తిరుమల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7: పంక్తి 7:
దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ [[శ్రీ వేంకటేశ్వరస్వామి‎|శ్రీ వేంకటేశ్వరుని]] దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన [[పల్లవులు]], 10వ శతాభ్దానికి చెందిన [[చోళులు]] (తంజావురు) పాండ్య రాజులు (మదురై), 13-14 శతాభ్దానికి చెందిన [[విజయనగర రాజులు]] శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతులైన [[శ్రీ కృష్ణదేవ రాయలు]], రాజా తోడరమల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.
దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ [[శ్రీ వేంకటేశ్వరస్వామి‎|శ్రీ వేంకటేశ్వరుని]] దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన [[పల్లవులు]], 10వ శతాభ్దానికి చెందిన [[చోళులు]] (తంజావురు) పాండ్య రాజులు (మదురై), 13-14 శతాభ్దానికి చెందిన [[విజయనగర రాజులు]] శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతులైన [[శ్రీ కృష్ణదేవ రాయలు]], రాజా తోడరమల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.
<div style="align:right;">{{వ్యాఖ్య|వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన !
<div style="align:right;">{{వ్యాఖ్య|వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన !
వేంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి !!}}</div>
వేంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి !!}}</div><!-- ఇది వీంకటేశ్వర స్వామి చరిత్ర -->[[File:Tirumala Venkateswara temple entrance 09062015.JPG|thumb|తిరుమల తిరుపతి దేవస్థాన ముఖద్వారము]]
[[File:Tirumala Venkateswara temple entrance 09062015.JPG|thumb|తిరుమల తిరుపతి దేవస్థాన ముఖద్వారము]]
==స్థల పురాణం==
==స్థల పురాణం==
[[బొమ్మ:Tirumala from srivaaripaadaalu.jpg|కుడి|240px|thumb|శ్రీవారి పాదముల నుండి తిరుమల దృశ్యము]]
[[బొమ్మ:Tirumala from srivaaripaadaalu.jpg|కుడి|240px|thumb|శ్రీవారి పాదముల నుండి తిరుమల దృశ్యము]]

11:26, 2 మార్చి 2021 నాటి కూర్పు

తిరుమల గర్భగుడి ఆనందనిలయంపైన ఉన్న బంగారు గోపురం
దస్త్రం:Venkateswara Swamy Mula Virat at Tirupati.jpg
తిరుమల గర్భగుడిలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి విగ్రహం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి" అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షలమంది వరకూ దర్శనం చేసుకొంటారు.[1]. ఈ యాత్రాస్థలం శ్రీవైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్యదేశాలలో ఒకటి.

తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువుగా అవతరించాడని భవిష్యోత్తరపురాణం లోని శ్రీ వేంకటాచల మహత్యం కథనం. తిరుమల వేంకటేశ్వరుని శ్రీనివాసుడు, బాలాజీ అని కూడా పిలుస్తారు. శ్రీవారు అని కూడా అంటారు. మొట్ట మొదటగా, వైఖానస అర్చకుడు శ్రీ మాన్ గోపీనాథ దీక్షితుల వారు (శ్రీ వేంకటాచల మహాత్యం అనుసరించి), శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరిణి చెంత, చింత చెట్టు క్రింది చీమల పుట్టలో కనుగొని, శ్రీవారి మూర్తిని ప్రస్తుతం వున్న ప్రదేశంలో ప్రతిష్ఠించి, అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అప్పటి నుండి శ్రీ గోపీనాథ దీక్షితుల యొక్క వంశీయులే పరంపరగా స్వామి వారి పూజా కైంకర్యాల నిర్వహణ చేస్తున్నారు. తిరుమల ఆలయం లోని మొదటి ప్రాకారం (విమాన ప్రాకారం), ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు.

దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వేంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాభ్దానికి చెందిన చోళులు (తంజావురు) పాండ్య రాజులు (మదురై), 13-14 శతాభ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతులైన శ్రీ కృష్ణదేవ రాయలు, రాజా తోడరమల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.

వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన !

వేంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి !!

తిరుమల తిరుపతి దేవస్థాన ముఖద్వారము

స్థల పురాణం

శ్రీవారి పాదముల నుండి తిరుమల దృశ్యము

ద్వాపర యుగంలో శ్రీమహావిష్ణువు దర్శనార్ధం వాయు దేవుడు, వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుడిని అడ్డగించి, మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు. అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది. అప్పుడు శ్రీమహావిష్ణువు అక్కడకు వస్తే ఇద్దరు వాళ్ళవాళ్ళ గొప్పతనం చెప్పుకొంటారు. మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకొమని చెప్పి, వాయుదేవుడిని ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడ నుండి కదిలించమని పరీక్షపెడతాడు. ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం నెలకొనగా చతుర్ముఖబ్రహ్మ, ఇంద్రాది దేవతల కోరికమేరకు ఆదిశేషువు ఆనందపర్వతం మీద తన పట్టు సడలించి పరీక్షనుంచి విరమిస్తాడు. దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయువు ప్రభావం వల్ల అక్కడనుండి వెళ్ళి స్వర్ణముఖీ నది ఒడ్డున పడుతుంది. ఇది తెలుసుకొని ఆదిశేషువు బాధ పడతాడు. ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వేంకటాద్రితో విలీనం చేస్తాను అక్కడ మహావిష్ణువు వెలస్తాడు అని చెబుతాడు. ఆదిశేషువు వేంకటాద్రి పర్వతంలో విలీనం అయి ఆదిశేషువు పడగ భాగంలో (శేషాద్రి) శ్రీమహావిష్ణువు వెలశారు, శేషువు మధ్య భాగంలో అహోబిలంలో శ్రీ నారసింహమూర్తి, తోక భాగంలో శ్రీశైల క్షేత్రములో మల్లికార్జునస్వామిగా వెలశారు.

