భారతీయ రైల్వేలు

వికీపీడియా నుండి
(భారతదేశంలో రైల్వేలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భారతీయ రైల్వేలు
Typeప్రభుత్వ పరమైన
పరిశ్రమరైల్వేలు , లోకోమోటివ్స్
స్థాపనఏప్రిల్ 16, 1853, జాతీయం 1951 [1]
Foundersస్థాపకుడు
ప్రధాన కార్యాలయం
కొత్తఢిల్లీ
,
Areas served
భారతదేశం
Key people
రైల్వేశాఖ మంత్రి:
అశ్విని వైష్ణవ్
Productsరైలు రవాణా, సరుకుల రవాణా, సర్వీసులు
RevenueINR 1,63,450 కోట్లు (25 బిలియన్లుడాలర్లు)(2014–15)[2]
Number of employees
13,34,000 (2014) [3]
Parentరైల్వేమంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం
Divisions16 రైల్వే విభాగాలు (కొంకణ్ రైల్వే గాక)
Websitewww.indianrailways.gov.in
భారత రైల్వే నెట్-వర్క్ యొక్క మ్యాపు.

భారతీయ రైల్వేలు (ఆంగ్లం: Indian Railways; హిందీ: भारतीय रेल Bhāratīya Rail); సంక్షిప్తంగా భా.రే.) భారత ప్రభుత్వ విభాగము. భారతదేశంలో రైల్వేలు మొదటిసారిగా 1853 లో ప్రవేశపెట్టబడ్డాయి. 1947 (స్వతంత్రం వచ్చే)నాటికి దేశంలో మొత్తం 42 రైల్వే సంస్థలు నెలకొల్పబడి ఉన్నాయి. 1951లో ఈ సంస్థలన్నింటినీ కలుపుకొని భారత రైల్వే, ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఆవిర్బవించింది. భారత రైల్వే దూర ప్రయాణాలకు, నగరాలలో దగ్గరి ప్రయాణాలకు సబర్బన్ (suburban) అనగా పట్టణపు పొలిమేరలవరకు) అవసరమైన రైళ్ళను నడుపుతోంది.[3][4]

రైలు మార్గాలు భారతదేశపు నలుమూలలా విస్తరించి ఉన్నాయి. భారతీయ రైలు మార్గాలపై ప్రభుత్వానికి ఏకఛత్రాధిపత్యం ఉంది. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. రైలు మార్గాలు మొత్తం దూరం సుమారుగా 114500 కి.మీ. ఇది సుమారు 65000 కి.మీ రూటు పై వుంది, 7500 స్టేషన్లు వున్నాయియ 20 11 నాటికి రైల్వేల వద్ద 2,40,000 వాగన్లు, 69,000 కోచ్ లు, 9000 ఇంజిన్లు ఉన్నాయి.[3] ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగి వున్న సంస్థలలో భారతీయ రైల్వేది (సుమారు పదనాలుగు లక్షలు)ద్వితీయ స్థానము. భారతీయ రైల్వే కంప్యూటరీకరణలో అన్నిటిలో ప్రథమ స్థానంలో ఉంది. ముందస్తుగా ప్రయాణం ఖరారు చేసుకునేటందులకు, మార్పులు చేసుకునేందుకు సౌకర్యం అందిస్తోంది. ఈ విభాగం భారతీయ రైల్వే ఆహార నిర్వహణ, పర్యాటక సంస్థ నిర్వహిస్తుంది. ఇది భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తూ భారత రైల్వే రవాణా వ్యవస్థను నిర్వహిస్తూ ఉంటుంది. రైల్వే మంత్రిత్వ శాఖ కేంద్ర రైల్వే మంత్రి (కేబినెట్ హోదా) నిర్వహణలో ఉండే రైల్వే విభాగం, రైల్వే బోర్డు కింద పనిచేస్తుంది. దీనిని పరిపాలనా సౌలభ్యం కోసం 18 జోన్లుగా విభజించారు.

చరిత్ర[మార్చు]

థానే సమీపంలో 1855 లో చిన్న థానే రైల్వే భవనంగా ఉంది
1855 లో థానే సమీపంలోని ఎక్కువ థానే రైల్వే భవంతిని దాటుతున్న రైలు
ముంబై లోకల్ రైలు

భారతదేశంలో రైలు మార్గాల కొరకు మొదటిసారిగా 1832లో ప్రణాళిక ప్రవేశపెట్టబడినప్పటికీ, ఆ తరువాత మరో దశాబ్దం వరకూ ఇందులో ఎటువంటి పురోగతి సాధించలేదు. 1837 లో రెడ్ హిల్స్ నుండి చింతప్రేట్ వంతెన వరకు నడిచింది. దీనిని రెడ్ హిల్ రైల్వే అని పిలుస్తారు, విల్లియం అవేరీచే తయారు చేయబడిన రోటరీ స్టీమ్ లోకోమోటివ్ని ఉపయోగించారు. ఈ రైల్వే సర్ ఆర్థర్ కాటన్ చే నిర్మించబడింది, ప్రధానంగా మద్రాసులో రహదారి నిర్మాణ పనుల కొరకు గ్రానైట్ రాళ్ళను రవాణా చేయడానికి ఉపయోగించబడింది. 1844 లో, అప్పటి గవర్నరు జనరలు, లార్డు హార్డింజ్ రైల్వే వ్యవస్థను నెలకొల్పేందుకు ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇచ్చాడు. రెండు కొత్త రైల్వే కంపెనీలను స్థాపించి, వాటికి సహాయపడవలసిందిగా ఈస్ట్ ఇండియా కంపెనీని అదేశించారు. ఇంగ్లండు లోని పెట్టుబడిదారుల ఆసక్తి కారణంగా తరువాతి కొద్ది సంవత్సరాలలో రైల్వే వ్యవస్థ త్వరితగతిన ఏర్పడింది. 1845 లో గోదావరిలో ఒక డ్యామ్ నిర్మాణం కోసం రాళ్ళు సరఫరా చేయడానికి ఉపయోగించే రాజమండ్రిలో దోల్స్లేవమ్ వద్ద గోదావరి డాం కనస్ట్రక్షన్ రైల్వేను నిర్మించారు. 1851 లో సోలాని అక్విడక్ట్ రైల్వేను రూర్కీలో నిర్మించారు, దీనిని ఒక బ్రిటీష్ అధికారి పేరు మీద ఉన్న "థామస్సన్" అని పిలిచే ఆవిరి లోకోమోటివ్లచే నడపబడుతుంది. సోలానీ నదిపై ఒక కాలువ కోసం నిర్మాణ పదార్థాలను రవాణా చేసేందుకు ఉపయోగించబడింది.1853 ఏప్రిల్ 16లో మొదటి ప్రయాణీకుల రైలు బోరిబందర్, బొంబాయి, థాణేల మధ్య నడుపబడింది. ఈ ప్రయాణం మొత్తం దూరం 34 కి.మీ కాగా, సాహిబ్, సుల్తాన్, సింధ్ అనే ఇంజిన్లను వినియోగించారు. ఒక విధంగా ఈ సంఘటన భారత రైల్వేలకు అంకురార్పణ చేసిందని చెప్పుకోవచ్చు.

పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం నూతన పధకాలను ప్రవేశపెట్టింది. ఈ పధకం ప్రకారం, పెట్టుబడిదారులకు మొదటి కొద్ది సంవత్సరాలకు కనీసం ఐదు శాతం లాభాలకు హామీ లభిస్తుంది. సంస్థ ప్రారంభమైన తరువాత అది బ్రిటిష్ ప్రభుత్వ ఆధీనమౌతుంది, కానీ సంస్థ మీద అజమాయిషీ మాత్రం పెట్టుబడిదారుల వద్దే ఉంటుంది. దీంతో 1880కి, మొత్తం రైలు మార్గాల దూరం 14,500 కి.మీ (9000 మైళ్ళు) వరకు విస్తరించింది. ఇందులో అధికశాతం పెద్ద రేవు పట్టణాలైన బొంబాయి, మద్రాస్, కలకత్తాలను చేరుకునేందుకు నిర్మించబడ్డాయి. 1895 నాటికి భారతదేశంలో ఇంజిన్ల తయారీ మొదలయ్యింది. 1896లో భారత ఇంజినీర్లు ఉగాండా రైల్వేను నిర్మించడంలో సాయపడ్డారు.

1871 లో భారత రైల్వే నెట్‌వర్క్.
1909 లో భారత రైల్వే నెట్‌వర్క్.

ఆ తరువాత కొద్దికాలంలోనే దేశంలోని వివిధ రాజ సంస్థానాలు తమ సొంత రైలు మార్గాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఆ విధంగా రైలు మార్గాలు వేర్వేరు ప్రాంతాలు (ఇప్పటి రాష్ట్రాలు) అస్సాం, రాజస్థాన్, ఆంధ్ర ప్రదేశ్ లకు విస్తరించాయి. 1901లో రైల్వే బోర్డు స్థాపించబడినప్పటికీ విధాన నిర్ణయాధికారం మాత్రం బ్రిటిష్ వైస్రాయ్ జెనరెల్ (లార్డ్ కర్జన్) వద్దనే వుండేది. రైల్వే బోర్డు ఆర్థిక, పరిశ్రమల శాఖ కింద పని చేసేది. ఈ బోర్డును నిర్వహించేందుకు ప్రభుత్వ రైల్వే అధికారి అధ్యక్షుడు గానూ, ఇంగ్లాండు నుండి ఒక రైల్వే నిర్వహణాధికారి, రైల్వే సంస్థ ప్రతినిధి ఒకరు ఉండేవారు. రైల్వే బోర్డు చరిత్రలో మొదటిసారిగా లాభాలను ఆర్జించడం మొదలైన తరువాత 1907 లో రైల్వే సంస్థలన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

ఆ తరువాతి సం.లో మొదటి సారిగా విద్యుత్ ఇంజిన్లను ప్రవేశపెట్టారు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలైన తరువాత రైల్వేలు బ్రిటీష్ వారి అవసరాల కోసం దేశం వెలుపల కూడా వినియోగించడం జరిగింది. ప్రపంచ యుద్ధం పూర్తయ్యే సరికి రైల్వేలు బాగా దెబ్బ తిని మూల పడ్డాయి, దాంతో 1920లో ప్రభుత్వం వాటి నిర్వహణను తన ఆధీనంలోకి తీసుకొని రైల్వేల ఆర్థిక వ్యవహారాలను ఇతర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నుండి వేరు చేసింది. ఈ విధానం ఇప్పటికీ ప్రత్యేక రైల్వే బడ్జెట్ రూపంలో అమలులో ఉంది.

ఆ తరువాతి కాలంలో సంభవించిన రెండవ ప్రపంచ యుద్ధంలో ట్రైన్లను మధ్య ప్రాచ్యంలోకి తరలించడంతో రైల్వేలు మరింత దెబ్బ తిన్నాయి. రైల్వే కర్మాగారాలు ఆయుధ కర్మాగారాలుగా మారిపోయాయి. 1947 లో స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో అధిక శాతం రైలు మార్గాలు కొత్తగా అవతరించిన పాకిస్థాన్ లో ఉండి పోయాయి. దాంతో మిగిలిన నలభై రెండు వేర్వేరు రైలు మార్గాలను (రాజ సంస్థానాల ఆధీనంలో ఉన్న ముప్పై రెండు మార్గాలతో సహా) కలుపుకొని ఏకైక సంస్థ "భారతీయ రైల్వే" అవతరించింది. 1951లో అప్పటి వరకు వేర్వేరుగా ఉన్న రైల్వేలను మార్చి, మొత్తం ఆరు ప్రాంతీయ విభాగాలను ఏర్పాటు చేయటం జరిగింది. భారత దేశ ఆర్థిక పరిస్థితి మెరుగు పడటంతో అన్ని రైల్వే కర్మాగారాలు పూర్తిగా దేశీయ సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగంలోకి తెచ్చాయి. సం.1985 నాటికి అప్పటి వరకూ వినియోగంలో ఉన్న ఆవిరి యంత్రాలకు బదులుగా డీసెల్, విద్యుత్ యంత్రాలు ప్రవేశించాయి. 1995 నాటికి దేశంలోని రైల్వే రిజర్వేషన్ వ్యవస్థ మొత్తం కంప్యూటరీకరించబడింది. ప్రపంచలో చైనా మిలిటరీ తరువాత అత్యధిక ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థగా భారత రైల్వేలు రికార్డును సృష్టించాయి.

