పురాణాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 184: పంక్తి 184:


===Translations===
===Translations===
[[Horace Hayman Wilson]] published one of the earliest English translations of one version of the Vishnu Purana in 1840.<ref>HH Wilson (1840), [https://archive.org/stream/worksbylatehorace06wils#page/n5/mode/2up Vishnu Purana] Trubner and Co., Reprinted in 1864</ref> The same manuscript, and Wilson's translation, was reinterpreted by Manmatha Nath Dutt, and published in 1896.<ref>MN Dutt (1896), [https://archive.org/stream/Vishnupurana-English-MnDutt#page/n1/mode/2up Vishnupurana] Eylsium Press, Calcutta</ref> The All India Kashiraj Trust has published editions of the Puranas.<ref>{{Harvnb|Mittal|2004|p=657}}</ref>
1840 లో విష్ణు పురాణం సంస్కరణ ఒకటి ప్రారంభ ఆంగ్ల అనువాదాలలో ఒకటి ప్రచురించబడింది.<ref>HH Wilson (1840), [https://archive.org/stream/worksbylatehorace06wils#page/n5/mode/2up Vishnu Purana] Trubner and Co., Reprinted in 1864</ref> అదే వ్రాతప్రతులు విల్సను అనువాదం మన్మధ నాథుదత్తు చేత పునర్నిర్వచించబడి 1896 లో ప్రచురించబడింది.<ref>MN Dutt (1896), [https://archive.org/stream/Vishnupurana-English-MnDutt#page/n1/mode/2up Vishnupurana] Eylsium Press, Calcutta</ref> " ఆల్ ఇండియా కాశీరాజ్ ట్రస్టు " పురాణాల సంచికలను ప్రచురించింది.<ref>{{Harvnb|Mittal|2004|p=657}}</ref>


మారిదాసు పౌల్లే (మరియాదాసు పిళ్ళై) 1788 లో భగవత పురాణం తమిళ ప్రతుల నుండి ఒక ఫ్రెంచి అనువాదాన్ని ప్రచురించారు. ఇది ఐరోపాలో విస్తృతంగా పంపిణీ చేయబడింది. ఇది 18 వ శతాబ్దపు హిందూ సంస్కృతి, హిందూ మతం వలసరాజ్యాల కాలంలో చాలా మంది యూరోపియన్లకు పరిచయం అయ్యింది. 1795 లో అదే రచనను " లే భగవత" పేరుతో భిన్నమైన అనువాదాన్ని పాండిచేరి నుండి పౌల్లే తిరిగి ప్రచురించాడు.<ref>[[Jean Filliozat]] (1968), Tamil Studies in French Indology, in Tamil Studies Abroad, Xavier S Thani Nayagam, pages 1-14</ref> పౌలు అనువాదం నకలు పారిసులోని బిబ్లియోథెకు నేషనలు డి ఫ్రాంసులో భద్రపరచబడింది.
Maridas Poullé (Mariyadas Pillai) published a French translation from a Tamil version of the Bhagavata Purana in 1788, and this was widely distributed in Europe becoming an introduction to the 18th-century Hindu culture and Hinduism to many Europeans during the colonial era. Poullé republished a different translation of the same text as ''Le Bhagavata'' in 1795, from [[Pondicherry]].<ref>[[Jean Filliozat]] (1968), Tamil Studies in French Indology, in Tamil Studies Abroad, Xavier S Thani Nayagam, pages 1-14</ref> A copy of Poullé translation is preserved in [[Bibliothèque nationale de France]], Paris.


==Influence==
==Influence==

15:01, 17 అక్టోబరు 2019 నాటి కూర్పు

ప్రముఖ ఎనిమిది విగ్రహాలుతో యుద్ధంలో రాక్షసుడు రక్తబీజుడు నకు వ్యతిరేకంగా దేవత దుర్గ, మార్కండేయ పురాణము లోని దేవి మహాత్మ్యం నందలి చిత్రం.
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం

అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడు కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.

