Coordinates: 17°57′N 79°30′E / 17.95°N 79.5°E / 17.95; 79.5

హనుమకొండ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Reverted 1 edit by 117.202.238.147 (talk) to last revision by Tulsi Bhagat. (TW)
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 87: పంక్తి 87:


వరంగల్ జిల్లాలో దేశంలో ఉత్తమమైనవిగా గుర్తింపు పొందిన విద్యాసంస్థలు ఉన్నాయి. వరంగలు తెలంగన జిల్లాలలో 2 ఉంది. 1959లో పండిత జవహర్లాల్ నెహ్రుచే పునాది రాయి స్థాపించబడిన [[నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, వరంగల్]] (పాత పేరు ఆర్.ఇ.సి వరంగల్) మరియు [[కాకతీయ మెడికల్ కాలేజీ]] ఉంది. ఎన్ ఐ టి భారతదేశం అంతా చక్కగా అభివృద్ధి చెందింది. వరంగల్ నిట్ (ఎన్ ఐ టి) దేశంలో అత్యుత్తమమైనదిగా భావిస్తున్నారు. 1959 లో దీనిని స్థాపించినప్పటి నుండి ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు అనేకులు దేశ విదేశాలలో ఉన్నారు. ఈ సంస్థ దేశం మొత్తం నుండి ప్రతిభావంతులని అనేక మందిని ఆకర్షిస్తుంది.
వరంగల్ జిల్లాలో దేశంలో ఉత్తమమైనవిగా గుర్తింపు పొందిన విద్యాసంస్థలు ఉన్నాయి. వరంగలు తెలంగన జిల్లాలలో 2 ఉంది. 1959లో పండిత జవహర్లాల్ నెహ్రుచే పునాది రాయి స్థాపించబడిన [[నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, వరంగల్]] (పాత పేరు ఆర్.ఇ.సి వరంగల్) మరియు [[కాకతీయ మెడికల్ కాలేజీ]] ఉంది. ఎన్ ఐ టి భారతదేశం అంతా చక్కగా అభివృద్ధి చెందింది. వరంగల్ నిట్ (ఎన్ ఐ టి) దేశంలో అత్యుత్తమమైనదిగా భావిస్తున్నారు. 1959 లో దీనిని స్థాపించినప్పటి నుండి ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు అనేకులు దేశ విదేశాలలో ఉన్నారు. ఈ సంస్థ దేశం మొత్తం నుండి ప్రతిభావంతులని అనేక మందిని ఆకర్షిస్తుంది.
orugallu technology india software industry-hanamkonda,Warangal city-Telangana-India- online comptuer education - engineirng services


== దర్శనీయ స్థలాలు ==
== దర్శనీయ స్థలాలు ==

10:44, 11 మార్చి 2019 నాటి కూర్పు

భారతదేశం- [తెలంగాణ]] రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి వరంగల్ పట్టణ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి, వరంగల్ పట్టణ జిల్లా పరిపాలన కేంద్రం.[1]

  ?వరంగల్
తెలంగాణ • భారతదేశం
View of వరంగల్, India
View of వరంగల్, India
అక్షాంశరేఖాంశాలు: 17°57′N 79°30′E / 17.95°N 79.5°E / 17.95; 79.5
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 12,846 కి.మీ² (4,960 చ.మై)
ముఖ్య పట్టణం వరంగల్
ప్రాంతం తెలంగాణ
జనాభా
జనసాంద్రత
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
35,22,644 (2011 నాటికి)
• 274/కి.మీ² (710/చ.మై)
• 1766257
• 1756387
• 58.41(2001)
• 70.01
• 46.54

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో లోగడ ఉన్న వరంగల్ జిల్లాను వరంగల్ పట్టణ జిల్లాగా, వరంగల్ గ్రామీణ జిల్లాగా విభజించారు.ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదునకు ఉత్తర దిశలో 157 కి.మీ. దూరంలో ఉంది.

గణాంకాలు

2011 భారతీయ జనాభా గణాంకాలను అనుసరించి వరంగల్ జిల్లా జనాభా 759,594. వీరిలో పురుషుల శాతం 51%. స్త్రీల శాతం 49%.

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం వరంగల్ జిల్లాఅక్షరాస్యత 84.16%. ఇది జాతీయక్షరాస్యత 69.5% కంటే అధికం. వీరిలో పురుషుల అక్షరాస్యత శాతం 91.54%. స్త్రీల అక్షరాస్యత 76.79%. వరంగల్ జిల్లాలో 6 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారి శాతం 11%.