చరిత్ర

మరింత సమాచారం: తిరుమల చరిత్ర వ్యాసంలో
తిరుపతిలో హాథీరాంజీ మఠం... భవనము

15 వందల ఏళ్ల నుండి తిరుమల, పాలకుల ఆదరణకు నోచుకుంటూ ఉంది. క్రీ.శ.614. పల్లవ రాణి సామవై కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్దారణ కావింపబడింది. సామవై పెరిందేవి క్రీ.శ. 614 లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని బహుకరించింది. అక్కడి అర్చకులు సూచించిన విధంగా ఈ విగ్రహాన్ని బహుకరించి శ్రీ వైఖనస భగవఛ్ఛాస్త్రోక్తంగ ప్రతిష్ఠింపజేసింది. ఇదే తిరుమల ఆలయంలో మొట్టమొదటి కానుకగా దేవాలయంలోని గోడల మీది శాసనం వలన తెలుస్తోంది. తరువాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు క్రీ.శ.1328లో, శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాధయాధవరాయలు క్రీ.శ.1429లో, హరిహరరాయలు క్రీ.శ. 1446లోను బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.

సాళువ నరసింహరాయలు 1470 లో భార్య, ఇద్దరు కుమారులు, తన పేర్లతో సంపగి ప్రదక్షిణం నాలుగు మూలలో నాలుగు స్తంభాల మండపాలను నిర్మించాడు. 1473లో తిరుమలరాయ మండపానికి వేదిక నిర్మించాడు. శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ.1513 నుండి 1521 వరకు ఏడు సార్లు తిరుమలకి వచ్చి ఎన్నో కానుకలు సమర్పించాడు. అచ్యుత రాయలు 1530లో ఉత్సవాలు నిర్వహించాడు, ఆలయానికి ఎన్నో గ్రామాలు, భూములను కానుకగా ఇచ్చాడు. తిరుమల రాయలు 16వ శతాబ్దం చివరలో, అన్నా ఊయల మండపాన్ని విస్తరింపజేసి, ఉత్సవాలు నిర్వహించాడు. వెంకటపతి రాయలు 1570లో చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించాడు.

తిరుమల లోని ఒక చిత్రం

విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఆలయం మహమ్మదీయుల పరమైనది. కర్నాటకకు నవాబైన దావూద్ ఖాన్ హైదరాబాదు నిజామ్కు కట్టవలసిన పన్నులను సమకూర్చుకునేందుకు, ఆలయంపై పన్నులు విధించాడు. ఈ విషయంగా మహమ్మదీయులు, మరాఠాలు గొడవలు పడ్డారు. 1740లో మరాఠీ ప్రభువు ఆలయాన్ని స్వాధీన పరచుకుని, స్వామివారికి ఎన్నో అమూల్య ఆభరణాలు సమర్పించాడు. తరువాత క్రమంగా 1801 నాటికి ఆలయం ఈస్టిండియా కంపెనీ వారి ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుంచీ తిరుమల పరిపాలనను స్థానిక కలెక్టరు చేసేవారు. ఆలయ ఆదాయవ్యయాలను స్థిరపరిచి వాటి నుంచి స్వామికి సేవలు, ఉత్సవాలు నిర్వహించడం, మిగిలిన సొమ్ము(అప్పట్లోనే దాదాపు సంవత్సరానికి రూ.లక్ష) కంపెనీ ఖజానాలో జమకట్టేవారు. 1841లో ఆంగ్లప్రభుత్వం హిందూ మతసంస్థలలో జోక్యం చెసుకోకూడదని చట్టం చేసినందున అలయ నిర్వహణను మహంతులకు అప్పజెప్పారు.[2].

90 ఏళ్ళ పాటు మహంతుల నిర్వహణ తరువాత,1933లో అప్పటి గవర్నర్ ధర్మ కర్తల మండలిని ఏర్పాటు చేసి ఆలయ నిర్వహణ బాధ్యతను అప్పజెప్పారు. 19 వ శతాబ్దాంతానికి కొండపైన శ్రీవారి ఆలయం, విశాలమైన హథీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలూ ఉండేవి కావు. అతికొద్దిగా ఉండే ఇళ్ళు అత్యంత సంకుచితంగా ఉండేవి. కోతుల బెడద విపరీతంగా ఉండేది. అడవి పందులు కొండపై మనుష్యుల నడుమ నడుస్తూనే వుండేవి.[2] అడవి జంతువులు, దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ, గోవిందనామ స్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు. 1870లో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండమీదకు మెట్లు నిర్మించింది. 1933లో ఏర్పడిన తితిదే బోర్డు రూ.26 వేల ఖర్చుతో ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది. 1980లో తితిదే బోర్డు ఈ మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించి విద్యుద్దీపాల ఏర్పాటుతో మరింత అభివృద్ధి చేసింది.

ఘాట్‌రోడ్డు నిర్మాణం

అలిపిరి మెట్ల దారిలో సాష్టాంగ నమస్కార ముద్రలో శిల్పం, అలిపిరి వద్ద తీసిన చిత్రం

1940ల నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది. అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండమీదకు రోడ్డుమార్గం గురించి ఆలోచించింది. బ్రిటిష్ అధికారులు సర్వే బృందాల వారు తిరుపతి చేరుకున్నారు. 1944 ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్‌రోడ్డు నిర్మాణం పూర్తయింది. మొదట్లో ఎద్దులబళ్లు, గుర్రపుబళ్లు తిరిగేవి. నెమ్మదిగా దేవస్థానమే తిరుమల-తిరుపతి మధ్య రెండు బస్సులు ప్రారంభించింది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెల్లువెత్తసాగారు. దీంతో 1974లో రెండవ ఘాట్‌రోడ్డును(ప్రస్తుత ఎగువ రోడ్డు) కూడా నిర్మించారు.

స్వామి వారి పూజలు

రోజువారీ సేవలు

దస్త్రం:Venakteswara Swamy Harathi.jpg
శ్రీవారికి హారతి ఇస్తున్న దృశ్యం
స్వామి వారి సేవల బోర్డు

శ్రీ వైఖానస భగవఛ్ఛాస్త్రోక్త మార్గాన్ననుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి. దీనినే ఆగమ పరిభాషలో షట్కాల పూజ అని అంటారు. అవి... ప్రత్యూష, ప్రాత:కాలం, మధ్యాహ్న, అపరాహ్ణ, సాయంకాల, రాత్రి పూజలు. తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూష పూజలకు నాంది.