పురాణ వాఙ్మయం ఆవిర్భావం

భాగవత పురాణము ఆధారంగా వరాహ అవతారము యొక్క ఒక ఉదాహరణ

"పురాణ" శబ్దానికి "పూర్వ కాల కథా విశేషం" అన్న అర్ధం నిరూఢమై ఉంది. క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం నాటికే ఈ వాఙ్మయం ప్రస్తుతం లభిస్తున్న రూపు సంతరించుకొంది కాని వేదవాఙ్మయ కాలానికే దీని మౌలిక రూపం ఏర్పడి ఉండాలి. యజ్ఞసమయంలో ఋక్సామచ్ఛందాలతో పాటు ఉచ్చిష్ట రూపమై పురాణం ఆవిర్భవించిందని అధర్వణ వేదంలో తొలిసారిగా ప్రస్తావింపబడింది. శతపథ బ్రాహ్మణం, బృహదారణ్యకోపనిషత్తు, గోపథ బ్రాహ్మణం వంటి గ్రంధాలలో పురాణ ప్రశంసలున్నాయి. ఆదికాలంలో ఇది వేదాధ్యయనానికి ఒక సాంగ సాధన ప్రక్రియగా ఉండేదని, కాలక్రమంలో ప్రత్యేక శాఖగా పరిణమించి మతసాహిత్యంగా రూపుదిద్దుకొందని విమర్శకుల ఊహ. సుదీర్ఘ కాలం జరిగే యజ్ఞయాగాది కార్యాల సమయంలో నడుమ నడుమ విరామ వేళలలో ఇష్ట కథా వినోదంగా ఇది మొదలై ఉండవచ్చును. ఆ యజ్ఞాలు చేసే రాజుల వంశాల చరిత్రను, యజ్ఞానికి లక్ష్యమైన దేతల కథలను ఇలా చెబుతూ ఉండవచ్చును. మొదటి కాలంలో బహుశా యఙ్నాన్ని నిర్వహించే పండితులే ఈ కథాకాలక్షేపం జరిపి ఉండవచ్చును కాని ఇది ప్రధాన కార్యక్రమం కాదు గనుక క్రమంగా సూత పౌరాణికులకు (క్షత్రియునకు బ్రాహ్మణ స్త్రీయందు జన్మించిన సంతానం) ఈ విధి సంక్రమించి ఉండవచ్చును. ఇలాంటి ఐతిహ్యం వాయు బ్రహ్మాండ విష్ణు పురాణాలలో కనిపిస్తుంది.[1]

వ్యాస మహర్షి పురాణ సంహితను నిర్మించి తన సూత శిష్యుడు రోమహర్షునికి ఉపదేశించాడు. అతడు దానిని భాగాలుగా చేసి సుమతి, అగ్నివర్చుడు, మిత్రాయువు, శాంశపాయనుడు, అకృతవర్ణుడు, సావర్ణి అనే ఆరుగురు శిష్యులకు బోధించాడు. వీరిలో అకృతవర్ణుడు, సావర్ణి, కాశ్యప శాంశపాయనులు వేరువేరుగా మూడు పురాణ సంహితలను రూపొందించారు. రోమహర్షుని మాతృకతో కలిసి ఈ గ్రంధజాతమంతా పురాణ వాఙ్మయానికి మూలమయింది. ఈ విధంగా పరిశీలిస్తే అప్పటి యాఙ్ఞికులైన బ్రాహ్మణుల అధీనంలో ఉన్నవాఙ్మయాన్ని వ్యాసుడు విషయ క్రమం ప్రకారం పునర్వ్వస్థీకరించి, కాలానుగుణంగా అవుసరమైన మార్పులతో లోకులకు తెలియజేయమని బ్రాహ్మణేతరులైన సూతులకు అప్పగించాడు. ఆపస్తంభ ధర్మ సూత్రాలలోని ప్రస్తావనల ఆధారంగా క్రీ.పూ. 600-300నాటికే పురాణ వాఙ్మయం ఒక ప్రత్యేక శాఖగా రూపుదిద్దుకొందని, కాలానుగుణంగా ఉపదేశికుల బోధలను సంతరించుకొంటూ క్రీ.శ. 12వ శతాబ్దివరకూ మార్పులు చెందుతూ వచ్చిందని ఊహించవచ్చును[1].

ప్రణవం వేదాలు పురాణాల పుట్టుక

పురాణాలు ప్రణవం నుండి పుట్టాయని సంస్కృత భాగవతంలోని పన్నెండవ స్కందం చెప్తుంది. బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో ఆయన హృదయగృహ నుండి ఒక అనాహత శబ్దం వెలువడింది. ఆ శబ్దంలో నుండి కార కార కార శబ్ధాలు కూడిన ఓంకారశబ్దం ఆవిర్భవించింది. "అ" నుండి "హ" వరకు గల అక్షరాలు ఆశబ్దంనుండి ఉద్భవించాయి. ఓంకారం సకల మంత్రాలకు బీజాక్షరం అయింది. ఓంకారం నుండి నాలుగు వేదాలను ఉద్భవించాయి. ఆ 'అ'కార, 'ఉ'కార 'మ'కారములనుండి సత్వ,రజో,తమో అనే త్రిగుణాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనే చతుర్వేదాలు, భూ॰భువ॰సువ॰ అనే త్రిలోకాలు, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు జనించాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు చతుర్వేదాలను వెలువరించి తనకుమారులైన మరీచి తదితరులకిచ్చాడు. వారు తమ కుమారులైన కశ్యపుడు తదితరులకు ఇచ్చారు. అలా వేదాలు పరంపరాగతంగా సాగిపోతూ ఉన్నాయి.

వేదాలు ప్రజలకు క్లిష్టమైనవి కనుక అందుబాటులో లేనివి కనుక వేదవ్యాసుడు వేద ఉపనిషత్తు సారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించాడు. పురాణాలను వ్యాసుడు తన శిష్యుడైన రోమహర్షణుకి చెప్పాడు. రోమహర్షుడు తిరిగి వాటిని తన శిష్యులైన త్రైయారుణి, కశ్యపుడు, సావర్ణి లాంటి శిష్యులకు అందించాడు. ఆ తర్వాత అలా ఒకరి నుండి ఒకరికి సంక్రమించాయి.

పురాణం లక్షణాలు

ప్రతి పురాణం కుడా పురాణాల ముఖ్యమైన లక్షణాలను మొదటి సర్గలలో చెబుతుంది. కూర్మపురాణంలో చెప్పబడిన పురాణ ఉపోద్ఘాతము ప్రకారం

సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ
వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం

సర్గము, ప్రతి సర్గము, వంశము, మన్వంతరము, వంశాలచరిత్ర అనే పంచలక్షణాలు కలిగినదే పురాణం.