1981 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా ఈ జిల్లా జనాభా: 22,99,61, స్త్రీ, పురుషుల నిష్పత్తి... 987:1000, అక్షరాస్యత...23.84 శాతం (మూలం:ఆంధ్రాప్రదేశ్ దర్శిని. 1985)

జిల్లా చరిత్ర

11వ శతాబ్దానికి చెందిన పార్శ్వనాధుని విగ్రహం (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యూజియం)

క్రీ.శ.12-14 శతాబ్దాలలో పరిపాలించిన కాకతీయుల రాజ్యానికి వరంగల్ రాజధాని. కాకతీయుల నిర్మించిన ఎన్నో కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు ఈ జిల్లాలో ఉన్నాయి.కాకతీయుల పాలనా దక్షత గురించి ఇటలీ యాత్రికుడు మార్కోపోలో తన రచనలలో రాసాడు. కాకతీయ పాలకులు - కాకర్త్య గుండన, మొదటి ప్రోలరాజు (1050-1080), రెండవ బేత రాజు (1080 - 1115), రెండవ ప్రోల రాజు (1115-1158), రుద్ర దేవుడు (1158-1195), మహా దేవుడు (1195-1199), గణపతిదేవ చక్రవర్తి (1199-1261), రుద్రమ దేవి (1258-1290), ప్రతాపరుద్రుడు ( 1290-1326).

14 వ శతాబ్దంలో ఢిల్లీ తుగ్లక్ సుల్తానుల చేతిలో ఓడిపోవడంతో కాకతీయుల పరిపాలన అంతమయింది. తరువాత అది ముసునూరి నాయకులు, రేచెర్ల నాయకులు, బహమనీ సుల్తానులు, గోల్కొండను పాలించిన దక్కను సుల్తానుల పాలన లోకి వచ్చింది. మొగలు చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను 1687లో ఆక్రమించినపుడు అది మొగలు సామ్రాజ్యంలో భాగమయింది. తరువాత 1724లో ఈ సామ్రాజ్యం లోని దక్షిణ ప్రాంతం విడివడి హైదరాబాదు రాజ్యం ఏర్పడినపుడు వరంగల్లు ఆ రాజ్యంలో భాగమైంది. 1948లో వరంగల్లుతో సహా హైదరాబాదు భారతదేశంలో కలిసి పోయింది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ఠ్ఱం అవతరించిది.1996 వ సం.లో వరంగల్ పట్టణ అభివృద్ధికి కేంద్ర పభుత్వం నిధులను మంజూరు చేసింది.

1969లో తెలంగాణా ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం జరుగుతున్నట్లు మిగిలిన ఆంధ్రరాష్ట్ర ప్రజలపట్ల చూపుతున్న శ్రద్ధ తమ పట్ల చూపకుండా పక్షపాత దృష్టితో వ్యవహరిస్తున్నట్లు తలచారు. ఫలితంగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తలెత్తింది. ఈ ఉద్యమం కారణంగా వరంగల్ జిల్లాలో విషాదపరిస్థితిని ఎదుర్కొన్నది. ఇలాంటి పరిస్థితిలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణా ప్రజా సమితి (టి పి ఎస్) పార్టీ స్థాపించబడింది. 1956లో నిర్ణయించిన విధంగా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కావాలని ఇతరనాయకులు కూడా తమ కోరికను వెలిబుచ్చారు. వరంగల్ జిల్లా ప్రజలు ఈ ఉద్యమానికి పక్కబలంగా నిలిచారు. విద్యార్థులు, ప్రభుత్వోద్యోగులు, వ్యవసాయదారులు అందరూ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 400 కంటే అధికమైన విద్యార్థులు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులు ఒక విద్యాసంవత్సరం కోల్పోయారు.

