Jump to content

భాగమతి ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
భాగమతి ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంసూపర్ ఫాస్ట్ రైలు
స్థితినడుస్తుంది
స్థానికతకర్ణాటక,తమిళనాడు,ఆంధ్రప్రదేశ్,తెలంగాణా,మహారాష్ట్ర,మధ్య ప్రదేశ్,ఉత్తర ప్రదేశ్,బీహార్
ప్రస్తుతం నడిపేవారుతూర్పు మధ్య రైల్వే మండలం
మార్గం
మొదలుమైసూర్
ఆగే స్టేషనులు18
గమ్యందర్భాంగా
ప్రయాణ దూరం3,042 కి.మీ. (1,890 మై.)
సగటు ప్రయాణ సమయం55 గంటల 5నిముషాలు
రైలు నడిచే విధంవారానికి ఒక మారు
సదుపాయాలు
శ్రేణులుస్లీపర్ , ఏ.సి 1,2,3 జనరల్
ఆహార సదుపాయాలుపాంట్రీ కార్ కలదు
చూడదగ్గ సదుపాయాలుఅన్ని భోగీలలో పెద్ద కిటికీలు, శుభ్రత.
బ్యాగేజీ సదుపాయాలుసీట్ల క్రింద.
సాంకేతికత
రోలింగ్ స్టాక్రెండు
పట్టాల గేజ్విస్తృతం (1,676 ఎం.ఎం)
వేగం55 kilometres per hour (34 mph)

భాగమతి ఎక్స్‌ప్రెస్ కర్ణాటక రాష్ట్రంలో గల మైసూర్ నుండి బీహార్ రాష్ట్రంలో గల దర్భాంగా వరకు నడిచే వారానికి ఒక మారు నడుస్తుంది.

పద ఉత్పత్తి

[మార్చు]

భాగమతి అనే నది నేపాల్ దేశంలో పుట్టి బీహార్ రాష్ట్రంలో గల దర్భాంగా జిల్లాలో ప్రవేశించు నది. ఆ నది పేరు మీదనే ఈ రైలుకు భాగమతి ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టారు.

కోచ్ల అమరిక

[మార్చు]

భాగమతి ఎక్స్‌ప్రెస్ లో ఒక ఎ.సి మొదటి తరగతి ఒక ఎ.సి రెండవ తరగతి,ఒక ఎ.సి రెండవ మూడవ తరగతులు కలిసిన భోగీ,3 మూడవ తరగతి ఎ.సి భోగీలు,12 స్లీపర్ క్లాస్ భోగీలు,4జనరల్ భోగీలు,1 పాంట్రీకార్ తో కలిపి మొత్తం 24భోగీలుంటాయి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఇంజను
SLR జనరల్ జనరల్ ఎస్1 ఎస్2 ఎస్3 ఎస్4 ఎస్5 ఎస్6 ఎస్7 ఎస్8 ఎస్9 ఎస్10 ఎస్11 PC బి3 బి2 బి1 ఎబి1 ఎ1 ఎ2 జనరల్ జనరల్ SLR

ప్రయాణ మార్గం

[మార్చు]
Bagmati Express (Darbhanga - Mysore) Route map

భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రతి శని వారం ఉదయం 7గంటల 20నిమిషాలకు మైసూర్ లో 12578నెంబరుతో బయలుదేరి బెంగుళూరు,కాట్పాడి,చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను,గూడూరు,ఒంగోలు,విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను,వరంగల్,బల్లార్షా,సేవాగ్రామ్,నాగపూర్,ఇటార్సీ జంక్షన్ ,అలహాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను,ముఘల్ సరాయ్ జంక్షన్ ,పాట్నా,బరౌని జంక్షన్ ల మీదుగా ప్రయాణిస్తూ దర్భాంగా మూడవ రోజు మధ్యహ్నం 2గంటల 25నిమిషాలకు  చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మంగళవారం సాయంత్రం 04గంటలకు 12577 నెంబరుతో దర్భాంగా లో బయలుదేరి గురువారం రాత్రి 11గంటల 30నిమిషాలకు మైసూర్ చేరుతుంది.

ట్రాక్షన్

[మార్చు]

భాగమతి ఎక్స్‌ప్రెస్ కు మైసూర్ నుండి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను వరకు రాయపురం లోకోషెడ్ అధారిత WAP-7/WAP-4 లోకోమోటివ్లను ఉపయోగిస్తారు.అక్కడి నుండి ఇటార్సీ వరకు ఇటార్సీ లోకోషెడ్ అధారిత WAP-4 లోకోమోటివ్లను ఉపయోగిస్తారు.అక్కడినుండి దర్భాంగా వరకు ఇటార్సీ లోకోషెడ్ అధారిత WDP-4D డీజిల్ లోకోమోటివ్లను ఉపయోగిస్తున్నారు.

సగటు వేగం

[మార్చు]

భాగమతి ఎక్స్‌ప్రెస్ కు మైసూర్ నుండి దర్భాంగా వరకు మద్య గల 3041కిలో మీటర్ల దూరాన్నీ 55గంటల 5నిమిషాల ప్రయాణసమయంతో 55కిలో మీటర్ల సగటువేగంతో అధిగమిస్తుంది.ఇది గంటకు 55 కి.మీ. / గం. పైన నడుస్తుంది కాబట్టి ఇది ఒక సూపర్‌ఫాస్ట్ రైలు, సర్‌చార్జి దీనికి వర్తిస్తుంది.

ఇవి కూడ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

జోన్