తలయేరు గుండు
  • సుప్రభాత సేవ: నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవ ఇదే. నిత్యం తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది.
  • శుద్ధి: సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున మూడున్నర నుంచి మూడుగంటల నలభైఐదు నిమిషాలదాకా ఆలయ శుద్ధి జరుగుతుంది.
  • తోమాలసేవ: ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలలతో అలంకరిస్తారు. వారంలో ఆరు రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు. శుక్రవారం నాడు మాత్రం అభిషేకం జరిపించిన తరువాత రెండవ సారి మరల తోమాలసేవ చేస్తారు.
  • కొలువు: తోమాలసేవ తర్వాత పదిహేను నిమిషాలపాటు స్నపన మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్‌ జరుగుతుంది. దీనినే శ్రీ వైఖానస భగవచ్చాస్త్రంలో 'యాత్రాసనం' అని కూడా అంటారు.
  • సహస్రనామార్చన: ఉదయం 4.45 నుంచి 5.30 వరకు సహస్రనామార్చన జరుగుతుంది. బ్రహ్మాండ పురాణం లోని స్వామివారి 1008 నామాలనూ స్తుతిస్తూ తులసి దళాలతో చేసే అర్చన ఇది.
  • మొదటిగంట, నైవేద్యం: మేలుకొలుపులు, అభిషేకాలు, కొలువుకూటం అన్నీ అయిన తరువాత స్వామివారికది నైవేద్యసమయం. నైవేద్యసమర్పణకు ముందుగా శయనమంటపాన్ని శుభ్రం చేసి, బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు. తిరుమామణి మంటపంలోని గంటలు మోగిస్తారు. అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామివారికి పులిహోర, పొంగలి, దద్ధోజనం, చక్కెర పొంగలి (అన్నప్రసాదాలు), లడ్లు, వడలు, అప్పాలు, దోసెలు, పోళీలు (పిండివంటలు) కులశేఖరపడి (పడికావలి)కి ఇవతల ఉంచి సమర్పిస్తారు.
  • అష్టోత్తర శతనామార్చన: ఈ అర్చనతో మధ్యాహ్నపూజలు ప్రారంభమవుతాయి. వరాహపురాణంలో ఉన్న శ్రీవారి నూట ఎనిమిది నామాలను పఠిస్తారు.
  • రెండో గంట, నైవేద్యం: అష్టోత్తర శతనామార్చన అనంతరం ఆలయంలో రెండో గంట నైవేద్యం జరుగుతుంది. పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండివంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. నివేదన తరువాత తాంబూలం, కర్పూరహారతి ఇస్తారు.
  • రాత్రి కైంకర్యాలు: ఉదయం జరిగే తోమాలసేవ వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది.
  • ఏకాంతసేవ: రాత్రి ఒకటిన్నర సమయంలో జరిగే పవళింపు సేవనే ఏకాంతసేవ అంటారు. రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు బ్రహ్మది దేవతలు వస్తారని ప్రతీతి. బ్రహ్మది దేవతలు స్వామి వారి ఆరాధన చేయడం కోసం తగినంత నీటిని బంగారు పంచ పాత్రలలో ఉంచుతారు. వారు ఆరాధన చేసిన తీర్ధాన్ని మరుసటి రోజు సుప్రభాతం ముగిసిన తర్వాత భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఏడుకొండలస్వామి పవళింపుసేవలో అన్నమయ్య లాలి సంకీర్తనలు ఆలపిస్తారు. దీన్ని తాళ్లపాక వారి లాలి అంటారు. దీంతో ఆరోజుకి నిత్యపూజలు అన్నీ జరిగినట్లే.
  • ముత్యాల హారతి:ఉత్తర మాడా వీధిలో నివసించేతరిగొండ వెంగమాంబ అనే మహాభక్తురాలు హారతి తీసుకోనిదే బ్రహ్మోత్సవాల సమయంలో ఆమె ఇంటి ముందు నుండి కదలని రథానికి గుర్తుగా ప్రతీరోజూ రాత్రి ఏకాంతసేవ అనంతరం వెంగమాంబని పాట పాడి హారతిని ఇమ్మని భక్తులూ,అర్చకులూ అడిగేవారట కాలక్రమంలో అది ఒక సేవగా స్థిరపడిపోయింది.ఈ సేవనే'తరిగొండ ముత్యాల హారతి'అనేవారు.వెంగమాంబ తరువాత ఆమె దత్తపుత్రిక వారసురాలయ్యింది.అదే పరంపర నేటికీ కొనసాగుతుంది.
  • గుడిమూసే ప్రక్రియ: రాత్రి రెండుగంటలకు గుడిమూసే ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా మూడో ద్వారాన్ని, ఆ తర్వాత బంగారువాకిలిని మూసేసి లోపలి గడియలు బిగిస్తారు. అధికారులు బయటివైపు తాళాలు వేసి వాటిపై సీళ్లు వేస్తారు.
  • తిరుమల ఉభయ నాంచారులు:తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భార్యలైన శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలను ఉభయ నాంచారులు అంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవ మూర్తిని మలయప్ప స్వామి అంటారు.ఉభయ నాంచారులలోని శ్రీదేవి విగ్రహం ఎల్లప్పుడు మలయప్ప స్వామికి కుడి వైపున ఉంటుంది. 26 అంగుళాల ఎత్తు గల శ్రీదేవి విగ్రహం 4 అంగుళాల పీఠంపై నిలబడి ఉంటుంది.అలాగే భూదేవి విగ్రహం ఎల్లప్పుడు మలయప్ప స్వామికి ఎడమవైపున ఉంటుంది.