________________________________________________________________________________________________________________

సంస్థ

రైల్వే సంస్థాగత నిర్మాణం

  ప్రధాన వ్యాసాలు:  భారతీయ రైల్వే సంస్థాగత నిర్మాణం, భారతీయ రైల్వే జోన్లు, డివిజన్లు

భారతీయ రైల్వేలు నలుగురు సభ్యుల రైల్వే బోర్డుచే నాయకత్వం వహిస్తాయి.  రైల్వే బోర్డు ఛైర్మన్ రైల్వే మంత్రిత్వ శాఖకు నివేదిస్తారు. రైల్వే బోర్డు రైల్వే మంత్రిత్వ శాఖగా కూడా పనిచేస్తుంది. రైల్వే బోర్డు కార్యాలయాన్ని నిర్వహించే అధికారులు ఎక్కువగా వ్యవస్థీకృత గ్రూప్ ఏ రైల్వే సర్వీసెస్, రైల్వే బోర్డ్ సెక్రటేరియట్ సర్వీస్‌కు చెందినవారు ఉంటారు. భారతీయ రైల్వేలు రైల్వే బోర్డుకు నివేదించే జనరల్ మేనేజర్ల నేతృత్వంలో 18 జోన్‌లుగా విభజించబడింది.[1] డివిజనల్ రైల్వే మేనేజర్లు నేతృత్వంలో జోన్‌లు 71 ఆపరేటింగ్ డివిజన్‌లుగా ఉపవిభజన చేయబడ్డాయి.[2][3][4] ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్, టెలికమ్యూనికేషన్, స్టోర్స్, అకౌంట్స్, పర్సనల్, ఆపరేటింగ్, కమర్షియల్, సెక్యూరిటీ, సేఫ్టీ శాఖల డివిజనల్ అధికారులు వారి సంబంధిత డివిజనల్ రైల్వే మేనేజర్ లకు రిపోర్ట్ చేస్తారు, రైల్వే కార్యకలాపాల, ఆస్తుల నిర్వహణకు బాధ్యత వహిస్తారు. స్టేషన్ మాస్టర్లు వారి వారి  స్టేషన్ల పరిధిలో రైలు కదలికలను నిర్వహిస్తారు.  దీనికి అదనంగా, రైల్వే బోర్డు నియంత్రణలో పని చేసే అనేక ఉత్పత్తి యూనిట్లు, శిక్షణా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర కార్యాలయాలు ఉన్నాయి.[1]

___________________________________________________________________________________________________________

మానవ వనరులు

ప్రధాన వ్యాసం: భారతీయ రైల్వేల కేంద్రీకృత శిక్షణా సంస్థలు

భారతీయ రైల్వే లోని సిబ్బందిని గెజిటెడ్ (గ్రూప్స్ ఏ, బి ), నాన్ గెజిటెడ్ (గ్రూప్స్ సి., డి) ఉద్యోగులుగా వర్గీకరించారు.[5] గెజిటెడ్ ఉద్యోగులు ఎగ్జిక్యూటివ్/మేనేజర్/ ఆఫీసర్ స్థాయి పనులను నిర్వహిస్తారు.  ఇందులో రైల్వే సిబ్బంది 2017 మార్చి  లెక్కల ప్రకారం  మొత్తం సంఖ్యలో (ఏ & బి గ్రూప్‌లు) 1.2% ఉండగా, గ్రూప్ సి., డి వరుసగా 92.6%, 6.2% ఉన్నారు.[1]

భారతీయ రైల్వేలలో గ్రూప్ బి ఉద్యోగులకు ప్రత్యక్ష నియామకం లేదు. వారు గ్రూప్ సి ఉద్యోగుల డిపార్ట్‌మెంటల్ ప్రమోషనల్ పరీక్షల ఎంపిక ద్వారా నియమించబడతారు. రైల్వే మంత్రిత్వ శాఖ యూ.పి.ఎస్.సి, డి.ఓ.టి.పితో సంప్రదించి, 2023నుండి  ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ లేదా ఐ.ఆర్.ఎమ్.ఎస్ కోసం అభ్యర్థులను నియామకం చేసే సాధనంగా యూ.పి.ఎస్.సి పరీక్షను (ఐ.ఆర్.ఎమ్.ఎస్.పరీక్ష)నిర్వహిస్తుందని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, 10 గ్రూప్- ఏ ఇండియన్ రైల్వే సర్వీసులలో 8 కొత్త ఐ.ఆర్.ఎమ్.ఎస్ లేదా ఇండియన్ రైల్వేస్ మేనేజ్‌మెంట్ సర్వీస్‌లో కలపబడతాయి.[6] గ్రూప్ సి జూనియర్ ఇంజనీర్లు, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ల నియామకాన్ని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిర్వహిస్తుంది. గ్రూప్ సి ఉద్యోగులను 21 రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ లేదా ఆర్.ఆర్.బి రిక్రూట్ చేస్తాయీ. వీటిని రైల్వే రిక్రూట్‌మెంట్ కంట్రోల్ బోర్డ్ (ఆర్.ఆర్.సి.బి) నియంత్రిస్తుంది.[7][8] 16 రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌లు లేదా ఆర్.ఆర్.సి ల ద్వారా గ్రూప్ డి సిబ్బంది నియామకం జరుగుతుంది.

భారతదేశంలోని ఏడు కేంద్రీకృత జోనల్ శిక్షణా సంస్థలు, 295 శిక్షణా కేంద్రాలలో అన్ని సమూహాల శిక్షణ భాగస్వామ్యం చేయబడింది.

భారతీయ రైల్వేలు రైల్వే  సిబ్బంది సంక్షేమం కోసం రైల్వేలో నివాస గృహాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, క్రీడా సౌకర్యాలను నిర్వహిస్తుంది.[1]

అనుబంధ సంస్థలు

భారతీయ రైల్వేలు భాగస్వామ్యంతో భారతదేశంలో రైలు రవాణాకు సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలు (పి. ఎస్. యూ లు), ఇతర సంస్థల జాబితా క్రింది విధంగా ఉంది: :[1]

_______________________________________________________________________________________________________________

బోగీలు

ఇంజన్లు

1990ల నాటికి, ఆవిరి ఇంజన్లు  దశలవారీగా ప్రారంభించబడ్డాయి, కొన్ని సి.ఎన్.జి. (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్)  ఇంజన్ లతో పాటు ఎలక్ట్రిక్, డీజిల్ ఇంజన్లు ఉపయోగించబడ్డాయి.[1] హెరిటేజ్ రైళ్లలో మాత్రమే ఆవిరి  ఇంజన్ లను ఉపయోగిస్తారు. భారతదేశంలోని ఇంజన్లు గేజ్, మోటివ్ పవర్, అవి సరిపోయే పని, వాటి శక్తి లేదా మోడల్ నంబర్ ద్వారా వర్గీకరించబడ్డాయి. ఇంజన్ పేరులోని నాలుగు లేదా ఐదు అక్షరాల కూర్పు ఈ సమాచారాన్ని కలిగి ఉంటుంది. మొదటిది  అక్షరం ట్రాక్ గేజ్‌ను, రెండవది ఇంజిన్ మోటివ్ పవర్ (డీజిల్ లేదా ఎలక్ట్రిక్), మూడవది రవాణా  సంబంధిత (వస్తువులు, ప్యాసింజర్, మల్టీ లేదా షంటింగ్)విషయం, నాల్గవ అక్షరం లోకోమోటివ్ కాలక్రమ నమూనా సంఖ్యను సూచిస్తుంది.  అయితే 2002లో, నూతన డీజిల్ ఇంజన్ లలోని నాల్గవ అక్షరం హార్స్‌పవర్ పరిధిని తెలియజేసే నూతన  వర్గీకరణను స్వీకరించారు. 

ఇంజన్ పేరులో ఐదవ అక్షరాన్ని కలిగి ఉండవచ్చు తద్వారా  సాంకేతిక రూపాంతరం, సబ్‌క్లాస్ లేదా ఉప-రకం (ప్రాథమిక మోడల్ (లేదా సిరీస్)లో వైవిధ్యం లేదా వేరే మోటార్ లేదా తయారీదారుని సూచిస్తుంది

నూతన డీజిల్-ఇంజన్ వర్గీకరణలో, ఐదవ అక్షరం 100- ఎచ్.పి ఇంక్రిమెంట్లలో హార్స్‌పవర్‌ను మెరుగుపరుస్తుంది: ఏ 100 ఎచ్.పి.ని, బి  200 ఎచ్.పిని, సి 300 ఎచ్.పిని,  మొదలైన వాటిని తెలియజేస్తుంది. ఈ వర్గీకరణలో, డబ్ల్యూ.డి.ఎమ్-3 ఏ 3100 ఎచ్.పి, డబ్ల్యూ.డి.ఎమ్ -3డి 3400 ఎచ్.పి, డబ్ల్యూ.డి.ఎమ్ -3ఎఫ్ 3600 ఎచ్.పి ఇంజన్ లు ఉన్నాయి.   [లోవర్ -ఆల్ఫా 1] డీజిల్ ఇంజన్లు సహాయక పవర్ యూనిట్‌లతో అమర్చబడి ఉండడంవలన రైలు నడవనప్పుడు  అనగా నిష్క్రియ సమయంలో  దాదాపు 88 శాతం ఇంధనం ఆదా అవుతుంది. [2]

         ప్రస్తుతం భారతీయ రైల్వే రోలింగ్ స్టాక్ (బోగీలు) ఐ.సి.ఎఫ్., ఎమ్.సి.ఎఫ్., ఆర్.సి.ఎఫ్ ద్వారా తయారు చేయబడుతున్నాయి.  ఇంజన్ లను చిత్తరంజన్ లోకోమోటివ్స్, బనారస్ లోకోమోటివ్ వర్క్స్, పాటియాలా లోకోమోటివ్స్ వర్క్స్  తయారు చేస్తున్నాయి . ఇవన్నీ రైల్వే శాఖ స్వాధీనంలో ఉన్నాయి, నిర్వహించబడతాయి. కానీ భారతీయ రైల్వేలు ఇతర ప్రభుత్వ సంస్థలైన బి.ఇ.ఎమ్.ఎల్., బి.ఎచ్.ఇ. ఎల్  నుండి బోగీలను కూడా సేకరిస్తాయి.


గూడ్స్ వ్యాగన్లు

      భారతీయ రైల్వేలలో నూతన వ్యాగన్ నంబరింగ్ వ్యవస్థను 2003లో అవలంబించారు.[1] వ్యాగన్‌ల సమాచారాన్ని గుర్తించడానికి, కంప్యూటరీకరణ సులభతరం చేయడానికి  11 అంకెలు కేటాయించబడ్డాయి [2]. మొదటి రెండు అంకెలు వ్యాగన్ రకాన్ని సూచిస్తాయి, మూడవ, నాల్గవ అంకెలు రైల్వే యాజమాన్యాన్ని సూచిస్తాయి, ఐదవ, ఐదు అంకెలు తయారీ సంవత్సరాన్ని సూచిస్తాయి, ఏడవ నుండి పదవ అంకెలు వ్యక్తిగత వ్యాగన్ సంఖ్యను సూచిస్తాయి, చివరి అంకె చెక్ అంకె.

     భారతీయ రైల్వేలలో మొత్తం వ్యాగన్ల అవసరాలను గతంలో భారత్ వ్యాగన్, ఇంజినీరింగ్ ద్వారా తీర్చబడ్డాయి . ప్రస్తుతం  ఇప్పుడు వ్యాగన్లు, తయారీ యూనిట్ల సేకరణ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో అలాగే రైల్వే మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలనా నియంత్రణలో ఉన్న ఇతర ప్రభుత్వ రంగ యూనిట్ల ద్వారా జరుగుతుంది.[3] భారతీయ రైల్వేలు ఎస్.ఏ.ఐ.ఎల్., ఆర్.ఐ.టి.ఇ.ఎస్. మధ్య ఒక ప్రత్యేక జాయింట్ వెంచర్‌ను కూడా సృష్టించాయి, వ్యాగన్ తయారీ కోసం ఎస్.ఏ.ఐ.ఎల్. ఆర్.ఐ.టి.ఇ.ఎస్.బెంగాల్ వ్యాగన్ పరిశ్రమ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక ప్రయోజన వాహనాన్ని రూపొందించింది.[4]


ప్యాసింజర్ కోచ్‌లు

        సుదూర మార్గాల్లో, కొన్ని చిన్న మార్గాలలో, భారతీయ రైల్వేలు రెండు ప్రాథమిక రకాల కోచ్ డిజైన్ రకాలను ఉపయోగిస్తుంది. ప్రస్తుత నిల్వలలో  ఎక్కువ భాగం 1955 నుండి 2018 జనవరి వరకు  ఉత్పత్తి అయిన ఐ.సి. ఎఫ్  కోచ్ లు ఉన్నాయి . [1] ఈ కోచ్‌లు సరిపడా భద్రతా ఫీచర్లు లేనివిగా పరిగణించబడి, నెమ్మదిగా దశలవారీగా తొలగించబడుతున్నాయి. 2017 సెప్టెంబరు నాటికి, దాదాపు 40,000 కోచ్‌లు ఇప్పటికీ పనిచేస్తున్నాయి.[2] ఈ కోచ్‌లను ఎల్‌హెచ్‌బి కోచ్‌తో భర్తీ చేస్తున్నారు. 90ల మధ్యలో ప్రవేశపెట్టబడిన ఈ కోచ్‌లు తేలికైనవి, సురక్షితమైనవి,  గంటకు 160 కిలో మీటర్ ల (99 మైల్స్ ) వేగంతో ప్రయాణించగలవు.[3]