  • సర్గము - సర్వ ప్రపంచ సృష్టిని విస్తరించేది
  • ప్రతి సర్గము - సకల ప్రపంచము లయమయ్యే లక్షణం తెలిపేది (ప్రళయం)
  • వంశము - పృథు, ప్రియ వ్రతాదుల వంశోత్పత్తిని వివరించుట
  • మన్వంతరము - ఏ కల్పంలో ఏ మనువు కాలంలో ఏమి జరిగిందో తెలుపుట
  • వంశాలచరిత్ర

భాగవతంలో పురాణ లక్షణాలు పది చెప్పబడ్డాయి

సర్గోప్యశ్చ విసర్గశ్చ వృత్తి రక్షాంతరాణి చ
వంశో వంశానుచరితం సంస్థాహేతు రపాశ్రయ
దశభిర్లక్షణైర్యుక్తం పురాణం తద్విదో విదు:

అనగా సర్గము (సృష్టి), ప్రతిసర్గము (ప్రళయము), వృత్తి (వ్యాపారము), రక్షా (పరిపాలవ), అంతరము (మన్వాదుల కాలము), వంశము (వంశాదుల విషయము), వంశానుచరితము (సూర్య, చంద్ర వంశస్థుల కథనాలు), సంస్థా (స్థితి), హేతువు (కారణము), అపాశ్రయము (ఆశ్రయ విషయాలు) అనే పదీ పురాణ లక్షణాలు. కొంతమంది ఇలా పది లక్షణాలున్నవి మహాపురాణాలని, ఐదు లక్షణాలున్నవి పురాణాలని వర్గీకరిస్తున్నారు.[2]

పురాణాల విభజన

పురాణాల పేర్లు చెప్పే శ్లోకం

సత్రయాగం జరుగుచున్నప్పుడు అష్టాదశపురాణాలను తెలుపుతూ సూతుడు ఋషులకు చెప్పిన శ్లోకం. భాగవత పురాణము ప్రధమ స్కందము లో చెప్పబడింది.

మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం
అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్

పైన చెప్పిన వాటిలో:

  • "మ" ద్వయం -- మత్స్య పురాణం, మార్కండేయ పురాణం
  • "భ" ద్వయం -- భాగవత పురాణం, భవిష్య పురాణం
  • "బ్ర" త్రయం -- బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం
  • "వ" చతుష్టయం -- విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం

మిగిలిన వాటి పేర్ల మొదటి అక్షరాలు మాత్రమే తీసుకుని శ్లోకపాదం కూర్చటం జరిగింది:

  • అ -- అగ్ని పురాణం
  • నా -- నారద పురాణం
  • పద్ -- పద్మ పురాణం
  • లిం -- లింగ పురాణం
  • గ -- గరుడ పురాణం
  • కూ -- కూర్మ పురాణం
  • స్క -- స్కంద పురాణం

అష్టాదశ పురాణములలో శ్లోకాలు [3]

  1. బ్రహ్మ పురాణం - బ్రహ్మదేవుడు మరీచికి బోధించినది. 10,000 శ్లోకములు కలది.
  2. పద్మ పురాణము - బ్రహ్మదేవునిచే చెప్పబడినది. 55,000 శ్లోకములు కలది.
  3. విష్ణు పురాణం - పరాశరుని రచన. దీనిలో 63,000 (8,000?) శ్లోకములు ఉన్నాయి.
  4. శివ పురాణం - వాయుదేవునిచే చెప్పబడినది. ఇందులో 24,000 శ్లోకాలున్నాయి.
  5. లింగ పురాణము - నందీశ్వరుని రచన. 11,000 శ్లోకాలు ఉన్నది.
  6. గరుడ పురాణం - విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పిన ఈ పురాణంలో 19,000 (16,000?) శ్లోకాలున్నాయి.
  7. నారద పురాణము - నారద మహర్షి రచన. 24,000 (25,000?) శ్లోకములు కలది.
  8. భాగవత పురాణం- శుకమహర్షి పరీక్షిత్తునకుపదేశించినది. 18,000 శ్లోకములు కలది.
  9. అగ్ని పురాణం - భృగుమహర్షిచే చెప్పబడినది. 16,000 (8,000?) శ్లోకములు కలది.
  10. స్కంద పురాణం - కుమారస్వామిచే చెప్పబడినది. 80,000 (లక్ష?) ఇందు శ్లోకములు ఉన్నాయి.
  11. భవిష్య పురాణం లేదా భవిష్యోత్తర పురాణం - శతానీకుడు సుమంతునకు బోధించినది. 14,500 (31,000?) శ్లోకములు ఉన్నాయి.
  12. బ్రహ్మవైవర్త పురాణం - వశిష్ట మహర్షి అంబరీషునకు ఉపదేశించినది. 18,000 (12,000) శ్లోకములు కలది.
  13. మార్కండేయ పురాణం - పక్షులు క్రోష్టి (జైమిని) కి చెప్పినట్లుగా మార్కండేయమహర్షి రచించెను. 9,000 (32,000?) శ్లోకములు ఉన్నది.
  14. వామన పురాణము - బ్రహ్మదేవుని రచన - 14,000 శ్లోకములు కలది.
  15. వరాహ పురాణం - శ్రీవరాహమూర్తి భూదేవికి ఉపదేశించినది. ఇందు 24,000 శ్లోకములు ఉన్నాయి.
  16. మత్స్య పురాణం - శ్రీమత్స్యావతారుడైన విష్ణువు మనువునకు ఉపదేశించెను. దీనిలో 14,000 శ్లోకాలున్నాయి.
  17. కూర్మ పురాణం - శ్రీకూర్మావతారుడైన విష్ణువు ఉపదేశించెను. దీనిలో 17,000 (6,000) శ్లోకాలున్నాయి.
  18. బ్రహ్మాండ పురాణం - బ్రహ్మదేవుని రచన- 1,100 (12,200?) శ్లోకములున్నది.