ప్రత్యేక సేవలు

రోజువారీ అర్చనలు, ధూపదీపనైవేద్యాలు కాకుండా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో తిరుమలవాసుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అవి సోమవారం విశేషపూజ, మంగళవారం అష్టదళ పాద పద్మారాధన, గురువారం సడలింపు,నేత్ర దర్శనం,తిరుప్పావడ, సాయంత్రం పూలంగిసేవ, శుక్రవారం అభిషేకం. స్వామికి రోజూ కల్యాణోత్సవం జరిపిస్తారు. డోలోత్సవం, సహస్రదీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, ఆర్జిత వసంతోత్సవం ఇవన్నీ ఉత్సవమూర్తులకు ప్రతి నిత్యం జరిగేవి.

కాలి నడకన చేరుకునే విధం

నారాయణగిరి కొండ మీద శ్రీవారి పాదాల నుండి చూసిన, ఈవిధంగా తిరుమల ఆలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (ముందుభాగంలో అర్థచంద్రాకార భవనం)
దస్త్రం:Srinivasam.. in tirupati.JPG
శ్రీనివాసం. తిరుపతిలో
కాలిదారిలో కనిపించే ఆంజనేయ స్వామి విగ్రహం

తిరుమల గుడికున్న ఓ ప్రాముఖ్యత "కాలినడక"! తిరుపతి నుండి పైన కొండలమీద ఉన్న తిరుమల పట్టణానికి చేరడానికి కొండపైన కాలినడక కోసం మెట్లదారి ఉంది, భక్తులు ఈ దారిగుండా వెళ్ళి స్వామి వారిని దర్శించుకోవడం ఒక మొక్కుగా భావిస్తారు. తిరుమలకి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కాలిబాటలు ఉన్నాయని అంటారు। ప్రస్తుతం మాత్రం రెండు ఎక్కువ వినియోగంలో ఉన్నాయి. మూడవది, కడప నుండి ఉందని ప్రతీతి.

  • అలిపిరి కాలిబాట: ఇది ఎక్కువ ప్రఖ్యాతిగాంచిన కాలిబాట. దానికి కారణం చాలా మంది భక్తులు కష్టసాధ్యమైన ఏడు కొండలూ దాటితే తమ కోరికలు తీరతాయని విశ్వసిస్తారు. ఇది తిరుపతి పట్టణం నుండి మొదలవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానముల (తితిదే) వారు దీన్ని బాగా అభివృద్ధి చేయటం. బస్సు ద్వారా గాని, రైలు ద్వారా గాని తిరుపతి చేరుకున్న తరువాత, అక్కడి నుండి తితిదే వారు నడుపుతున్న ఉచిత బస్సు / ఆటో / ప్రయివేటు బస్సు / టాక్సీ / జీపు ద్వారా ఈ కాలిబాట దగ్గరకు చేరుకోవచ్చు. అక్కడ కర్పూరాలు కొని (ఏడు కొండలకు ఏడు అని అమ్ముతుంటారు), దారి మొదట్లో ఉన్న "వేంకటేశ్వరుని పాదాల గుడి" దర్శనం చేసుకుని నడక కొనసాగిస్తూ దారిలో ఉన్న ఆంజనేయస్వామి చిన్న చిన్న మందిరాలు దర్శిస్తూ నడుస్తారు. ఈ మెట్లదారి సుమారుగా తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది. సుమారు 3500 పైబడి మెట్లు ఎక్కాలి. ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వారు కాలిబాటన వచ్చేవారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ తొందరగా దైవదర్శనం అయ్యే విధానాన్ని అమలు చేసారు. మీరు ఎపుడైనా తిరుపతికి కాలినడకన వెళ్ళారా. మీరు తిరుపతికి కాలినడకన వెళితే ఈ సారి తప్పక వేకువజామున 3 నుంచి 5 గంటల మధ్య నడిచి వెళ్ళండి. ఎందుకంటే ఆ సమయములో శ్రీ వారిని పూజించడానికి గంధర్వ బ్రహ్మాది దేవతలు ఏడుకొండల లోని దివ్యమైన వృక్షాలనుంచి అదృశ్య పూలను కోసుకొని తీసుకెళ్తుంటారంట అప్పుడు మనకు ఆ పూల దివ్యమైన సుగంధ పరిమళ వాసన వస్తుంది. ఆ అనుభూతి అనిర్వచనీయము. ఇది వర్ణించరానిది. ఇది ఇప్పటికి ఉంది. అందుకే మీరు ఈ సారి తిరుపతికి వెళ్ళినప్పుడు తప్పకుండా వేకువజామున వెళ్ళండి. ఓం నమో వెంకటేశాయ.
    • మొదటిసారి నడవాలి అని అనుకునేవారికి కొన్ని సలహాలు:
      • నెమ్మదిగా నడవండి, పరుగెత్తవద్దు, పరుగెత్తితే తొందరగా అలసిపోతారు.
      • సాధ్యమైనంతవరకూ మొదటి గంట ఎక్కడా కూర్చోవద్దు, కూర్చోకుండా నెమ్మదిగా నడిస్తే మొదటి గంటలో మెట్లన్నీ అయిపోయి మామూలు రోడ్డులాంటి దారికి వెళ్తారు, ఇక అక్కడి నుండి మోకాళ్ళ మంటపం వరకూ మెట్లు ఉండవు, ఉన్నా ఒకటీ అరా ఉంటాయి.
      • మెట్లకి ఇరువైపులా ఉన్న అంగళ్లలో పానీయాలు, తినుబండారాలు తక్కువ తీసుకోండి. సాధ్యమైనంతవరకు గ్లూకోసు, నీళ్లు - వీటిపై ఆధారపడండి, ముఖ్యంగా కూల్ డ్రింకులు(కోక్,పెప్సీ మొ.) ఏ విధంగానూ మన నడకకు సహకరించవు.
      • నామాల కొండ వద్ద తొందరగా దైవదర్శనం అయ్యేందుకు ఇస్తున్న రశీదు తీసుకోవడం మరచిపోవద్దు. ఆ తరువాత కొంత దూరం నడిచినాక మళ్ళీ ఆ రశీదు మీద ముద్ర వేయించుకోవడం మరచిపోవద్దు.
      • లగేజీలో విలువైన వస్తువులు లేకుండా చూసుకోండి, లగేజిని కింద ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానముల ఉచిత రవాణా సేవలో పైకి పంపించండి.
  • శ్రీవారి మెట్టు కాలిబాట: తిరుమల చేరుకోవడానికి ఇది రెండవ కాలిబాట. తిరుమల పట్టణానికి కళ్యాణీ డ్యాము నీటి సరఫరాకి ఈ మార్గం నుండి పైపులైను వేసిన తరువాత నుండి ఈ దారి కొంత అభివృద్ధి చెందింది. అలాగే తితిదే వారు ఈ కాలిబాటను కూడా బాగా అభివృద్ధి చేస్తున్నారు. దీనికీ, అలిపిరి కాలిబాటకు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే అలిపిరి కాలిబాట మొత్తం సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటే ఈ కాలిబాట సుమారుగా మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అయితే ఈ కాలిబాటలో సమస్య ఏమిటంటే దీనికి చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు తక్కువగా ఉండేవి.కాని తిరుమల తిరుపతి దేవస్తానము వారు తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు దారి వరకు ఉచిత బస్సులను నడుపుతున్నారు.ఈ దారిలో వేళ్ళేవారికి తిరుమల తిరుపతి దేవస్తానం వారు దివ్యదర్శనానికి టోకను మంజూరు చేస్తున్నారు,దారి పొడవునా నీటి కుళాయిలను వుంచారు,అలిపిరి లాగా మెట్టు దారి లాగా పైకప్పును కూడా యేర్పాటుచేసారు. ఈ దారిగుండానే వేంకటేశ్వరుడు వివాహానంతరం ఆరు నెలలు అగస్త్యాశ్రమంలో గడిపి తరువాత తిరుమల చేరుకున్నాడని పురాణ కథ. శ్రీనివాస మంగాపురం చేరుకొని అక్కడి నుండి ఆటోలో వెళ్లవచ్చు. శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టు సుమారుగా 6 కిలోమీటర్లు ఉంటుంది.