      భారతీయ రైల్వేలు సుదూర మార్గాల కోసం నూతన ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (ఈ.ఎమ్.యూ.) రైలు సెట్‌లను ప్రవేశపెట్టింది. అటువంటిది వందే భారత్ అమలులో ఉంది, మరొకటి, దాని స్లీపర్ వెర్షన్ 2023 నుండి నడుస్తుంది. ఈ రైలు సెట్లు సుదూర మార్గాల్లో లోకోమోటివ్-హల్డ్ రైళ్లను భర్తీ చేస్తాయి.[4]

     ప్రాంతీయ స్వల్ప-దూర మార్గాలలో, అందుబాటులో ఉన్న ట్రాక్షన్‌పై ఆధారపడి భారతీయ రైల్వేలు మెయిన్‌లైన్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (మెము) లేదా డీజిల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (డెమూ ) రైళ్లను నడుపుతుంది. ఈ రైలు సెట్లు వేగవంతమైన త్వరణం లేదా వేగాన్ని తగ్గించే సామర్ధ్యంతో స్వీయ-చోదకతను కలిగి ఉంటాయి, ఎక్కువ రద్దీగా ఉండే  మార్గాల్లో రద్దీని తగ్గిస్తాయి. ప్యాసింజర్ లోకోమోటివ్-హల్లింగ్ రైళ్లు, తరచుగా స్టాప్‌లు కలిగి ఉంటాయి, నెమ్మదిగా భారతదేశం అంతటా రైలు సెట్‌లతో భర్తీ చేయబడుతున్నాయి. [5]

      పెద్ద పట్టణ కేంద్రాల చుట్టూ ఉన్న సబర్బన్ ప్రయాణికుల మార్గాలలో, భారతీయ రైల్వేలు సాధారణ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (ఈ.ఎమ్.యూ) కోచ్‌లతో రైళ్లను నడుపుతుంది. వీటిని "స్థానిక రైళ్లు" లేదా కేవలం "లోకల్" అని పిలుస్తారు.[6]


ఉత్పత్తి

భారతీయ రైల్వేలు ఒక నిలువుగా సమీకృత సంస్థ, ఇది ఇటీవలి కొన్ని మినహాయింపులతో, అంతర్గత ఉత్పత్తి యూనిట్లలో దాని అధిక ఇంజిన్లు  & రోలింగ్ స్టాక్‌ను ఉత్పత్తి చేస్తుంది.


నిర్వహణ

     ఈ విస్తారమైన రోలింగ్ స్టాక్ మరమ్మత్తు, నిర్వహణ 44 లోకో షెడ్‌లు, 212 క్యారేజ్ & వ్యాగన్ రిపేర్ యూనిట్లు, భారతీయ రైల్వే లోని వివిధ జోన్‌లలోని 45 పీరియాడిక్ ఓవర్  హౌల్ వర్క్ షాప్ లలో  నిర్వహించబడుతుంది.[1]


ట్రాక్‌లు

      ఇయర్ బుక్ 2021-22 లో పేర్కొన్న ప్రకారం   2022 మార్చి 31 నాటికి, భారతీయ రైల్వే ల  నెట్‌ వర్క్ పరిధి  లో 128,305 కి. మీ  (79,725 మైల్స్ ) ట్రాక్ పొడవు, 102,831 కి. మీ  (63,896 మైల్స్) ల రన్నింగ్ ట్రాక్ పొడవు, 68,043 కి. మీ  (42,280 మైల్స్)  రైల్ మార్గం పొడవు  విస్తరించి ఉంది .[1]

   ట్రయల్ రన్ సమయంలో ప్యాసింజర్ రైళ్లు గరిష్ఠ వేగం  గంటకు 180 కి. మీ (110 మైల్స్ )గా ఉన్న అప్పటికి,   ట్రాక్ విభాగాలలో వేగం   గంటకు 80 నుండి 200 కి. మీ (50 నుండి 124 మైల్స్ ) వరకు రేట్ చేయబడతాయి.  అయితే. అన్ని బ్రాడ్-గేజ్ నెట్‌వర్క్‌లు లాంగ్-వెల్డెడ్, హై-టెన్సైల్ స్ట్రెంగ్త్ 52కె.జి  /60కె. జి  90 యూ. టి. ఎస్.  పట్టాలు, సాగే ఫాస్టెనింగ్‌లతో కూడిన ప్రీ-స్ట్రెస్డ్ కాంక్రీట్ (పి. ఎస్. సి ) స్లీపర్‌లతో అమర్చబడి ఉంటాయి.[2]

       1,676 ఎమ్. ఎమ్. (5 ft 6 in) బ్రాడ్ గేజ్ అనేది భారతీయ రైల్వేలు ఉపయోగించే గేజ్, 2022 మార్చి 31 నాటికి దాదాపు మొత్తం నెట్‌ వర్క్ ను విస్తరించింది. ఇది సాధారణ ప్రయాణీకుల కదలిక కోసం ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న బ్రాడ్ గేజ్. 1,000 ఎమ్. ఎమ్.  (3 ft 3+3⁄8 in) మీటర్ గేజ్ ట్రాక్‌లు, 762 ఎమ్. ఎమ్. (2 ft 6 in), 610 ఎమ్. ఎమ్.  (2 ft) నారో గేజ్ ట్రాక్‌లు 2022 మార్చి 31 నాటికి వారసత్వ పురాతన  మార్గాలలో మాత్రమే ఉన్నాయి.


విద్యుద్దీకరణ

ప్రధాన వ్యాసం: సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ రైల్వే  ఎలెక్టరీ ఫికేషన్ 

      భారతీయ రైల్వేలు 2023 జూలై 31 నాటికి, మొత్తం బ్రాడ్-గేజ్ రూట్ కిలోమీటర్లలో 59,524 కి. మీ  (36,986 మైల్స్)ని విద్యుద్దీకరించింది. భారతీయ రైల్వేలు విద్యుద్దీకరించిన అన్ని ట్రాక్‌లపై 25 కె. వి 50 Hz ఏ. సి ట్రాక్షన్‌ను ఉపయోగిస్తుంది.[1][2]

        భారతదేశంలో రైల్వే విద్యుద్దీకరణ 1500 వీ డి. సి వద్ద గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే (జి. ఐ. పి. ఆర్.)లో 1925 ఫిబ్రవరి 3న హార్బర్ లైన్‌లో ఛత్రపతి శివాజీ టెర్మినస్, కుర్లా మధ్య మొదటి ఎలక్ట్రిక్ రైలుతో ప్రారంభమైంది. పశ్చిమ కనుమలలో భారీ వాలులు జి. ఐ. పి. ఆర్ పై విద్యుత్ ట్రాక్షన్‌ను ఈశాన్య రేఖలోని ఇగత్‌పురికి, ఆగ్నేయ రేఖలో పూణేకు ప్రవేశపెట్టడం అవసరం. 1928 జనవరి 5న 1500 వి డి. సి ట్రాక్షన్ బొంబాయి, బరోడా, సెంట్రల్ ఇండియా రైల్వే యొక్క సబర్బన్ విభాగంలో కొలాబా, బోరివిలి మధ్య, మద్రాస్ బీచ్, తాంబరం మధ్య మద్రాస్, సదరన్ మహారత్తా రైల్వే మధ్య 1931 మే 11న, పెరుగుతున్న ట్రాఫిక్‌ అవసరాల  అనుగుణంగా ప్రవేశపెట్టబడింది.

[3] తూర్పు రైల్వేలోని హౌరా-బుర్ద్వాన్ సెక్షన్ లో  3000 వి.డి. సి విద్యుద్దీకరణ 1958లో పూర్తయింది. మొదటి 3000 వి.డి. సి ఇ. ఎమ్. యూ.  సేవ 1957 డిసెంబరు 14న హౌరా-షియోరాఫులి సెక్షన్‌లో ప్రారంభమైంది.[3]

         ఐరోపా‌లో పరిశోధన, ట్రయల్స్, ప్రత్యేకించి ఫ్రెంచ్ రైల్వేస్ (ఎస్.ఎన్.సి.ఎఫ్.)లో 25 కె.వి ఏ.సీ  అనేది ఆర్థిక విద్యుద్దీకరణ వ్యవస్థ అని సూచించింది. భారతీయ రైల్వేలు 1957లో 25 కె.వి ఏ.సీని ప్రమాణంగా స్వీకరించాలని నిర్ణయించుకుంది, ప్రారంభ దశలో ఎస్.ఎన్.సి.ఎఫ్ వారి సలహాదారుగా ఉంది

1960లో సౌత్ ఈస్టర్న్ రైల్వేలో రాజ్ ఖర్స్వాన్-డోంగోఅపోసి విభాగంలో మొదటి 25 కె.వి ఏ.సీ . 1962 సెప్టెంబరులో  మొదటి 25 కె.వి ఏ.సీ ఇ.ఎమ్.యూలు, కోల్‌కతా సబర్బన్ సేవలను ప్రారంభించాయి. దీనిని కొనసాగిస్తు, తూర్పు రైల్వేలోని హౌరా-బుర్ద్వాన్ విభాగం, దక్షిణ రైల్వేలోని మద్రాస్ బీచ్-తాంబరం సెక్షన్ 1968 నాటికి 25 కె.వి ఏ.సీకి మార్చబడింది. 1996–97లో డి.సి ట్రాక్షన్ సిస్టమ్‌లో పరిమితుల కారణంగా, ముంబై సబర్బన్ రైలు నెట్‌వర్క్ యొక్క డబ్లు.ఆర్., సీ. ఆర్  ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్‌ను 1.5 నుండి25 కె.వి ఏ.సీకి  మార్చాలని నిర్ణయం తీసుకోబడింది. 1996–97లో కె.వి డి.సి నుండి 25 కె.వి ఏ.సీ . డి.సి  నుండి ఏ.సీ ట్రాక్షన్‌గా మార్చడం 2012లో పశ్చిమ రైల్వే, 2016లో సెంట్రల్ రైల్వే ద్వారా పూర్తయింది. అప్పటి నుండి, భారతదేశంలోని మొత్తం విద్యుద్దీకరించబడిన ప్రధాన రైలు నెట్‌వర్క్ 25 కె.వి ఏ.సీని ఉపయోగిస్తుంది, డి.సి ట్రాక్షన్ మెట్రోలు, ట్రామ్‌లకు మాత్రమే ఉపయోగించబడుతుంది.[3]

       2022 నాటికి దేశం లోని మొత్తం రైలు నెట్‌వర్క్ విద్యుద్దీకరించబడుతుందని భారతీయ రైల్వేలు   2017 మార్చి 31న ప్రకటించింది.[4][5] ఇది నూతన భావన కానప్పటికీ, ఇప్పుడు భారతదేశంలో విద్యుదీకరణ ₹35,000కోట్ల ($4.4బిలియన్ అమెరికన్ డాలర్లు) తాజా పెట్టుబడితో మొత్తం నెట్‌వర్క్‌ను విద్యుద్దీకరించడానికి, రవాణా కింద ఇంధన ఖర్చును తగ్గించడానికి కట్టుబడి ఉంది, తద్వారా మొత్తం ₹10,500 కోట్ల (US$1.3 బిలియన్ అమెరికన్ డాలర్లు)భారీ ఆదా అవుతుంది. రైల్వే మౌలిక సదుపాయాల కల్పనలో, ఆధునీకరణలో పెట్టుబడులను సద్వినియోగం చేసుకునే దిశలోఈ పొదుపు ప్రభుత్వానికి ఒక వరం అవుతుంది. [6] 2022 నాటికి రైల్వే విద్యుద్దీకరణ కోసం వార్షిక ప్రాతిపదికన దాదాపు 30 బిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది తద్వారా సంప్రదాయ శక్తి ఐ. పి. పి లకు అద్భుతమైన అవకాశాలకు దారి తీస్తుంది.[5]


సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్

      భారతీయ రైల్వేలు ట్రాఫిక్ సాంద్రత, భద్రతా అవసరాల ఆధారంగా రైలు కార్యకలాపాలను నిర్వహించడానికి అనేక రకాల సిగ్నలింగ్ సాంకేతికతలు, పద్ధతులను ఉపయోగిస్తుంది.

