హిందూ పురాణాలలో, కామధేనువు (English: Kamadhenu), (సంస్కృతం: कामधेनु) అతి పవిత్రమైన ధేనువు అనగా ఆవు. గోమాత సర్వదేవతలు కొలువై వుంటారు. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది. పశువులన్నింటికీ మూలం కామధేనువు అని పురాణాలు చెబుతున్నాయి. అమృతం కోసం దేవతలు, రాక్షసులు ఆదిశేషువు తాడుగా మంధర పర్వతాన్ని కర్రగా చేసుకుని క్షీర సాగరాన్ని మథిస్తారు. అయితే ఆ క్షీర సాగర మథనంలో కామధేనువు కూడా మథనం నుంచి ఉద్భవిస్తుంది. ఈ ఆవునే సురభి అని కూడా పిలుస్తారు. లోకంలో ఉన్న పశుసంపదలన్నిటికీ ఈ కామధేనువే ఆధారం అని పురాణాలు చెప్తాయి. కామధేనువు ఇంద్రుడి వద్ద ఉంటుంది. మరికొన్ని పురాణగాథల్లో వశిష్ఠుడి ఇంటిలో, కొన్ని పురాణగాథల్లో గౌతమ ముని వద్ద ఉన్నట్టు కనిపిస్తుంది. కామధేనువు వశిష్టుని తపస్సు కోసం కావలసినవన్నీ ప్రసాదించింది. కామధేనువు పుత్రిక శబల అనే గోవు, కామధేనువు పుత్రుడు నంది. ఏ పురాణంలో అయినా కామధేనువు మాత్రం, ఏది కోరినా దాన్ని తక్షణమే ప్రసాదించే మహిమ గలది.
కామధేనువు సురభి ఆవు ఉద్భవించడం వెనుక పలు రకాల భిన్నమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అవేమిటంటే…[1]
రామాయణము ప్రకారమైతే రుషి కశ్యపుడు, అతని భార్య క్రోధవశల కుమార్తె సురభి. ఆమెకు మళ్లీ ఇద్దరు కూతుళ్లు జన్మిస్తారు. వారు రోహిణి, గోదావరి. ఈ క్రమంలో సురభి కోరిన కోర్కెలు తీర్చే కామధేనువుగా మారిందని పురాణాలు చెబుతున్నాయి.
ఇంద్రుడు వశిష్ట మహర్షి యొక్క యజ్ఞాలకు మెచ్చి పుత్రిక అయిన శబల అనే గోవుని ఇస్తాడు. ఇది కామధేనువు లాగే తన యజమానికి ఏది కోరితే అది ఇవ్వగలదు.
దేవీభాగవతము చెబుతున్న దాని ప్రకారమైతే శ్రీకృష్ణుడే స్వయంగా సురభి ఆవును బృందావనంలో సృష్టించాడట ... గోపికలతో బృందావనంలో నాట్యమాడుతుండగా అకస్మాత్తుగా కృష్ణునికి తీవ్రమైన దాహం వేస్తుందట. దీంతో శ్రీకృష్ణుడు అప్పటికప్పుడే సురభిని సృష్టించి దాని పాలను తాగుతాడట.
అయితే మహాభారతం ప్రకారం ... వశిష్ఠ మహర్షి తలపెట్టిన భూయాగం పట్ల దేవేంద్రుడు అసహనానికి లోనవుతాడు. ఆ ప్రాంతంలో కరవు కాటకాలను సృష్టిస్తాడు. ఆశ్రమంలోని శిష్యులంతా ఆకలితో బాధలు పడుతుంటారు.అరుంధతి బిడ్డల ఆకలి తీర్చే శక్తిని ప్రసాదించమని పార్వతి దేవి అమ్మవారిని కోరుతుంది. అమ్మవారు అరుంధతికి గోమాతను ఇస్తు కామధేనువు మహిమ ఆ తల్లి సెలవిస్తుంది. అరుంధతి ఆశ్రమంలోని అందరి ఆకలిని తీరుస్తుంది.[2]
బృహద్ధర్మ పురాణం ·దేవీ భాగవతం· గణేష పురాణం · కల్కి పురాణం · కాళికా పురాణం · కపిల పురాణం · ముద్గల పురాణం ·నృశింహ పురాణం· సాంబ పురాణం ·సౌర పురాణము· శివ రహస్య పురాణం · విష్ణు ధర్మోత్తర పురాణం · సనత్కుమారీయం ·స్కాందం (కుమారస్వామి) · శివ ధర్మం (నందికేశ్వరుడు) ·నారదీయం (దూర్వాసుడు) ·బ్రహ్మాండ పురాణం (శుక్రాచార్యుడు) · కాలకం · మహేశ్వరం (పురాణం) · మారీచం · భార్గవపురాణం (పరాశరుడు) · కార్తీకపురాణం (స్కందపురాణం) · వారుణం
1 బుద్ధుడు, బలరాముడు విష్ణువు అవతారములని ప్రతీతి. ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం బుద్ధుడు అవతారమైతే, దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం బలరాముడు విష్ణువు అవతారంగా పరిగణిస్తారు.