తిరుమల గురించి కొన్ని విశేషాలు

(వీటిని ధ్రువీకరించవలసి ఉంది. పరిశీలించగలరు)

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి గురించి మీకు తెలుసా! శ్రీ వారి గర్భగుడిలో ఒక పిల్లి అనుచానంగా నివసిస్తు వస్తోంది. మాములుగా శ్రీ వారి ఆలయం బంగారు వాకిలి తలుపులు తెల్లవారు జామున 3 గంటలకు సుప్రభాత సేవ సమయంలో అర్చకుల చే తెరువబడుతాయి. ఆ సమయంలో బంగారు వాకిలి లోపలికి అర్చకులు, జీయంగారు స్వామి, ఏకాంగితో పాటుగా 'సన్నిధి గొల్ల' అనబడే ఒక యాదవుడూ మాత్రమే ప్రవేశిస్తారు. కాని అదే సమయంలో అశ్చర్యకరంగా ఒక దైవీకమైన పిల్లి క్రమం తప్పకుండా వీరితో పాటుగా బంగారు వాకిలిలో ప్రవేశిస్తుంది. ఇది శ్రీ వారి లీల మాత్రమే గాని మరియొకటి కాదు. ఈ పిల్లి (లేక పిల్లులు)సుమారుగా 100 సంవత్సరముల(ఈ గుడితో సంబధం ఉన్నటువంటి పూర్వికుల నుండి గ్రహించిన సమాచారం మేరకు) నుండి శ్రీ వారి గర్భాలయంలో వున్నట్టు తెలుస్తోంది. మాములుగా రాత్రి శ్రీ వారి ఏకాంత సేవ సమయంలో తలుపులు మూసి వేస్తారు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు శ్రీ వారిని అర్చిస్తారని ప్రతీతి. ఆ సమయంలో గర్భాలయం ఎట్టి పరిస్థితుల్లోను లోపల ఎవ్వరు ఉండకుడదు. ఇది అనుచానంగా శ్రీ వారి ఆలయంలో వస్తున్న సంప్రదాయం. ఆశ్చర్యకరంగా ఈ పిల్లి కూడా ఈ నిబంధనను క్రమంతప్పక పాటిస్తుంది. ఆ తర్వాత తిరిగి సుప్రభాత సమయంలో నే అర్చకులతో పాటు ఈ పిల్లి లోనికి ప్రవేశిస్తుంది. ఈ పిల్లి శ్రీ వారికి నివేదించిన తర్వాత మాత్రమే ప్రసాదం స్వీకరిస్తుంది అది కూడా అర్చకులు పిల్లి చేసే సంజ్ఞలను గుర్తించి ప్రసాదాన్ని పిల్లి కోసం పెట్టినప్పుడు మాత్రమే అది స్వీకరిస్తుంది.అలాగే రాత్రి ఏకాంత సేవ సమయంలో శ్రీ వారికి నివేదించబడిన పాలు అర్చకులు ఇవ్వగా స్వీకరిస్తుంది. శ్రీ వారికి నివేదించని ప్రసాదాన్ని ఇది స్వీకరించదు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. మరొక విషయమేంటంటే ఈ పిల్లి ఆయుర్దాయం తీరిన వెంటనే ఆ స్థానంలో మరొక పిల్లి శ్రీ వారి కైంకర్యం చేయడానికి సిద్ధంగా వుంటుంది. ఈవిధంగా శ్రీ వారు మనుష్యులతో పాటు జంతువులను కుడా కటాక్షిస్తున్నారు!