      2020 మార్చి నాటికి, దాదాపు 3,309 కిమీ (2,056 మైళ్ళు) మార్గం రైలు కార్యకలాపాల కోసం ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్‌ను ఉపయోగిస్తుంది - అధిక సాంద్రత గల మార్గాలు, పెద్ద నగరాలు, జంక్షన్‌లలో కేంద్రీకృతమై ఉంది[1]. మిగిలిన మార్గాలు సాధారణంగా స్టేషన్లలో ఉన్న సిగ్నల్ బాక్స్‌ల నుండి సిగ్నల్ మెన్ ద్వారా మానవీయంగా నియంత్రించబడే రైళ్లతో సంపూర్ణ బ్లాక్ సిగ్నలింగ్‌పై ఆధారపడి ఉంటాయి. కొన్ని తక్కువ ట్రాఫిక్ సాంద్రత గల మార్గాలు ఇప్పటికీ టోకెన్‌ల భౌతిక మార్పిడి ఆధారంగా ట్రాక్ క్లియరెన్స్‌పై కమ్యూనికేషన్‌తో మాన్యువల్ బ్లాక్ సిగ్నలింగ్ పద్ధతులను ఉపయోగిస్తున్నాయి.[2] కొన్ని విభాగాలలో, తక్కువ పెట్టుబడితో లైన్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడానికి ఇంటర్మీడియట్ బ్లాక్ సిగ్నలింగ్ అందించబడుతుంది. భారతీయ రైల్వేలో 2020 మార్చి నాటికి, 602 బ్లాక్ విభాగాలు ఇంటర్మీడియట్ బ్లాక్ సిగ్నల్‌లను ఏర్పాటు చేయబడినాయి. [1] 

      భారతీయ రైల్వేలు ప్రధానంగా సెమాఫోర్స్, డిస్క్-ఆధారిత సిగ్నలింగ్ (స్థానం లేదా రంగుపై ఆధారపడి ఉంటుంది) స్థానంలో రంగుల సిగ్నల్ లైట్లను ఉపయోగిస్తుంది.[3] భారతీయ రైల్వేలు దాని నెట్‌వర్క్‌లో రెండు-కోణాలు, మూడు-కోణాలు, నాలుగు (లేదా బహుళ) రంగుల సిగ్నలింగ్‌ని ఉపయోగిస్తుంది.[4]

     మానవ సిగ్నలింగ్ లోపాలను తొలగించడానికి  చాలా స్టేషన్లలో సిగ్నల్స్ ప్యానెల్ ఇంటర్‌లాకింగ్, రూట్-రిలే ఇంటర్‌లాకింగ్ లేదా ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ పద్ధతులను ఉపయోగించి ఇంటర్‌లాక్ చేయబడినాయి.  భారతీయ రైల్వేలు రైలు గుర్తింపు కోసం ట్రాక్ సర్క్యూట్‌ని, యాక్సిల్ కౌంటర్‌లను వినియోగిస్తున్నది., భారతీయ రైల్వేలు అంతటా 2017 మార్చి నాటికి 6,018 స్టేషన్‌లు ఇంటర్‌లాక్డ్ స్టేషన్‌లు, మల్టీ-అస్పెక్ట్ సిగ్నలింగ్‌ను కలిగి ఉన్నాయి. దాదాపు 99% కీలక మార్గాలు (ఏ. బి. సీ., డి  ) ఆటోమేటెడ్ రైలు గుర్తింపు కోసం ట్రాక్ సర్క్యూట్ లేదా బ్లాక్ ప్రూవింగ్ యాక్సిల్ కౌంటర్‌లను కలిగి ఉన్నాయి. అలాగే, భారతీయ రైల్వేలు భారతదేశం అంతటా 59,105 రూట్ కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది, ఇది రైలు నియంత్రణ, వాయిస్, డేటా కమ్యూనికేషన్ కోసం ఉపయోగించబడుతుంది. దాదాపు 3,445 కి. మీ  (2,141 మైల్స్ ) మార్గం జి. ఎస్. ఎమ్. –ఆర్  ఆధారిత మొబైల్ రైలు రేడియో కమ్యూనికేషన్ ద్వారా కవర్ చేయబడింది.[1]

     2017 డిసెంబరులో, ₹12,000 కోట్ల ( $1.5 బిలియన్ అమెరికన్ డాలర్ల ) పెట్టుబడితో కీలక మార్గాల్లో సిగ్నలింగ్, నియంత్రణ కోసం ఈ.టి.సీ.ఎస్. స్థాయి 2 వ్యవస్థను అమలు చేయనున్నట్లు భారతీయ రైల్వేలు ప్రకటించింది.[5] ప్రస్తుతం భారతీయ రైల్వేలు రద్దీగా ఉండే ఘజియాబాద్- కాన్పూర్ మార్గంలో సెంట్రలైజ్డ్ ట్రాఫిక్ కంట్రోల్ (సి.టి.సీ)ని, ముంబై, కోల్‌కతా సబర్బన్ రూట్లలో వాస్తవ సమయం రైలు పర్యవేక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తోంది.[1]


బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ వారానికి నాలుగు సార్లు కోల్‌కతా నుండి ఢాకా వరకు నడిచే మైత్రీ  ఎక్స్ ప్రెస్, 2017 నవంబరులో కోల్‌కతా, ఖుల్నాల మధ్య వాణిజ్య ప్రయాణాలను ప్రారంభించిన వీక్లీ బంధన్ ఎక్స్ ప్రెస్, న్యూ జల్‌పైగురి జంక్షన్, ఢాకా మధ్య నడిచే రెండు వారాల మిథాలీ  ఎక్స్ ప్రెస్ ద్వారా అనుసంధానించబడి ఉంది.[3]

భారత, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు ఉపరితల రవాణాను సులభతరం చేయడానికి నూతన  రైలు మార్గానికి సంబంధించిన పనిని ప్రారంభించాయి.[4] భారతదేశం త్రిపుర రాజధాని అగర్తలాను బంగ్లాదేశ్ యొక్క ఆగ్నేయ నగరం అఖౌరాతో కలిపే 13 కిమీ (8.1 మైళ్ళు) రైలును నిర్మిస్తుంది, ఇది చిట్టగాంగ్ పోర్ట్, రిసోర్స్-రిచ్ సిల్హెట్, ఢాకాకి అనుసంధానించబడిన ఒక ముఖ్యమైన రైల్వే జంక్షన్.[5] 2010 జనవరిలో భారతదేశ పర్యటన సందర్భంగా అప్పటి భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ షేక్ హసీనా మధ్య రైల్వే ప్రాజెక్ట్ అమలుకు ఒప్పందం జరిగింది.[6] ప్రతిపాదిత ప్రాజెక్ట్ యొక్క మొత్తం వ్యయం ₹252 కోట్లు ($32 మిలియన్ల అమెరికన్ డాలర్లు)గా అంచనా వేయబడింది. ఇండియన్ రైల్వే కన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఐ.ఆర్.సి.ఓ.ఎన్.) సరిహద్దుకు ఇరువైపులా కొత్త రైల్వే ట్రాక్‌లను నిర్మిస్తోంది. 13 కి. మీ. (8.1 మైళ్ళు) రైలు మార్గంలో, 5 కి. మీ. (3.1 మైళ్ళు) ట్రాక్‌లు భారత భూభాగంలో ఉన్నాయి.[7][8] ఈశాన్య సరిహద్దు రైల్వేలు (ఎన్.ఎఫ్.ఆర్ ), త్రిపుర యొక్క దక్షిణ సరిహద్దు పట్టణం సబ్‌రూమ్ - అగర్తలాకు దక్షిణంగా 135 కిమీ (84 మైళ్ళు) దూరంలో భారతదేశం వైపు మరొక కొత్త రైలు లింక్ కోసం అనుసంధాన ట్రాక్‌లను కూడా వేస్తోంది ఉంది. సబ్రూమ్ నుండి, చిట్టగాంగ్ అంతర్జాతీయ సముద్ర ఓడరేవు 72 కిమీ (45 మైళ్ళు) దూరంలో ఉంది.[9]


భూటాన్

  2021 నాటికి భూటాన్‌తో ప్రస్తుతం రైలు మార్గం లేదు. పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్‌పైగురి-అలీపుర్‌దువార్ లైన్‌లోని హసిమారా నుండి భూటాన్‌లోని పసాఖా పట్టణం సమీపంలోని తోరిబారి వరకు 18 కిమీ (11 మైళ్ళు) పొడవైన రైలు మార్గాన్ని సతాలి, భర్నా బారి, దల్సింగ్‌పారా మీదుగా నిర్మించాలని ప్రణాళిక చేయబడింది. [10][11] అయితే స్థానికుల వ్యతిరేకత కారణంగా ఈ ప్రాజెక్ట్ రద్దు చేయబడింది.[11] భారతీయ రైల్వేలు 2020లో, న్యూ జల్‌పైగురి-అలీపుర్‌దువార్ లైన్‌లోని ముజ్నై నుండి సామ్ట్సేలోని ఫుయంత్‌షోపెల్రి గెవాగ్ కింద ఉన్న నెయోపలింగ్ గ్రామం వరకు 37.5 కిమీ (23.3 మైళ్ళు) పొడవైన లైన్ కోసం నూతన  లైన్ సర్వేను నిర్వహించింది.


మయన్మార్

2021 నాటికి మయన్మార్‌తో రైలు మార్గం లేదు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న జిరిబామ్-ఇంఫాల్ రైలు మార్గాన్ని మోరే వద్ద ఇండో-మయన్మార్ సరిహద్దు వరకు విస్తరించాలని, మయన్మార్ వైపు టముకు అనుసంధానం చేయాలని ప్రణాళిక చేయబడింది.[13][13] 14] కలాయ్-పకోక్కు-చాంగ్ యు-మ్యుహాంగ్ (మండలే) లైన్‌లోని కాలే వద్ద ఉన్న రైలుమార్గానికి టము నుండి ఒక మిస్సింగ్ లింక్‌ను నిర్మించాలి.[13][14] ఆర్.ఐ. టి ఇ. ఎస్ లిమిటెడ్ ద్వారా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన సాధ్యాసాధ్యాల అధ్యయనం ప్రకారం, ఈ మిస్సింగ్ లింక్ నిర్మాణానికి ₹29.41 బిలియన్లు ($370 మిలియన్ అమెరికన్ డాలర్ల) వ్యయం ఖర్చవుతుందని అంచనా వేయబడింది.[14][15]


నేపాల్

2021 నాటికి నేపాల్‌కు రెండు రైలు మార్గాలు ఉండగా, మూడవది నిర్మాణంలో ఉంది. 2004లో భారతదేశం, నేపాలీ ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం 2005[16]లో రాక్సాల్ నుండి సిర్సియా (బిర్‌గంజ్ సమీపంలో) వరకు 6 km-పొడవు (3.7 మైళ్ళు) లైన్ తెరవబడింది.[17] 2018లో రాక్సాల్-బిర్‌గంజ్ మార్గాన్ని నేపాలీ రాజధాని ఖాట్మండు వరకు విస్తరించడానికి భారతదేశం, నేపాలీ ప్రభుత్వాల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది.[18] జయనగర్ నుండి జనక్‌పూర్ మార్గం 2020లో కుర్తా[19][20] వరకు తెరవబడింది, ఆ తర్వాత ఈ విభాగం 2021లో నేపాల్ రైల్వేలకు అప్పగించబడింది.[21] నేపాల్ రైల్వేల సిబ్బంది సమస్యల కారణంగా 2022 ఏప్రిల్ వరకు ఈ విభాగంలో సేవలు ప్రారంభం కాలేదు.[22][23] కుర్తా-బిజల్‌పురా నిర్మాణం జరుగుతోంది, ఈ మార్గాన్ని బర్దిబాస్ వరకు పొడిగించాలని ప్రతిపాదించబడింది.[24]

2021 నాటికి 18.6 కి. మీ -పొడవు (11.6 మైళ్ళు) జోగ్బాని నుండి బిరత్‌నగర్ రైల్వే లైన్ నిర్మాణం జరుగుతోంది. బత్నాహా నుండి నేపాల్ కస్టమ్స్ పాయింట్ వరకు 8 కిలోమీటర్ల (5.0 మైళ్ళు) రైల్వే లైన్‌తో కూడిన మొదటి దశ ఇప్పటికే పూర్తయింది, మిగిలిన భాగం నేపాల్ కస్టమ్స్ పాయింట్ నుండి బిరత్‌నగర్ వరకు ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉంది.[25]


పాకిస్తాన్

పాకిస్తాన్‌కు రెండు రైళ్లు నడుస్తాయి: ఢిల్లీ, లాహోర్ మధ్య సంఝౌతా  ఎక్స్  ప్రెస్, జోధ్‌పూర్, కరాచీ మధ్య థార్ ఎక్స్ ప్రెస్. అయితే, 2019 ఆగస్టు నాటికి, కాశ్మీర్‌పై ఉద్రిక్తతల  కారణంగా అవి రద్దు చేయబడ్డాయి.


శ్రీలంక

ప్రస్తుతం శ్రీలంకతో రైలు అనుసంధానం లేదు. అయితే ప్రారంభంలో బోట్ మెయిల్ లేదా ఇండో-సిలోన్ ఎక్స్ ప్రెస్, మద్రాస్ (చెన్నై ఎగ్మోర్) నుండి ట్యూటికోరిన్ (తూత్తూకుడి) నుండి రైలు ద్వారా, ట్యూటికోరిన్ నుండి కొలంబో స్ట్రీమర్ ద్వారా అనుసంధానించబడింది. తరువాత ఈ లింక్ మూడు విభాగాలలో నడిచింది: 1) మద్రాస్ (చెన్నై ఎగ్మోర్) నుండి ధనుష్కోడి పీర్ నుండి బోట్ మెయిల్ లేదా ఇండో-సిలోన్ ఎక్స్ ప్రెస్  ద్వారా 2) ధనుష్కోడి పీర్ నుండి తలైమన్నార్ బోట్ ద్వారా, 3) తలైమన్నార్ నుండి కొలంబో మీదుగా యల్జ్‌పన్నం (జఫ్నా) రైలు ద్వారా.

