ఋచీక మహర్షి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఋచీక మహర్షి ని రుచికుడు అని కూడా వ్యవహరింతురు. మిక్కిలి తపోబలసంపన్నుడు. చతుర్వేదాలు యెరింగినవాడు. ధనుర్వేదము ఆసాంతము తెలిసినవాడు. సత్యసంధుడు.

వివాహము[మార్చు]

ఒక ముసలి బ్రాహ్మణుడు అయిన ఋచీక మహర్షితో భార్య పేరు సత్యవతి (ఋచీకుడి భార్య)కి వివాహం జరిగింది. సత్యవతి (ఋచీకుడి భార్య) తండ్రి గాధి రాజు. గాధి తండ్రి కుశనాభుడు, గాధి కుమారుడు విశ్వామిత్రుడు. ఋచీక మహర్షి దంపతులకు పుట్టిన కుమారుడు జమదగ్ని మహర్షి.

ఋచీక మహర్షి తన వారసుడుగా బ్రాహ్మణ లక్షణాలు కలిగిన ఒక కుమారుడు కావలయునని, అందుకు కావలసిన పవిత్రమైన బలి సమర్పణ (చారు) అతను ఈ లక్ష్యం సాధించడానికి సిద్ధం చేసాడు, ఆ కోరికతో అందుకోసం వలననే అతను దానిని సత్యవతికి ఇచ్చాడు. అతను సత్యవతి తల్లికి కూడా ఆమె అభ్యర్థనను మన్నించి తన వద్ద క్షత్రియ లక్షణాలున్న ఒక కుమారుడు గర్భం కలగడానికి మరొక చారు పాత్ర ఇచ్చాడు. కానీ సత్యవతి తల్లి రహస్యముగా ఆమె తమ చారు మార్పిడి కోసం సత్యవతిని కోరింది. ఈ మార్పిడి ఫలితంగా సత్యవతి తల్లికి, ఒక బ్రాహ్మణ లక్షణాల నాణ్యతగా క్షత్రియ రాజు గాధి కుమారుడుగా విశ్వామిత్రుడు నకు జన్మనివ్వడం ; అలాగే సత్యవతి, క్షత్రియ యొక్క లక్షణాలను కలిగియున్న ఒక బ్రాహ్మణుడుగా పరశురాముడు తండ్రి అయిన జమదగ్నికి జన్మనిచ్చింది.

బ్రహ్మర్షి విశ్వామిత్రుడు, విష్ణువు యొక్క ఆరవ అవతారం అయిన గొప్ప యోధుడు, ఋషి అయిన పరశురాముడు నకు సంబంధించినంత వరకు చాలా బంధుబాంధ్యవం ఉంది.

పరశురాముని జన్మవృత్తాంతం[మార్చు]

పరశురామావతారము

శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము ఆరవది.[1] త్రేతాయుగము ఆరంభములో జరిగింది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని భార్గవరాముడు, జామదగ్ని అని కూడా అంటారు.[2] కుశ వంశానికి చెందిన మహారాజు గాధి. ఒకసారి భృగు వంశానికి చెందిన ఋచీక మహర్షి గాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకొన్నాడు.[3] ఇలా జరుగుతుండగా ఒక రోజు సత్యవతి ఋచీకుని దగ్గరకు వచ్చి తనకు, తన తల్లికి పుత్రసంతానం ప్రసాదించమని కోరగా ఋచీకుడు యాగం చేసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సు, రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారుచేసి స్నానానికి వెళ్ళతాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకొని విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. ఋచీకునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తనకొడుకు సాత్వికుడిగ ఉండి, మనుమడు ఉగ్రుడు అవుతాడు అని పల్కుతాడు.[4] ఋచీకుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశతో జన్మించినవాడు పరశురాముడు.[3] గాధి కొడుకే విశ్వామిత్రుడు. భృగు వంశాను చరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు. ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొంది, పరశురాముడైనాడు.

మూలాలు[మార్చు]

  1. Shahjahanpur – Etihasik Evam Sanskritik Dharohar
  2. Pai, Anant (November 29, 2010). Parashurama – Sixth Incarnation of Vishnu. Amar Chitra Katha – Volume 764. p. 33.
  3. 3.0 3.1 Rai, Kayyara Kinhanna (June 13, 2010). BhargavaParashurama. Litent ePublishing. p. 33.
  4. "Parashurama". Rai, Kayarra Kinhanna. November 22, 2012. Archived from the original on 2012-04-28. Retrieved November 22, 2012.