంది. రాతితో బుద్ధుడు పద్మాసనంలో కూర్చొని ఉండటం.. ఇక్కడి ప్రత్యేకత. వీటితో పాటు ఈ గుట్టపై అతి పెద్ద సొరంగం కూడా ఉందని పురావస్తు శాఖ గుర్తించింది. ఈ కొండకు ఆగ్నేయంగా రెండు బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి. ఒకే రాయిపై 4 వైపులా బుద్ధుని ప్రతిమలు చెక్కి ఉన్నాయి. ఇక్కడ చరిత్ర నిక్షిప్తమై ఉన్నట్లు ప్రభుత్వం 1989లోనే గుర్తించి నిర్ధారించింది.
మండలంలోని పట్టణాలు
- కొత్తగూడెం (m+og)
- కొత్తగూడెం (m)
- చాతకొండ (ct)
- చుంచుపల్లి (ct)
శాసనసభ నియోజకవర్గం
సకలజనుల సమ్మె
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 1,88,191 - పురుషులు 93,300 - స్త్రీలు 94,891