1900లలో భారతదేశం, సిలోన్ (ప్రస్తుతం శ్రీలంక) మధ్య రైలు, స్టీమర్ ఫెర్రీ సర్వీస్ ఉండేది. ఈ వ్యవస్థ మొదట్లో చెన్నై, కొలంబోలను కలుపుతూ, రైలు నుండి సముద్ర ఆపరేషన్‌ను ఉపయోగించింది. అయితే  తరువాత రైలు నుండి సముద్రానికి -, సముద్రం నుండి  రైలుకు మార్చబడింది.  ఈ ప్రయాణంలో ప్రయాణీకులు ప్రయాణానికి ఒకే టిక్కెట్‌ను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం, ఇది చెన్నై ఎగ్మోర్ నుండి విల్లుపురం, కుంభకోణం, తిరుచ్చి, కారైక్కుడి, దేవకోట్టై, మనమదురై, పరమక్కుడి, రామనాథపురం, మండపం, పాంబన్ మీదుగా రామేశ్వరం వరకు నడుస్తోంది.[26]

టుటికోరిన్-కొలంబో: 19వ శతాబ్దం చివరలో, భారతదేశంలోని మార్గంలో రైల్వే భాగం మద్రాసు (చెన్నై) నుండి టుటికోరిన్ వరకు ఉండేది. టుటికోరిన్ వద్ద, ప్రయాణికులు సిలోన్‌లోని కొలంబోకు బోట్ మెయిల్ స్టీమర్‌లో బయలుదేరెవారు. రైలు మద్రాసు నుండి టుటికోరిన్ వరకు 21 గంటల 50 నిమిషాలు పట్టేది. బోట్ మెయిల్ అనేది 1898లో వెస్టిబుల్ క్యారేజీలను అందించిన ప్రారంభ రైళ్లలో ఒకటి.[27]

ధనుష్కోడి-తలైమన్నార్: 1914లో పాంబన్ వంతెన నిర్మించిన తర్వాత, రైలు మార్గం మార్చబడి మద్రాసు నుండి ధనుష్కోడికి వెళ్ళింది. చాలా తక్కువ ఫెర్రీ సర్వీస్ తర్వాత ప్రయాణికులను సిలోన్‌లోని తలైమన్నార్‌కు తీసుకువెళ్లింది, అక్కడి నుండి మరొక రైలు కొలంబోకు వెళ్లింది. 35 కిలోమీటర్లు (22 మైళ్ళు) పొడవైన ఫెర్రీ ప్రయాణం 270 కిలోమీటర్లు (170 మైళ్ళు) పొడవైన టుటికోరిన్-కొలంబో మార్గం కంటే చాలా తక్కువగా ఉంది.[28][29]


రైళ్లల్లో  రకాలు

వివరణ

వందే భారత్ ఎక్స్ ప్రెస్

వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ద్వారా 2019 ఫిబ్రవరి 15న జెండా ఊపి ప్రారంభం చేయబడింది.  వందే భారత్ ఎక్స్ ప్రెస్ వై-ఫై, స్నాక్ టేబుల్‌లు, సి.సి.టి.వీ కెమెరాలు, హైడ్రాలిక్-ప్రెజర్ డోర్లు, మంటలు, పొగను గుర్తించే, చల్లార్చే వ్యవస్థ వంటి సౌకర్యాలతో కూడిన సెమీ-హై-స్పీడ్, ఎయిర్ కండిషన్డ్  పగటిపూట ప్రయాణంచేసే రైలు. ఇది గంటకు 200 కిలోమీటర్లు (120 మైళ్ళు) వేగంతో ప్రయాణించగలదు. ఇది భారతదేశంలో తయారు చేయబడిన మొదటి సెమీ-హై స్పీడ్ (ఈ.ఎమ్.యూ.) రైలు సెట్.

గతిమాన్ ఎక్స్ ప్రెస్

ఢిల్లీ, ఝాన్సీల మధ్య గంటకు 160 కిలోమీటర్లు (99 మైళ్ళు) వేగంతో నడుస్తున్న మొదటి సెమీ-హై-స్పీడ్, ఎయిర్ కండిషన్డ్ రైలు .

తేజస్ ఎక్స్ ప్రెస్

సెమీ-హై-స్పీడ్, ఎయిర్ కండిషన్డ్ రైలు 2017 మే 24న 8 గంటల 30 నిమిషాలలో 551.7 కిమీ (342.8 మైళ్ళు) ప్రయాణించి దాని ప్రారంభ పరుగును ప్రారంభించింది.

కోచ్‌లలో బయో-వాక్యూమ్ టాయిలెట్లు, నీటి-స్థాయి సూచికలు, ట్యాప్ సెన్సార్లు, హ్యాండ్ డ్రైయర్‌లు, ఇంటిగ్రేటెడ్ బ్రెయిలీ డిస్‌ప్లేలు, ఫోన్ జాక్‌తో కూడిన ప్రతి ప్రయాణికుడికి ఎల్.ఇ డి టి.వీ, స్థానిక వంటకాలు, వై-ఫై, టీ, కాఫీ వెండింగ్ మెషీన్లు, మ్యాగజైన్‌లు, స్నాక్ టేబుల్‌లు ఉన్నాయి. సి.సి.టి.వీ కెమెరాలు, అగ్ని, పొగను గుర్తించే, ఆర్పే వ్యవస్థ ఏర్పాటు. ఇది గంటకు 200 కిలోమీటర్లు (120 మైళ్ళు) వేగంతో పరుగెత్తగలదు.  కానీ కొన్ని సాంకేతిక కారణాల వలన ఇది గంటకు 130 కిలోమీటర్లు (81 మైళ్ళు)కి పరిమితం చేయబడింది.

తేజస్-రాజధాని ఎక్స్ ప్రెస్

సెమీ-హై-స్పీడ్, ఎయిర్ కండిషన్డ్ రైలు 2021 ఫిబ్రవరి 15న 40 గంటల 5 నిమిషాల్లో 2,424 కిమీ (1,506 మైళ్ళు) ప్రయాణించి దాని ప్రారంభ పరుగును ప్రారంభించింది. కోచ్‌లలో బయో-వాక్యూమ్ టాయిలెట్లు, నీటి-స్థాయి సూచికలు, ట్యాప్ సెన్సార్లు, హ్యాండ్ డ్రైయర్‌లు, ఇంటిగ్రేటెడ్ బ్రెయిలీ డిస్‌ప్లేలు, ఫోన్ జాక్‌తో కూడిన ప్రతి ప్రయాణికుడికి ఎల్.ఇ.డి టి.వీ, స్థానిక వంటకాలు, వై-ఫై, టీ, కాఫీ వెండింగ్ మెషీన్లు, మ్యాగజైన్‌లు, స్నాక్ టేబుల్‌లు ఉన్నాయి.  సి.సి.టి.వీ కెమెరాలు, అగ్ని, పొగను గుర్తించే, ఆర్పే వ్యవస్థ ఏర్పాటు. ఇది గంటకు 160 కిలోమీటర్లు (99 మైళ్ళు) వేగంతో పరుగెత్తగలదు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వలన గంటకు 130 కిలోమీటర్లు (81 మైళ్ళు)కి పరిమితం చేయబడింది.

రాజధాని ఎక్స్ ప్రెస్

గంటకు 130–140 కిలోమీటర్లు (81–87 మైళ్ళు) గరిష్ఠ వేగంతో రాష్ట్ర రాజధానులను జాతీయ రాజధాని న్యూఢిల్లీకి అనుసంధానించే పరిమిత-స్టాప్, ఎయిర్ కండిషన్డ్ రైళ్లు. 2014 రైల్వే బడ్జెట్ రాజధాని, శతాబ్ది ఎక్స్ ప్రెస్ ల సంఖ్యను గంటకు180 కిలోమీటర్లు (110 మైళ్ళు)కి పెంచాలని ప్రతిపాదించింది. భారతీయ రైల్వే కొన్ని మార్గాల్లో రేక్‌లను తేజస్ కోచ్‌లకు అప్‌గ్రేడ్ చేసింది, తద్వారా దీనిని తేజస్-రాజధాని ఎక్స్ ప్రెస్ అని పిలుస్తారు.

శతాబ్ది ఎక్స్ ప్రెస్

పగటిపూట ప్రయాణం కోసం ఎయిర్ కండిషన్డ్, ఇంటర్‌సిటీ రైళ్లు. రాజధాని లేదా దురంతో ఎక్స్ ప్రెస్ వలె కాకుండా, శతాబ్ది ఎక్స్ ప్రెస్ లు అదే రోజున ఒక రౌండ్ ట్రిప్ చేస్తాయి. భోపాల్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ (రైలు సంఖ్య 12001/12002) న్యూఢిల్లీ, ఆగ్రా మధ్య భారతదేశపు రెండవ వేగవంతమైన రైలు, సగటు వేగం గంటకు 90 కిలోమీటర్లు (56 మైళ్ళు), గరిష్ఠ వేగం గంటకు 150 కిలోమీటర్లు (93 మైళ్ళు). పరిమిత-స్టాప్ రైళ్లలో, వై-ఫై ఉంది.

దురంతో ఎక్స్ ప్రెస్

2009లో నాన్‌స్టాప్ (టెక్నికల్ హాల్ట్‌లు మినహా) సర్వీస్  ప్రవేశపెట్టబడింది. 2016 జనవరిలో, ఆ టెక్నికల్ స్టాప్‌ల నుండి టిక్కెట్‌లను బుక్ చేసుకోవడం సాధ్యమైంది. అవి భారతదేశం యొక్క మెట్రోలు, ప్రధాన రాష్ట్ర రాజధానులను కలుపుతాయి, రాజధాని ఎక్స్ ప్రెస్ వేగానికి సమానంగా (లేదా మించి) ప్రవేశపెట్టబడ్డాయి. ఎయిర్ కండిషన్డ్ వన్-, టూ-, లేదా త్రీ-టైర్ సీటింగ్‌తో, కొన్ని ఎయిర్ కండిషన్ లేని స్లీపర్-క్లాస్ వసతిని కలిగి ఉంటాయి.

హమ్‌సఫర్ ఎక్స్ ప్రెస్

స్టేషన్‌లు, రైలు వేగం గురించి సమాచారాన్ని ప్రదర్శించే ఎల్.ఇ.డి స్క్రీన్‌లతో ఎయిర్ కండిషన్డ్, త్రీ-టైర్ కోచ్ రైళ్లు, పి.ఏ సిస్టమ్, టీ, కాఫీ కోసం వెండింగ్ మెషీన్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాల కోసం ఛార్జింగ్ పోర్ట్‌లు, బయో-టాయిలెట్‌లు, పొగ అలారాలు, సి.సి.టి.వీ కెమెరాలు, కర్టెన్‌లు, ఆహారం కోసం వేడి, శీతలీకరణ సౌకర్యాలు. దీని ప్రారంభ ప్రయాణం గోరఖ్‌పూర్ నుండి ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య జరిగింది.

డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్

పగటిపూట ప్రయాణం కోసం ఎయిర్ కండిషన్డ్, పరిమిత-స్టాప్, టూ-టైర్ ఎక్స్ ప్రెస్ రైలు

ఉదయ్ ఎక్స్ ప్రెస్

రాత్రిపూట ప్రయాణానికి ఎయిర్ కండిషన్డ్ డబుల్ డెక్కర్ రైలు.

జన శతాబ్ది ఎక్స్ ప్రెస్

ఎయిర్ కండిషన్డ్, నాన్-ఎయిర్ కండిషన్డ్ తరగతులతో, గరిష్ఠ గంటకు 110 కిలోమీటర్లు (68 మైళ్ళు) వేగంతో మరింత-ఆర్ధిక రూపాంతరంచెందిన  శతాబ్ది ఎక్స్ ప్రెస్

ఇంటర్‌సిటీ ఎక్స్ ప్రెస్

హై, సెమీ-హై స్పీడ్‌లతో చిన్న మార్గాల్లో ప్రధాన నగరాలను  అనుసంధానం చేయడానికి  పరిచయం చేయబడింది.  ఇంటర్‌సిటీ ఎక్స్ ప్రెస్ ల ద్వారా ప్రయాణికులు  తమ ప్రయాణాన్ని మూల స్థానం నుండి ప్రారంభించి, వారి గమ్యాన్ని చేరుకుని, మరోసారి ఒకే రోజులో దాని మూలస్థానానికి తిరిగి రాగల సౌకర్యం . వీటిలో డెక్కన్ క్వీన్, ఫ్లయింగ్ రాణీ, పల్లవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, వైగై సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, శాతవాహన ఎక్స్ ప్రెస్, రత్నాచల్ ఎక్స్ ప్రెస్, కోయంబత్తూరు ఇంటర్‌సిటీ ఎక్స్ ప్రెస్, బిలాస్‌పూర్ -నాగ్‌పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్ ప్రెస్ కొన్ని రైళ్లలో ఉన్నాయి.