దేవతాప్రాముఖ్యాన్ని గుణాన్ని చెప్పే శ్లోకం

ఈ క్రింది శ్లోకం అష్టాదశ పురాణాలను మూడు విధాలుగా విభజిస్తూ వైష్ణవ, శైవ, బ్రహ్మ పురాణాలుగా చెబుతుంది.

వైష్ణవం నారదీయం చ తధా భాగవతం శుభం గారుడంచ తధా పాద్మం
వరాహం శుభదర్శనే సాత్వికాని పురాణాని విష్ణ్వేయాని శుభానిదై
బ్రహ్మాండం బ్రహ్మ వైవర్తం మార్కండేయం తధైవ చ భవిష్యం వామనం బ్రహ్మరాజ నిబోధతే
మాత్స్య కౌర్మం తధా లైంగ శైవం స్కౌందం ఆగ్నేయంచ షడేతాని తామసాని భోధమే
ఇలాంటిదే మరొక శ్లోకం
బ్రాహ్మం పాద్వం వైష్ణవంచ శైవం వైంగం చ గారుడమ్
నారదీయం భాగవతం ఆగ్నేయం స్కాంద సంజ్ఞికమ్
భవిష్యం బ్రహ్మవైవర్తం మార్కండేయం చ వామనమ్
వారాహం మత్స్య కౌర్మాణి బ్రహ్మాండాఖ్యమితి త్రిషట్

మహాపురాణాలు

పురాణము పేరు శ్లోకములు సంఖ్య వ్యాఖ్యలు
అగ్ని 15,400 శ్లోకములు వాస్తు శాస్త్రం మరియు రత్నశాస్త్రం వివరాలను కలిగి ఉంది.
భాగవత 18,000 శ్లోకములు విష్ణువు యొక్క పది అవతారాలు చెప్పడం, పురాణాలల్లో యొక్క అత్యంత ప్రసిద్ధి మరియు ప్రముఖం అయినదిగా భావించింది.[4][5] దీని పదవ మరియు పొడవైనది అని చెప్పవచ్చు, కృష్ణ పనులు, వ్యాఖ్యానం, తన చిన్ననాటి దోపిడీలు పరిచయం, తరువాత అనేక భక్తి ఉద్యమాలు ఒక థీం ద్వారా విశదీకరించినది.[6]
బ్రహ్మ 10,000 శ్లోకములు గోదావరి మరియు దాని ఉపనదులు వివరిస్తుంది..
బ్రహ్మాండ 12,000 శ్లోకములు లలితా పంచాక్షరీ, కొన్ని హిందువులు ప్రార్థనలు వర్ణించు ఒక వాచకం కలిపి ఉంది.
బ్రహ్మవైవర్త 17,000 శ్లోకములు కృష్ణ మరియు వినాయకుడు దేవతలు,పూజించే మార్గాలను వివరిస్తుంది..
గరుడ 19,000 శ్లోకములు మరణం మరియు దాని తర్వాత కార్యాలు వివరిస్తుంది.
హరివంశ 16,000 శ్లోకములు ఇతిహాసములు (పురాణ కవిత్వం) పరిగణించబడుతుంది.
కూర్మ 17,000 శ్లోకములు విష్ణువు యొక్క పది ప్రధాన అవతారములు యొక్క రెండవది ఉంది.
లింగ 11,000 శ్లోకములు విశ్వం యొక్క లింగం వైభవం, శివ యొక్క చిహ్నం మరియు మూలం వివరిస్తుంది. ఇది

లింగం గురించి అనేక కథలు ఉన్నాయి. ఇందులో విష్ణు, బ్రహ్మ మధ్య వివాదం ఎలా అనివార్యమైంది, అలాగే ఎలా పరిష్కరించవచ్చు అనేది కూడా అగ్ని లింగం తెలియ జేస్తుంది.