శ్రీవారి ఆభరణాలు

తిరుమల వెంకన్నకు దాదాపు 45 టన్నుల స్వర్ణాభరణాలు ఉన్నాయి.[3] శ్రీవారికి 12వ శతాబ్ది నుంచే రాజులు విశేషంగా కానుకలు సమర్పించారని ఆలయంలోని శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. విజయనగర రాజుల కాలం (1450)లో శ్రీవారికి ఆభరణాల వెల్లువ ప్రారంభమైంది. ప్రధానంగా శ్రీకృష్ణదేవరాయులు పాలించిన 21 ఏళ్లు (1509-1530)[3] స్వర్ణయుగమేనని చెప్పవచ్చును. తిరుమల ఆలయాన్ని ఏడుసార్లు సందర్శించిన శ్రీకృష్ణ దేవరాయలు విశేష కానుకలతో స్వామివారి భాండాగారాన్ని స్వర్ణమయం చేశాడు. శ్రీకృష్ణ దేవరాయలు 10-02-1513న శ్రీవారి ఆలయాన్ని సందర్శించి కెంపులు, పచ్చలు, వజ్రాలు, నీలాలు, మాణిక్యాలు, వైఢూర్యాలు, గోమేధికాలతో పొదిగిన వజ్రకిరీటాన్ని కానుకగా సమర్పించాడు. 1513 మే 2 న నవరత్నఖచిత ఉడుధార, స్వర్ణఖడ్గం, నిచ్చెన కఠారి, [[రత్నఖచిత మరో చిన్న కత్తి]], [[నవరత్నాలు పొదిగిన కంఠహారం]], భుజకీర్తులు, 30 తీగల పతకం కానుకగా సమర్పించాడు.[3] తంజావూరు రాజులు పాండ్యన్‌ కిరీటాన్ని కానుకగా సమర్పించారు. రాజులు పోయినా... మహ్మదీయ రాజ్యం, బ్రిటిష్‌ పాలన, మహంతుల శకం, ప్రస్తుతం ప్రజాస్వామ్య భారతంలో పాలక మండళ్ల వ్యవస్థ ఇలా ఆలయ నిర్వహణ పలు పుంతలు తొక్కినప్పటికీ కాలమాన పరిస్థితులతో నిమిత్తం లేకుండా స్వామి వారికి కానుకల వెల్లువ పెరుగుతూనే ఉంది.

స్వామి వారికి ఉన్న విశేష ఆభరణాల్లో 500 గ్రాముల గరుడమేరు పచ్చ ప్రధానమైనది. ఉత్సవాల్లో శ్రీవారికి దీన్ని అలంకరిస్తారు. బ్రిటిష్‌ పాలనలో చిత్తూరు కలెక్టర్‌గా పనిచేసిన థామస్‌ మన్రో పెద్ద గంగాళాన్ని కానుకగా ఇచ్చారు. స్వామివారి పూజకు వాడే 108 బంగారు పువ్వులను గుంటూరు జిల్లాకు చెందిన షేక్‌ హుస్సేన్‌ సాహెబ్‌ అనే ముస్లిం సమర్పించడం విశేషం. అర్చన సేవలో ఉపయోగించే 108 పద్మాలను హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ మీర్జా సమర్పించారు. వేంకటేశ్వర హెచరీస్‌ సంస్థ 13 కిలోల కిరీటం సమర్పించింది గోయెంకా కుటుంబం 10 కిలోల కిరీటాన్ని కానుకగా ఇచ్చింది. పెన్నా సిమెంట్స్ ‌ సంస్థ రూ.5 కోట్ల విలువైన వజ్రాలతో పొదిగిన కఠి, వరద హస్తాలను సమర్పించింది. తితిదే కూడా స్వామివారికి వజ్రాలతో కిరీటం, హారం, శంఖుచక్రాలు, కర్ణపత్రాలు తయారుచేయించింది స్వామి వారికి ప్రస్తుతం ముఖ్యమైన 6 కిరీటాలు, 20 ముత్యాల హారాలు, 50 కాసుల దండలు, ఉత్సవ విగ్రహాలకు 7 కిరీటాలు ఉన్నాయి. వాటిలో వజ్రాల కిరీటం, గద్వాల మహారాణి కిరీటం ముఖ్యమైనవి. ఇవే కాకుండా సువర్ణపద్మపీఠం, సువర్ణపాదాలు, ఉదర బంధము, దశావతార హారము, బంగారు పులిగోరు, సువర్ణ యజ్ఞోపవీతం, తులసీ పత్రహారం, 4 కిలోల చతర్భుజ లక్ష్మీహారం, 32 కిలోల సహస్రనామ హారం, సూర్య కఠారి (ఖడ్గం), కటి వరద హస్తాలు, నాగాభరణాలు, భుజకీర్తులు, ఆకాశరాజు కిరీటం వంటి అనేక ఆభరణాలున్నాయి. ఇవి కాకుండా ఉత్సవాల్లో అలంకరించేందుకు ప్రత్యేక ఆభరణాలు ఉన్నాయి. వాటిలో రత్నకిరీటం, మేరు పచ్చ, రత్నాలతో చేసిన శంఖుచక్రాలు, రత్నాల కరపత్రాలు, రత్నాల కటి వరద హస్తాలు, 7 కిలోల రత్నాల మకర కంఠి, బంగారు వస్త్రాలు తదితరాలు ముఖ్యమైనవి.[3] 2009వ సంవత్సరంలో గాలి జనార్ధన రెడ్డి 42 కోట్లు విలువ చేసే వజ్రాల కీరీటాన్ని శ్రీవారికి సమర్పించాడు.

రోడ్డు మార్గం

తిరుమల బస్టాండు

రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే బస్సుల కోసం తిరుపతిలో నాలుగు బస్టాండ్‌లు ఉన్నాయి. మొదటిది రైల్వే స్టేషను ఎదురుగా ఉండే శ్రీ వేంకటేశ్వర బస్‌స్టేషను. రైళ్లు వచ్చే సమయానికి అక్కణ్నుంచి తిరుమలకు వెళ్లే బస్సులు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంటాయి. బెంగుళూరు వైపు నుంచి వచ్చే బస్సులు సరాసరి అలిపిరి టోల్‌గేటు వద్ద ఉండే బాలాజీ లింక్ బస్‌స్టేషను‌కు వస్తాయి. టూరిస్టు వాహనాలు నిలుపుకోవడానికి అక్కడ విశాలమైన ప్రదేశం ఉంది. చెన్నై, హైదరాబాదు, విజయవాడ నగరాల నుంచి వచ్చే బస్సులు సప్తగిరి లింక్ బస్‌స్టేషను (పెద్ద బస్టాండ్)కు చేరుకుంటాయి. బృందాలుగా ప్రైవేటు వాహనాల్లో వచ్చే పర్యాటకుల కోసం రైల్వేస్టేషను వెనకవైపు శ్రీ పద్మావతీ బస్‌స్టేషను ఉంది. వీటిలో ఎక్కడ దిగినా సమీపంలోనే సుదర్శనం కౌంటర్లు ఉంటాయి.