ఏ. సి  ఎక్స్ ప్రెస్

ప్రధాన నగరాలను కలుపుతూ, గంటకు దాదాపు 130 కిలోమీటర్లు (81 మైళ్ళు) వేగంతో పరిమిత-స్టాప్లు కలిగిన  ఎయిర్ కండిషన్డ్ రైళ్లు.  

గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్

గంటకు 130 కిలోమీటర్లు (81 మైళ్ళు) గరిష్ఠ వేగంతో త్రీ-టైర్ ఎయిర్ కండిషన్డ్ కలిగిన  ఎకానమీ రైళ్లు

యువ ఎక్స్ ప్రెస్

యువ భారతీయులకు ఎయిర్ కండిషన్డ్ ప్రయాణాన్ని అందించడానికి దురంతో ఎక్స్ ప్రెస్ తో పరిచయం చేయబడింది.  సీట్లలో 60 శాతం 18, 45 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రయాణీకులకు కేటాయించబడ్డాయి. రైళ్లు విజయవంతం కాలేదు, ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-ముంబై మార్గాలలో మాత్రమే నడుస్తాయి.

సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్

న్యూఢిల్లీకి ఎక్స్ ప్రెస్ సర్వీస్.

కవి గురు ఎక్స్ ప్రెస్

రవీంద్రనాథ్ ఠాగూర్ గౌరవార్థం  రైల్వే నెట్‌ వర్క్ లో  ప్రవేశపెట్టబడిన నాలుగు జతల రైళ్లు.

వివేక్ ఎక్స్ ప్రెస్

2013లో స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకుని దేశంలో నాలుగు జతల వివేక్ ఎక్స్ ప్రెస్ లు ప్రవేశపెట్టబడినాయి .

రాజ్య రాణి ఎక్స్ ప్రెస్

రాష్ట్ర రాజధానులను ఆ రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు అనుసంధానం చేయడానికి ప్రవేశపెట్టబడింది.

మహామన ఎక్స్ ప్రెస్

భారతీయ రైల్వేల మోడల్ రేక్ కోచ్‌లతో కూడిన సూపర్‌ఫాస్ట్ రైలు.

అంత్యోదయ ఎక్స్ ప్రెస్

రద్దీని తగ్గించడానికి రద్దీ  రైలు మార్గాలలో రిజర్వ్ చేయని, హై-స్పీడ్ ఎల్. ఎచ్. బి  కోచ్‌లతో .

జన సామాన్య్ ఎక్స్ ప్రెస్

రద్దీని తగ్గించడానికి రద్దీ  రైలు మార్గాలలో రిజర్వ్ చేయని ఎక్స్ ప్రెస్ రైళ్లు.

సువిధ ఎక్స్ ప్రెస్

అధిక డిమాండ్ ఉన్న మార్గాలలో డైనమిక్ ధరలతో అధిక ప్రాధాన్యత కలిగిన రైళ్లు.

జనతా ఎక్స్ ప్రెస్

జనతా అంటే దేవనాగరిలో "సామాన్య ప్రజలు".  ఇవి భారతీయ రైల్వేలోని వివిధ మార్గాల్లో నడిచే ఎక్స్ ప్రెస్ రైళ్ల శ్రేణి.

గరీబ్ నవాజ్ ఎక్స్ ప్రెస్

భారతీయ రైల్వేలోని వివిధ మార్గాల్లో గరీబ్ నవాజ్ ఎక్స్ ప్రెస్ పేరుతో నడిచే ఎక్స్ ప్రెస్ రైళ్ల శ్రేణి.

సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్

గరిష్ఠ వేగం గంటకు 100–110 కిలోమీటర్లు (62–68 మైళ్ళు) కంటే ఎక్కువ, సగటు వేగం గంటకు 55 కిలోమీటర్లు (34 మైళ్ళు) కంటే ఎక్కువగా ఉండే రైళ్లు. చాలా తక్కువ స్టేషన్లలో స్టాప్‌లు ఉన్నందున, ఈ రైళ్ల టిక్కెట్‌లకు సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జ్ ఉంటుంది.

ఎక్స్ ప్రెస్

గరిష్ఠ వేగం గంటకు 100 కిలోమీటర్లు (62 మైళ్ళు), సగటు వేగం గంటకు 36 కిలోమీటర్లు (22 మైళ్ళు) కంటే ఎక్కువ ఉన్న రైళ్లు, కొన్ని స్టేషన్లలో స్టాప్‌లు ఉంటాయి.

మెయిల్

ఈ రైళ్లకు ఇంతకు ముందు ప్రత్యేక మెయిల్ కోచ్‌లు ఉండేవి. ఈ రోజుల్లో, అన్ని ఇతర రైళ్ల మాదిరిగానే లగేజ్ కోచ్‌లో మెయిల్ తీసుకువెళతారు, చారిత్రక మెయిల్ రైళ్లు "మెయిల్" బ్రాండింగ్‌ను నిలుపుకోవడం ద్వారా ఎక్స్ ప్రెస్ రైలుగా నడుస్తాయి.

ప్యాసింజర్ రైళ్లు

ఒక మార్గంలో ప్రతి (లేదా దాదాపు ప్రతి) స్టేషన్‌లో ఆగిపోయే నెమ్మదిగా, తక్కువ చార్జి లతో  ఉండే రైళ్లు. సాధారణంగా-రిజర్వ్ చేయని సీటింగ్‌తో, ఈ రైళ్లు గంటకు40–80 కిలోమీటర్లు (25–50 మైళ్ళు) వేగంతో ప్రయాణిస్తాయి.

లింక్/స్లిప్ ఎక్స్ ప్రెస్ /ప్యాసింజర్

ఇది ఒక నిర్దిష్ట స్టేషన్‌లో మరొక రైలుకు జోడించబడి, గమ్యస్థానం వరకు ఒకే రైలుగా కలిసి నడుస్తుంది లేదా రైలు ప్రారంభ స్థానం నుండి కలిసి నడుస్తుంది, నిర్దిష్ట స్టేషన్‌లో వేరు చేయబడుతుంది. కలిసి నడుస్తున్నప్పుడు, లింక్ ఎక్స్ ప్రెస్ /ప్యాసింజర్ అని, విడిగా నడుస్తున్నప్పుడు, స్లిప్ ఎక్స్ ప్రెస్ /ప్యాసింజర్ అని పిలుస్తారు.[1]

సబర్బన్ ట్రైన్స్  

ఈ రైళ్లు ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, వడోదర, సూరత్, బెంగళూరు, పూణే, కాన్పూర్, లక్నో మధ్య నడుస్తాయి, సాధారణంగా ప్రతి స్టేషన్‌లో ఆగుతాయి, రిజర్వ్ చేయని సీటింగ్ ఉంటుంది.

మెట్రో

పట్టణ రవాణా కోసం రూపొందించబడినవి. 1984లో మొదటి మెట్రో  కోల్‌కతా మెట్రో రైలు.[2]

మౌంటైన్ రైల్వేస్

మూడు లైన్లు యునెస్కోచే "మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా"గా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడ్డాయి.[3]

సరిహద్దు రైల్వేలు

భారతదేశం, ఇతర పొరుగు దేశాలను కలుపుతూ అంతర్జాతీయ ఎక్స్ ప్రెస్ లేదా ప్యాసింజర్ రైలు సర్వీస్.

భారతీయ రైల్వే దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రసిద్ధ పర్యాటక సర్క్యూట్లలో టూరిస్ట్ రైలు లేదా కోచ్ సేవలను నిర్వహిస్తుంది. ఈ సర్వీస్ రైలు ప్రయాణం, స్థానిక రవాణా, వసతి, ఆహారం, గైడెడ్ టూర్‌లతో కూడిన టూర్ ప్యాకేజీలను అందిస్తుంది. భారతీయ రైల్వేలు   ఈ విభాగంలో లగ్జరీ టూరిస్ట్ రైళ్లు, సెమీ లగ్జరీ రైళ్లు, బౌద్ధ ప్రత్యేక రైళ్లు, భారత్ దర్శన్ రైళ్లు, ఆస్తా సర్క్యూట్ రైళ్లు, స్టీమ్ రైళ్లు వంటి వివిధ పర్యాటక సేవలను అందిస్తుంది. [1]

ప్యాలెస్ ఆన్ వీల్స్ :

ప్యాలెస్ ఆన్ వీల్స్ అనే రాజస్థాన్‌లో పర్యాటకాన్ని [2]ప్రోత్సహించడానికి తరచుగా ఆవిరి ఇంజిన్  ద్వారా నడుపబడుతున్న  ఒక విలాసవంతమైన -రైలు సేవ.  ఈ రైలు న్యూ ఢిల్లీ నుండి జైపూర్, సవాయి మాధోపూర్, చిత్తౌర్‌గఢ్, ఉదయపూర్, జైసల్మేర్, జోధ్‌పూర్, భరత్‌పూర్, ఆగ్రా మీదుగా రౌండ్ ట్రిప్‌లో ఏడు రాత్రులు, ఎనిమిది రోజుల ప్రయాణాన్ని కలిగి ఉంది.

రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్:

రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ రాజస్థాన్‌లోని అనేక పర్యాటక ప్రదేశాలను ప్రదర్శింపచేస్తుంది. ఏడు రోజుల, ఎనిమిది రాత్రుల పర్యటన న్యూ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ స్టేషన్ నుండి మొదలై జోధ్‌పూర్, ఉదయపూర్, చిత్తౌర్‌ఘర్, రణతంబోర్ నేషనల్ పార్క్, జైపూర్, ఖజురహో, వారణాసి, సారనాథ్, ఆగ్రా మీదుగా ఒక రౌండ్ ట్రిప్. [3]

మహారాజాస్  ఎక్స్ ప్రెస్ :

ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐ.ఆర్.సి.టి.సి) ద్వారా నిర్వహించబడే ఒక విలాసవంతమైన రైలు.  మహారాజాస్ ఎక్స్ ప్రెస్ అక్టోబరు నుండి ఏప్రిల్ వరకు వాయువ్య, మధ్య భారతదేశం (రాజస్థాన్ చుట్టూ కేంద్రీకృతమై) 12 గమ్యస్థానాలకు ఐదు మార్గాల్లో[4] నడుస్తుంది.

దక్కన్ ఒడిస్సీ :

మహారాష్ట్ర, గోవాలోని పర్యాటక ప్రాంతాలను కవర్ చేస్తుంది. దక్కన్ ఒడిస్సీ యొక్క  ఏడు రాత్రుల, ఎనిమిది రోజుల పర్యటన ముంబైలో ప్రారంభమవుతుంది, జైగడ్ కోట, గణపతిపూలే, రత్నగిరి, సింధుదుర్గ్, తార్కర్లీ, సావంత్‌వాడి, గోవా, కొల్హాపూర్, పూణే (5వ రోజు), ఔరంగాబాద్, ఎల్లోరా గుహలు,, అజంతా గుహలు, నాసిక్‌లలో ఆగుతుంది.[ 5]

గోల్డెన్ చారియట్ :

ప్రైడ్ ఆఫ్ ది సౌత్[6], స్ప్లెండర్ ఆఫ్ ది సౌత్ అనే రెండు పర్యటనలలో నడుస్తున్న విలాసవంతమైన రైలు సేవ:.[7]

మహాపరి నిర్వాణ ఎక్స్ ప్రెస్,

బౌద్ధ యాత్రికుల  సేవ కోసం ఐ.ఆర్.సి.టి.సి ద్వారా నిర్వహించబడే మహాపరి నిర్వాణ ఎక్స్ ప్రెస్ లేదా బౌద్ధ సర్క్యూట్ రైలు అని కూడా పిలువబడే ఎయిర్ కండిషన్డ్ రైలు.  ఈ సేవ ఏడు-రాత్రుల ఎనిమిది రోజుల పర్యటన న్యూ ఢిల్లీలో ప్రారంభమవుతుంది, బోధ్ గయా, రాజ్‌గిర్, నలంద, వారణాసి, సారనాథ్, కుషీనగర్, లుంబినీ, శ్రావస్తి, తాజ్ మహల్‌లను ప్రదర్శింపచేస్తుంది.[8]

ఫెయిరీ క్వీన్,

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఆపరేటింగ్ స్టీమ్ ఇంజన్ గా  కూడా పిలువబడే ఈ పర్యాటక ఆకర్షక విలాసవంతమైన -రైలు సేవ  ఢిల్లీ నుండి అల్వార్ వరకు నడుస్తుంది .