భౌగోళిక స్వరూపం

హనుమకొండ పద్మాక్షి అమ్మవారి చిత్రము

వరంగల్ జిల్లా 12,846 చ.కి.మీ.లలో వ్యాపించి 32,31,174 (2001 లెక్కలు) జనాభా కలిగి ఉంది. బొగ్గు మరియు గ్రానైటు గనులకు (నలుపు, బ్రౌను రకాలు) జిల్లా ప్రాముఖ్యత చెందింది. వరి, మిరప, పత్తి మరియు పొగాకు పంటలు విరివిగా పండుతాయి. గాలిలోని తేమశాతం సగం మాత్రమే ఉండే తెలంగాణా భూభాగంలో ఉన్న కారణంగా వరంగల్ వాతావరణం వేడివాతావరణం కలిగి ఉంటుంది. మార్చి మాసంలో ఆరంభం అయ్యే వేసవి కాలం మే మాసానికి 42 ° (108 ° ఫారెన్ హీట్ ) సెంటీగ్రేడుల శిఖరాగ్రం చేరుకుంటుంది. జూన్ మాసానికంతా ఆరంభం అయ్యే వర్షాలు సెప్టేంబర్ వరకు కురుస్తుంటాయి. వర్షపాతం 22 మిల్లీమీటర్ల (22 అంగుళాలు) వరకు కురుస్తుంది. నవంబరు మాసం నుండి మంచుకురవని తేమలేని స్వల్పమైన శీతాకాలం ఆరంభం అయి ఫిబ్రవరి మాసం ఆరంభం వరకు ఉంటుంది. శీతాకాలం సరసరి ఉష్ణోగ్రత 22-23 ° సెంటీగ్రేడులు (72-73 ఫారెన్ హీట్ ) వరకు ఉంటుంది. వరంగల్ జిల్లా సందర్శనానికి ఇది తగిన సమయం. వరంగల్ జిల్లా సముద్రమట్టానికి 302 మీటర్ల (990 అడుగులు) ఎత్తులో ఉంటుంది. భారతదేశంలోని భూపర్యవేష్టిత జిల్లాలలో ఇది ఒకటి. అలాగే అటవీ ప్రాంతం అధికంగా ఉన్న జిల్లాలలో కూడా ఇది ఒకటి.

శాసనసభ నియోజక వర్గాలు.

  • నియోజకవర్గాలు: వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ, వర్థన్నపేట, స్టేషన్‌ ఘన్‌పూర్‌

పడమర వరంగల్

2014 తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు తెలిపే పటము
  • 2010 శాసనసభ ఉప ఎన్నికలలో దాస్యం వినయ్‌భాస్కర్‌ 74.85% శాతం ఓట్లతో విజయం సాధించారు.
  • 2009 శాసనసభ ఎన్నికలలో దాస్యం వినయభాస్కర్ 39.64% శాతం ఓట్లతో విజయం సాధించారు.

తూర్పు వరంగల్

  • 2009 శాసనసభ ఎన్నికలలో బసవరాజు సారయ్య 32.66% శాతం ఓట్లతో విజయం సాధించారు.
  • 2014 శాసనసభ ఎన్నికల్లో కొండా సురేఖ విజయం సాధించారు.

జిల్లాలోని రెవెన్యూ మండలాలు

  1. వరంగల్
  2. ఖిలా వరంగల్
  3. హనుమకొండ
  4. కాజీపేట
  5. ధర్మసాగర్
  6. వేలేర్
  7. ఐనవోలు
  8. హసన్ పర్తి
  9. ఎల్కతుర్తి
  10. భీమదేవరపల్లి
  11. కమలాపూర్

రవాణా వ్వవస్థ

వరంగల్ నగర శివార్లలో ఈశాన్యంలో ఉన్న మామ్నూరు గ్రామం వద్ద వరంగల్ ఖమ్మమ్ రహదారిలో వాయుసేన గ్లైడర్ శిక్షణా కేంద్రంగా ఉపయోగపడుతుంది. నిజాం నవాబు కాగజ్ నగర్ పేపర్ మిల్లు మరియు అజం జాహీ మిల్లుకు చేరడానికి అనుగుణంగా నిర్మించబడిన ఈ విమానాశ్రయం 1947 వరకు దేశంలోనే పెద్ద విమానాశ్రయంగా ఉంటూ వచ్చింది. సమీపంలో ఉన్న విమానాశ్రయం వరంగల్ పట్టణానికి 160 కిలోమీటర్ల దూరంలో హైదరాబాదులో ఉన్న రాజీవ్ గాంధీ విమానాశ్రయం.