రైలు మార్గం

తిరుమలకు దగ్గరి లోని రైల్వే స్టేషను తిరుపతి. తిరుపతి స్టేషనుకు దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి రైళ్ళు నడుస్తాయి. రైల్వేస్టేషను నుంచి కొండమీదకు ఆర్టీసీ దాదాపు నిమిషానికో బస్సు నడుపుతోంది. ముందుగానే దర్శన టిక్కెట్లు, కాటేజీ వసతి రిజర్వు చేయించుకుంటే అంతగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. స్టేషను నుంచి బయటకు వచ్చి సరాసరి కొండమీదకు వెళ్లిపోవచ్చు.

విమాన మార్గం

తిరుపతికి సమీపాన ఉన్న రేణిగుంట, తిరుమలకు అతి దగ్గరి విమానాశ్రయం. ఇక్కడికి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాదు నుండి నేరుగా విమాన సేవలు ఉన్నాయి.

చూడవలసిన ప్రదేశాలు

తిరుమల మ్యాపు
పాపవినాశనం
తిరుమల నుండి ఘాట్ రోడ్ లో తిరివచ్చే దారిలో ఒక శిల గరుత్మంతుని ఆకారంలో ఉంటుంది. ఆ శిలా విశేషం
  • తిరుమల ముఖ్యాలయం:
  • వెండి వాకిలిలో దర్శించవలసిన విశేషాలు: (వామ భాగం నుండి దక్షిణ భాగం వైపు).
  • స్వామి పుష్కరిణి
  • గర్భగుడి/ఆనందనిలయం
  • రామర్ మేడై (రాములవారి మేడ)
  • వరదరాజస్వామి ఆలయం
  • పోటు (వంటశాల) ప్రధాన వంటశాల (అన్నప్రసాదాలు తయారుచేయు స్థలం)
  • వకుళమాత దేవాలయం
  • బంగారు బావి
  • మాడ వీధులు: తిరుమల శ్రీ వారి ఆలయం చుట్టూ వున్న ప్రధాన రహదారులను మాడ వీధులు అంటారు. ఉత్సవ సందర్భాలలో స్వామి వారిని వివిధ వాహనాలపై, రథాల పై వూరేగింపుగా ఈ మాడ వీదులలో ఊరేగిస్తారు. నాలుగు దిక్కులలో ఉన్న వీధులను దిక్కుల పేరు మీదుగా తూర్పు మాడ వీధి, దక్షిణ మాడ వీధి, పడమర మాడ వీధి, ఉత్తర మాడ వీధి అని పిలుస్తారు.
  • తీర్థం శఠరి ఇచ్చే ప్రదేశం హనుమ, అంగద, సుగ్రీవ, విష్వక్సేన, అనంత, గరుడ ఉత్సవ మూర్తులు ఉండే మంటపం. ఈ ఉత్సవ విగ్రహాలు ఇది వరకు రాములవారి మేడలో వుండేవి. ఇప్పుడు 'యాగశాల' అనబడే 'తీర్థం, శఠారి మంటపంలో వుంచబడ్డాయి.
  • ఇప్పటి పరకామణి
  • విమాన వెంకటేశ్వరస్వామి
  • హుండీ
  • తాళ్ళపాక వారి అర: తాళ్ళపాక వారి అర(అన్నమయ్య భాంఢాగారం) లో రాగి మీద చెక్కిన అన్నమయ్య పాటలను దాచి ఉంచారు.
  • భాష్యకార్ల సన్నిధి
  • బొక్కసం సెల్
  • యోగ నరసింహస్వామి ఆలయం: ఈ గుడి ప్రధానాలయానికి ఈశాన్య దిక్కున వుంటుంది. పురాతనమైన ఈ విగ్రహం రామానుజుల కాలంలో దొరికింది. గ్రామంలో సర్వదేవతలూ ప్రధాన దైవానికి అభిముఖంగా వుండాలన్న ఆగమోక్తి ననుసరించి, నరసింహుని ఉగ్రరూపం తగ్గించడానికనీ తిరుమల ఆలయంలో రెండవ ప్రాకారంలో స్వామికి ఈశాన్య దిక్కున పశ్చిమాభిముఖంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
  • పరిమళపు అర

వెండివాకిలి బయట ఉండే విశేషాలు

వెంకటేశ్వర స్వామిని మొట్టమొదట దర్శించే యాదవుల కులానికి చెందిన మహిళా గుడి మందిరం గొల్లమండపం. గొల్ల కులానికి చెందిన ఓ మహిళా తిరుమలలో పాలు అమ్ముకొని, వచ్చిన ఆదాయంతో గొల్ల మండపాన్ని నిర్మించింది.