టికెటింగ్ విధానం :

భారతీయ రైల్వేలో  టికెట్ రిజర్వేషన్‌లు 1980ల చివరి వరకు మానవీయంగా చేయబడ్డాయి. భారతీయ రైల్వేలు 1987 చివరలో కంప్యూటరైజ్డ్ టికెటింగ్ సిస్టమ్‌ను ఉపయోగించడం ప్రారంభించింది. స్థితి, లభ్యతపై ప్రస్తుత సమాచారాన్ని అందించడానికి సిస్టమ్ 1995లో ఆన్‌లైన్‌లోకి వచ్చింది. మారుమూల ప్రాంతాలను మినహాయించి స్టేషన్లలో టికెటింగ్ నెట్‌వర్క్ కంప్యూటరైజ్ చేయబడింది. భారతీయ రైల్వేలు ప్రస్తుతం దేశంలోని ఏదైనా రెండు రైలు స్టేషన్ల మధ్య టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయాణీకుల కోసం అనేక మార్గాలను కల్పించింది. భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ వెబ్‌సైట్, స్మార్ట్‌ఫోన్ యాప్‌లు, ఎస్. ఎమ్. ఎస్లు, రైలు స్టేషన్‌లలో రైలు రిజర్వేషన్ కౌంటర్‌లు లేదా ప్రైవేట్ టిక్కెట్ బుకింగ్ కౌంటర్‌ల ద్వారా 120 రోజుల ముందుగానే రిజర్వు చేయబడిన టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. రిజర్వ్ చేయబడిన సీటు లేదా బెర్త్‌తో తక్కువ సమయ వ్యవదిలో  ప్రయాణించాలనుకునే ప్రయాణీకులు తత్కాల్ రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు. అయితే అలాంటి టిక్కెట్‌లను సాధారణ ముందస్తు రిజర్వేషన్ టిక్కెట్‌ల కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తారు.[1]

ధ్రువీకరించబడిన రిజర్వేషన్ టిక్కెట్‌లు ప్రయాణీకుల వివరాలు, టిక్కెట్‌పై వారికి కేటాయించిన బెర్త్ లేదా సీట్ నంబర్ (ల)తో పాటుగా చూపబడతాయి. నిర్దిష్ట రైలులో రిజర్వేషన్ అందుబాటులో లేకుంటే, టిక్కెట్‌పై వెయిటింగ్-లిస్ట్ నంబర్ ఉంటుంది. వెయిట్-లిస్ట్ టిక్కెట్‌ను కలిగి ఉన్న వ్యక్తి ధ్రువీకరించబడిన టిక్కెట్‌ను పొందడానికి తగినంత రద్దు కోసం వేచి ఉండాలి. బయలుదేరే రోజున వారి టికెట్ ధ్రువీకరిణ కాకపోతే వారు ప్రయాణం చేయడానికి అనుమతి లేదు.  క్యాన్సిలేషన్ టిక్కెట్‌లకు వ్యతిరేకంగా రిజర్వేషన్ (ఆర్.ఏ.సీ), వెయిటింగ్, కన్ఫర్మ్ లిస్ట్‌ల మధ్య, టికెట్ హోల్డర్‌ను రైలు ఎక్కేందుకు అనుమతిస్తారు, టిక్కెట్ కలెక్టర్ ఖాళీగా ఉన్న సీటును గుర్తించిన  తర్వాత కలెక్టర్ కేటాయించిన  సీటును పొందవచ్చు. [2]

తక్కువ దూరం లేదా  ముందుగా ప్రణాళిక లేని ప్రయాణాల కోసం అన్‌రిజర్వ్ చేయని టిక్కెట్‌లను బయలుదేరే ముందు ఎప్పుడైనా స్టేషన్‌లలో కొనుగోలు చేయవచ్చు. అటువంటి టిక్కెట్లు ఉన్నవారు సాధారణ కంపార్ట్‌మెంట్లలో మాత్రమే ప్రయాణం చేయవచ్చును. సబర్బన్ నెట్‌ వర్క్ లు పరిమిత సమయం వరకు చెల్లుబాటు అయ్యే రిజర్వ్ కాని  టిక్కెట్‌లను లేదా కొంత కాలానికి రెండు స్టాప్‌ల మధ్య అపరిమిత ప్రయాణంతో సీజన్ పాస్‌లు జారీ చేస్తాయి. ప్రయాణికులు స్టేషన్లలో లేదా యూ. టి.. ఎస్. మొబైల్ యాప్‌ల ద్వారా టిక్కెట్లు, సీజన్ పాస్‌లను కొనుగోలు చేయవచ్చు.[3] రైలులో ప్రయాణంచేసేందుకు ఫోటో గుర్తింపుతో పాటు టిక్కెట్ కొనుగోలుకు చెల్లుబాటు అయ్యే రుజువు అవసరం.

భారతదేశం ప్రపంచంలోనే అతి తక్కువ రైలు ఛార్జీలను కలిగి ఉంది, అధిక-తరగతి ఛార్జీల ద్వారా ప్రయాణీకుల ట్రాఫిక్‌కు సబ్సిడీ ఇవ్వబడుతుంది.[4] సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు పైబడిన వారు), వికలాంగులు, విద్యార్థులు, క్రీడాకారులు, పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి తగ్గింపు టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ప్యాసింజర్ రైలులో మహిళల కోసం అత్యల్ప తరగతి వసతితో కూడిన ఒక కంపార్ట్‌మెంట్ కేటాయించబడింది. కొన్ని బర్త్ లు లేదా సీట్లు మహిళలు లేదా సీనియర్ సిటిజన్‌లకు కూడా కేటాయించబడ్డాయి.[5]


సరుకు రవాణా విభాగం:

భారతీయ రైల్వేలు సరుకు రవాణా విభాగంలో, భారతదేశం వ్యాప్తంగా  పారిశ్రామిక, వినియోగదారు, వ్యవసాయ రంగాలలో  వివిధ వస్తువులు, ఇంధనాలను రవాణా చేస్తుంది. భారతీయ రైల్వేలు చారిత్రాత్మకంగా సరుకు రవాణా వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంతో ప్రయాణీకుల విభాగానికి సబ్సిడీని అందించింది. తత్ఫలితంగా,సరుకు రవాణా సేవలు ఇతర రవాణా విధానాలతో పోటీ పడలేక ఖర్చు, డెలివరీ వేగం రెండింటిలోనూ, మార్కెట్ వాటా నిరంతర కోతకు దారితీస్తుంది.[1] భారతీయ రైల్వేలు రవాణా విభాగాలలో ఈ అధోముఖ ధోరణిని ఎదుర్కోవడానికి, ఇప్పటికే ఉన్న గూడ్స్ షెడ్‌లను పునరాభివృద్ధి  చేయడం, మల్టీ-కమోడిటీ మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ టెర్మినల్‌లను నిర్మించడానికి ప్రైవేట్ మూలధనాన్ని ఆకర్షించడం, కంటైనర్ పరిమాణాలను మార్చడం, టైమ్-టేబుల్డ్ ఫ్రైట్ రైళ్ల నిర్వహణ,  సరుకు రవాణా ధర/ఉత్పత్తి మిశ్రమం లాంటి నూతన  కార్యక్రమాలను ప్రారంభించింది. [2] ఆదేవిధముగా రోల్-ఆన్ రోల్-ఆఫ్ (ఆర్.ఓ.ఆర్.ఓ.) సర్వీస్  లాంటి ఎండ్-టు-ఎండ్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ సొల్యూషన్స్, 1999లో కొంకణ్ రైల్వే కార్పొరేషన్ ఫ్లాట్‌బెడ్ ట్రెయిలర్‌లపై[3]ట్రక్కులను తీసుకువెళ్లడానికి ప్రారంభించిన రోడ్-రైలు వ్యవస్థ, ఇప్పుడు భారతదేశం అంతటా ఇతర మార్గాలకు కూడా విస్తరించబడుతోంది.

భారతీయ రైల్వేలోని  సరుకు రవాణా విభాగంలో  మార్పుగా భావిస్తున్న నూతన  డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లు 2020 నాటికి పూర్తవుతుందని అంచనా. దాదాపు 3300 కి.మీ.లు విస్తరించిన నూతన  కారిడార్లు పూర్తిగా అమలు చేయబడినప్పుడు, గంటకు 100 కిలోమీటర్ల (62 మైళ్ళ ) వేగంతో 32.5 టన్నుల యాక్సిల్-లోడ్‌తో 1.5 కి.మీ పొడవుతో రైళ్లను నడపడానికి  తోడ్పడతాయి. దీనితోపాటు  రద్దీ  ప్రయాణీకుల మార్గాల్లో సామర్థ్యాన్ని పెంపుచేస్తాయి, మరిన్ని రైళ్లను అధిక వేగంతో నడపడానికి భారతీయ రైల్వేలకు  అవకాశం కలుగుతుంది. దేశంలో సరుకు రవాణా మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు అదనపు కారిడార్లను ప్లాన్ చేస్తున్నారు.


ప్రపంచ వారసత్వ ప్రదేశాలు

భారతీయ రైల్వేలు రెండు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలను నిర్వహిస్తోంది. మొదటిది  ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ముంబై,[1], "మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా".[2] రెండోది భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో మూడు రైలు మార్గాలు: డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, పశ్చిమ బెంగాల్‌లోని లెస్సర్ హిమాలయాల్లో 610 మిమీ (2 అడుగులు) నారో-గేజ్ రైల్వే; నీలగిరి మౌంటైన్ రైల్వే, తమిళనాడులోని నీలగిరి కొండలలో 1,000 ఎమ్.ఎమ్. (3 అడుగులు 3+3⁄8 లో) మీటర్ గేజ్ రాక్ రైల్వే, 762 ఎమ్.ఎమ్ (2అడుగులు6లో) నారో-గేజ్ రైలు కల్కా-సిమ్లా రైల్వే హిమాచల్ ప్రదేశ్‌లోని సివాలిక్ కొండలలో. [2]


రైల్‌మదాద్ పోర్టల్: రైల్వే ప్రయాణీకుల సమస్యలు, సలహాలు

భారతీయ రైల్వేలోని ప్రయాణీకుల సమస్యలను నివారణించడానికి,  పరిష్కరించడానికి రైల్వే గ్రీవెన్స్ అండ్ సజెషన్ పోర్టల్ 2019లో,  రైల్వే మంత్రిత్వ శాఖ రైల్‌మదాద్ అనే పోర్టల్‌ను ప్రారంభించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ 2021లో రాజ్యసభలో ఒక ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానంలో, అన్ని ఫిర్యాదులు 72 గంటల్లో పరిష్కరించబడ్డాయని, ప్రజలు సంతృప్తికరమైన అభిప్రాయాన్ని అందించారాని తెలియజేశారు .[3]


రైల్వే గణాంకాలు

రైలు మార్గాలు మొత్తం దూరం సుమారుగా 114500 కి.మీ .[5] ఇది సుమారు 65000 కి.మీ రూటు పై వుంది, 7500 స్టేషన్లు వున్నాయి [5] 20 11 నాటికి రైల్వేల వద్ద 2,40,000 వాగన్లు, 69,000 కోచ్ లు, 9000 ఇంజిన్లు ఉన్నాయి.[5] భారతీయ రైలు మార్గాలపై ప్రభుత్వానికి ఏకఛత్రాధిపత్యం ఉంది. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. ఇది ప్రతి రోజూ మూడు కోట్ల ప్రయాణీకులను గమ్యం చేరుస్తూండడమే కాక మరో 28 లక్షల మెట్రిక్ టన్నుల సరుకులను కూడా రవాణా చేస్తోంది.[6] ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను (సుమారు పద్నాలుగు లక్షలు) కలిగి వున్న సంస్థలలో భారతీయ రైల్వేది ద్వితీయ స్థానము.[3][7]

రైల్వే విభాగాలు[మార్చు]

పాలనా సదుపాయం కోసం భారతీయ రైల్వేలను 18 జోనులుగా విడగొట్టారు.