రైలు మార్గం

ఖాజీపేట రైల్వే జంక్షన్ ముఖద్వారమ్

వరంగల్ రైలు మార్గం ద్వారా భారతదేశంలోని అనేక ప్రముఖ నగరాలతో అనుసంధానించబడింది. ఇది భారతీయ రైల్వేలో దక్షిణ మధ్య రైల్వే విభాగానికి చెందినది.వరంగల్‌కు సమీపంలో 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాజీపేట రైల్వే జంక్షన్ ఉంది. ఇది హైదరాబాదు, న్యూ ఢిల్లీ, విజయవాడ, చెన్నై మరియు కొలకత్తా రైలు మార్గంలో ప్రముఖ రైలు కూడలి (రైలు జంక్షన్) ఖాజీపేట రైల్వే జంక్షనే. వరంగల్ రైలు స్టేషను హైదరాబాద్, విజయవాడ, చెన్నై రైలు మార్గంలో ఉంది. ప్రతి రోజు ఈ స్టేషను ద్వారా గూడ్స్ రైళ్ళు కాక 132 రైళ్ళు దాటి వెళుతుంటాయి. దేశంలో రైలు స్టేషనులలో పెద్ద రైలు స్టేషనులలో వరంగల్ రైలు స్టేషను ఒకటి.

రోడ్డు మార్గం

హైదరాబాదు నుండి భోపాలపట్నం వరకు వేస్తున్న జాతీయరహదారి 202 నిర్మాణదశలో ఉంది. ఈ రహదారిలో వరంగల్ నుండి పోతుంది. వరంగల్ మరియు హనుమకొండ వద్ద రెండు ప్రధాన బస్సు స్టాండ్లు ఉన్నాయి. వరంగల్ నుండి దూరప్రాంతాలకు వెళ్ళే డీలక్స్ బస్సులు బెంగుళూరు, మద్రాసు, హైదరాబాదు, తిరుపతి, అనంతపూరు, హుబ్లి మరియు బెల్గాం లకు ఉన్నాయి. అలాగే స్టాండెడ్ ఎక్ష్ప్రెస్స్ బస్సులు గుంటూరు వయా విజయవాడ, చెన్నై, చెరియల్ మార్గంలో వరంగల్ ను చేరుకుంటాయి.

ఆర్ధిక స్థితి గతులు

వరంగల్లులో ఒక వీధి

వరంగల్ ఆర్థికంగా వ్యవసాయం మీద ఆధాపడి ఉంది. వరంగల్ సమీపంలో దేశాయిపేట వద్ద ఉన్న ఎనుమాముల గ్రామం వరంగల్ జిల్లా ధాన్యపు వాణిజ్య కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతం బియ్యపు వ్యాపారానికి ప్రధాన కేంద్రం. ప్రాంతీయ అవసరాలకు మరియు వెలుపలి వాణిజ్యానికి అవసరమైన బియ్యం వ్యాపారం ఇక్కడ ప్రధానంగా జరుగుతుంది. 1990 వరకు ఈ ప్రాంతంలో పత్తి ఉత్పత్తి ప్రధానంగా జరిగింది. ఇటీవలి కాలంలో పత్తి ఉత్పత్తిలో సమస్యలు ఎదురైయ్యాయి. ఈ జిల్లాలో 1997-1998 మధ్య పత్తిరైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదు అయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ జిల్లాలో పరిశ్రమలకు ముఖ్యత్వం ఇవ్వడంలో శ్రద్ధవహించ లేదు. నిజాం కాలం నుండి సాగుతున్న కొన్ని పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి. అజం జాహి క్లోత్ మిల్లు మూతపడింది. జిల్లాలో చిన్నతరహా పరిశ్రమలు మాత్రం నడుస్తున్నాయి. రెండవ స్థాయి నగరాలు సాంకేతిక రంగంలో జరుగుతున్న విప్లవాత్మక ఫలాలని అందునే ప్రయత్నంగా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్ టి పి ఐ) వరంగల్ జిల్లాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపించాలని అనుకుంటున్నారు. చక్కని ప్రయాణ వసతులు, నాణ్యమైన విద్యాసంస్థల నుండి విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు, మంచి భవనవసతులు, తక్కువగా ఉన్న వాహనాల రద్దీ మరియు హైదరాబాదుకు అందుబాటు దూరంలో ఉన్న కారణంగా వరంగల్ ఇందుకు తగి ఉంది. విదేశాలలో స్థిరపడిన ప్రవాసభారతీయుల నుండి ఈ జిల్లాకు విదేశీ పెట్టుబడులు అందుతున్నాయి.