తిరుమల కొండలమీద ఉన్న వివిధ తీర్థాలు

  1. తుంబురు తీర్థము
  2. రామకృష్ణ తీర్థం
  3. పాండవ తీర్థం
  4. దేవతీర్థం: తిరుమలలో శ్రీవారి ఆలయానికి వాయవ్యదిశలో ఉంది ఈ దేవతీర్థం. పుష్యమీ నక్షత్రం కలిసిన గురువారంకానీ శ్రవణానక్షత్రయుక్తమైన సోమవారం నాడుకానీ ఈ తీర్థంలో స్నానం చేస్తే పాపాలు నశించి, దీర్ఘాయువు వరమై, ఆ తర్వాత మోక్షసిద్ధి కలుగుతుందని ప్రతీతి.
  5. కుమారధారాతీర్థం
  6. కాయరసాయన తీర్థము
  7. జాబాలి తీర్థం
  8. శేష తీర్థము: పాపవినాశనం నుండి కొన్ని మైళ్ళు అడవిలో నడిస్తే శేష తీర్థం చేరుకుంటారు. ఈ తీర్థానికి వెళ్ళటం చాలా కష్టం. పర్వతాలను ఎక్కడం కష్టపడటమే కాక చిన్న ప్రవాహాలను దాటాలి. ఇక్కడ పాచి పట్టి ఉంటుంది. జాగ్రత్తగా దాటాలి. ఇక్కడ ఆదిశేషుడు శిలారూపంలో ఉంటాడు. ఇదే కాక ప్రత్యేకంగా కొన్ని నాగుపాములు ఈ తీర్థంలో తిరుగుతూనే ఉంటాయి. దేవాలయానికి పదికిలోమీటర్ల దూరంలో ఉంది.
  9. పసుపుధారా కుమారధారా తీర్థం
  10. చక్రతీర్థం
  11. శంకుతీర్థం: తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ముఖద్వారానికి ఎదురుగా వున్న గుట్టపై వున్న చిన్న గుంట, శంఖు తీర్దం.
  12. పంచాయుధతీర్థం
  13. బ్రహ్మతీర్థం
  14. అగ్నికుండతీర్థం
  15. సప్తర్షితీర్థం
  16. విష్వక్సేన సరస్సు
  17. పాప వినాశనం
  18. ఆకాశ గంగ
  19. స్వామి పుష్కరణి
  20. వైకుంఠ తీర్థం
  21. కపిలతీర్థం
  22. గోగర్భం ఆనకట్ట (Gogarbham dam) అనేది తిరుమల నివాసితులకు నీరు సరఫరా చేసే జలాశయాల యొక్క ఒకటి. ఈ జలాశయం దేశంలో అత్యంత పుణ్యకేత్రమైన శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువైవున్న తిరుమలలోని కొండ పైభాగాన పాప వినాశనము వద్ద ఉంది. ఈ జలాశయ జలపాతం పచ్చని పర్వతాల మధ్యనున్నది, ఈ ప్రదేశానికి చేరుకున్న యాత్రికులు ఇక్కడి సౌందర్యానికి ముగ్ధులవుతారు. ఈ ప్రదేశం వద్ద నీటిని ఆపటం వలన తిరుమలకు మంచి నీటి వనరు సమకూరింది. గాలిమరల జంట అక్కడి అందమైన సెట్టింగులు, అందమైన చెట్లు, కొండలు ఫోటోగ్రాఫర్లకు మంచి కనువిందునిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం ఇక్కడి ప్రశాంత అందాన్ని చూడడానికి ఉత్తమ సమయం. శ్రీవారి ఆలయ ప్రదేశానికి ఎక్కువ దూరంలో ఉన్నందున ఇక్కడకు నడవటం కష్టం, కావున అందుబాటులో ఉన్న బస్సులను లేదా టాక్సీలను ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఫోటోలు తీసుకోవచ్చు.

ఇంకా దర్శించవలసిన ప్రదేశాలు

  1. శ్రీవేంకటేశ్వర మ్యూజియం
  2. శిలాతోరణం
  3. శ్రీ వేంకటేశ్వర ధ్యాన జ్ఞాన మందిరం
  4. రీజనల్ సైన్స్ సెంటర్, తిరుపతి
  5. ల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీనివాసమంగాపురం
  6. వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, కాణిపాకం
  7. గోవిందరాజ స్వామి ఆలయం, తిరుపతి
  8. పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూరు

వేంకటేశ్వరుని భక్తులు,కైంకర్య పరులు

  1. ఆళ్వారులు
  2. అన్నమాచార్యులు
  3. వ్యాసరాయలు
  4. తరిగొండ వెంగమాంబ
  5. తిరుమల నంబి
  6. గొల్ల భక్తురాలు
  7. సర్ థామస్ మన్రో
  8. కులశేఖర ఆళ్వార్
  9. హథీరాం బావాజీ
  10. వీరనరసింహ దేవుడు(గజపతి)

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వాహనాలు

  1. పెద్ద శేష వాహనం: బ్రహ్మోత్సవాలు మొదటి రోజున ఉపయోగించే వాహనం.
  2. చిన్నశేష వాహనం: బ్రహ్మోత్సవాలు రెండవ రోజున ఉపయోగించే వాహనం.
  3. సింహ వాహనం: బ్రహ్మోత్సవాలు మూడవ రోజున ఉపయోగించే వాహనం.
  4. కల్పవృక్ష వాహనం: బ్రహ్మోత్సవాలు నాలుగవ రోజున ఉపయోగించే వాహనం.
  5. గరుడ వాహనం: బ్రహ్మోత్సవాలు అయిదవ రోజున ఉపయోగించే వాహనం.
  6. హనుమంత వాహనం: బ్రహ్మోత్సవాలు ఆరవ రోజున ఉపయోగించే వాహనం.
  7. సూర్యప్రభ వాహనం: బ్రహ్మోత్సవాలు ఏడవ రోజున ఉపయోగించే వాహనం.
  8. అశ్వ వాహనం: బ్రహ్మోత్సవాలు ఎనిమిదవ రోజున ఉపయోగించే వాహనం.
  9. పల్లకి వాహనం: బ్రహ్మోత్సవాలు తొమ్మిదవ రోజున ఉపయోగించే వాహనం.
  10. ముత్యాల పందిరి
  11. చంద్రప్రభ వాహనం
  12. రథము
  13. సర్వభూపాల వాహనం
  14. హంస వాహనం
  15. గజ వాహనం

చిత్రమాలిక

వనరులు

బయటి లింకులు

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. http://www.hindu.com/2003/09/30/stories/2003093003080300.htm
  2. 2.0 2.1 వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  3. 3.0 3.1 3.2 3.3 ఈనాడు దిన పత్రికలో శ్రీవారు 'బంగారు' కొండ[permanent dead link] ఆభరణాల వివరాలు జులై 07, 2008న సేకరించబడినది.

మూస:భారత దేశంలోని హిందువుల పవిత్రనగరాలు

"https://te.wikipedia.org/w/index.php?title=తిరుమల&oldid=3145306" నుండి వెలికితీశారు