వ. పేరు సూక్ష్మరూపం స్థాపించిన తేదీ కేంద్రము విభాగాలు (డివిజన్లు)
1. ఉత్తర రైల్వే ఎన్‌ఆర్ ఏప్రిల్ 14, 1952 ఢిల్లీ అంబాలా, ఢిల్లీ, ఫిరోజ్‌పూర్, లక్నో, మొరదాబాద్,
2. ఈశాన్య రైల్వే ఎన్‌ఈ 1952 గోరఖ్‌పూర్ ఇజ్జత్‌నగర్, లక్నో, వారణాసి
3. ఈశాన్య సరిహద్దు రైల్వే ఎన్‌ ఈ ఎఫ్‌ఆర్ 1958 గౌహతి అలీపూర్‌ద్వార్ జంక్షన్, కతిహార్, లుమ్‌డింగ్, రంగియా, తిన్‌సుఖియా
4. తూర్పు రైల్వే ఈఆర్ ఏప్రిల్, 1952 కోలకతా హౌరా, సీల్డా, అస్సంసోల్, మాల్దా
5. ఆగ్నేయ రైల్వే ఎస్‌ఈఆర్ 1955 కోలకతా అద్రా, చక్రధర్‌పూర్, ఖరగ్‌పూర్, రాంచీ
6. దక్షిణ మధ్య రైల్వే ఎస్‌సిఆర్ అక్టోబరు 2, 1966 సికింద్రాబాదు సికింద్రాబాదు, హైదరాబాదు, విజయవాడ, గుంటూరు, గుంతకల్, నాందేడ్
7. దక్షిణ రైల్వే ఎస్‌ఆర్ ఏప్రిల్ 14, 1951 చెన్నై చెన్నై, మదురై, పాలఘాట్, తిరుచ్చిరాప్పల్లి, త్రివేండ్రం, సేలం
8. మధ్య రైల్వే సిఆర్ నవంబరు 5, 1951 ముంబై ముంబై, భూసావల్, పూణె, షోలాపూర్, నాగపూర్
9. పశ్చిమ రైల్వే డబ్ల్యుఆర్ నవంబరు 5, 1951 ముంబై ముంబై సెంట్రల్, బరోడా, రత్లాం, అహ్మదాబాదు, రాజకోట్, భావ్‌నగర్
10. నైరుతి రైల్వే ఎస్‌డబ్ల్యుఆర్ ఏప్రిల్ 1, 2003 హుబ్లీ హుబ్లీ, బెంగళూరు, మైసూరు
11. వాయువ్య రైల్వే ఎన్‌డబ్ల్యుఆర్ అక్టోబరు 1, 2002 జైపూరు జైపూరు, అజ్మీర్, బీకానెర్, జోధ్‌పూర్
12. పశ్చిమ మధ్య రైల్వే డబ్ల్యుసిఆర్ ఏప్రిల్ 1, 2003 జబల్ పూర్ జబల్ పూర్, భోపాల్, కోటా
13. ఉత్తర మధ్య రైల్వే ఎన్‌సిఆర్ ఏప్రిల్ 1, 2003 అలహాబాదు ప్రయాగ రాజ్, ఆగ్రా, ఝాన్సీ
14. ఆగ్నేయ మధ్య రైల్వే ఎస్‌ఈసిఆర్ ఏప్రిల్ 1, 2003 బిలాస్‌పూర్ CG బిలాస్‌పూర్, రాయపూర్, నాగపూర్
15. తూర్పు తీర రైల్వే ఈసిఒఆర్ ఏప్రిల్ 1, 2003 భువనేశ్వర్ ఖుర్దారోడ్, సంబల్‌పూర్, రాయగడ
16. తూర్పు మధ్య రైల్వే ఈసిఆర్ అక్టోబరు 1, 2002 హాజీపూర్ (అయోమయ నివృత్తి) దానాపూర్, ధన్‌బాద్, మొగల్ సరాయ్, సమస్తిపూర్, సోనాపూర్
17. కోల్‌కతా మెట్రో రైల్వే కెఎంఆర్ డిసెంబ‌ర్ 31, 2010 కలకత్తా కోల్‌కతా మహానగర ప్రాంతం, దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు
18. దక్షిణ తీర రైల్వే ఎసిఒఆర్ 2019 ఫిబ్రవరి 27 విశాఖపట్నం [[గుంతకల్లు రైల్వే డివిజన గుంతకల్లు]], గుంటూరు, విజయవాడ

ప్రతి ప్రాంతీయ విభాగం నిర్వహణలో వున్న ప్రాంతాన్ని కొన్ని డివిజన్లుగా విభజించారు. ప్రతి డివిజన్ కూ ఒక ముఖ్య పట్టణం వుంటుంది. దేశమంతటా కలిపి మొత్తం అరవై ఏడు డివిజన్లు ఉన్నాయి.

ప్రయాణీకుల సౌకర్యాలు[మార్చు]

భారతీయ రైల్వేలు మొత్తం 8,702 ప్రయాణీకుల రైళ్ళను నడుపుతున్నాయి. ఇవి దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలో (ఢిల్లీ, పుదుచ్చేరి, ఛండీగడ్)సుమారు ఒక కోటీ యాభై లక్షల మంది ప్రయాణీకులను వారి వారి గమ్యాలకు చేరుస్తున్నాయి. సిక్కిం, మేఘాలయ, మిజోరం, మణిపూర్, నాగాలాండ్ వంటి రైలు రవాణా సౌకర్యం లేని రాష్ట్రాలకు భారత ప్రభుత్వం రైలు సౌకర్యం కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపడుతోంది.

భారతదేశంలో ప్రజలు దూర ప్రయాణాలకు అత్యధికంగా రైలు మర్గాలనే ఆశ్రయిస్తారు. ప్రతి సాధారణ ప్రయాణీకుల రైలులో సుమారుగా పద్దెనిమిది బోగీలు ఉండగా ప్రజాదరణ పొందిన రైళ్ళలో ఇరవై నాలుగు బోగీల వరకూ ఉంటాయి. ఈ బోగీలు పద్దెనిమిది నుండి డెబ్బైరెండు మంది ప్రయాణించేందుకు వీలుగా తయారు చేయబడ్డాయి, అయితే రద్దీ సమయాలలో ఈ భోగీలలో అంతకంటే చాలా ఎక్కువ మంది కూడా ప్రయాణం సాగించవచ్చు. ఈ బోగీలలో ఎక్కువ భాగం ఒక దానికి మరొకటి అనుసంధానించబడి ఒక దాని నుండి మరొక దానికి మారేందుకు వీలుగా ఉంటాయి. అయితే కొన్ని రైళ్ళలో అవసరార్దం ఈ మార్గం మూసివేయబడవచ్చు. సరకు రవాణా చేసే బోగీలలో చాలా రకాలు ఉన్నాయి.

ఒక డియమ్‌యు రైలు DEMU

ప్రయాణీకులకు కల్పించబడిన సదుపాయాల దృష్ట్యా ఈ బోగీలు వివిధ తరగతులుగా విభజించబడ్డాయి. వీటిలో సాధారణ రెండవ తరగతి రిజర్వేషన్ తరగతి అత్యంత ప్రజాదరణ పొందింది. సాధారణంగా ప్రయాణీకుల రైలు సుమారు తొమ్మిది వరకూ ఈ రకం బోగీలు కలిగి ఉండటం గమనించవచ్చు. ఇవి కాక మొదటి తరగతి, ఎయిర్ కండిషన్డ్ (రెండు, మూడు పడకలతో) బోగీలు, జనరల్ బోగీలను కూడా గమనించవచ్చు.

భారత రైల్వేలు మరి కొన్ని విశేషాలు[మార్చు]

  • భారతదేశంలో మొదటి సారిగా రైలు ప్రయాణం చేసిన తేది 22.12.1851.
  • భారతదేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన రైలు స్టేషన్లు వరుసగా భవానీ మాండీ ఇది మధ్యప్రదేశ్, రాజస్థాన్ సరిహద్దులలో ఉంది. నవాపూర్ ఇది మహారాష్ట్రా, గుజరాత్ సరిహద్దులలో ఉంది. జరాయ్‌కేలా ఇది ఒడిషా, జార్ఖండ్ సరి హద్దులలో ఉంది. ఒడిషా, జార్ఖండ్ సరి హద్దులలో ఉన్న మరో రైల్వే స్టేషన్ బార్బిల్.
  • భారతదేశంలో అత్యంత చిన్న పేరున్న రైల్వే స్టేషను ఇబ్. ఇది ఒడిషా లోని ఝూర్స్ గూడా సమీపంలో ఉంది.
  • భారతదేశంలో పెద్ద పేరున్న రైల్వే స్టేషను వెంకటనరసింహరాజు వారి పేట. ఇది అరక్కోణం, రేణిగుంట రైలు మార్గంలో ఉంది.
  • భారతదేశంలో అత్యంత తక్కువ దూరం ప్రయాణిచే రైలు మహారాష్ట్రలోని నాగపూర్ నుండి అజ్ని వరకు ప్రయాణం చేస్తుంది. ఈ రైలు ప్రయాణం చేసే దూరం కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే.
  • భారతదేశంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలు కన్యాకుమారి నుండి న్యూ టిన్సుకియా వరకు ప్రయాణించే వివేక్ ఎక్స్‌ప్రెస్. ఇది 83.15గంటల సమయంలో 4283 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది.
  • భారతదేశంలో అత్యంత తక్కుగా మధ్య దూరం ఉన్న రైలు స్టేషన్లు సఫిల్ గూడ దయానంద సాగర్. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం 170 మీటర్లు మాత్రమే.
  • భారతదేశంలో ఉన్న అత్యంత పొట్టి రైలు కొసాంబ్ ఉమర్‌పడ వరకు ప్రయాణిస్తుంది. దీనికి కేవలం రెండు బోగీలు మాత్రమే ఉన్నాయి.
  • భారతదేశంలో అత్యంత ఆలస్యంగా వచ్చే రైలు సిల్చార్ - తిరువనంతపురం ఎక్స్ ప్రెస్. ఇది సిల్చార్ నుండి తిరువనంతపురం వరకు సరాసరి 10 నుండి 12 గంటల ఆలస్యంగా ప్రయాణం చేస్తుంది. దీని ప్రయాణ సమయం 74:45 గంటలు
  • భారతదేశంలో ఉన్న అత్యంత పొడవైన రైలు స్టేషను ఉత్తరప్రదేశ్లోని హుబ్లీ కర్ణాటక. దీని పొడవు 1505 మీటర్లు.
  • భారతదేశంలో మూడు గేజుల పట్టాలు ఉన్న స్టేషను పశ్చిమ బెంగాల్ లోని న్యూ జల్పైగురి.
  • భారతదేశంలో అత్యధిక మార్గాలు ఉన్న రైలు జంక్షన్ ఉత్తరప్రదేశ్‌లో ఉన్న మ‌థుర‌.

భారతీయ రైల్వే మండలాలు[మార్చు]

భారతీయ రైల్వే లు 18 రైల్వే జోన్స్ (రైల్వే మండలాలు) గా విభజించబడింది. ప్రతి రైల్వే జోన్ కొన్ని రైల్వే డివిజన్లు (రైల్వేవిభాగములుగా ) విభజించబడింది. అన్ని రైల్వే జోన్|మండలములలో దాదాపుగా 67 విభాగాలు ఉన్నాయి.

దక్షిణ మధ్య రైల్వే[మార్చు]

ప్రధాన వ్యాసం దక్షిణ మధ్య రైల్వే చూడండి.

  • భారతదేశం లోని 18 రైల్వే జోన్‌లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే 1966, అక్టోబరు 2న ఏర్పడింది. ఈ రైల్వే జోన్ సికింద్రాబాదు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. దీని పరిధిలో ప్రస్తుతం 6 రైల్వే డివిజన్‌లు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని హైదరాబాదు, సికింద్రాబాదు, గుంతకల్లు, విజయవాడ, గుంటూరు లతో పాటు మహారాష్ట్రకు చెందిన నాందేడ్ డివిజన్‌లు దక్షిణ మధ్య రైల్వేలో ఉన్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించియున్న ఈ డివిజన్ కొంతమేరకు కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో కూడా వ్యాపించియున్నది. మొత్తం 5752 కిలోమీటర్ల నిడివి కలిగిన రైలు మార్గం ఈ జోన్‌లో విస్తరించిఉన్నది. దేశంలో అత్యధిక లాభాలు ఆర్జించే జోన్‌లలో ఇది ఒకటి.

తూర్పు తీర రాష్ట్ర రైల్వే[మార్చు]

ప్రధాన వ్యాసం తూర్పు తీర రాష్ట్ర రైల్వే చూడండి.

తూర్పు తీర రాష్ట్ర రైల్వే అనేది భారతదేశంలోని ఒక రైల్వే కంపెనీ. 1890లో ఏర్పడిన ఈ గ్యారంటీ కంపెనీ స్వల్పకాలిక ఉనికిని కలిగి ఉంది.

పేరొందిన రైళ్ళు[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

‌మూలాలు[మార్చు]

  1. "[IRFCA] Indian Railways FAQ: IR History: Early Days - 1". www.irfca.org.
  2. "Indian Railways Budget Documents 2018-19" (PDF). Ministry of Railway. Retrieved 22 February 2018.
  3. 3.0 3.1 3.2 3.3 "Indian Railways Statistical Publications 2016-17: Statistical summary - Indian Railways" (PDF). Ministry of Railway. Retrieved 22 February 2018.
  4. "Indian Railways Statistical Publications 2016-17: Statistics for Track and Bridges - Indian Railways" (PDF). Ministry of Railway. Retrieved 22 February 2018.
  5. 5.0 5.1 5.2 Indian Railways Year Book (2009–2010) (PDF). Ministry of Railways, Government of India. 2011. p. 13.
  6. Indian Railways Year Book (2009–2010) (PDF). Ministry of Railways, Government of India. 2007. p. 53.
  7. "Indian Railways Statistical Publications 2016-17: Passenger Business" (PDF). Ministry of Railway. p. 23. Retrieved 2 March 2018.

బయటి లింకులు[మార్చు]

మూసలు , వర్గాలు[మార్చు]