మార్కండేయ 09,000 శ్లోకములు దేవి మహాత్మ్యం, గుళ్ళల్లో పూజారులు/శాక్తేయులు మొదలగు వారి కోసం ఒక ముఖ్యమైన వాచకం, పొందుపరచబడింది.
మత్స్య 14,000 శ్లోకములు మత్స్యావతారము కథ, విష్ణువు యొక్క పది ప్రధాన అవతారాలు యొక్క మొదటి అవతారము. ఇది కూడా పలు రాజ వంశాల వారసత్వపు వివరాలను కలిగి ఉంది.[7]
నారద 25,000 శ్లోకములు వేదాలు మరియు వేదాంగాలు గొప్పతనం వర్ణిస్తుంది.
పద్మ 55,000 శ్లోకములు భగవద్గీత గొప్పతనాన్ని వివరిస్తుంది. అందువల్ల, ఇది కూడా గీతామహత్మ్యము గా (లిట్. భగవద్గీత ఘనత ) అంటారు.
శివ 24,000 శ్లోకములు శివుడు మరియు ఆయన గురించి ఇతర కథలు, పూజలు, శివ గొప్పతనం మరియు గొప్పతనాన్ని వివరిస్తుంది.
స్కంద 81,100 శ్లోకములు స్కంధ (లేదా కార్తికేయ), శివుడు యొక్క కుమారుడు పుట్టిన వివరాలు వివరిస్తుంది. ఇది చాలా పొడవైన పురాణం., ఇందులో సంబంధిత పురాణములు, ఉపమానరీతిగా, కీర్తనలు మరియు కథలు భారతదేశంలో తీర్థయాత్రా కేంద్రాలలో భౌగోళిక స్థానాలను కలిగిన ఒక అసాధారణమైన ఖచ్చితమైన పుణ్య గైడ్ ఉంది. అనేక ఆచూకీ లభ్యం కాలేని కోట్స్ దీనిలో వాచకము రూపములో అందిస్తుంది.[8]
వామన 10,000 శ్లోకములు ఉత్తర భారతదేశం లో కురుక్షేత్రం చుట్టూ ప్రాంతాల్లో వాటిని వివరిస్తుంది.
వరాహ 24,000 శ్లోకములు విష్ణు భక్తి ఆచారాలు మరియు వివిధ రూపాలు ప్రార్థన వివరిస్తుంది. శివుడు మరియు దుర్గ యొక్క అనేక దృష్టాంతాలు కూడా కలిగి ఉంది.[9]
వాయు 24,000 శ్లోకములు శివ పురాణం యొక్క మరో పేరు
విష్ణు 23,000 శ్లోకములు విష్ణువు అనేక పనులు మరియు ఆయనని పూజించేవారు వివిధ మార్గాలను వివరిస్తుంది.[10]

వర్గీకరణ

మహాపురాణాలు దైవము యొక్క మూడు రూపములు ప్రకారంగా వర్గీకరించ బడ్డాయి. త్రిమూర్తి:

వైష్ణవ పురాణాలు: విష్ణు పురాణం, భాగవత పురాణం, నారద పురాణము, గరుడ పురాణం, పద్మ పురాణము, వరాహ పురాణం, వామన పురాణము, కూర్మ పురాణం, మత్స్య పురాణము
బ్రహ్మ పురాణాలు: బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, మార్కండేయ పురాణము, భవిష్య పురాణం,
శైవ పురాణాలు: శివ పురాణము, లింగ పురాణము, స్కంద పురాణం, అగ్ని పురాణం

[11]

పద్మ పురాణంలో, ఉత్తర ఖండం నందు (236.18-21),[12] దానికదే ఒక వైష్ణవ పురాణం, మూడు గుణాలలో లేదా లక్షణాలను అనుగుణంగా పురాణాల్లో వర్గీకరించింది; సత్యం, అభిమానం, మరియు ఉదాసీనత:

సత్వ ("నిజం; స్వచ్ఛత") విష్ణు పురాణం, భాగవత పురాణం, నారద పురాణము, గరుడ పురాణం, పద్మ పురాణము, వరాహ పురాణం
రాజస ("డిమ్నెస్; అభిరుచి") బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, మార్కండేయ పురాణము, భవిష్య పురాణం, వామన పురాణము బ్రహ్మ పురాణము
తామస ("చీకటి; అజ్ఞానం") మత్స్య పురాణము, కూర్మ పురాణం, లింగ పురాణము, శివ పురాణం స్కంద పురాణం, అగ్ని పురాణం

వ్రాతప్రతులు

An 11th-century Nepalese palm-leaf manuscript in Sanskrit of Devimahatmya (Markandeya Purana).

పురాణాల వ్రాతప్రతుల అధ్యయనం చాలా అస్థిరంగా ఉన్నందున సవాలుగా ఉంది.[13][14] ఇది మహాపురాణాలు, ఉపపురాణాలన్నింటికి వర్తిస్తుంది.[13] పురాణగ్రంధాలు అధికంగా ముఖ్యంగా పాశ్చాత్య పండితుల ఉపయోగంలో ఉన్నాయి. "ఒక వ్రాతప్రతి ఆధారంగా లేదా యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడిన కొన్ని వ్రాతప్రతుల మీద ఆధారపడి ఉన్నాయి". అదే శీర్షికతో విభిన్నమైన లిఖిత ప్రతులు ఉన్నప్పటికీ. పురాణ వ్రాతప్రతుల ఉనికిని పండితులు చాలాకాలానికి ముందుగా గుర్తించారు. ఇవి "ముద్రిత ప్రతులకు చాలా భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది". ఇది ఏది ఖచ్చితమైనదో అస్పష్టంగా ఉంది. యాదృచ్ఛికంగా లేదా చెర్రీపిక్డు ప్రింటెడు ప్రతుల నుండి తీసుకోబడిన తీర్మానాలు భౌగోళికంగా విశ్వజనీయమైనవి.[13] అదే శీర్షిక పురాణ వ్రాతప్రతులలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. కానీ ప్రాంతీయ భాషలైన తమిళం, తెలుగు, బెంగాలీ, ఇతరులు ఎక్కువగా విస్మరించబడ్డాయి. [13]