సంస్కృతి

వరంగల్ జిల్లాలో ప్రజలు అధికంగా తెలుగు భాషను మాట్లాడుతుంటారు. వరంగల్ ప్రజలు సంప్రదాయమైన చీరె మరియు ధోవతి వంటి దుస్తులతో అధునిక వస్త్రాలను కూడా ధరిస్తుంటారు.వరంగల్ జిల్లా నుండి అత్యధికంగా యువత విదేశాలలో పనిచేస్తున్నారు. ప్రధానంగా అమెరికా వంటి దేశాలలో అధికంగా పనిచేస్తున్నారు. అత్యధికంగా సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న వారే. అనేకంగా ప్రతి ఇంట్లో విదేశాలలో నివసిస్తున్న సభ్యులు ఉన్నారు. యువతలో అధికులు సాంకేతిక రంగంలో నైపుణ్యం ఉన్న కారణంగా ఐ.టి. సంస్థలు ఇక్కడ తమ శాఖలను స్థాపించడానికి ఉత్సుకత చూపుతున్నారు. వరంగల్ జిల్లాలో ని ప్రజల అభిరుచులను తెలంగాణ సమాజం లోని ప్రజలు ఒక రకంగా ప్రామాణికంగా పరిగణిస్తారు. చుట్టూ పక్కల గ్రామీణ ప్రాంతాల నుండి వలస వచ్చి స్థిర పడిన వారి సంఖ్యనే అధికం.

విద్యాసంస్థలు

వరంగల్ జిల్లాలో దేశంలో ఉత్తమమైనవిగా గుర్తింపు పొందిన విద్యాసంస్థలు ఉన్నాయి. వరంగలు తెలంగన జిల్లాలలో 2 ఉంది. 1959లో పండిత జవహర్లాల్ నెహ్రుచే పునాది రాయి స్థాపించబడిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, వరంగల్ (పాత పేరు ఆర్.ఇ.సి వరంగల్) మరియు కాకతీయ మెడికల్ కాలేజీ ఉంది. ఎన్ ఐ టి భారతదేశం అంతా చక్కగా అభివృద్ధి చెందింది. వరంగల్ నిట్ (ఎన్ ఐ టి) దేశంలో అత్యుత్తమమైనదిగా భావిస్తున్నారు. 1959 లో దీనిని స్థాపించినప్పటి నుండి ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు అనేకులు దేశ విదేశాలలో ఉన్నారు. ఈ సంస్థ దేశం మొత్తం నుండి ప్రతిభావంతులని అనేక మందిని ఆకర్షిస్తుంది.

దర్శనీయ స్థలాలు

  • ఓరుగల్లు కోట: 13వ శతాబ్దంలో నిర్మించబడిన ఓరుగల్లు కోట వరంగల్ పట్టణానికి 2 కి.మీ. ల దూరములో ఉంది.
  • వేయి స్థంభాల గుడి: 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలిన వేయి స్తంభాల గుడి వరంగల్ నుండి సుమారు 5 కి.మీ. దూరంలోనూ హనుమకొండ నగరం నడిబొడ్డున ఉంది.
  • భద్రకాళి దేవాలయము: వరంగల్ నగరం నడిబొడ్డున కొలువైవున్న శ్రీ భద్రకాళి అమ్మవారు భక్తుల పాలిట కొంగుబంగారమై విల్లసిల్లుతున్నారు. అందమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రక్కన భద్రకాళి చెరువు, గుడి వెనుక అందమైన తోటలతో శోభయమయంగా వెలుగొందుతున్న ప్రముఖ దేవాలయం ఇది.
  • వన విజ్ఞాన కేంద్రం : వన విజ్ఞాన కేంద్రం తెలంగాణ అటవీ శాఖ వారి ఆధ్వర్యములో సామాన్య ప్రజానీకానికి వన్య సంరక్షణ గురించి తెలుపడానికి ఏర్పాటు చేయబడింది. ఈ విజ్ఞాన కేంద్రాన్ని ప్రతి రోజు 500 మంది వరకు సందర్శకులు సందర్శిస్తుంటారు. 50 ఎకరాల విస్తీర్ణములో విస్తరించి ఉన్న ఈ విజ్ఞాన కేంద్రం, వరంగల్ హంటర్ రోడ్ వద్ద ఉంది.
  • ఐనవోలు మల్లన్న స్వామి దేవాలయం : వర్ధన్నపేట మండలంలోని ఐనవోలులో ఈ దేవాలయం ఉంది. పశ్చిమ చాళుక్య చక్రవర్తి, త్రిభువన మల్ల బిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యు ( క్రీ .శ. 1076-1127) ని మంత్రి అయిన అయ్యనదేవుడు ఈ ఆలయాన్ని కట్టించాడు.

ప్రముఖవ్యక్తులు

మూలాలు

  1. http://warangalurban.telangana.gov.in/wp-content/uploads/2016/10/231.Warangal-U-231.pdf

బయటి లింకులు