ఆధునిక విద్యావేత్తలు ఈ వాస్తవాలన్నింటినీ గమనించారు. నిజమైన అగ్ని పురాణం పరిధి అన్ని సమయాలలో అన్ని ప్రదేశాలలో ఒకేలా ఉండదని సమయం, ప్రాంతంలోని వ్యత్యాసంతో ఇది వైవిధ్యంగా ఉందని ఇది గుర్తించింది. (...) దేవి పురాణం వచనం ప్రతిచోటా ఒకేలా ఉండదని కానీ వివిధ ప్రావిన్సులలో గణనీయంగా తేడా ఉందని ఇది చూపిస్తుంది. అయినప్పటికీ తార్కిక తీర్మానాన్ని రూపొందించడంలో ఒకరు విఫలమయ్యారు: మన [మనుగడలో ఉన్న] వ్రాతప్రతులలో కనిపించే పురాణాల సంస్కరణ పాటు, మా [ముద్రిత] ప్రతులలో చాలా తక్కువ అనే శీర్షికల క్రింద అనేక ఇతర ప్రతులు ఉన్నాయి. కానీ ఇవి గుర్తించబడలేదు, పునరుద్ధరించడానికి వీలుకాని విధంగా మారాయి.

—లూడో రోచరు, పురాణాలు [15][16]

Chronology

మధ్యయుగ శతాబ్దాల నుండి కొత్తగా కనుగొన్న పురాణాల వ్రాతప్రతులు పండితుల దృష్టిని ఆకర్షించాయి. పురాణ సాహిత్యం కాలక్రమేణా నెమ్మదిగా పునర్నిర్మాణంలో అనేకమార్పులు సంభవించాయి. అలాగే అనేక అధ్యాయాలను ఆకస్మికంగా తొలగించడం కొత్త సమాచారంతో భర్తీ చేయడం వంటివి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పురాణాలు 11 వ శతాబ్దం లేదా 16 వ శతాబ్దానికి ముందు ఉన్న వాటికి పూర్తిగా భిన్నంగా ఉంటాయి.[17]

ఉదాహరణకు కొత్తగా కనుగొన్న నేపాలులోని స్కంద పురాణం తాటి-ఆకు వ్రాతప్రతి క్రీ.శ 810 నాటిది అయినప్పటికీ వలసరాజ్యాల కాలం నుండి దక్షిణ ఆసియాలో చెలామణి అవుతున్న స్కంద పురాణం సంస్కరణలకు ఇది పూర్తిగా భిన్నంగా ఉంది.[18][17] మరో నాలుగు వ్రాతప్రతుల తదుపరి ఆవిష్కరణలు, పత్రం రెండుసార్లు పెద్ద పునర్ముద్రణల ద్వారా వెళ్ళిందని సూచిస్తుంది. మొదట 12 వ శతాబ్దానికి ముందు, 15 వ -16 వ శతాబ్దంలో సంభవించిన రెండవ పెద్ద మార్పు కారణాలు అస్పష్టంగా ఉన్నాయి.[19] స్కంద పురాణం వ్రాతప్రతులు విభిన్న సంస్కరణలు కాలక్రమేణా "చిన్న" పునరావృత్తులు, అంతర్కాలుష్యంతో రచనలోని ఆలోచనల అవినీతిని సూచిస్తున్నాయి.[19]

ప్రతి పురాణం కూర్పు తేదీ వివాదాస్పద సమస్యగా ఉందని రోచరు పేర్కొన్నాడు.[20][21] ప్రతి పురాణ వ్రాతప్రతులు ఎంసైక్లోపీడియా శైలిలో ఉన్నాయని డిమ్మిటు, వాను బ్యూటెనెను పేర్కొన్నాడు. ఇవి ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎవరిచే వ్రాయబడ్డాయి అని నిర్ధారించడం కష్టం:[22]

ప్రస్తుతం అవి ఉన్నందున పురాణాలు స్థిరీకరించిన సాహిత్యం. ప్రతి పేరున్న రచనలో వరుస చారిత్రక యుగాలలో అనేక వృద్ధి చెందుతుంది. అందువల్ల ఏ పురాణానికి కూర్పు ఒక్క తేదీ కూడా లేదు. (...) అవి కొత్త వాల్యూములను నిరంతరం జోడించిన లైబ్రరీల వలె ఉంటుంది. షెల్ఫు చివరిలో కాదు యాదృచ్ఛికంగా.

—కార్నెలియా డిమ్మిటు, జె.ఎ.బి. వాను బ్యూటెనెను, క్లాసికలు హిందూ మిథాలజీ: సంస్కృత పురాణాలలో ఒక పాఠకుడు.[22]

నకిలీలు

చాలా వ్రాతప్రతులు తాటి ఆకు మీద వ్రాయబడ్డాయి లేదా బ్రిటిషు ఇండియా వలసరాజ్యాల కాలంలో కాపీ చేయబడ్డాయి. కొన్ని 19 వ శతాబ్దంలో ఉన్నాయి.[23][24] వివిధ పురాణాల మీద అధ్యయనాలు తరచూ నకిలీల కారణంగా బాధించబడుతుందని పురాణాల ప్రచారంలో స్వేచ్ఛ సాధారణమైనదని, పాత వ్రాతప్రతులను కాపీ చేసిన వారు పదాలను భర్తీ చేశారని లేదా వలసరాజ్యాల పండితులు ప్రచురణ మీద ఆసక్తి చూపుతున్నారనే సిద్ధాంతానికి తగినట్లుగా కొత్త విషయాలను చేర్చారని లూడో రోచరు పేర్కొన్నాడు.[23][24]

Translations

1840 లో విష్ణు పురాణం సంస్కరణ ఒకటి ప్రారంభ ఆంగ్ల అనువాదాలలో ఒకటి ప్రచురించబడింది.[25] అదే వ్రాతప్రతులు విల్సను అనువాదం మన్మధ నాథుదత్తు చేత పునర్నిర్వచించబడి 1896 లో ప్రచురించబడింది.[26] " ఆల్ ఇండియా కాశీరాజ్ ట్రస్టు " పురాణాల సంచికలను ప్రచురించింది.[27]

మారిదాసు పౌల్లే (మరియాదాసు పిళ్ళై) 1788 లో భగవత పురాణం తమిళ ప్రతుల నుండి ఒక ఫ్రెంచి అనువాదాన్ని ప్రచురించారు. ఇది ఐరోపాలో విస్తృతంగా పంపిణీ చేయబడింది. ఇది 18 వ శతాబ్దపు హిందూ సంస్కృతి, హిందూ మతం వలసరాజ్యాల కాలంలో చాలా మంది యూరోపియన్లకు పరిచయం అయ్యింది. 1795 లో అదే రచనను " లే భగవత" పేరుతో భిన్నమైన అనువాదాన్ని పాండిచేరి నుండి పౌల్లే తిరిగి ప్రచురించాడు.[28] పౌలు అనువాదం నకలు పారిసులోని బిబ్లియోథెకు నేషనలు డి ఫ్రాంసులో భద్రపరచబడింది.

Influence

The Puranas have had a large cultural impact on Hindus, from festivals to diverse arts. Bharata natyam (above) is inspired in part by Bhagavata Purana.[29]

The most significant influence of the Puranas genre of Indian literature have been, state scholars and particularly Indian scholars,[30] in "culture synthesis", in weaving and integrating the diverse beliefs from ritualistic rites of passage to Vedantic philosophy, from fictional legends to factual history, from individual introspective yoga to social celebratory festivals, from temples to pilgrimage, from one god to another, from goddesses to tantra, from the old to the new.[31] These have been dynamic open texts, composed socially, over time. This, states Greg Bailey, may have allowed the Hindu culture to "preserve the old while constantly coming to terms with the new", and "if they are anything, they are records of cultural adaptation and transformation" over the last 2,000 years.[30]

The Puranic literature, suggests Khanna, influenced "acculturation and accommodation" of a diversity of people, with different languages and from different economic classes, across different kingdoms and traditions, catalyzing the syncretic "cultural mosaic of Hinduism".[32] They helped influence cultural pluralism in India, and are a literary record thereof.[32]

Om Prakash states the Puranas served as efficient medium for cultural exchange and popular education in ancient and medieval India.[33] These texts adopted, explained and integrated regional deities such as Pashupata in Vayu Purana, Sattva in Vishnu Purana, Dattatreya in Markendeya Purana, Bhojakas in Bhavishya Purana.[33] Further, states Prakash, they dedicated chapters to "secular subjects such as poetics, dramaturgy, grammar, lexicography, astronomy, war, politics, architecture, geography and medicine as in Agni Purana, perfumery and lapidary arts in Garuda Purana, painting, sculpture and other arts in Vishnudharmottara Purana".[33]

Indian Arts

The cultural influence of the Puranas extended to Indian classical arts, such as songs, dance culture such as Bharata Natyam in south India[29] and Rasa Lila in northeast India,[34] plays and recitations.[35]

Festivals

The myths, lunar calendar schedule, rituals and celebrations of major Hindu cultural festivities such as Holi, Diwali and Durga Puja are in the Puranic literature.[36][37]

ఉపపురాణాలు

ఈ అష్టాదశపురాణాలే కాకుండా ఉపపురాణాలు కూడా 18 ఉన్నాయి. అవి:

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. 1.0 1.1 శ్రీమద్భాగవతము - సరళాంధ్ర పరివర్తన - ఏల్చూరి శేషగిరిరావు
  2. "అష్టాదశ పురాణములు" - వాడ్రేవు శేషగిరిరావు
  3. శ్లోకాల సంఖ్య వివిధ గ్రంధాలలో తేడాగా ఉంది. వాడ్రేవు శేషగిరిరావు రచన "అష్టఅదశ పురాణములు"లో ఇచ్చిన సంఖ్య (ఇతర సంఖ్యలో భిన్నంగా ఉంటే గనుక) బ్రాకెట్లలో ఉంచబడింది.
  4. Thompson, Richard L. (2007). The Cosmology of the Bhagavata Purana 'Mysteries of the Sacred Universe. Motilal Banarsidass Publishers. p. 10. ISBN 978-81-208-1919-1.
  5. Monier-Williams 1899, p. 752, column 3, under the entry Bhagavata.
  6. Hardy 2001
  7. Dalal, Roshen (2011). Hinduism: An Alphabetical Guide. Penguin Books India. p. 250. ISBN 978-0-14-341421-6.
  8. Doniger 1993, pp. 59–83
  9. Wilson, Horace H. (1864), Works: ¬Vol. ¬6 : ¬The Vishṅu Purāṅa: a system of Hindu mythology and tradition ; 1, Trübner, p. LXXI
  10. Lochtefeld, James G. (2002), The Illustrated Encyclopedia of Hinduism: N-Z, The Rosen Publishing Group, p. 760, ISBN 978-0-8239-3180-4
  11. The Puranic Encyclopedia
  12. Wilson, H. H. (1840). The Vishnu Purana: A system of Hindu mythology and tradition. Oriental Translation Fund. p. 12.
  13. 13.0 13.1 13.2 13.3 Ludo Rocher (1986), The Puranas, Otto Harrassowitz Verlag, ISBN 978-3447025225, pages 59-67
  14. Gregory Bailey (2003), The Study of Hinduism (Editor: Arvind Sharma), The University of South Carolina Press, ISBN 978-1570034497, pages 141-142
  15. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Ludo Rocher 1986 page 63 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  16. Rajendra Hazra (1956), Discovery of the genuine Agneya-purana, Journal of the Oriental Institute Baroda, Vol. 4-5, pages 411-416
  17. 17.0 17.1 Dominic Goodall (2009), Parākhyatantram, Vol 98, Publications de l'Institut Français d'Indologie, ISBN 978-2855396422, pages xvi-xvii
  18. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; R Andriaensen 1994 pages 325-331 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  19. 19.0 19.1 Kengo Harimoto (2004), in Origin and Growth of the Purāṇic Text Corpus (Editor: Hans Bakker), Motilal Banarsidass, ISBN 978-8120820494, pages 41-64
  20. Rocher 1986, p. 249.
  21. Gregory Bailey 2003, pp. 139–141, 154–156.
  22. 22.0 22.1 Dimmitt & van Buitenen 2012, p. 5.
  23. 23.0 23.1 Rocher 1986, pp. 49–53.
  24. 24.0 24.1 Avril Ann Powell (2010). Scottish Orientalists and India: The Muir Brothers, Religion, Education and Empire. Boydell & Brewer. pp. 130, 128–134, 87–90. ISBN 978-1-84383-579-0.
  25. HH Wilson (1840), Vishnu Purana Trubner and Co., Reprinted in 1864
  26. MN Dutt (1896), Vishnupurana Eylsium Press, Calcutta
  27. Mittal 2004, p. 657
  28. Jean Filliozat (1968), Tamil Studies in French Indology, in Tamil Studies Abroad, Xavier S Thani Nayagam, pages 1-14
  29. 29.0 29.1 Katherine Zubko (2013), The Bhagavata Purana: Sacred Text and Living Tradition (Editors: Ravi Gupta and Kenneth Valpey), Columbia University Press, ISBN 978-0231149983, pages 181-201
  30. 30.0 30.1 Greg Bailey (2001), Encyclopedia of Asian Philosophy (Editor: Oliver Leaman), Routledge, ISBN 978-0415172813, pages 442-443
  31. Gregory Bailey (2003), The Study of Hinduism (Editor: Arvind Sharma), The University of South Carolina Press, ISBN 978-1570034497, pages 162-167
  32. 32.0 32.1 R Champakalakshmi (2012), Cultural History of Medieval India (Editor: M Khanna), Berghahn, ISBN 978-8187358305, pages 48-50
  33. 33.0 33.1 33.2 Om Prakash (2004), Cultural History of India, New Age, ISBN 978-8122415872, pages 33-34
  34. Guy Beck (2013), The Bhagavata Purana: Sacred Text and Living Tradition (Editors: Ravi Gupta and Kenneth Valpey), Columbia University Press, ISBN 978-0231149983, pages 181-201
  35. Ilona Wilczewska (2013), The Bhagavata Purana: Sacred Text and Living Tradition (Editors: Ravi Gupta and Kenneth Valpey), Columbia University Press, ISBN 978-0231149983, pages 202-220
  36. A Whitney Sanford (2006), Alternative Krishnas: Regional and Vernacular Variations on a Hindu Deity (Editor: Guy Beck), State University of New York Press, ISBN 978-0791464168, pages 91-94
  37. Tracy Pintchman (2005), Guests at God's Wedding: Celebrating Kartik among the Women of Benares, State University of New York Press, ISBN 978-0791465950, pages 60-63, with notes on 210-211

వనరులు

  • "అష్టాదశ పురాణములు" - రచన: వాడ్రేవు శేషగిరిరావు - ప్రచురణ: సోమనాధ్ పబ్లిషర్స్, రాజమండ్రి (2007)
  • శ్రీమద్భాగవతము - సరళాంధ్ర పరివర్తన - రచన : ఏల్చూరి శేషగిరిరావు - ప్రచురణ : శ్రీరామకృష్ణ మఠము, హైదరాబాదు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=పురాణాలు&oldid=2760912" నుండి వెలికితీశారు